4, నవంబర్ 2023, శనివారం

2,000 jobs: ‘స్కిల్‌’ శిక్షకులకు ఆహ్వానం

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- 

రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో ఏర్పాటుచేసిన 192 స్కిల్హబ్స్, ప్రతి పార్లమెంట్నియోజకవర్గ పరిధిలో ఏర్పాటుచేసిన మరో 26 స్కిల్కాలేజీలు, ఒక స్కిల్యూనివర్సిటీలో వివిధ కోర్సుల్లో శిక్షణ ఇవ్వడానికి ఔత్సాహికుల నుంచి Andhra Pradesh State Skill Development Corporation (APSSDC) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.

ప్రతి జాబ్రోల్కు ఒక సర్టిఫైడ్ట్రైనర్చొప్పున మొత్తం 2,000 మంది శిక్షకులు అవసరమవుతారని ఏపీఎస్ఎస్డీసీ అంచనా వేసింది. అర్హత కలిగిన అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ తరగతులపై ట్రైనింగ్ఇచ్చి శిక్షకులుగా ఎంపిక చేస్తామని, ఇందుకు సంబంధించిన నిర్వహణ విధివిధానాలు (ఎస్వోపీ)ని రూపొందించినట్లు ఏపీఎస్ఎస్డీసీ ఎండీ సీఈవో వినోద్కుమార్వంబర్ 2‌ ‘సాక్షికి తెలిపారు. ఆసక్తిగలవారికి కేంద్ర నైపుణ్య శిక్షణ ఎన్ఎస్క్యూఎఫ్ప్రమాణాల ప్రకారం నైపుణ్య శిక్షణ ఇచ్చే విధంగా ఉచితంగా ట్రైనింగ్ఇస్తామని చెప్పారు. తర్వాత శిక్షకులుగా సర్టిఫికెట్జారీచేసి ఏపీఎస్ఎస్డీసీ ఎంపానల్మెంట్లో నమోదు చేస్తామని చెప్పారు.

మొత్తం 20 రంగాలకు చెందిన 44 జాబ్రోల్స్లో శిక్షకులను నియమించనున్నట్లు వివరించారు. ఆసక్తిగల అభ్యర్థులు ఏపీఎస్ఎస్డీసీ పోర్టల్‌ https://skilluniverse.apssdc.in/user&registration లో తమ వివరాలు నమోదు చేసుకోవాలని సూచించారు. శిక్షణ పూర్తి చేసుకుని ఎంపికైన అభ్యర్థులను ఏపీ స్కిల్యూనివర్సల్పోర్టల్లేదా యాప్లో ఉంచనున్నట్లు తెలిపారు. ఆయా కోర్సుల్లో శిక్షణ అవసరమైనప్పుడు వీరు విద్యార్థులకు శిక్షణ ఇస్తారని, శిక్షణా వ్యయంలో సుమారు 13 శాతం వరకు శిక్షకులకు పారితోషికంగా ఇస్తామని, కోర్సును బట్టి వీటి ఫీజులు మారుతుంటాయని వినోద్కుమార్తెలిపారు.

రాష్ట్రంలో ఏర్పాటుచేసిన పరిశ్రమల్లో 75 శాతం ఉద్యోగాలు స్థానికులకే ఇవ్వాలని ముఖ్యమంత్రి వైఎస్జగన్మోహన్రెడ్డి చట్టం తీసుకురావడమే కాకుండా దానికి అనుగుణంగా నైపుణ్యం కలిగిన మానవ వనరులను అందించడానికి పిరమిడ్ఆకృతిలో ఒక ఎకో సిస్టమ్ను రూపొందించారు.

ఇంటర్మీడియెట్లోపు విద్యార్థులకు నైపుణ్య శిక్షణ కోసం స్కిల్హబ్స్, ఆపైన విద్యార్థులకు స్కిల్కాలేజీలు, హైఎండ్స్కిల్శిక్షణ కోసం స్కిల్యూనివర్సిటీలను రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది.       

 - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 116 కోర్సులు ఇవే...🖋️

ఇంటర్ తర్వాత చేయడానికి అవకాశం ఉన్న ఉన్నతమైన 116 కోర్సులు ఇవే...🖋️

001. ఏరోనాటికల్ ఇంజనీరింగ్
002. ఏరోస్పేస్ ఇంజనీరింగ్
003. ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
004. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషీన్ లెర్నింగ్
005. ఆస్ట్రోనమీ అండ్ ఆస్ట్రోఫిజిక్స్
006. ఆటోమొబైల్ ఇంజనీరింగ్
007. బయో మెడికల్ ఇంజనీరింగ్
008. బయో టెక్నాలజీ ఇంజనీరింగ్
009. సెరామిక్స్ ఇంజనీరింగ్
010. కెమికల్ ఇంజనీరింగ్
011. సివిల్ ఇంజనీరింగ్
012. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్
013. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
014. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్
015. ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్
016. ఇన్ఫర్మేషన్ కమ్యూనికేషన్స్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్
017. ఇంస్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్
018. మ్యాన్యుఫ్యాక్చరింగ్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్
019. మెరైన్ ఇంజనీరింగ్
020. మెకానికల్ ఇంజనీరింగ్
021. మెడికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
022. మెటాలర్జీ
023. మెటరాలజీ
024. మైనింగ్ ఇంజనీరింగ్
025. నావల్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్
026. ఫిజికల్ సైన్సెస్
027. పాలీమర్ ఇంజనీరింగ్
028. రోబోటిక్స్
029. టెక్స్‌టైల్ ఇంజనీరింగ్
030. అగ్రికల్చర్ సైన్స్
031. బయోలాజికల్ సైన్స్
032. బయోటెక్నాలజీ
033. కంప్యూటర్ అప్లికేషన్స్
034. కంప్యూటర్ సైన్స్
035. సైబర్ సెక్యూరిటీ
036. ఎర్త్ సైన్స్ / జాగ్రఫీ
037. ఎన్విరాన్‌మెంటల్ సైన్సెస్
038. ఫిషరీస్
039. ఫ్లోరికల్చర్/హార్టికల్చర్
040. ఫుడ్ టెక్నాలజీ
041. ఫారెస్ట్రీ
042. ఓషియనోగ్రఫీ
043. స్టాటిస్టికల్ సైన్స్
044. వెటర్నరీ సైన్సెస్
045. వైల్డ్ లైఫ్ బయాలజీ
046. జువాలజీ
047. ఆయుర్వేద బీఏఎంఎస్
048. డెంటల్ బీడీఎస్
049. హోమియోపతి
050. న్యాచురోపతి
051. ఫార్మసీ
052. సిద్ధ
053. యునానీ
054. ఆంత్రోపాలజీ
055. ఆర్కియాలజీ
056. ఆర్ట్ రిస్టోరేషన్
057. క్యూరేషన్
058. ఎడ్యుకేషనల్/వొకేషనల్ స్కూల్ కౌన్సిలర్
059. మాన్యుమెంట్స్ అండ్ స్కల్ప్చర్‌ రిస్టోరేషన్
060. మ్యూసియాలజీ
061. ఫిజియోథెరపీ
062. రిహ్యాబిలిటేషన్ సైకాలజీ
063. రిహ్యాబిలిటేషన్ థెరపీ
064. సోషల్ వర్క్
065. స్పెషల్ ఎడ్యుకేటర్
066. స్పీచ్ లాంగ్వేజ్ అండ్ హియరింగ్
067. లా
068. అడ్వర్టైజింగ్
069. జర్నలిజం
070. మాస్ కమ్యూనికేషన్
071. పబ్లిక్ రిలేషన్స్
072. ఆర్ట్ డైరెక్షన్
073. కొరియోగ్రఫీ
074. డైరెక్షన్
075. ఫిల్మ్/డ్రామా ప్రొడక్షన్
076. ఫైన్ ఆర్ట్స్
077. పర్ఫామింగ్ ఆర్ట్స్
078. వోకల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటల్ మ్యూజిక్
079. యానిమేషన్
080. సినిమాటోగ్రఫీ
081. కమ్యూనికేషన్ డిజైన్
082. డిజైన్
083. గ్రాఫిక్ డిజైనింగ్
084. ఫోటోగ్రఫీ
85. యాక్చురియల్ సైన్సెస్
086. బ్యాంక్ మేనేజ్‌మెంట్
087. బిజినెస్ అడ్మినిస్ట్రేషన్
088. బిజినెస్ మేనేజ్‌మెంట్
089. కాస్ట్స్ అండ్ వర్క్స్ అకౌంట్స్
090. చార్టర్డ్ అకౌంటెన్సీ
091. చార్టర్డ్ ఫైనాన్షియల్ అనాలిసిస్
092. ఈవెంట్ మేనేజ్‌మెంట్
093. హాస్పిటల్ మేనేజ్‌మెంట్
094. హోటల్ మేనేజ్‌మెంట్
095. హ్యూమన్ రిసోర్స్ మేనేజ్‌మెంట్
096. ఇన్స్యూరెన్స్
097. లాజిస్టిక్స్ అండ్ సప్లై చెయిన్ మేనేజ్‌మెంట్
098. మేనేజ్‌మెంట్
099. బ్యాచిలర్ ఆఫ్ ఆర్ట్స్
100. డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్
101. కార్పొరేట్ ఇంటెలిజెన్స్
102. డిటెక్టీవ్
103. ఫుడ్ సైన్స్ అండ్ న్యూట్రీషియన్
104. ఫారిన్ లాంగ్వేజెస్
105. హోమ్ సైన్స్
106. ఇంటీరియర్ డిజైనింగ్
107. లిబరల్ స్టడీస్
108. లైబ్రసీ సైన్సెస్
109. మాంటెస్సరీ టీచింగ్
110. న్యూట్రీషియన్ అండ్ డైటెటిక్స్
111. ఫిజికల్ ఎడ్యుకేషన్
112. స్పోర్ట్స్ అండ్ స్పోర్ట్స్ మేనేజ్‌మెంట్
113. టూరిజం అండ్ ట్రావెల్.
114. డిప్లొమా ఇన్ ఆప్టిమెట్రీ (కంటి పరీక్ష లు)
115 . పర్ఫ్యూషన్ టెక్నాలజీ ( రక్త మార్పిడి).
115. మేల్ నర్శింగ్ , ఫిమేల్ నర్శంగ్ కోర్సులు
116. గుండె పరీక్ష లు చేసే డిప్లమా కోర్సులు

