అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
2, నవంబర్ 2021, మంగళవారం
MSME టూల్ రూమ్ రిక్రూట్మెంట్ 2021 అకౌంట్స్ అసిస్టెంట్, పర్చేజ్ ఇంజనీర్, డిజైన్ ఇంజనీర్ & ఇతర – 13 పోస్టులు www.citdindia.org చివరి తేదీ 05 నుండి 15–11-2021 వరకు – వాక్ ఇన్ చేయండి
Name of Organization Or Company Name :MSME Tool Room
Total No of vacancies: 13 Posts
Job Role Or Post Name:Accounts Assistant, Purchase Engineer, Design Engineer & Other
Educational Qualification:Diploma/ Degree (Relevant Discipline)
Who Can Apply:All India
Last Date:05 to 15–11-2021 – Walk in
Website: www.citdindia.org
Click here for Official Notification
ITBP రిక్రూట్మెంట్ 2021 స్పెషలిస్ట్ మెడికల్ ఆఫీసర్, స్పెషలిస్ట్ – 20 పోస్టులు www.itbpolice.nic.in చివరి తేదీ 15 & 16-11-2021 – వాక్ ఇన్
Name of Organization Or Company Name :Indo-Tibetan Border Police
Total No of vacancies:– 20 Posts
Job Role Or Post Name:Specialist Medical Officer, Specialist
Educational Qualification:PG Degree/ Diploma
Who Can Apply:All India
Last Date:15 & 16-11-2021 – Walk in
Website: www.itbpolice.nic.in
Click here for Official Notification
ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా రిక్రూట్మెంట్ 2021 గ్రాడ్యుయేట్ & డిప్లొమా అప్రెంటీస్ – 63 పోస్టులు www.aai.aero చివరి తేదీ 30-11-2021
Name of Organization Or Company Name :Airports Authority of India
Total No of vacancies: 63 Posts
Job Role Or Post Name:Graduate & Diploma Apprentice
Educational Qualification:Diploma, Degree (Relevant Engg. Discipline)
Who Can Apply:All India
Last Date:30-11-2021
Website: www.aai.aero
Click here for Official Notification
IBPS PO Notification 2021: 4135 పీఓ పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2021
బ్యాంకింగ్ రంగంలో కెరీర్ కోరుకునే అభ్యర్థులకు శుభవార్త! ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఆఫీసర్ స్థాయి కొలువుకు చక్కటి అవకాశం!! ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్).. 4135 ప్రొబేషనరీ ఆఫీసర్(పీఓ) పోస్టుల భర్తీకి ఇటీవల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఏదైనా డిగ్రీ అర్హతతో ఈ పోస్టులకు పోటీ పడొచ్చు. ఎంపిక ప్రక్రియలో విజయం సాధిస్తే.. బ్యాంకింగ్ రంగంలో అద్భుతమైన కెరీర్ సొంతమవుతుంది. దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో.. ఐబీపీఎస్ పీవో పోస్టులు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, విజయానికి ప్రిపరేషన్ టిప్స్తో ప్రత్యేక కథనం..
- 4135 పీఓ పోస్ట్ల భర్తీకి ఐబీపీఎస్ నోటిఫికేషన్
- ఏదైనా డిగ్రీ అర్హతతో దరఖాస్తు చేసుకోవచ్చు
- మూడు దశల్లో ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్..
ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్. ప్రభుత్వ రంగ
బ్యాంకుల్లో క్లర్క్, పీవో,స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులకు ఎంపిక ప్రక్రియ
చేపట్టేందుకు ఏర్పాటైన అటానమస్ సంస్థ. ఐబీపీఎస్ ప్రతి ఏటా ఆయా ఉద్యోగాల
భర్తీకి నోటిఫికేషన్లు విడుదల
చేస్తోంది. తాజాగా 2022–23 సంవవత్సరానికి పలు ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో
4,135 పీఓ/ఎంటీ(మేనేజ్మెంట్ ట్రైనీ) పోస్ట్లకు దరఖాస్తులు కోరుతోంది.
