27, నవంబర్ 2021, శనివారం

Kisan Vikas Patra: కిసాన్ వికాస్ పత్రలో పదేళ్లలో మీ డబ్బు రెట్టింపు

సురక్షిత పెట్టుబడికి పోస్టాఫీస్ స్కీం అద్భుతమైన ఎంపిక. వడ్డీ రేటు తక్కువగా ఉన్నప్పటికీ భద్రమైన పెట్టుబడి కోసం, రిస్క్ తీసుకోవడం పెద్దగా ఇష్టపడని చాలామంది దీనిని ఎంచుకుంటారు. పోస్టాఫీస్ స్కీం ద్వారా గ్యారెంటీ రిటర్న్స్ ఉంటాయి. ఇలాంటి పోస్టాఫీస్ సేవింగ్స్ స్కీంలలో కిసాన్ వికాస్ పత్ర ఒకటి. ఈ స్కీంలో ఇన్వెస్ట్ చేస్తే 124 నెలలు లేదా 10 సంవత్సరాల్లో మీ డబ్బు రెండింతలు అవుతుంది. ఏప్రిల్ 1, 2020 నుండి ఈ పథకానికి సంబంధించి వడ్డీ రేటు 6.9 శాతంగా ఉంది. కనీసం రూ.1000తో పెట్టుబడులు ప్రారంభించవచ్చు. గరిష్ట పరిమితి లేదు. ఒక వ్యక్తి ఒకటి కంటే ఎక్కువ కిసాన్ వికాస పత్ర ఖాతాలు తెరుచుకోవచ్చు. ఒక వ్యక్తి మరొకరికి కేవీపీ పత్రాలను బదలీ చేసుకోవచ్చు. రుణం ఇస్తారు. ఇందుకు కేవీపీ తీసుకున్న వ్యక్తి సంబంధిత పోస్టాఫీస్‌కు అంగీకార పత్రంతో కూడిన దరఖాస్తు ఫామ్‌ను ఇవ్వాలి. ఒక పోస్టాఫీస్ నుండి మరో పోస్టాఫీస్‌కు బదలీ చేసుకోవచ్చు. మెచ్యూరిటీ తేదీని సర్టిఫికెట్లో ముద్రిస్తారు.

Gemini Internet

అకౌంట్ ఓపెనింగ్ KVP పథకంలో పెట్టుబడికి కనీస వయస్సు పద్దెనిమిది సంవత్సరాలు. వ్య‌క్తిగ‌తంగా లేదా ఉమ్మ‌డిగా ఖాతా ఓపెన్ చేయవచ్చు. గరిష్టంగా ముగ్గురు పెద్దలు ఉమ్మడి ఖాతాను తెరుచుకోవచ్చు. పదేళ్లు నిండిన‌ పిల్లల పేరుతో మైనర్ ఖాతాను తెరువవచ్చు. పిల్ల‌ల త‌ర‌పున తల్లిదండ్రులు లేదా గార్డియ‌న్ అకౌంట్ తెరవాల్సి ఉంటుంది. నామినీని ఏర్పాటు చేసే వెసులుబాటు ఉంది. ఖాతా తెరిచేందుకు, ద‌ర‌ఖాస్తు ఫాంతో పాటు ఆధార్ కార్డు, పాన్ కార్డు, ఓటర్ ఐడి కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, పాస్‌పోర్ట్‌లో ఏదైనా గుర్తింపు పత్రాన్ని ఇవ్వాలి. అకౌంట్ తెరిచిన రెండున్న‌ర సంవ‌త్స‌రాల తర్వాత షరతులకు లోబ‌డి ముంద‌స్తు ఉపసంహరణకు అనుమతిస్తారు.

వడ్డీ రేటు నిర్ణయం ఈ స్కీం వ‌డ్డీరేటును కేంద్రం నిర్ణ‌యిస్తుంది. ప్రతి మూడు నెలలకు ఓసారి వడ్డీ రేటును సవరిస్తుంది. అకౌంట్ తెరిచే స‌మ‌యంలో ఉన్న వ‌డ్డీరేటు కాల‌ప‌రిమితి మొత్తానికి వర్తిస్తుంది. ఉదాహర‌ణ‌కు ఒక వ్య‌క్తి కిసాన్ వికాస్ ప‌త్ర ఖాతాను జ‌న‌వ‌రి-మార్చి 2020 త్రైమాసికంలో ఓపెన్ చేస్తే మెచ్యూరిటి వ‌ర‌కు వార్షికంగా 7.6 శాతం వ‌డ్డీ ఉంటుంది. కొత్త‌గా అంటే ప్ర‌స్తుత త్రైమాసికంలో ఖాతా తెరిచే వారికి వార్షికంగా 6.9 శాతం వ‌డ్డీ ల‌భిస్తుంది. ఇదే వ‌డ్డీ మెచ్యూరిటీ వరకు ఉంటుంది. త్రైమాసికంలో KVP వ‌డ్డీ రేటును 7.6 శాతం నుండి 6.9 శాతానికి త‌గ్గించారు. అప్ప‌టి నుండి అదే వ‌డ్డీ రేటును కొనసాగిస్తున్నారు.