విద్యార్థులు, వారి తల్లిదండ్రుల కోసం రూపొందించిన బుక్‌లెట్‌లో సీబీఎస్ఈ ప్రధానంగా వివరించిన 116 కోర్సులు ఇవి.

ఇవే కాకుండా అనేక రంగాల్లో అనేక కోర్సులు ఉన్నాయి.

అయితే విద్యార్థుల అభిరుచికి తగ్గట్టుగా కోర్సుల్ని ఎంచుకుంటే కెరీర్ బాగుంటుంది.

ఈ పోస్టును షేర్ చేయడం వలన ఇంటర్ పాసయిన విద్యార్థులకు, వారి తల్లితండ్రుల కు ఉపయోగముంటుంది.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺 ‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’ - శకుంతలా దేవి

🌺 నేడు "మానవ గణన యంత్రం" శకుంతలా దేవి జయంతి 🌺
‘‘గణితం లేకుండా మీరేమీ చేయలేరు. మీ చుట్టూ ఉన్నదంతా అంకెలు, సంఖ్యలు, గణితమే.’’
 - శకుంతలా దేవి
గణితమే తన లోకంగా జీవించిన మేధావి శకుంతలాదేవి. గణితంతో మూడేళ్ల వయసులో మొదలైన ఆమె ప్రయాణాన్ని, మరణం మాత్రమే విడదీయగలిగింది. 
శకుంతలాదేవి 1929 నవంబర్ 4న బెంగళూరులోని ఒక సనాతన కన్నడ బ్రాహ్మణ కుటుంబంలో జన్మించింది. ఆమె తండ్రి పూజారిగా ఉండటానికి ఇష్టపడక సర్కస్ కంపెనీలో చేరారు. వచ్చే ఆదాయం అంతంత మాత్రమే. అలాంటి పరిస్థితులు కూడా శకుంతలాదేవి ప్రతిభకు అడ్డుకట్ట వేయలేకపోయాయి.
 
 ఆమె మూడేళ్ల చిన్నారిగా ఉన్నప్పుడు తండ్రితో పేకాడుతూ ప్రతి ఆటలోనూ గెలిచేది. అంత చిన్నపాప ప్రతీసారీ తనపై గెలవడం తండ్రికి ఆశ్చర్యం కలిగించింది. తన కూతురు మోసం చేస్తుందేమోనని అనుమానం కలిగించింది. అన్ని జాగ్రత్తలూ తీసుకుని ఆడినా ఆమెదే విజయం. చివరకు.. పేక ముక్కలన్నింటినీ గుర్తుపెట్టుకోవడం వల్లనే శకుంతల గెలుస్తోందని గుర్తించాడు. ఆమె అద్భుత జ్ఞాపకశక్తిని తమకు జీవికగా ఉపయో గించుకున్నాడు.
 
 ఆమెతో ప్రదర్శనలిప్పిం చాడు. అలా అలా ఆమె ప్రతిభ విశ్వ విద్యాలయాలకు చేరింది. ఆరేళ్ల వయసులో తొలిసారి యూనివర్సిటీ ఆఫ్ మైసూర్‌లో ప్రదర్శన ఇచ్చింది. ఆ తర్వాత రెండేళ్లకు అన్నామలై విశ్వవిద్యాలయంలో ఆ తర్వాత ఉస్మానియా, ఆంధ్ర విశ్వవిద్యాలయాల్లో బాల మేధావిగా ఆమె పేరు మారుమోగింది.

 శకుంతలాదేవికి లెక్కలంటే ఏమాత్రం లెక్కలేదు. ఎంత పెద్ద సమస్యనైనా ఆమె చిటికలో పరిష్కరించేవారు.

 తన ప్రతిభను ప్రదర్శించేందుకు ఆమె 1944లో తండ్రి చేయి పట్టుకుని లండన్ చేరుకున్నారు.
 
 అనేక విశ్వవిద్యాలయాల్లో, వివిధ సంస్థల్లో ప్రదర్శనలిచ్చారు. 1950 అక్టోబర్ 5న బీబీసీలో తన గణిత ప్రతిభను ప్రదర్శిం చారు. లెస్లీ మిషెల్ ఇచ్చిన సమస్యను సెకన్లలో పరిష్కరించారు. ఆ సమాధానం తప్పని మిషెల్ అన్నారు. కానీ శకుంతలా దేవి తాను సరైన సమాధానమే చెప్పానని, సరిచూసుకోమని దృఢంగా చెప్పారు. ఆవిడ తిరిగి చూసుకుంటే శకుంతలా దేవి సమాధానమే సరైనదని తేలింది. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. ఆమెకు ‘హ్యూమన్ కంప్యూటర్’ అనే బిరుదు దక్కింది. 

శకుంతలా దేవి ప్రతిభకు డల్లాస్‌లోని సదరన్ మెథడిస్ట్ యూనివర్సిటీలో జరిగిన సంఘటన మరింత అద్దం పడుతుంది. అమెరికాలోని ఈ యూనివర్సిటీవారు శకుంతలా దేవిని ఆహ్వానించారు. ఆమె ప్రతిభను పరీక్షించే పనిలో భాగంగా 201 అంకెలున్న సంఖ్యకు 23వ రూట్ చెప్పమన్నారు.
 
  ఆవిడ 50 సెకన్లలో చెప్పేసింది. కానీ అది నిజమో కాదో తెలుసుకోవడానికి అమెరికన్ బ్యూరో ఆఫ్ స్టాండర్డ్స్ సంస్థలోని యూనివాక్-1101 అడ్వాన్స్‌డ్ కంప్యూటర్‌లో ప్రత్యేక ప్రోగ్రామ్ రాయాల్సి వచ్చింది. 

1980లో లండన్ ఇంపీరియల్ కాలేజీలో ఆమె గిన్నిస్ రికార్డు సృష్టించారు. అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా (బెర్క్‌లీ) సైకాలజీ ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సన్ 1988లో శకుంతలాదేవి ఇంటెలిజెన్స్‌ను అధ్యయనం చేశారు. అనేక క్లిష్ట సమస్యలను జెన్సన్ పేపర్‌పై రాసేకంటే అతి తక్కువ సమయంలో ఆమె పరిష్కరించి అతన్ని ఆశ్చర్యపరిచారు.

1977లో అమెరికాలో ఓ కంప్యూటర్తోశకుంతలా దేవికి పోటీ పెట్టారు. 188132517 అనే సంఖ్యకు మూడో వర్గం కనుక్కోవడంలో ఈ పోటీ పెట్టగా, ఆమె కంప్యూటర్ ను ఓడించేశారు. 

ఇక 1980 జూన్ నెలలో 13 అంకెలున్న రెండు సంఖ్యలు తీసుకున్నారు

76,86,36,97,74,870  అనే సంఖ్యతో 24,65,09,97,45,779 అనే సంఖ్యను హెచ్చవేస్తే ఎంత వస్తుందని లండన్ ఇంపీరియల్ కాలేజిలోని కంప్యూటర్ విభాగంలోని ఓ సూపర్ కంప్యూటర్ శకుంతలా దేవిని ప్రశ్నించింది. దానికి ఆమె కేవలం 28 సెకన్లలో సమాధానం ఇచ్చారు. 