8 బ్యాంకులు.. 4,135 పోస్ట్లు
- ఐబీపీఎస్ నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం–మొత్తం ఎనిమిది ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో 4,135 పీఓ/ఎంటీ ఖాళీలు ఉన్నాయి.
- బ్యాంకుల వారీగా ఖాళీల వివరాలు: బ్యాంక్ ఆఫ్ ఇండియా–588, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర–400, కెనరా బ్యాంకు–650, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–620, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్–98, పంజాబ్ అండ్ సిం«ద్ బ్యాంక్ –427, యూకో బ్యాంక్–440, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా–912.
- వాస్తవానికి మరో మూడు ప్రభుత్వ బ్యాంకులు(బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్) కూడా ఐబీపీఎస్ ద్వారానే నియామకాలు చేపడుతుంటాయి. 2022–23 సంవత్సరంలో ఖాళీలకు సంబంధించి ఈ బ్యాంకుల నుంచి ఇప్పటి వరకు ఎలాంటి వివరాలు రాలేదు. దాంతో ఎనిమిది బ్యాంకుల్లో పోస్ట్ల భర్తీకే ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
అర్హతలు
- నవంబర్ 10, 2021 నాటికి గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత సాధించాలి.
- వయసు: అక్టోబర్ 1, 2021 నాటికి 21–30ఏళ్లు(అక్టోబర్ 2, 1991–అక్టోబర్ 01, 2001 మధ్య జన్మించాలి) మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీలకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్ క్రిమి లేయర్) అభ్యర్థులకు మూడేళ్ల గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.
ఎంపిక ప్రక్రియ
ఐబీపీఎస్ పీఓ/ఎంటీ ఎంపిక ప్రక్రియను మూడు దశల్లో నిర్వహించనున్నారు. అవి..ప్రిలిమినరీ, మెయిన్, పర్సనల్ ఇంటర్వ్యూ. ప్రిలిమినరీ, మెయిన్ పరీక్షలు ఆబ్జెక్టివ్ తరహాలో,ఆన్లైన్ విధానంలో జరుగుతాయి.
ప్రిలిమినరీ పరీక్ష
ఎంపిక ప్రక్రియలో తొలి దశ ప్రిలిమినరీ పరీక్షను మూడు విభాగాల్లో వంద
మార్కులకు నిర్వహిస్తారు. అవి..ఇంగ్లిష్ లాంగ్వేజ్ 30 ప్రశ్నలు–30
మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ 35 ప్రశ్నలు–35 మార్కులు, రీజనింగ్
ఎబిలిటీ 35 ప్రశ్నలు–35
మార్కులకు పరీక్ష జరుగుతుంది. ఒక్కో విభాగానికి 20 నిమిషాల చొప్పున మొత్తం పరీక్ష సమయం 60 నిమిషాలు.
మెయిన్కు ఎంపిక
అభ్యర్థులు ప్రిలిమినరీ పరీక్షలో సాధించిన మార్కులు, నిర్దేశిత కటాఫ్ ఆధారంగా మెయిన్కు ఎంపిక చేస్తారు. ప్రిలిమినరీ పరీక్షలో ప్రతి విభాగంలోనూ నిర్దిష్ట కటాఫ్ మార్కులు పొందాల్సి ఉంటుంది. ప్రిలిమ్స్ నుంచి మెయిన్కు 1:10 నిష్పత్తిలో అభ్యర్థులను ఎంపిక చేస్తారు. అంటే.. ప్రతి పోస్టుకు పది మంది చొప్పున పోటీపడతారు.
మెయిన్ ఎగ్జామ్
మెయిన్లో ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ పరీక్షలు ఉంటాయి. మెయిన్ ఆబ్జెక్టివ్ పరీక్షను ఆన్లైన్ విధానంలో నాలుగు విభాగాల్లో మొత్తం 155 ప్రశ్నలు–200 మార్కులకు నిర్వహిస్తారు. పరీక్ష సమయం మూడు గంటలు.
