పోస్ట్‌లు

BMRC Recruitment 2021: బెంగళూరు మెట్రో రైల్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి

బెంగళూరు మెట్రో రైల్ లో జాబ్స్.. దరఖాస్తుకు మరికొన్ని రోజులే ఛాన్స్.. ఇలా అప్లై చేయండి నిరుద్యోగులకు బెంగళూరు మెట్రో రైల్ కార్పోరేషన్ (BMRC) పలు ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు జనవరి 17లోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. బెగంళూరు మెట్రో రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ (BMRC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాలను (Jobs) భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు సంస్థ తాజాగా నోటిఫికేషన్ (Job Notification) జారీ చేసింది. సెక్షన్ ఇంజనీర్స్ తో పాటు పలు ఇతర ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో (Notification) పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. అప్లై చేసుకోవడానికి జనవరి 17ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని నోటిఫికేషన్లో స్పష్టం చేశారు. ఎంపికైన అభ్యర్థులు మూడేళ్ల పాటు కాంట్రాక్ట్ విధానంలో పని చేయాల్సి ఉంటుంది. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు

CSIR UGC NET అభ్యర్థులకు గమనిక.. కరెక్షన్ విండో ఓపెన్ చేసిన NTA.. జనవరి 9న మార్పులకు అవకాశం.

CSIR UGC NET 2022: CSIR UGC NET జూన్ 2021కి అప్లై చేసుకున్న అభ్యర్థులు ఏవైనా తప్పులుంటే సరిచేసుకోవడానికి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) కరెక్షన్ విండోను ఓపెన్ చేసింది. అభ్యర్థులు తమ ఆన్‌లైన్ దరఖాస్తు ఫారమ్‌లో సవరణలు చేసుకోవచ్చు. ఇందుకోసం అధికారిక వెబ్‌సైట్ csirnet.nta.nic.in ని సందర్శించి తప్పులు సరిదిద్దుకోవచ్చు. అభ్యర్థులందరికి జనవరి 9, 2022న మధ్యాహ్నం 12 గంటల నుంచి రాత్రి 11:50 గంటల వరకు మార్పులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. NTA జారీ చేసిన నోటీసు ప్రకారం.. జనవరి 9, 11:50 pm తర్వాత ఎటువంటి మార్పులకు అవకాశం ఉండదు. NTA ఇచ్చిన సమయంలో మార్పులు చేసిన తర్వాత అభ్యర్థులు ఏవైనా అదనపు ఛార్జీలు (వర్తిస్తే) చెల్లించాల్సి వస్తే క్రెడిట్/డెబిట్ కార్డ్/నెట్ బ్యాంకింగ్/UPI లేదా Paytm వాలెట్ ద్వారా చెల్లించవచ్చు. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6 తేదీల్లో పరీక్ష ఈ పరీక్షల కోసం రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తి చేసి జనవరి 8, 2021న లేదా అంతకు ముందు ఫీజు చెల్లించిన అభ్యర్థులకు మాత్రమే అడ్మిట్‌ కార్డు వస్తుంది. జనవరి 29, ఫిబ్రవరి 5, ఫిబ్రవరి 6, 2022న NTA పరీక్ష జరుగుతుంది. సైన్స్ అండ్ టెక్నాల

తిరుమల శ్రీవారి ఉదయాస్తమాన సేవ శ్రీవారి సేవలో అత్యంత ఖరీదైన టికెట్టు | ధర కోటి యాభై లక్షలు

■ ఆ సేవకు ఎందుకు అంత డిమాండ్..? ■ ఇంతకీ ఏంటి ఆ సేవలు ? పూర్తి వివరాలు మీకోసమే....!               👇👇👇 *🙏ఉదయాస్తమాన సేవ🙏*.              తిరుమలలో ఆ సేవ టికెట్ల ధర కోటిన్నర...? ఎందుకు అంత డిమాండ్...? 👉 సకల లోకాధిపతి దేవత సార్వభౌముడు శ్రీ వేంకటేశ్వర స్వామి దర్శన భాగ్యం ఈ కలియుగం లో ముక్తి మార్గం అనేది చాలా మంది భక్తుల నమ్మకం. ★ ఆ డిమాండ్ కి తగ్గట్టే ఉదయాస్తమాను సేవ టికెట్ల ధరల కోటిన్నర రూపాయలుగా టీటీడీ నిర్ణయించింది. 🕉 కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగే ఉదయాస్తమాన సేవా టికెట్ల ధరను టీటీడీ నిర్ణయించింది. 🟢  సధారణ రోజుల్లో ఉదయాస్తమాన సేవా టికెట్ కోటి రూపాయలు కాగా శుక్రవారం రోజున 1.5 కోట్లుగా టీటీడీ నిర్ణయించింది.  🕉 పరస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం దగ్గర 531  ఉదయాస్తమాన సేవా టికెట్లు అందుబాటులో ఉన్నాయి. 🕉 ఈ టికెట్‌తో దాదాపు 25 ఏళ్ల పాటు ఆర్జిత సేవలో పాల్గొనే అవకాశాన్ని భక్తులు పొందుతారు. ◆ ఏడాదికి ఒక్కరోజు ఉదయం సుప్రభాత సేవ నుంచి రాత్రి ఏకాంత సేవ వరకు ఆరుగురు భక్తులు పాల్గొనే సౌలభ్యాన్ని కల్పిస్తారు. 🟢 "ఉదయాస్తమాన సేవా"  టికెట్ల కేటాయింపుతో టీటీడీకి దాదాప