ఆ సమాధానం.. 18,947,668,177,995,426,462,773,730. ఆ దెబ్బకు గిన్నెస్ రికార్డు ఆమె పాదాక్రాంతమైంది.

యూనివర్సిటీ ఆఫ్ 
కాలిఫోర్నియాకు  చెందిన మానసిక శాస్త్ర ప్రొఫెసర్ ఆర్థర్ జెన్సెన్ స్వయంగా శకుంతలా దేవి గణిత ప్రతిభను పరిశీలించి అవాక్కయ్యారు.

గత శతాబ్ద కాలంలో ఏ తేదీ చెప్పినా అది ఏ వారం అవుతుందో చిటికెలో ఆమె చెప్పేవారు.

1977లో 201 అంకెలున్న సంఖ్యకు 23వ వర్గం ఎంతో కేవలం 50 సెకండ్లలో చెప్పేశారు.

శకుంతలా దేవి కేవలం గణిత మేధావి మాత్రమే కాదు. మంచి రచయిత కూడా. స్వలింగ సంపర్కంపై భారత దేశంలో తొలి సమగ్ర రచన అయిన ‘ద వరల్డ్ ఆఫ్ హోమోసెక్సువాలిటీ (1977)’ శకుంతలా దేవి రాసిందే. దీనితో పాటు గణితం, జ్యోతిషంపై అనేక పుస్తకాలు రాశారు. ఫన్ విత్ నంబర్స్, ఆస్ట్రాలజీ ఫర్ యు, పజిల్స్ టు పజిల్ యు, మాథెబ్లిట్ లాంటి పుస్తకాలు రాశారు

యూనివర్సిటీ ఆఫ్ ఫిలిప్పైన్స్ 1969లో శకుంతలాదేవికి ‘మోస్ట్ డిస్టింగ్విష్డ్ ఉమన్ ఆఫ్ ద ఇయర్’ అవార్డు ఇచ్చింది. వాషింగ్టన్ డీసీ 1988లో రామానుజన్ మేథమెటికల్ జీనియస్ అవార్డును ప్రదానం చేసింది.
 
 శకుంతలా దేవి 1980లో మెదక్ నుంచి ఇందిరా గాంధీపై పోటీ చేశారు. 

1980లో బెంగళూరుకు చేరి పిల్లల కోసం అనేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ

ఒక మాంచి స్ఫూర్తి నింపు కథ

దట్టమైన అడవిలో… చిక్కని చీకట్లో ఆ కుర్ర డాక్టర్… తొలి డెలివరీ కేసు…

1943… డాక్టర్ కులకర్ణి వయస్సులో చిన్నవాడే… హుబ్లీలో ఉంటాడు… తను వయస్సులో ఉన్నప్పుడు చందగఢ్ అనే ఊళ్లోని చిన్న హాస్పిటల్‌లో పోస్టింగ్ వచ్చింది. అది మహారాష్ట్ర- కర్నాటక బోర్డర్. ఆ ఊరి చుట్టూ దట్టంగా అడవి.
జూలై… తుఫాను రాత్రి… ఏదో పుస్తకం చదువుకుంటున్నాడు… హఠాత్తుగా డోర్ కొడుతున్న చప్పుడు. ఇంత రాత్రి ఎవరబ్బా అని ఆశ్చర్యంతో కూడిన భయంతో తలుపు తీశాడు. ఉన్ని బట్టలు కప్పుకుని, చేతుల్లో కర్రలు పట్టుకుని ఉన్న నలుగురు వ్యక్తులు మరాఠీలో చెప్పారు. ‘‘త్వరగా నీ బ్యాగ్ తీసుకుని మాతో నడువ్…’’
ఆయన నిశ్శబ్దంగా తన మెడికల్ కిట్ తీసుకుని వాళ్లతో కలిశాడు… గంటన్నర తరువాత ఎడ్లబండి ఆగింది. దట్టమైన చీకటి, గడ్డితో పైకప్పు వేయబడిన ఓ చిన్న ఇల్లు అది. లోపలకెళ్తే సన్నగా లాంతరు వెలుతు, మంచంపై ఓ మహిళ, పక్కన ఓ ముసలామె.
అయోమయంగా చూశాడు డాక్టర్.
ఆమె ఎవరు..? నన్నెందుకు తీసుకొచ్చారు..? వైద్యం కోసమేనా..? అదే నిజమైతే అక్కడే చెప్పొచ్చు కదా… ఈ నిర్బంధ ధోరణి దేనికి..? మర్యాదగా అడిగినా వచ్చేవాడు కదా… 
‘ప్రసవం చేయాలి డాక్టర్’ అన్నాడు ఓ వ్యక్తి… 
ఆమె నొప్పితో గిలగిలలాడుతోంది… ఏం చేయాలో డాక్టర్‌కు బోధపడటం లేదు… తనలోని డాక్టర్ స్థిమితంగా లేడు… ఎందుకంటే..? తను అంతకుముందు ఎప్పుడూ డెలివరీ చేయలేదు… కానీ ఆమెకు ఎలాగైనా సాయపడాలని అనుకున్నాడు… డాక్టర్ కదా… ఊరుకోలేకపోయాడు…
నొప్పి డైవర్ట్ చేయడానికి మాటల్లో దింపాడు… ఆమెను అడిగాడు… ‘అసలు ఎవరు నువ్వు..? ఇక్కడికి ఎలా వచ్చావు..?’
‘డాక్టర్ సార్, నాకు బతకాలని లేదు… నేనొక భూస్వామి కూతురిని’ ఆమె గొంతులో ధ్వనిస్తున్న బాధ… ‘‘మా ఊళ్లో హైస్కూల్ కూడా లేదు… అందుకని నన్ను చదువు కోసం కాస్త దూరంగా ఉన్న పట్టణానికి పంపించారు… అక్కడ ఓ క్లాస్‌మేట్‌ను ప్రేమించాను… ఈ కడుపు ఆ ప్రేమ వల్లే… కడుపు విషయం తెలియగానే ఆ అబ్బాయి జంప్… నా తల్లిదండ్రులు విషయం తెలుసుకున్నారు… కానీ అప్పటికే ఆలస్యమైంది… ఇంకేమీ చేయడానికి లేదు, అందుకని ఇక్కడ ఉంచారు… ఇటువైపు ఎవరూ రారు… నా కడుపు, నా బాధ ఎవరికీ తెలియదు, తెలియవద్దనే ఈ ఏర్పాటు…’’ అంటూ రోదించసాగింది…
డాక్టర్‌కు ఏం మాట్లాడాలో అర్థం కాలేదు… మెల్లిమెల్లిగా తన సాయంతో ఆమె ఓ ఆడబిడ్డను ప్రసవించింది… కానీ ఆ బిడ్డ ఏడవడం లేదు… పుట్టింది ఆడబిడ్డ అని తెలిసి ఆమె మళ్లీ ఏడుపు అందుకుంది… డాక్టర్ సార్, దాన్ని ఇక్కడే చంపేయండి… నా బతుకులాగే దానిది కూడా ఏడుపు బతుకు కావొద్దు ప్లీజ్…’
కులకర్ణి ఎలాగోలా తంటాలు పడ్డాడు కాసేపు… పిల్ల ఏడ్చింది… ఆ గదిని వదిలిపెట్టి బయటికి వచ్చాక ఆయనకు 100 రూపాయలు ఇవ్వబడ్డాయి… అప్పట్లో అది చాలా పెద్ద మొత్తమే… తన జీతమే 75 రూపాయలు… ఫీజు తీసుకున్నాడు, లెక్కపెట్టుకునేటప్పుడు తన మెడికల్ బ్యాగ్ గదిలోనే మరిచిపోయినట్టు గుర్తొచ్చింది… ఆ బ్యాగ్ తెచ్చుకుంటానని చెప్పి, గదిలోకి వెళ్లాడు… ఆ వంద రూపాయలు ఆ కొత్త తల్లి చేతుల్లో పెట్టాడు…
‘‘సంతోషమో, దుఖమో.. మన చేతుల్లో ఏమీ లేవు… జరిగిందేదో జరిగిపోయింది… అన్నీ మరిచిపో… నీ జీవితం నీది… ప్లాన్ చేసుకో… ప్రయాణానికి తగినంత ఓపిక వచ్చాక పూణె వెళ్లు, అక్కడ నర్సింగ్ కాలేజీ ఉంటుంది… అందులో నా దోస్త్ ఆప్టే ఉంటాడు… వెళ్లి కలువు, కులకర్ణి పంపించాడని చెప్పు… తను తప్పక సాయం చేస్తాడు… ఇది ఓ సోదరుడి సూచన అనుకో, సాయం అనుకో, ఇప్పుడైతే నేన్నీకు వేరే సాయం ఏమీ చేయలేను’’ అని ఆమె తలపై ఓదార్పుగా ఓసారి చేయి వేసి, అక్కడి నుంచి వెళ్లిపోయాడు…
ఏళ్లు గడిచాయి… కులకర్ణి ఇప్పుడు పలు రంగాల్లో నైపుణ్యం సంపాదించాడు… ఓసారి అనుకోకుండా ఓ మెడికల్ కాన్ఫరెన్స్ కోసం ఔరంగాబాద్ వెళ్లాడు… అక్కడ డాక్టర్ చంద్ర అనే లేడీ డాక్టర్ ఇచ్చిన ప్రజెంటేషన్ చూసి బాగా అబ్బురపడ్డాడు… ప్రోగ్రాంలో అనుకోకుండా తన పేరు కులకర్ణిగా ప్రస్తావనకు వచ్చేసరికి డాక్టర్ చంద్ర చకచకా నేరుగా తన దగ్గరకు వెళ్లింది… ‘సర్, మీరు ఎప్పుడైనా చందగఢ్ వెళ్లారా..?’ అనడిగింది…
‘అవును, చాలా ఏళ్ల క్రితం.,. నాకు ఆ ఊరితో బంధముంది… అక్కడ కొన్నాళ్లు పనిచేశాను’
‘అయితే మీరు ఓసారి మా ఇంటికి వస్తారా ప్లీజ్…’
‘డాక్టర్ చంద్రా, మిమ్మల్ని తొలిసారి కలిశాను, మీ ప్రజెంటేషన్ సింప్లీ సూపర్బ్… నాకు బాగా నచ్చింది… కానీ ప్రస్తుతం మీ ఇంటికి రాలేను… మళ్లీ ఎప్పుడైనా తప్పకుండా మీ ఇంటికి వస్తాను, ఏమీ అనుకోవద్దు ప్లీజ్…’
‘సర్, దయచేసి ఒక్కసారి రండి, కాసేపు… మీ టైం ఎక్కువగా తీసుకోను, మీరొక్కసారి మా ఇంటికి వస్తే జీవితాంతం మిమ్మల్ని మరిచిపోను’.. కులకర్ణి ఇక మాట్లాడలేకపోయాడు… ఆమె అంత ఇదిగా పిలుస్తుంటే ఎలా కాదనగలడు? పైగా ఆమె పరిజ్ఞానం తనను ముగ్దుడిని చేసింది… ఆమె వాళ్ల ఇంటికి తీసుకెళ్లింది… లోపలకు అడుగు పెట్టకముందే… ‘అమ్మా, మనింటికి ఎవరొచ్చారో ఓసారి చూడు…’ అని గట్టిగా పిలిచింది.
డాక్టర్ చంద్ర తల్లి బయటికి వచ్చింది… కులకర్ణిని చూడగానే కాసేపు తన కళ్లను తనే నమ్మలేకపోయింది… జలజలా కన్నీళ్లు కారిపోతున్నాయి అసంకల్పితంగా… ఆయన పాదాలపై పడింది… ఆమె కన్నీళ్లు కులకర్ణి పాదాలను తడిపేస్తున్నయ్… ఆయన గందరగోళంలో పడిపోయాడు… తరువాత ఆమె చెప్పింది…
‘ఆ రాత్రిపూట మీరు చందగఢ్ అడవిలో నాకు డెలివరీ చేశారు… ఆరోజు పుట్టింది ఈ బిడ్డే… మీరు చెప్పినట్టే పూణె వెళ్లాను, మీ మిత్రుడి సాయంతో చదువుకున్నాను… స్టాఫ్ నర్స్ అయ్యాను… నా బిడ్డను ఓ మంచి గైనకలాజిస్టును చేయాలనేది నా జీవిత లక్ష్యంగా పెట్టుకున్నాను… మీరే స్పూర్తి… ఆశీర్వదించండి సార్…’ అంది చేతులు జోడిస్తూ…
ఆనందం, ఆశ్చర్యం ఆయన్ని కమ్మేశాయి… తన తొలి డెలివరీ కేసు ఆమె… అదీ ఓ గడ్డు స్థితిలో… డాక్టర్ చంద్రను అడిగాడు… ‘ఇంతకీ నన్నెలా గుర్తించావు..?’
అనుకోకుండా మీ పేరు కులకర్ణి అని వినిపించేసరికి ఆశ్చర్యపోయాను… అమ్మ మీ పేరును రోజూ ఓ మంత్రంలా పఠిస్తూనే ఉంటుంది… 
సార్, మీ పూర్తి పేరు రామచంద్ర కులకర్ణి అని మీ మిత్రుడు చెప్పాడు… అందులో నుంచే నా బిడ్డకు చంద్ర అని పేరు పెట్టుకున్నాను… ఆమెకు జీవితం ప్రసాదించింది మీరే… మీరే ఆదర్శంగా పేద మహిళలకు ఫ్రీ డెలివరీ, ఫ్రీ వైద్యం నా బిడ్డ అలవాటు చేసుకుంది… ఎన్నో కేసులు, ఎందరికో ప్రాణం పోసింది… సార్, ఈమె స్పూర్తి రీత్యా మీ బిడ్డే…’ ఆమె చెబుతూనే ఉంది…
ఇప్పుడు ఆయన కళ్లల్లో ఎందుకో నీళ్లు… ఆగడం లేదు… జారుతున్న తడిని తుడుచుకోవాలని కూడా లేదు… కొన్నిసార్లు కన్నీళ్లు అలా మత్తడి దూకాల్సిందే… 