విభాగం | ప్రశ్నలు | మార్కులు | సమయం |
రీజనింగ్ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్ | 45 | 60 | 60 ని |
జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్ | 40 | 40 | 35 ని |
ఇంగ్లిష్ లాంగ్వేజ్ | 35 | 40 | 40 ని |
డేటా అనాలిసిస్ అండ్ ఇంటర్ప్రిటేషన్ | 35 | 60 | 45 ని |
మొత్తం | 155 | 200 | 3 గం |
ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్
మెయిన్ పరీక్షలో భాగంగా ఇంగ్లిష్ డిస్క్రిప్టివ్ టెస్ట్ను కూడా నిర్వహిస్తారు. వ్యాసరూప తరహాలో ఉండే ఈ విభాగంలో అభ్యర్థులు ఇంగ్లిష్లో ఎస్సే, లెటర్ రైటింగ్ రాయాల్సి ఉంటుంది. దీనికి కేటాయించిన మార్కులు 25. పరీక్ష సమయం 30 నిమిషాలు. అభ్యర్థుల ఇంగ్లిష్ పరిజ్ఞానాన్ని పరీక్షించే ఉద్దేశంతో దీన్ని నిర్వహిస్తున్నారు.
నెగెటివ్ మార్కింగ్
ఆన్లైన్ విధానంలో.. ఆబ్జెక్టివ్ టెస్ట్లుగా నిర్వహించే ప్రిలిమ్స్, మెయిన్ రెండు పరీక్షల్లోనూ నెగెటివ్ మార్కింగ్ నిబంధన అమలవుతోంది. ప్రతి తప్పు సమాధానానికి 0.25 మార్కులు తగ్గిస్తారు.
పర్సనల్ ఇంటర్వ్యూ
మెయిన్కు సెక్షన్ వారీ కటాఫ్, ఓవరాల్ కటాఫ్లను నిర్దేశించి.. ఆ
జాబితాలో నిలిచిన అభ్యర్థులకు చివరగా పర్సనల్ ఇంటర్వ్యూ నిర్వహిస్తారు. ఈ
ఇంటర్వ్యూకు కేటాయించిన మార్కులు 100. ఇందులో అభ్యర్థులు కనీస అర్హత
మార్కులు సాధించాల్సి
ఉంటుంది. జనరల్ కేటగిరీ అభ్యర్థులు 40 శాతం మార్కులు, రిజర్వ్డ్ కేటగిరీ అభ్యర్థులు 35 శాతం మార్కులు సాధించాలి.
తుది జాబితా 80:20 వెయిటేజీ
- అభ్యర్థుల తుది జాబితా రూపకల్పనలో మెయిన్ మార్కులు, పర్సనల్ ఇంటర్వ్యూకు నిర్దేశిత వెయిటేజీలు పేర్కొన్నారు.
- మెయిన్ పరీక్షలో మార్కులకు 80 శాతం వెయిటేజీ, పర్సనల్ ఇంటర్వ్యూ మార్కులకు 20 శాతం వెయిటేజీని నిర్దేశించారు. అంటే.. అభ్యర్థులు మెయిన్, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కులను వంద మార్కుల వెయిటేజీకి క్రోడీకరించి.. తుది జాబితా ప్రకటిస్తారు.
విజయం సాధించాలంటే
- ఎస్బీఐ పీఓకు పోటీ పడే అభ్యర్థులు.. ఐబీపీఎస్ పీవోకు కూడా దరఖాస్తు చేసుకుంటే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సిద్ధం కావొచ్చు.
- మొదట ప్రిలిమ్స్, మెయిన్ రెండింటిలో కీలకంగా నిలిచే రీజనింగ్పై పట్టు సాధించేందుకు కృషి చేయాలి. సిరీస్, అనాలజీ, కోడింగ్–డీ కోడింగ్, డైరెక్షన్స్, బ్లడ్ రిలేషన్స్, ర్యాంకింగ్స్, సీటింగ్ అరేంజ్మెంట్స్, సిలాజిజమ్స్పై అవగాహన పెంచుకోవాలి.