నష్టభయం లేదు పోస్టాఫీస్ కిసాన్ వికాస్ పత్ర ఖాతాలో రాబ‌డికి న‌ష్ట‌భ‌యం ఉండ‌దు. అందుకే జీరో రిస్క్‌తో పెట్టుబ‌డి పెట్టాల‌నుకునేవారు ఈ ఖాతాను ఎంచుకోవ‌చ్చు. పెట్టుబ‌డులు వైవిధ్యంగా ఉండాలంటే పోర్ట్‌ఫోలియోలో కొంతభాగం రిస్క్‌లేని పెట్టుబ‌డులు ఉండాల‌నేది నిపుణుల సూచన. 18 ఏళ్లు నిండినవారు కిసాన్ వికాస్ పత్రను ఓపెన్ చేయవచ్చు. మైనర్ పేరిట జాయింట్ అకౌంట్ ఓపెన్ చేయవచ్చు.


Andhra Pradesh Jobs: ఏపీవీవీపీ, అనంతపురంలో పదోతరగతి, ఇంట‌ర్‌ అర్హత‌తో 76 పోస్టులు

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వానికి చెందిన ఏపీ వైద్య విధాన పరిషత్‌(ఏపీవీవీపీ).. అనంతపురం ఆసుపత్రుల్లో ఒప్పంద/అవుట్‌ సోర్సింగ్‌ ప్రాతిపదికన ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 76

పోస్టుల వివరాలు: రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్, థియేటర్‌ ఆర్టిస్ట్, ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపిస్ట్, ఆఫీస్‌ సబార్డినేట్‌ తదితరాలు.

అర్హత: పోస్టుల్ని అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియట్, డీఎంఎల్‌టీ, బ్యాచిలర్‌ డిగ్రీ, డీఫార్మసీ/బీఫార్మసీ ఉత్తీర్ణులవ్వాలి. ఏపీ మెడికల్‌ కౌన్సిల్‌/పారా మెడికల్‌ బోర్డ్‌లో రిజిస్టర్‌ అయి ఉండాలి.

వయసు: 01.07.2021 నాటికి 18 నుంచి 42 ఏళ్ల మధ్య ఉండాలి.

వేతనం: నెలకు రూ.12,000 నుంచి రూ.28,000 వరకు చెల్లిస్తారు.

ఎంపిక విధానం: అర్హత పరీక్షలో సాధించిన మెరిట్‌ మార్కులు, గత పని అనుభవం, ఇతర వివరాల ఆధారంగా ఎంపికచేస్తారు.

దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తును ది డిస్ట్రిక్‌ కోఆర్డినేటర్‌ ఆఫ్‌ హాస్పిటల్‌ సర్వీసెస్‌(ఏపీవీవీపీ), గవర్నమెంట్‌ జనరల్‌ హాస్పిటల్‌ క్యాంపస్, అనంతపురం, ఏపీ చిరునామకు పంపించాలి.

దరఖాస్తులకు చివరి తేది: 29.11.2021

వెబ్‌సైట్‌: https://ananthapuramu.ap.gov.in

for application and notification Visit Gemini Internet, D L Road, Hindupur 

Gemini Internet

26, నవంబర్ 2021, శుక్రవారం

DRDO Recruitment 2021: డీఆర్డీఓలో ఉద్యోగాలు.. ఎలాంటి ఎగ్జామ్ లేదు.. కేవలం మార్కుల ఆధారంగానే అభ్యర్థుల ఎంపిక