చెప్పనేలేదు కదూ… ఈ డాక్టర్ కులకర్ణి ఎవరో తెలుసా..? ప్రముఖ రచయిత్రి, సామాజిక కార్యకర్త, ఇన్ఫోసిస్ చైర్‌పర్సన్ సుధామూర్తికి స్వయానా తండ్రి.
ఆహా...ఎంత గొప్ప మనసులు...
ఇటువంటి చరిత్రను నేటి తరం పిల్లలకు పాఠ్యాంశాలుగా బోధిస్తేనే మన భావితరం ఆదర్శంగా జీవిస్తారనటంలో అతిశయోక్తి లేదేమో.!!

☘️ఇది కథ కాదు.! జరిగిన కథ.! స్ఫూర్తిని గుండెల నిండా నింపే కథ.!హృదయలోతుల్లోంచి ఆర్ధ్రత పొంగుకు వచ్చే కథ.! నేను చదువుతుంటే నా కళ్క్ష వెంట ఆనందబాష్పాలు రాల్చిన కథ.! ఇది మన కథ.!!
జయశ్రీరామ*ధర్మపథం
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

IITH: ఐఐటీ హైదరాబాద్‌లో నాన్ టీచింగ్ పోస్టులు | అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణత

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ హైదరాబాద్- డైరెక్ట్ రిక్రూట్‌మెంట్ ద్వారా కింది ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.  

ఉద్యోగాల వారీగా ఖాళీల వివరాలు:

1. పబ్లిక్ రిలేషన్స్ ఆఫీసర్- 01

2. టెక్నికల్ సూపరింటెండెంట్- 04

3. సెక్షన్ ఆఫీసర్- 02

4. జూనియర్ సైకలాజికల్ కౌన్సెలర్ (మేల్‌)- 01

5. ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్- 02

6. ఫిజియోథెరపిస్ట్ (మేల్‌)- 01

7. స్టాఫ్ నర్స్- 06

8. ఫిజికల్ ట్రైనింగ్ ఇన్‌స్ట్రక్టర్- 01

9. లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 01

10. జూనియర్ ఇంజినీర్ (సివిల్)- 01

11. జూనియర్ ఇంజినీర్ (ఎలక్ట్రికల్)- 01

12. జూనియర్ టెక్నికల్ సూపరింటెండెంట్- 10

13. అకౌంటెంట్- 09

14. జూనియర్ అసిస్టెంట్- 17

15. జూనియర్ టెక్నీషియన్- 29

16. జూనియర్ లైబ్రరీ ఇన్ఫర్మేషన్ అసిస్టెంట్- 02

17. జూనియర్ హార్టికల్చరిస్ట్- 01

మొత్తం పోస్టుల సంఖ్య: 89.

అర్హతలు: పోస్టును అనుసరించి ఎస్‌ఎస్‌సీ, సంబంధిత విభాగంలో ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. 

దరఖాస్తు రుసుము: జనరల్‌ అభ్యర్థులకు రూ.500. ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్‌, దివ్యాంగులు, మహిళా అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష/ స్కిల్ టెస్ట్/ ఇంటర్వ్యూ ఆధారంగా.

ఆన్‌లైన్ దరఖాస్తు ముగింపు తేదీ: 12.11.2023.


