పోస్ట్‌లు

ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు

  ICAI CA May Exam 2022 Schedule: సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, PQC పరీక్షలు – మే 2022 షెడ్యూల్ విడుదలైంది. సీఏ కొత్త షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారిక వెబ్‌సైట్‌ icaiexam.icai.orgలో విద్యార్ధుల కోసం అందుబాటులో ఉంచింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్ధులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 13 వరకు https://icaiexam.icai.orgలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు, పరీక్ష సమయాలు ఈకింది విధంగా ఉంటాయి.. షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలివే.. సీఏ ఫౌండేషన్‌ 2022 పరీక్షలు: మే 23, 24, 29 తేదీల్లో జరుగుతాయి. సీఏ ఇంటర్మీడియట్‌ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 15, 18, 20, 22 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 24, 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి. సీఏ మే ఫైనల్ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 14, 17, 19, 21 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 23, 25, 27, 29 తేదీల్లో జరుగుతాయి. ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ – అసెస్‌మెంట్ టెస్ట్‌ (INTT – AT): మే 14, 17 తేద

IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు

IGNOU January 2022 Session Admission Last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 21 వరకు స్పీకరించనున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఇగ్నో పేర్కొ్ంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in లేదా ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిలో అందించే ఓపెన్, డిస్టెన్స్ మోడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్‌ను చేసుకుని, అన్ని వివరాలను నమోదు చేసి, ఏ కోర్సులో అడ్మిషన్‌ కావాలని భావిస్తున్నారో దానిని ఎంచుకోవాలి. ఇగ్నో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీలు, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, అప్రీషియేషన్‌/అవేర్‌నెస్ లెవల్‌ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ విభాగాల్లో మొత్తం 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను వర్సిటీ అందించింది. మరిన్ని సంబంధిత వివరాల

Deputy Manager Jobs: కేవలం ఇంటర్వ్యూతోనే.. డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగాలు

APMDC Recruitment 2022 : విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APMDC) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటి మేనేజర్‌ (deputy manager posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 4 పోస్టుల వివరాలు: డిప్యూటి మేనేజర్‌ పోస్టులు విభాగాలు: లీగల్‌, మైనింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌ పే స్కేల్‌: నెలకు రూ.51,000ల నుంచి 70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అదనంగా నెలకు రూ.25,000ల వరకు అలవెన్స్‌ ఇస్తారు. వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, లా డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా (మైనింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. అడ్రస్‌: ఏపీఎండీసీ, కానూరు గ్

Project Assistant Jobs: బీఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండానే సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు.

CSIR – IPU Recruitment 2022: న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (IPU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం.. వివరాలు: మొత్తం ఖాళీల సంఖ్య: 10 పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు విభాగాలు: కెమికల్‌, మయోటెక్‌, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్‌, మెకానికల్ పే స్కేల్‌: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు. అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి. ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022. పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.   Gemini Internet

AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.

AWES Army School Admit Card 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్‌ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ స్కూల్ టీజీటీ, పీజీటీ, పీఆర్టీ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 8700 పోస్ట్‌లు రిక్రూట్ చేయనున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, సబ్జెక్ట్ పేరు, రోల్ నంబర్, చిరునామా, పరీక్షా కేంద్రం, తేదీలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. కాగా ఆర్మీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి 28 వరకు జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ awesindia.com ను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, మీరట్, బరేలీ, నోయిడా, ఢిల్లీ, ఝాన్సీ, డెహ్రాడూన్, జైపూర్, జబల్‌పూర్, భోపాల్‌లలో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ ట

AP EAPCET 2022: ఏపీ ఈఏపీ 2022 పరీక్ష ‘మే’ లో..

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది.. Gemini Internet AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది. ఏపీ ఈఏపీ 2022 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏపీ ఈఏసీ సెట్‌ 2022 లో మొత్తం 331 కళాశాలలు పాల్గొంటున్నాయి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధీనంలో కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తుంది.

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

చిత్రం
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి.  విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.  కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు. మొత్తంగా  మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533