Income Tax Notice: ఇన్‌కమ్ టాక్స్ నుంచి నోటీసు వచ్చిందా ?.. అప్పుడేం చేయాలి ?.. పూర్తి వివరాలు

ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్, ఐటీ రిటర్న్స్, ఫైలింగ్, జేఎస్​ఓఎన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ, కామన్​ ఆఫ్​లైన్​ యుటిలిటీ  శాఖ నుండి నోటీసు రావాలని ఎవరూ కోరుకోరు. అక్కడి నుంచి నోటీసులు రావొద్దనే ప్రతి ఒక్కరూ భావిస్తుంటారు. కానీ మనం చేసే కొన్ని చిన్న చిన్న పొరపాట్ల వల్ల ఒక్కోసారి ఇన్‌కమ్ టాక్స్ డిపార్ట్‌మెంట్ నుంచి ఇబ్బందులు వచ్చిపడుతుంటాయి.  Gemini Internet ఆదాయపు పన్ను రిటర్న్ (ITR) దాఖలు చేసేటప్పుడు మీ ఆదాయాన్ని లెక్కించేటప్పుడు ఒక చిన్న పొరపాటు మిమ్మల్ని ఇబ్బందుల్లోకి నెట్టవచ్చు. దీని కారణంగా ఆ శాఖ నుంచి మీకు నోటీసులు కూడా రావొచ్చు. అయితే ఈ రకంగా నోటీసులు పొందిన వాళ్లు www.incometaxindiaefiling.gov.in వెబ్‌సైట్‌ ద్వారా సమాధానం ఇచ్చే అవకాశం కూడా ఉంది. సాధారణంగా ఆదాయపు పన్ను రిటర్న్‌ను దాఖలు చేసేటప్పుడు పన్ను ఆదా చేయడానికి వ్యక్తులు తప్పుడు సమాచారం ఇస్తారు. ఎక్కువ నష్టాన్ని చూపుతారు. అటువంటి పరిస్థితిలో తప్పుడు సమాచారాన్ని నింపినట్లు అనుమానించబడిన వ్యక్తులకు శాఖ నోటీసులు పంపే అవకాశం ఉంటుంది. ఇక్కడ వచ్చే సాధారణ నోటీసులు కోసం సెక్షన్ 139(9) ప్రకారం ఐటీఆర్‌లో ఏదైనా సమాచారం లేకపోయినా లే

EPFO: పీఎఫ్‌ వడ్డీ మీ ఖాతాలో జమ అయ్యిందో లేదో చెక్‌ చేయండిలా..

ఇంటర్నెట్ ‌ డెస్క్ ‌: పీఎఫ్‌ చందాదారులకు గుడ్‌న్యూస్‌. 2020-21 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి పీఎఫ్‌ మొత్తాలపై వడ్డీని చందాదారుల ఖాతాల్లో ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) జమ చేస్తోంది. ఇప్పటికే ఈ ప్రక్రియను ప్రారంభించింది. 8.5 శాతం చొప్పున 25 కోట్ల మంది ఖాతాదారుల ఖాతాల్లో వడ్డీ జమ కానుంది. మీ ఖాతాలో వడ్డీ జమ అయ్యిందో లేదో ఓ సారి చెక్‌ చేసుకోండి. ఎస్సెమ్మెస్‌, ఉమాంగ్‌ యాప్‌, ఈపీఎఫ్‌వో వెబ్‌సైట్‌, మిస్డ్‌ కాల్‌ ఇవ్వడం ద్వారా మీ బ్యాలెన్స్‌ను చెక్‌ చేసుకోవచ్చు. ఈపీఎఫ్ ‌ వో పోర్టల్ ‌: ఈపీఎవో సభ్యత్వ పోర్టల్‌లో రిజిస్టర్‌ చేసుకున్న స‌భ్యులు www.epfindia.gov.in వెబ్‌సైట్‌కు వెళ్లి కూడా బ్యాలెన్స్‌ వివరాలు తెలుసుకోవచ్చు. అందులో ‘అవర్‌ సర్వీసెస్‌’లోని ‘మెంబర్‌ పాస్‌బుక్‌’ విభాగంలోకి వెళ్లాల్సి ఉంటుంది. అప్పుడు యూఏఎన్‌ నంబర్‌, పాస్‌వర్డ్‌ ఎంటర్‌ చేయడం కోసం మరో పేజీకి రీడైరెక్ట్‌ అవుతుంది. వివరాలు ఎంటర్‌ చేయడం ద్వారా మీ ఖాతా వివరాలు తెలుసుకోవచ్చు. మిస్డ్ కాల్ స ‌ ర్వీస్ ‌: ఈపీఎఫ్‌వోతో రిజిస్టర్‌ చేసుకున్న మొబైల్ నుంచి 011-22901406 నంబర్‌కు మిస్డ్‌కాల్‌ ఇవ్వడం ద్వారా పీఎఫ్‌ బ్యాలె