- క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్ విభాగానికి సంబంధించి అర్థమెటిక్పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. స్క్వేర్ రూట్స్, క్యూబ్ రూట్స్, పర్సంటేజెస్, టైం అండ్ డిస్టెన్స్, టైం అండ్ వర్క్, ప్రాఫిట్ అండ్ లాస్, రేషియోస్ సంబంధిత ప్రశ్నలను ప్రాక్టీస్ చేయాలి. వీటితోపాటు నంబర్ సిరీస్, డేటా అనాలిసిస్ విభాగాలను కూడా అధ్యయనం చేయాలి. ఫలితంగా ప్రిలిమ్స్, మెయిన్స్ రెండింటిలోనూ మంచి మార్కులు సాధించే అవకాశం ఉంటుంది.
- అభ్యర్థుల్లోని విశ్లేషణ సామర్థ్యం, తులనాత్మకతను పరిశీలించే డేటా అనాలిసిస్, డేటా ఇంటర్ప్రిటేషన్లో రాణించేందుకు కాలిక్యులేషన్ స్కిల్స్ను పెంచుకోవాలి. టేబుల్స్, డయాగ్రమ్స్, నంబర్ డేటా, లైన్ గ్రాఫ్, బార్ గ్రాఫ్ తదితర గ్రాఫ్ ఆధారిత డేటాలోని సమాచారాన్ని క్రోడీకరించే విధంగా ప్రాక్టీస్ చేయాలి.
- జనరల్/ఎకానమీ/బ్యాంకింగ్ అవేర్నెస్కు సంబంధించి ఇటీవల కాలంలో జాతీయ ఆర్థిక రంగంలో మార్పులు, బ్యాంకుల విధి విధానాలు, అవి కొత్తగా ప్రకటిస్తున్న పథకాల గురించి తెలుసుకోవాలి. బ్యాంకింగ్, ఆర్థిక రంగంలో వినియోగించే పదజాలంపై పట్టు సాధించాలి.
- ఇంగ్లిష్ లాంగ్వేజ్ కోసం బేసిక్ గ్రామర్తో మొదలు పెట్టి వొకాబ్యులరీ పెంచుకోవడం వరకు కృషి చేయాలి. రీడింగ్ కాంప్రహెన్షన్, కరెక్షన్ ఆఫ్ సెంటెన్సెస్, జంబుల్డ్ సెంటెన్సెస్, ప్రిపోజిషన్స్, ఆర్టికల్స్ వంటి వాటిపై ప్రత్యేక దృష్టిపెట్టాలి.
- డిస్క్రిప్టివ్ విధానంలో ఉండే ఇంగ్లిష్ ఎస్సే రైటింగ్, లెటర్ రైటింగ్ కోసం ఇంగ్లిష్ దినపత్రికలు చదవడం, ఎడిటోరియల్స్ చదవడం మేలు చేస్తుంది.
ఐబీపీఎస్ పీఓ/ఎంటీ –(11)–2022–23 సమాచారం
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేది: 10.11.2021
- ప్రిలిమినరీ కాల్ లెటర్స్ డౌన్లోడ్: నవంబర్/డిసెంబర్, 2021
- ప్రిలిమినరీ పరీక్ష(ఆన్లైన్) తేదీలు: డిసెంబర్ 4, 11 తేదీల్లో
- ప్రిలిమినరీ ఫలితాలు: డిసెంబర్ 2021/జనవరి 2022.
- మెయిన్ కాల్ లెటర్ డౌన్లోడ్: డిసెంబర్ 2021/జనవరి 2022.