Important Links

Posted Date: 03-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

3, నవంబర్ 2023, శుక్రవారం

CBSE: సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్‌) జనవరి-2024 | పరీక్ష విధానం: | అర్హతలు: | దరఖాస్తు రుసుము: | తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: | ముఖ్యమైన తేదీలు:

ఉపాధ్యాయవృత్తిని కెరీర్‌గా ఎంచుకునే వారి కోసం ప్రతీ ఏటా సెంట్రల్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సీటెట్) నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షను సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్(సీబీఎస్​ఈ) నిర్వహిస్తోంది. సీటెట్​ పరీక్ష ప్రతి ఏడాది రెండుసార్లు జరుగుతుంది. తాజాగా జనవరి-2024 ఏడాదికి సంబంధించిన సీటెట్​ నోటిఫికేషన్​ విడుదలైంది. 18వ ఎడిషన్‌ సీటెట్‌ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ నవంబర్‌ 3 నుంచి నవంబర్‌ 23 వరకు కొనసాగనుంది. పరీక్షను కంప్యూటర్‌ ఆధారితంగా నిర్వహించనున్నారు. 

వివరాలు...

సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్(సీటెట్‌) జనవరి-202

పరీక్ష విధానం: పరీక్ష మొత్తం రెండు పేపర్‌లను కలిగి ఉంటుంది. మొదటి పేపర్​ ఒకటి నుంచి ఐదు తరగతులకు బోధించాలనుకునే వారికి కోసం, రెండో పేపర్​ ఆరు నుంచి తొమ్మిదో తరగతులకు బోధించాలనుకునే వారి కోసం నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ లైఫ్​ లాంగ్​ వ్యాలిడిటీ కలిగి ఉంటుంది. పరీక్షను 20 భాషలలో నిర్వహిస్తారు. సీటెట్​ స్కోర్ కేంద్ర ప్రభుత్వం పరిధిలోని పాఠశాలల ఉపాధ్యాయ నియామకాల్లో పరిగణనలోకి తీసుకుంటారు. 

అర్హతలు:

పేపర్-1: 50 శాతం మార్కులతో పన్నెండో తరగతితో పాటు ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా(డీఈఎల్‌ఈడీ)/ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్(ప్రత్యేక విద్య) లేదా డిగ్రీ, బీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

పేపర్-2: 50 శాతం మార్కులతో బ్యాచిలర్‌ డిగ్రీతో పాటు డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్/ బ్యాచిలర్ ఇన్ ఎడ్యుకేషన్(బీఈడీ)/ బీఈడీ(ప్రత్యేక విద్య) లేదా సీనియర్‌ సెకండరీతో పాటు నాలుగేళ్ల బ్యాచిలర్ ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్(బీఈఎల్‌ఈడీ)/ బీఎస్సీఈడీ/ బీఏఈడీ/ బీఎస్సీఈడీ ఉత్తీర్ణులై ఉండాలి.

దరఖాస్తు రుసుము: జనరల్/ ఓబీసీ కేటగిరీలకు రూ.1000(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.1200(పేపర్ 1 & 2 రెండూ). ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులకు: రూ.500(పేపర్ 1 లేదా 2 మాత్రమే), రూ.600(పేపర్ 1 & 2 రెండూ).

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: గుంటూరు, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్, వరంగల్‌.

ముఖ్యమైన తేదీలు:

ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 03-11-2023.

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేది: 23-11-2023.ఫీజు చెల్లింపు చివరి తేది: 23-11-2023.

కంప్యూటర్ ఆధారిత పరీక్ష తేదీ: 21-01-2024.


Important Links

Posted Date: 03-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు! * దరఖాస్తుల ప్రక్రియ షురూ * నవంబర్‌ 30 వరకు తుది గడువు * జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు * ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

JEE Main: జేఈఈ మెయిన్‌ సిలబస్‌ తగ్గింపు!  

* దరఖాస్తుల ప్రక్రియ షురూ

* నవంబర్‌ 30 వరకు తుది గడువు

* జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1 వరకు ఆన్‌లైన్‌ పరీక్షలు

* ఎన్‌టీఏ నోటిఫికేషన్‌ జారీ

ఈనాడు, హైదరాబాద్‌: జేఈఈ మెయిన్‌ తొలి విడతకు దరఖాస్తుల ప్రక్రియ గురువారం మొదలైంది. విద్యార్థులు నవంబర్‌ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) గురువారం(నవంబర్‌ 2) నోటిఫికేషన్‌ జారీ చేసింది. జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు నిర్వహిస్తారు. ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో బీటెక్‌లో చేరేందుకు జేఈఈ మెయిన్‌లో పేపర్‌-1, బీఆర్క్‌లో ప్రవేశానికి పేపర్‌-2ఏ, బీ-ప్లానింగ్‌లో ప్రవేశానికి పేపర్‌-2బీ రాయాల్సి ఉంటుంది. ప్రతిరోజూ ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పేపర్‌-1లో 300 మార్కులు(90 ప్రశ్నలు), పేపర్‌-2ఏలో 400 మార్కులు(82 ప్రశ్నలు), పేపర్‌-2బీలో 400 మార్కులు(105 ప్రశ్నలు) ఉంటాయి. ఫిబ్రవరి 12న స్కోర్‌ వెల్లడిస్తారు. ఈ పరీక్షల్లో కనీస స్కోర్‌ సాధించిన రెండున్నర లక్షల మందికి(అన్ని సామాజికవర్గాల వారిని కలిపి) మాత్రమే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రాసేందుకు అర్హత ఉంటుంది. అడ్వాన్స్‌డ్‌లో ఉత్తీర్ణులైనవారికి మాత్రమే ఐఐటీల్లో చేరేందుకు అవకాశం ఇస్తారు. తుది విడత జేఈఈ మెయిన్‌ ఏప్రిల్‌లో నిర్వహిస్తారు. రెండుసార్లు రాస్తే.. ఆ రెండింటిలో ఎక్కువ స్కోర్‌ను పరిగణనలోకి తీసుకొని ర్యాంకు కేటాయిస్తారు. దేశవ్యాప్తంగా జేఈఈ మెయిన్‌ను దాదాపు 11 లక్షల మంది రాస్తారు. తెలుగు రాష్ట్రాల నుంచి సుమారు లక్షన్నర మంది దరఖాస్తు చేసే అవకాశం ఉంది. ఏ నగరం/పట్టణంలో పరీక్ష కేంద్రం కేటాయించారో జనవరి రెండో వారంలో వెల్లడిస్తారు. పరీక్షకు మూడు రోజుల ముందు అడ్మిట్‌ కార్డులు(హాల్‌టికెట్‌) వెబ్‌సైట్లో అందుబాటులో ఉంచుతారు.

సిలబస్‌ తగ్గింపు

కరోనా కాలంలో సీబీఎస్‌ఈ విద్యార్థులకు 9, 10 తరగతులతోపాటు ఇంటర్‌ లేదా తత్సమాన తరగతిలో సిలబస్‌ తగ్గించినందువల్ల ఆ ప్రకారం జేఈఈ మెయిన్‌ పరీక్షలకు కూడా తగ్గించారు. రసాయనశాస్త్రంలో పలు పాఠ్యాంశాలను పూర్తిగా తొలగించారు. భౌతికశాస్త్రం, గణితంలో కొన్ని పాఠ్యాంశాలను పూర్తిగా, మరికొన్నింట్లో పాక్షికంగా తొలగించారు. తొలగించిన పాఠ్యాంశాల వివరాలను జేఈఈ మెయిన్‌ వెబ్‌సైట్లో ఎన్‌టీఏ అందుబాటులో ఉంచిందని, వాటిని పరిశీలించి పరీక్షలకు సిద్ధం కావాలని శిక్షణ నిపుణులు ఉమాశంకర్, కృష్ణచైతన్య తెలిపారు. తెలంగాణ ఇంటర్‌ బోర్డు పరీక్షలు రాసే విద్యార్థులు మాత్రం వాటిని చదవక తప్పదని పేర్కొన్నారు.

       జేఈఈ (మెయిన్) నోటిఫికేషన్‌ వివరాల కోసం క్లిక్‌ చేయండి

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

2, నవంబర్ 2023, గురువారం

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు.

అనంతపురం జిల్లాలోని నిరుద్యోగులకు సువర్ణ అవకాశం కలదు. ఉద్యోగం లేక ఇబ్బందులు పడుతున్న వారికి అనంతపురం నగరంలో జాబ్ మేళా నిర్వహించనున్నారు. వారి అర్హతను బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. వివిధ కంపెనీలలో ఉద్యోగాల భర్తీ కోసం నిరుద్యోగులకు డిపార్ట్మెంట్ ఆఫ్ స్కిల్స్ డెవలప్మెంట్ అండ్ ట్రైనింగ్ గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ వారి ఆధ్వర్యంలోనే జాబ్ మేళాను నిర్వహించనున్నారు.