LIC Scholarship 2021: విద్యార్థులకు శుభవార్త.. LIC స్కాలర్‌ షిప్‌కి అప్లై చేయండి.. ఏడాదికి రూ.20,000 పొందండి

LIC Scholarship 2021: ప్రతిభావంతులైన విద్యార్థులకు ఇది సువర్ణవకాశమని చెప్పాలి. LIC గోల్డెన్ జూబ్లీ ఫౌండేషన్ 2020 విద్యా సంవత్సరంలో కనీసం 60 శాతం గ్రేడ్‌తో X, XII లేదా తత్సమానం ఉత్తీర్ణులైన విద్యార్థులకు ఆల్ ఇండియా ప్రాతిపదికన స్కాలర్‌షిప్‌లను ప్రకటించింది. అర్హత, ఆసక్తి ఉన్న ఆర్థికంగా బలహీన విద్యార్థులు డిసెంబర్ 31, 2021లోగా దరఖాస్తు చేసుకోవాలి. LIC స్కాలర్‌షిప్‌లలో రెండు రకాలు ఉంటాయి. అందులో ఒకటి LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు, ఆడపిల్లల కోసం ప్రత్యేక స్కాలర్‌షిప్‌లు LIC డివిజనల్ కేంద్రానికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌లు LIC డివిజనల్ కేంద్రానికి మొత్తం 20 సాధారణ స్కాలర్‌షిప్‌లు ఉంటాయి. ఇందులో బాలురకు 10, బాలికలకు 10 కేటాయిస్తారు. ఆర్థికంగా బలహీన కుటుంబాలకు చెందిన విద్యార్థులకు ఉన్నత చదువులు చదవడానికి వీటిని అందిస్తారు. మెడిసిన్, ఇంజనీరింగ్, ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేషన్, ఏదైనా రంగంలో డిప్లొమా కోర్సు, ఇంటిగ్రేటెడ్ కోర్సు, ప్రభుత్వ గుర్తింపు పొందిన కళాశాలలు/సంస్థలు లేదా ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్‌స్టిట్యూట్‌లలోవృత్తి విద్యా కోర్సులు చదివేవారికి అవకాశం ఉంటుంద

NEET Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ నెలరోజులు ఆలస్యం.. అధికారికంగా ప్రకటించిన ఎంసీసీ

నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (National Eligibility cum Entrance Test) 2021 క్వాలిఫై అయిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కోసం ఎదురుచూస్తున్నారు. నీట్ ఫలితాలను ప్రకటించి ఒక నెల దాటినా, కౌన్సెలింగ్ (Counselling), అడ్మిషన్ ప్రక్రియ ఇంకా ప్రారంభం కాలేదు. దీంతో లక్షలాది మంది విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. అయితే నీట్ కౌన్సెలింగ్‌ ప్రారంభమయ్యేందుకు మరో నెల రోజుల సమయం పడుతుందని చెబుతోంది మెడికల్ కౌన్సెలింగ్ కమిటీ (Medical Counselling Committee). దీనికి సంబంధించి సంస్థ అధికారిక ప్రకటన వెల్లడించింది. మెడికల్ కాలేజీ అడ్మిషన్ల (Admissions)కు సంబంధించి అధికారుల నుంచి అధికారిక ప్రకటన వెలువడటం ఇదే తొలిసారి కావడం గమనార్హం. సుప్రీంకోర్టులో కొనసాగుతున్న కేసు కారణంగా నీట్ కౌన్సెలింగ్ ఆలస్యమవుతోందని MCC తెలియజేసింది. మెడికల్ అడ్మిషన్ల కోసం కొత్తగా ప్రవేశపెట్టిన EWS కోటాను పొందేందుకు రూ.8 లక్షలు పరిమితిగా ఉంచడంపై సుప్రీంకోర్టు (Supreme Court) లో విచారణ జరుగుతోంది. ఈ కేసు తదుపరి విచారణ జనవరి 6న జరగనుంది. Gemini Internet ఆ తరువాతే ఈ అంశంపై సుప్రీంకోర్టు తీర్పు రానుంది. కాబట్టి తీర్పుకు ముందు