ఇటీవల పలు ప్రభుత్వ రంగ సంస్థల నుంచి వరుసగా జాబ్ నోటిఫికేషన్లు (Job Notifications) విడుదలవుతున్నాయి. తాజాగా ప్రముఖ ప్రభుత్వ రంగ సంస్థ అయిన డిఫెన్స్ రీసెర్చ్ అండ్ డవలప్మెంట్ ఆర్గనైజేషన్ (DRDO) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. సంస్థ నుంచి తాజాగా మరో జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. సంస్థకు చెందిన Terminal Ballistics Research Laboratoryలో 61 ఖాళీలను అప్రంటీస్ విధానంలో భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. ఎలాంటి ఎగ్జామ్ (Exam) లేకుండా కేవలం మెరిట్ ఆధారంగానే ఎంపిక చేపట్టనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు ఏడాది పాటు అప్రంటీస్ (Apprenticeship) విధానంలో పని చేయాల్సి ఉంటుందని ప్రకటనలో స్పష్టం చేశారు. ఇంకా.. ఎంపికైన వారికి ఉపకారవేతనంగా నెలకు రూ. 8050 (stipend) చెల్లించనున్నారు.


ఖాళీలు, విద్యార్హతల వివరాలు..
ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 61 అప్రంటీస్ ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ కింది ట్రేడ్ లలో ఐటీఐ చేసిన వారు ఈ ఖాళీలకు అప్లై చేసుకోవచ్చు. ట్రేడ్ ల వారీగా ఖాళీల వివరాలు ఇలా ఉన్నాయి.

ఎలా అప్లై చేయాలంటే..
Step 1: అభ్యర్థులు NAPS పోర్టల్ ద్వారా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

Step 2: అభ్యర్థులు apprenticeshipindia.org పోర్టల్ లో రిజిస్టర్ అయ్యి అన్ని కావాల్సిన సర్టిఫికేట్లను అప్ లోడ్ చేయాల్సి ఉంటుంది.

Step 3: అనంతరం అభ్యర్థులు టెన్త్ క్లాస్ మార్క్ షీట్, ఐటీఐ పాస్ సర్టిఫికేట్&మార్క్స్ షీట్, కాస్ట్ సర్టిఫికేట్, ఐడీ ప్రూఫ్ స్కానింగ్ కాపీలను సింగిల్ పీడీఎఫ్ ఫైల్ లో admintbrI@tbrl.drdo.in మెయిల్ లో పంపించాల్సి ఉంటుంది.

Step 4: ఈ ఉద్యోగాలకు అప్లై చేసేందుకు డిసెంబర్ 20ని ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రకటనలో స్పష్టం చేశారు.


ఎంపిక ఎలా చేస్తారంటే..

-అభ్యర్థులు విద్యార్హత పరీక్షలో సాధించిన మెరిట్ ఆధారంగా ఎంపిక చేపడుతారు.

-ఒక వేళ మార్కులు సమానంగా ఉంటే కింది తరగతుల్లో అభ్యర్థులు సాధించిన మార్కులను ప్రామాణికంగా తీసుకుంటారు.

-ఎంపికైన అభ్యర్థులకు ఈ-మెయిల్, ఎస్ఎంఎస్, ఫోన్ ద్వారా ట్రైనింగ్ కు సంబంధించిన సమాచారం ఇస్తారు.

S.No.ట్రేడ్ఖాళీలు
1డ్రాట్స్ మెన్(Draughtsman (Civil)1
2మెకానిక్ మెకాట్రానిక్స్1
3ఇన్స్ట్రుమెంట్ మెకానిక్1
4మెకానిక్ కమ్ ఆపరేటర్ ఎలక్ట్రానిక్స్ కమ్యూనికేషన్ సిస్టమ్3
5మెకానిక్(Embedded Systems and PLC)1
6ఆర్కిటెక్చరల్ అసిస్టెంట్(సివిల్)1
7హౌస్ కీపర్1
8ఫిట్టర్7
9మెషినిస్ట్4
10టర్నర్3
11కార్పెంటర్1
12ఎలక్ట్రీషియన్8
13ఎలక్ట్రానిక్స్ మెకానిక్8
14మెకానిక్ మోటర్ వెహికిల్2
15వెల్డర్6
16కంప్యూటర్ పెరిఫిరల్స్ హార్డ్ వేర్ రిపేర్ అండ్ మెయింటెనెన్స్2
17కంప్యూటర్ ఆపరేటర్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్3
18డిజిటల్ ఫొటోగ్రాఫర్3
19సెక్రెటేరియల్ అసిస్టెంట్3
20స్టేనోగ్రాఫర్1