నవంబర్ 03, 2023 ఉదయం 9 గంటలకు APSSDC డిస్టిక్ ఆఫీస్ అనంతపురం నందు జాబ్ మేళా నిర్వహిస్తారు. ఇందులో ప్రముఖ సంస్థలు మొబైల్స్ మరియు టీం లెస్ కంపెనీలు పాల్గొన్నాయి. ఈ సంవత్సరంలో క్యాషియర్ సేల్స్ ఎగ్జిక్యూటివ్ మరియు సేల్స్ అసోసియేట్స్ మరియు డి మార్ట్, స్విగ్గి, విభాగాలలో ఉద్యోగాలు భర్తీ చేయనున్నారు. వీటి కోసం పదవ తరగతి ఇంటర్మీడియట్ డిగ్రీ ఆపై చదువు వారికి అర్హతగా నిర్ణయించారు.

వీటిలో ఉద్యోగం పొందిన నిరుద్యోగులకు అనంతపురం హైదరాబాద్ లో వివిధ ప్రాంతాలలో ఉద్యోగం చేయవలసి ఉంటుంది. మరియు అర్హత సాధించిన వారికి 12 వేల రూపాయల నుంచి 15 వేల రూపాయల వరకు నెల జీతం అందిస్తారు.పీఎఫ్, ఈఎస్ఐ సౌకర్యం కూడా కల్పిస్తారు. ఈ కంపెనీలలో నూట పది ఉద్యోగాల వరకు ఖాళీగా ఉన్నాయి. వీటి కోసం నిరుద్యోగ మహిళలు పురుషులు పాల్గొనవచ్చు. వీటిలో పాల్గొనే వారి వయసును 18 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వరకు ఉండాలని అర్హతగా నిర్ణయించారు. మరింత సమాచారం కోసం APSSDCవెబ్సైట్ను సంప్రదించవచ్చు.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

NFL: ఎన్‌ఎఫ్‌ఎల్‌లో 74 మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టులు 

నోయిడాలోని నేషనల్ ఫెర్టిలైజర్స్ లిమిటెడ్- దేశ వ్యాప్తంగా ఉన్న వివిధ ఎన్‌ఎఫ్‌ఎల్‌ యూనిట్లు/ కార్యాలయాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ ఖాళీల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. 

ఖాళీల వివరాలు:

1. మేనేజ్‌మెంట్ ట్రైనీ (మార్కెటింగ్): 60 పోస్టులు

2. మేనేజ్‌మెంట్ ట్రైనీ (ఎఫ్‌&ఎ): 10 పోస్టులు

3. మేనేజ్‌మెంట్ ట్రైనీ (లా): 04 పోస్టులు

మొత్తం పోస్టుల సంఖ్య: 74.

అర్హత: పోస్టును అనుసరించి ఎంఎస్సీ, ఎంబీఏ, పీజీడీబీఎం, పీజీడీఎం, సీఏ/ ఐసీడబ్ల్యూఏ/ సీఎంఏ, ఎల్‌ఎల్‌బీ, బీఎల్‌ ఉత్తీర్ణులై ఉండాలి. 

వయోపరిమితి: 18 నుంచి 27 సంవత్సరాల మధ్య ఉండాలి.

పే స్కేల్: నెలకు రూ.40000 - రూ.140000.

ఎంపిక ప్రక్రియ: రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా.

దరఖాస్తు రుసుము: రూ.700. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఈఎస్‌ఎం అభ్యర్థులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

ముఖ్యమైన తేదీలు… 

ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 01/12/2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 03, 04/12/2023.

మరింత సమాచారం... మీ కోసం!

‣ బీటెక్‌తో ఆర్మీలో ఉద్యోగాలు

‣ నాలుగేళ్ల కోర్సు.. నైపుణ్యాలతో మెరుగు!

‣ కొత్త నైపుణ్యాలే కొలువులకు రాచబాట!

‣ అగ్రరాజ్యంలో అడ్మిషన్లు ఇలా!

Read Latest jobs, Latest notifications and Latest govt jobs 

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023

Joint CSIR-UGC NET: జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సైన్స్‌ విభాగాల్లో పరిశోధన, బోధనకు అవకాశం కల్పించే.. సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్ట్‌(నెట్‌) డిసెంబర్‌-2023కు నోటిఫికేషన్‌ విడుదలైంది. నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ(ఎన్‌టీఏ) ఈ పరీక్షను నిర్వహించనుంది. సైన్స్‌ సబ్జెక్టుల్లో పరిశోధనలకు అవకాశం కల్పించే జేఆర్‌ఎఫ్‌తోపాటు లెక్చరర్‌షిప్‌/ అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ అర్హతల కోసం నిర్వహించే పరీక్ష- సీఎస్‌ఐఆర్‌ యూజీసీ నెట్‌. ఈ పరీక్ష ద్వారా జేఆర్‌ఎఫ్‌ అర్హత పొందితే సీఎస్‌ఐఆర్‌ పరిధిలోని రిసెర్చ్‌ సెంటర్లలో, విశ్వవిద్యాలయాల్లో పీహెచ్‌డీకి దరఖాస్తు చేసుకోవచ్చు. లెక్చరర్‌షిప్‌కు అర్హత పొందితే విశ్వవిద్యాలయాలు లేదా డిగ్రీ కళాశాలల్లో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా ఎంపికకావచ్చు.

పరీక్ష వివరాలు...

జాయింట్‌ సీఎస్‌ఐఆర్‌- యూజీసీ నెట్‌ ఎగ్జామినేషన్‌ డిసెంబర్‌-2023 

సబ్జెక్టు వివరాలు: పరీక్షను అయిదు సబ్జెక్టుల్లో నిర్వహిస్తారు. 

1. కెమికల్‌ సైన్సెస్ 

2. ఎర్త్, అట్మాస్ఫియరిక్, ఓషన్‌ అండ్‌ ప్లానెటరీ సైన్సెస్‌

3. లైఫ్‌ సైన్సెస్

4. మ్యాథమేటికల్‌ సైన్సెస్

5. ఫిజికల్‌ సైన్సెస్‌

అర్హత: కనీసం 55 శాతం మార్కులతో ఎమ్మెస్సీ తత్సమాన ఉత్తీర్ణులు/ నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఎస్‌- ఎంఎస్‌/ బీఈ/ బీటెక్‌/ బీఫార్మసీ/ ఎంబీబీఎస్‌  ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఓబీసీ(ఎన్‌సీఎల్‌), ఎస్సీ, ఎస్టీ, థర్డ్‌జెండర్‌, దివ్యాంగ అభ్యర్థులు అర్హత పరీక్షలో కనీసం 50శాతం మార్కులు పొందాలి. 

వయసు: జేఆర్‌ఎఫ్‌కు అర్హతకు సంబంధించి జనరల్‌ కేటగిరీ అభ్యర్థులకు 01.07.2023 నాటికి 28 ఏళ్లు మించకుండా ఉండాలి. ఎస్సీ/ ఎస్టీ/ దివ్యాంగులు/ మహిళ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీ(నాన్‌ క్రిమిలేయర్‌)లకు మూడేళ్ల గరిష్ఠ వయోసడలింపు లభిస్తుంది. అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌/ లెక్చరర్‌షిప్‌కు ఎలాంటి గరిష్ఠ వయోపరిమితి నిబంధన లేదు.

పరీక్ష విధానం: పరీక్ష 200 మార్కులకు నిర్వహిస్తారు. కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌ విధానంలో పరీక్ష జరుగుతుంది. మల్టిపుల్‌ ఛాయిస్‌ ప్రశ్నల పద్ధతిలో పరీక్ష ఉంటుంది. పరీక్ష వ్యవధి మూడు గంటలు. ప్రశ్న పత్రంలో మొత్తం మూడు విభాగాలు ఉంటాయి. 

దరఖాస్తు రుసుము: జనరల్ అభ్యర్థులకు రూ.1100, జనరల్ ఈడబ్ల్యూఎస్‌/ ఓబీసీ(ఎన్‌సీఎల్‌) రూ.550, ఎస్సీ/ఎస్టీలకు రూ.275, థర్డ్ జెండర్ రూ.275, దివ్యాంగులకు ఫీజు చెల్లింపు నుంచి మినహాయింపు ఉంటుంది. 

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ముఖ్యమైన తేదీలు...

ఫీజు చెల్లింపు, ఆన్‌లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 30.11.2023.

దరఖాస్తు సవరణ తేదీలు: 02.12.2023 నుంచి 04.12.2023 వరకు.

పరీక్ష తేదీలు: 26, 27 & 28-12-2023.

Important Links

Posted Date: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది.

JEE మెయిన్ 2024: జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024 

జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్(జేఈఈ) మెయిన్-2024 తొలి విడత పరీక్షలను జనవరి 24వ తేదీ నుంచి, చివరి విడతను ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే జాతీయ పరీక్షల సంస్థ(ఎన్‌టీఏ) ప్రకటించింది. జనవరి పరీక్షకు సంబంధించిన దరఖాస్తులను నవంబర్ 30వ తేదీ రాత్రి 9 గంటల వరకు సమర్పించవచ్చు. ఈ మేరకు ఎన్టీఏ నోటిఫికేషన్ జారీ చేసింది. 