- మెయిన్ ఆన్లైన్ పరీక్ష తేదీ: జనవరి 2022
- మెయిన్ ఫలితాల వెల్లడి: జనవరి/ఫిబ్రవరి 2022
- ఇంటర్వ్యూ కాల్ లెటర్ డౌన్లోడ్: ఫిబ్రవరి 2022
- పర్సనల్ ఇంటర్వ్యూలు: ఫిబ్రవరి/మార్చి 2022
- ప్రొవిజనల్ అలాట్మెంట్: 2022 ఏప్రిల్
పూర్తి వివరాలకు వెబ్సైట్: https://www.ibps.in/
Gemini Internet
NEET Results: నీట్ ఫలితాలు, కటాఫ్ సమాచారం
తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్రెడ్డి 23వ ర్యాంక్తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్ టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది.
720కి 720 మార్కులు సాధించింది వీరే..
తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్ టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్ టీఏ తెలిపింది. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్ టీ ఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కలి్పస్తారు.
ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు..
గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచి్చనవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కలి్పంచారు.
రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు
ఆంధ్రప్రదేశ్లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి.
15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్
- నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి.
- అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు.
- దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు.
- నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సరీ్వసెస్తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు https://www.mcc.nic.in వెబ్సైట్ను సందర్శించాలని ఎన్ టీఏ విజ్ఞప్తి చేసింది.
- ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు.
Gemini Internet
AP EAPCET వెబ్ ఆప్షన్లు ఫ్రీజ్ కాని సమస్యకు పరిష్కారం | AP EAPCET Weboptions Freezing problem Solved 2021-22
AP EAPCET 2021-22 సంవత్సరానికి సంబందించి ఎవరైతే weboptions పెడుతున్నారో అలాంటి వారు ఖచ్చితంగా తెలుసుకోవలసినవి
1. వెబ్ ఆప్షన్స్ పెట్టాడానికి ముందు కాలేజ్ కోడ్స్, కోర్సు కోడ్ లను జాగ్రత్త ఒక పేపరు లో వ్రాసుకుని వెబ్ ఆప్షన్స్ ను ఫిలప్ చేయాలి ఎందుకంటే ఇప్పుడు కొని కొత్త కోర్సులకు విద్యార్థులు ఆసక్తి చూపుతున్నారు కాబట్టి తల్లిదండ్రులు, సన్నిహితులు, కంప్యూటర్ ఆపరేటర్లు శ్రద్ద తీసుకుని కోర్సు అలాగే నచ్చిన కాలేజీ కోడ్ లను వరుస క్రమంలో వ్రాసుకోవాలని మనవి.
2. ఇంజీనీరింగ్ లో ఎవరైనా ఫోన్ నెంబరు పోగొట్టుకున్నా లేదా ఫోన్ నెంబరు తప్పుగా ఎంటర్ చేసి OTP లు రాకపోతే అలాంటి వారు మీకు సంబందించిన Help Line Centerను సందర్శించండి.
3.
ఇప్పుడు
చెప్పబోయేది కాస్త జాగ్రత్తగా వినండి, విద్యార్థులు ఖచ్చితంగా కంప్యూటర్లు వాడాలి సెల్ ఫోన్ లో చేయడానికి ప్రయత్నించకండి.
మీరు ఆప్షన్స్ పెట్టినతరువాత Freeze ఆప్షన్ పనిచేయకపోతే వేరొక బ్రౌజర్ లో చేయడం ద్వారా మీ ఆప్షన్లను ఫ్రీజ్ చేయవచ్చు.
నిజానికి ఈ సమస్య ఎక్కడ వస్తుందంటే ప్రస్తుత బ్రౌజర్లో options సేవ్ చేసిన తరువాత successfully saved అని వచ్చి do you want to block this message prompt అనే ఆప్షన్ ను క్లిక్ చేసి ఉండడం వల్ల ఇది జరుగుతుంది.
క్రింద ఉన్న స్క్రీన్ షాట్ లలో weboption ప్రక్రియను చూడవచ్చు.
Gemini Internet, Dhanalakshmi Road, Hindupur.

-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...