Gemini Internet

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (FIRST LEVEL) NATIONAL TALENT SEARCH EXAMINATION

డైరెక్టర్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP. అమరావతి నిర్వహించే నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ 2021-22 (మొదటి స్థాయి) కోసం దరఖాస్తు చేసుకోండి
పర్టిక్యులర్స్ స్కూల్ I'd మరియు పాస్‌వర్డ్ అవసరం
అభ్యర్థి ఆధార్
కుల ధృవీకరణ పత్రం
NMMS హాల్‌టికెట్ నెల మరియు పరీక్ష సంవత్సరం
U DISE కోడ్
HM ఫోన్ నంబర్
నేను పాఠశాల ఇమెయిల్
I. గడువు తేదీలు
a) 29-10-2021 నుండి దరఖాస్తు ఆన్‌లైన్ సమర్పణ
b) 30-10-2021 నుండి చెల్లింపు చేయవచ్చు
c) సంబంధిత హెడ్ మాస్టర్ ద్వారా అభ్యర్థి దరఖాస్తును అప్‌లోడ్ చేయడానికి చివరి తేదీ 30-11-2021
d) ఫీజు చెల్లించడానికి చివరి తేదీ 01-12-2021

e) O/oలోని ఇతర ఎన్‌క్లోజర్‌లతో పాటు ముద్రించిన నామినల్ రోల్స్‌ను సమర్పించడానికి చివరి తేదీ. పాఠశాలకు సంబంధించిన జిల్లా విద్యా కార్యాలయం (HMలు/ప్రిన్సిపల్స్/కరస్పాండెంట్) 06-12-2021

Gemini Internet

II: సాధారణ సమాచారం

నేషనల్ టాలెంట్ సెర్చ్ ఎగ్జామినేషన్ (ఫస్ట్ లెవెల్)ని డైరెక్టరేట్ ఆఫ్ గవర్నమెంట్ ఎగ్జామినేషన్స్, AP, విజయవాడ NCERT, న్యూ ఢిల్లీ ఆదేశాల మేరకు NMMS పరీక్షతో పాటు ప్రతి సంవత్సరం నవంబర్ నెలలో నిర్వహిస్తారు. కోవిడ్ -19 కారణంగా ఈ సంవత్సరం పరీక్ష షెడ్యూల్ చేయబడింది. జనవరి నెలలో నిర్వహించాలి.

రాష్ట్రంలోని గుర్తింపు పొందిన ఏదైనా పాఠశాలలో X స్టాండర్డ్ చదువుతున్న విద్యార్థులందరూ పరీక్ష రాయవచ్చు.

ఓపెన్ డిస్టెన్స్ లెర్నింగ్ (ODL) కింద నమోదు చేసుకున్న విద్యార్థులు కూడా స్కాలర్‌షిప్‌కు అర్హులు, విద్యార్థులు 18 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నట్లయితే (నిర్దిష్ట సంవత్సరం జూలై 1 నాటికి), విద్యార్థికి ఉద్యోగం లేదు మరియు ఆమె/అతను తరగతికి హాజరవుతున్నారు. మొదటి సారి X పరీక్ష.

స్కాలర్‌షిప్‌ల సంఖ్యను ప్రతి సంవత్సరం NCERT కేటాయిస్తుంది. అభ్యర్థులు మెరిట్ ఆధారంగా మరియు NCERT ఇచ్చిన రిజర్వేషన్ నిబంధనల ప్రకారం రెండవ స్థాయికి ఎంపిక చేయబడతారు.

దేశవ్యాప్తంగా ప్రతి సంవత్సరం 2000 మంది అభ్యర్థులు సెకండ్ లెవల్ పరీక్షలో ఎంపికవుతున్నారు.

SBI Personal Loan: కేవలం 4 క్లిక్స్‌తో రూ.20 లక్షల లోన్ ఇస్తున్న ఎస్‌బీఐ... అప్లై చేయండి ఇలా

SBI Pre-approved Personal Loan | ఎస్బీఐలో పర్సనల్ లోన్ తీసుకోవాలనుకునేవారికి గుడ్ న్యూస్. కేవలం 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తోంది ఎస్బీఐ.