ప్రకటన వివరాలు:

జైంట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (మెయిన్) - 2024

అర్హత: అభ్యర్థులకు వయోపరిమితి లేదు. 2022, 2023లో 12వ తరగతి/తత్సమాన పరీక్షలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు లేదా 2024లో వయస్సుతో సంబంధం లేకుండా 12వ తరగతి పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు జేఈఈ (మెయిన్) - 2024 పరీక్షకు హాజరు కావచ్చు.

* తొలి విడతను వచ్చే జనవరి 24 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు, చివరి విడత ఏప్రిల్‌ 1 నుంచి 15వ తేదీ వరకు జరుపుకుంటామని ఎన్‌టీఏ తేదీ. మొదటి ఒకట్రెండు రోజులు బీఆర్క్‌, బీ-ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2, మిగిలిన రోజుల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి పేపర్‌-1 పరీక్ష జరుగుతుంది. విద్యార్థులకు కేటాయించిన పరీక్ష కేంద్రాలను జనవరి రెండో వారంలో చేర్చారు.

* హాల్‌టికెట్లను జనవరి మూడో వారంలో వెబ్‌సైట్‌లో ఉంచుతారు. ఏప్రిల్‌లో జరిగే చివరి విడతకు ఫిబ్రవరి 2 నుంచి మార్చి 2వ తేదీ వరకు దరఖాస్తులు సమర్పించవచ్చు.

ఎన్ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో ప్రవేశాలకు..

దేశవ్యాప్తంగా ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీల్లో బీటెక్‌ సీట్లను జేఈఈ మెయిన్‌ ర్యాంకుల ఆధారంగానే భర్తీ చేస్తారు. ఐఐటీల్లో చేరాలంటే జేఈ అడ్వాన్స్‌డ్ రాయాలి. మెయిన్‌లో కనీస మార్కులు సాధించి అర్హత పొందిన 2.50 లక్షల మందికి మాత్రమే అడ్వాన్స్‌డ్ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంటుంది.

ఇంటర్ మార్కుల నిబంధన

గతంలో కనీస మార్కులతో ఇంటర్‌లో ఉత్తీర్ణులైతే చాలు ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశం పొందేలా వెసులుబాటు కల్పించారు. ఈసారి మళ్లీ మార్కుల నిబంధన విధించారు. జేఈఈ మెయిన్‌లో ఎంత ర్యాంకు వచ్చినా ఇంటర్‌లో ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 65 శాతం, మిగిలిన వారికి 75 మార్కులు తప్పనిసరిగా రావాలని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.

తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు

తెలంగాణ: హైదరాబాద్, సికింద్రాబాద్, కరీంనగర్, ఖమ్మం, కొత్తగూడెం, మహబూబ్‌నగర్, నల్గొండ, నిజామాబాద్, సిద్దిపేట, సూర్యాపేట, వరంగల్.

ఏపీ: అమలాపురం, అనంతపురం, బొబ్బిలి, చీరాల, చిత్తూరు, ఏలూరు, గుత్తి, గుడ్లవల్లేరు, గుంటూరు, కడప, కాకినాడ, కర్నూలు, మదనపల్లె, మార్కాపురం, నంద్యాల, నెల్లూరు, ఒంగోలు, పాపం పారే, ప్రొద్దుటూరు, పుట్టపర్తి, పుత్తూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తాడిపత్రి , తిరుపతి, తిరువూరు, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం.

ముఖ్యాంశాలివీ..

* పరీక్షలను తెలుగు, ఆంగ్లం సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించారు. ఇతర భాషల్లో హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, మరాఠీ, కన్నడ, మలయాళం, తమిళం, ఒడియా, పంజాబీ, ఉర్దూ ఉన్నాయి. ప్రశ్నపత్రాన్ని ఆంగ్లంతోపాటు అభ్యర్థులు కోరుకున్న ప్రాంతీయ భాషలోనూ ఇస్తారు. పేపర్‌-1 300 మార్కులకు, పేపర్‌-2 400 మార్కులకు ఉంటాయి.

* పరీక్షలు కంప్యూటర్ ఆధారంగా సాగుతాయి. బీఆర్క్ విద్యార్థులకు ఆఫ్‌లైన్ విధానంలో డ్రాయింగ్ పరీక్ష కూడా ఉంటుంది.

* పరీక్ష రెండు షిప్టుల్లో జరుగుతుంది. తొలి షిఫ్టు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు, రెండో షిఫ్టు సాయంత్రం 3 నుంచి 6 గంటల వరకు ఉంటుంది.

* ప్రశ్నపత్రాల్లో రెండు సెక్షన్లు ఉంటాయి. సెక్షన్-బీలో 10 ప్రశ్నల్లో అయిదుకు సమాధానాలు గుర్తించాలి. రెండు సెక్షన్లలోనూ తప్పు సమాధానాలకు మైనస్‌ మార్కులుంటాయి.

* దరఖాస్తు చేసుకునే సమయంలో విద్యార్థులు లేదా తమ తల్లిదండ్రులకు సంబంధించిన మొబైల్ నంబర్‌, ఈ-మెయిల్‌ చిరునామాను అందించండి.

* ఏమైనా సమస్యలు ఉంటే 011 40759000 నంబరుకు ఫోన్ చేయవచ్చు. 

ముఖ్య తేదీలు:

సెషన్-1: జేఈఈ (మెయిన్) - జనవరి 2024:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 01-11-2023 నుంచి 30-11-2023 వరకు.

పరీక్ష తేదీలు: 2024, జనవరి నుండి ఫిబ్రవరి 1 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, జనవరి రెండో వారం.

ఫలితాల వెల్లడి: 12.02.2024.

సెషన్-2: జేఈఈ (మెయిన్) - ఏప్రిల్ 2024:

ఆన్‌లైన్ దరఖాస్తు తేదీలు: 02-02-2024 నుంచి 02-03-2024 వరకు.

పరీక్ష తేదీలు: 2024, ఏప్రిల్ 1 నుంచి 14 వరకు.

పరీక్ష కేంద్రాల ప్రకటన: 2024, మార్చి మూడో వారం.

ఫలితాల వెల్లడి: 25.04.2024.

ముఖ్యమైన లింకులు

పోస్ట్ చేసిన తేదీ: 02-11-2023

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

Current Affairs - 02/11/2023 (Telugu / English)

Current Affairs - 02/11/2023
                (Telugu / English)

        
1. జాతీయ ఐక్యతా దినోత్సవం రోజున "మేరా యువ భారత్ సంగతన్"ని ఎవరు ప్రారంభించారు?

 జ:- ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

 2. విమాన ఇంజిన్ విడిభాగాలను తయారు చేసేందుకు సఫ్రాన్ ఎయిర్‌క్రాఫ్ట్‌తో ఏ భారతీయ కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది?

 జ:- HAL.

 3. భారతదేశంలో ఐఫోన్‌ను ఏ కంపెనీ తయారు చేస్తుంది?

 జ:- టాటా గ్రూప్ ద్వారా.

 4. ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి రాబోయే 5 సంవత్సరాలలో ప్రతిరోజూ 2 కొత్త పాఠశాలలను నిర్మించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు?

 జ:- అస్సాం ముఖ్యమంత్రి.

 5. భారతదేశం అంతటా 31 అక్టోబర్ 2023న ఏ రోజును జరుపుకుంటారు?

 జ:- జాతీయ ఐక్యతా దినోత్సవం.

 6. CCI (కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా) ఎంత మంది సభ్యుల ICN (ఇంటర్నేషనల్ కాంపిటీషన్ నెట్‌వర్క్)లో సభ్యుడిగా మారింది?

 జ:- 18-సభ్యులు.

 7. జై భీమ్ ముఖ్యమంత్రి ప్రతిభా వికాస్ యోజనను ఏ రాష్ట్ర/కేంద్రపాలిత ప్రభుత్వం ఆవిష్కరించింది?

 జ:- ఢిల్లీ.

 8. 15వ గిరిజన యూత్ ఎక్స్ఛేంజ్ కార్యక్రమం ఏ నగరంలో ప్రారంభించబడింది?

 జ:- ముంబైలో.

 9. భారతదేశపు మొట్టమొదటి ఉపగ్రహ ఆధారిత గిగాబిట్ బ్రాడ్‌బ్యాండ్ సేవను ప్రారంభించిన సంస్థ ఏది?

 జ:- జియో.

 10. పారా ఏషియన్ గేమ్స్ 2023లో భారత్ ఎన్ని పతకాలు సాధించింది?

 జ:- 111 పతకాలు.

 11. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఏ రాష్ట్రంలోని మెహసానా జిల్లాలో రూ. 5,900 కోట్ల విలువైన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించి, శంకుస్థాపన చేశారు?