కరోనా వైరస్ సంక్షోభంతో కష్టకాలంలో ఉన్నారా? ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నారా? స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI అద్భుతమైన లోన్ ఆఫర్ ప్రకటించింది. కేవలం 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. గతంలో కస్టమర్లు లోన్ తీసుకోవాలంటే చాలా పెద్ద ప్రాసెస్ ఉండేది. బ్యాంకుకు వెళ్లి, లోన్ దరఖాస్తు చేసి, రోజుల పాటు ఎదురుచూడాల్సి వచ్చేది. కానీ... టెక్నాలజీ పెరిగిపోయిన తర్వాత బ్యాంకులు వీలైనంత తక్కువ సమయంలోనే రుణాలు ఇస్తున్నాయి. ఎస్బీఐ కూడా పర్సనల్ లోన్ ఆఫర్ ప్రకటించింది. 4 క్లిక్స్తో పర్సనల్ లోన్ ఇస్తోంది. అది కూడా తక్కువ వడ్డీకే. కేవలం 9.60 శాతం వడ్డీకే పర్సనల్ లోన్ ఇస్తామని ప్రకటించింది. కస్టమర్లకు రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్స్ ఇస్తోంది ఎస్బీఐ.

గతంలో పర్సనల్ లోన్ వడ్డీ రేట్లు 12 శాతం నుంచి 16 శాతం మధ్య ఉండేవి. కానీ ఇటీవల వడ్డీ రేట్లు బాగా తగ్గాయి. గతంలో హోమ్ లోన్ వడ్డీ రేట్లతో సమానంగా ఇప్పుడు పర్సనల్ వడ్డీ రేట్లు ఉన్నాయి. 10 శాతం లోపే పర్సనల్ లోన్ లభిస్తోంది. అయితే ఇవి ప్రీ అప్రూవ్డ్ లోన్స్. అంటే కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, క్రెడిట్ స్కోర్ లాంటివి పరిగణలోకి తీసుకొని తక్కువ వడ్డీకే రుణాలను ఇస్తుంటాయి బ్యాంకులు. ముందుగానే రుణాలు మంజూరు చేసి కస్టమర్లకు సమాచారం ఇస్తాయి. వీటినే ప్రీ అప్రూవ్డ్ లోన్స్ అంటారు. కస్టమర్లు తమకు అవసరమైతే రుణాలను సులువుగా తీసుకోవచ్చు.

ఎస్బీఐ కస్టమర్లు తమకు ప్రీ అప్రూవ్డ్ లోన్ మంజూరైందా? లేదా? అన్న విషయాన్ని ఎస్ఎంఎస్ ద్వారా తెలుసుకోవచ్చు. ఇందుకోసం కస్టమర్లు తమ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ నుంచి PAPL అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి అకౌంట్ నెంబర్లోని చివరి 4 అంకెలు టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. ఉదాహరణకు మీ అకౌంట్ నెంబర్ చివర్లో 7890 అని ఉంది అనుకుంటే మీరు PAPL 7890 అని టైప్ చేసి 567676 నెంబర్కు ఎస్ఎంఎస్ చేయాలి. ప్రీ అప్రూవ్డ్ లోన్ వర్తిస్తుందో లేదో ఎస్ఎంఎస్ ద్వారా తెలుస్తుంది. అందరికీ రూ.20 లక్షల వరకు ప్రీ అప్రూవ్డ్ లోన్ రాకపోవచ్చు. కస్టమర్ల క్రెడిట్ హిస్టరీ, తిరిగి చెల్లించే సామర్థ్యాన్ని బట్టి ఇది మారుతుంది.
 
Image

All it takes is an SMS, to begin with your personal loan process. SMS <PERSONAL> on 7208933145. To know more: bit.ly/37fnHhp
 

ఇదొక్కటే కాదు... 7208933142 నెంబర్కు మిస్డ్ కాల్ ఇచ్చినా పర్సనల్ లోన్డిపార్ట్మెంట్ నుంచి కాల్ బ్యాక్ వస్తుంది. లేదా SMS PERSONAL అని టైప్ చేసి 7208933145 నెంబర్కు ఎస్ఎంఎస్ పంపాలి. మరిన్ని వివరాలకు 1800112211 నెంబర్కు కాల్ చేయొచ్చు. లేదా ఎస్బీఐ అధికారిక వెబ్సైట్లో చూడొచ్చు. ఎస్బీఐ యోనో యాప్లో కూడా ప్రీఅప్రూవ్డ్ లోన్కు సంబంధించిన సమాచారం ఉంటుంది. యాప్లో Pre-approved Loan పైన క్లిక్ చేస్తే ప్రీ అప్రూవ్డ్ లోన్ ఎంత మంజూరైందో తెలుస్తుంది. అక్కడే మరిన్ని వివరాలు ఎంటర్ చేసి క్షణాల్లో రుణాలు పొందొచ్చు.

 Gemini Internet

Recent

🔔 Government Job Alerts – April 2025