 జ:- గుజరాత్ రాష్ట్రం.

 12. భారతదేశంలో జరగనున్న ఆర్థిక వాణిజ్య ప్రతినిధుల సదస్సులో ఏ దేశ మాజీ రక్షణ మంత్రి పీటర్ డటన్ పాల్గొంటారు?

 జ:- ఆస్ట్రేలియా.

 13. నితిన్ గడ్కరీ జీ 2024లో రూ. 20 వేల కోట్ల విలువైన రోడ్డు నిర్మాణ ప్రాజెక్టులను ఏ రాష్ట్రంలో ప్రకటించారు?

 జ:- మిజోరంలో.

 14. హర్యానా, పంజాబ్ మరియు జాతీయ రాజధాని ప్రాంతంలో ఈ సంవత్సరం పొట్ట దహనం సంభవం ఎంత శాతం తగ్గింది?

 జ:- 50 శాతం.

 15. మ్యాట్రిక్స్ ఫైట్ నైట్ (MFN) 13వ ఎడిషన్‌లో మహిళల స్ట్రావెయిట్ విభాగంలో ఏ రాష్ట్రానికి చెందిన సోనమ్ జోంబా టైటిల్ గెలుచుకుంది?

 జ:- అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రం.

1. Who has launched "Mera Yuva Bharat Sangathan" on National Unity Day?

Ans:- Prime Minister Narendra Modi

2. Which Indian company has signed an agreement with Safran Aircraft to manufacture aircraft engine parts?

Ans:- HAL.

3. Which company will manufacture iPhone in India?

Ans:- By Tata Group.

4. The Chief Minister of which state has set a target of building 2 new schools every day for the next 5 years?

Ans:- Chief Minister of Assam.

5. Which day is celebrated all over India on 31 October 2023?

Ans:- National Unity Day.

6. CCI (Competition Commission of India) has become a member of how many member ICN (International Competition Network)?

Ans:- 18-member.

7. Which state/union territory government has unveiled the Jai Bhim Mukhyamantri Pratibha Vikas Yojana?

Ans:- Delhi.

8. In which city the 15th Tribal Youth Exchange Program has been inaugurated?

Ans:- In Mumbai.

9. Which company has launched India's first Satellite-Based Gigabit Broadband Service?

Ans:- Jio.

10. How many medals has India won in the Para Asian Games 2023?

Ans:- 111 medals.

11. Prime Minister Narendra Modi has inaugurated and laid the foundation stone of several development projects worth Rs 5,900 crore in Mehsana district of which state?

Ans:- Of Gujarat state.

12. Which country's former Defense Minister Peter Dutton will participate in the Economic Trade Delegation Summit to be held in India?

Ans:- Australia.

13. In which state has Nitin Gadkari ji announced road construction projects worth Rs 20 thousand crores to start in 2024?

Ans:- In Mizoram.

14. By how much percent has the incidence of stubble burning decreased this year in Haryana, Punjab and National Capital Region?

Ans:- By 50 percent.

15. Which state's Sonam Zomba has won the title in the women's strawweight category in the 13th edition of Matrix Fight Night (MFN)?

Ans:- Of Arunachal Pradesh state.‌‌
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

6,329 Teaching & Non-Teaching Posts: ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువులు.. రాత పరీక్షలో రాణించేలా ప్రిపేర్ అవ్వాలంటే ఇలా చేయండి

ప్రభుత్వ పాఠశాలల్లో టీచర్‌ కొలువు కోరుకునే వారికి చక్కటి అవకాశం స్వాగతం పలుకుతోంది! జాతీయ స్థాయిలో కేంద్ర ప్రభుత్వ పరిధిలోని..ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌లో.. టీచింగ్, నాన్‌ టీచింగ్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. ఈ నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో 5,660 టీజీటీ పోస్టులున్నాయి. ఈ నేపథ్యంలో.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌ ప్రత్యేకత, భర్తీ చేయనున్న పోస్టుల వివరాలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం తదితర వివరాలు..


  • టీచింగ్,నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో 6,329 కొలువులు
  • టీజీటీ హోదాలో మొత్తం 5,660 పోస్ట్‌లు
  • కేంద్ర గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నోటిఫికేషన్‌
  • రాత పరీక్షలో మెరిట్‌ ఆధారంగా నియామకాలు

కేంద్ర గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన విద్యా సంస్థలు.. ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ స్కూల్స్‌. ప్రస్తుతం జాతీయ స్థాయిలో మొత్తం 740 పాఠశాలలు ఉండగా.. తెలుగు రాష్ట్రాలైన ఏపీలో 28, తెలంగాణలో 23 స్కూల్స్‌ ఉన్నాయి. వీటిలో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు.. పూర్తిగా గురుకుల విధానంలో విద్యాబోధన సాగుతోంది. 

మొత్తం 6,329 పోస్ట్‌లు

తాజా నియామక ప్రక్రియ ద్వారా టీచింగ్, నాన్‌–టీచింగ్‌ విభాగాల్లో మొత్తం 6,329 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. టీచింగ్‌ విభాగంలో ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ) 5,660 పోస్ట్‌లు, నాన్‌ టీచింగ్‌ పోస్ట్‌ల విభాగంలో 669 హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌ల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపడతారు.

వేతనాలు

  • టీజీటీ(తృతీయ భాష) వేతన శ్రేణి–రూ.44,900–రూ.1,42,400. 
  • టీజీటీ(ఇతర విభాగాలు) వేతన శ్రేణి–రూ.35,400–రూ.1,12,400. 
  • హాస్టల్‌ వార్డెన్స్‌ వేతన శ్రేణి రూ.29,200–రూ,92,300.

అర్హతలు

  • అభ్యర్థులు తాము దరఖాస్తు చేసుకుంటున్న సబ్జెక్ట్‌తో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత సబ్జెక్ట్‌ మెథడాలజీలో బీఈడీ పాసై ఉండాలి. 
  • థర్డ్‌ లాంగ్వేజ్‌ పోస్ట్‌ల అభ్యర్థులు మూడేళ్ల బ్యాచిలర్‌ డిగ్రీలో సదరు భాషను ఎలక్టివ్‌ సబ్జెక్ట్‌గా మూడేళ్ల పాటు చదివుండాలి. –సీటెట్‌లో ఉత్తీర్ణత సాధించాలి.
  • ఎన్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు పూర్తి చేసుకున్న వారికి బీఈడీ అర్హత నిబంధన అవసరం ఉండదు.
  • మ్యూజిక్‌ టీచర్‌ పోస్ట్‌ల అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి మ్యూజిక్‌లో బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి.
  • ఆర్ట్‌ టీచర్‌: గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌/క్రాఫ్ట్‌లో ఉత్తీర్ణత లేదా రీజనల్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఎడ్యుకేషన్‌ నుంచి ఫైన్‌ ఆర్ట్స్‌లో బీఈడీ పాసవ్వాలి.
  • టీజీటీ–పీఈటీ: బీపీఈడీ ఉత్తీర్ణత ఉండాలి. 
  • లైబ్రేరియన్‌: ర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్‌ ఆఫ్‌ లైబ్రరీ సైన్స్‌ ఉత్తీర్ణులవ్వా­లి. లేదా బ్యాచిలర్‌ డిగ్రీ అర్హతగా లైబ్రరీ సైన్స్‌లో ఏడాది వ్యవధిలోని డిప్లొమా ఉత్తీర్ణత సాధించాలి.
  • హాస్టల్‌ వార్డెన్‌: బ్యాచిలర్‌ డిగ్రీ లేదా ఎస్‌సీటీఈ నిర్వహించే నాలుగేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఈడీ కోర్సు ఉత్తీర్ణులవ్వాలి.

వయసు

  • అన్ని పోస్ట్‌లకు 18.08.2023 నాటికి వయసు 18–35 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్‌సీ/ఎస్టీ అభ్యర్థులకు అయిదేళ్లు, ఓబీసీలకు మూడేళ్లు చొప్పున గరిష్ట వయో పరిమితిలో సడలింపు లభిస్తుంది.

ఎంపిక ప్రక్రియ

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో పోస్ట్‌ల భర్తీకి జాతీయ స్థాయిలో ఈఎంఆర్‌ఎస్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ ఎగ్జామ్‌(ఈఎస్‌ఈఈ)ను నిర్వహించనున్నారు. ఈ పరీక్షలో మెరిట్‌ ఆధారంగా తుది జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేస్తారు.

120 మార్కులకు టీజీటీ పరీక్ష

టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి రాత పరీక్షను నాలుగు విభాగాలుగా మొత్తం 120 మార్కులకు నిర్వహిస్తారు. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–4 టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 సంబంధిత సబ్జెక్ట్‌ 80 ప్రశ్నలు–80మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. టీజీటీ పరీక్ష వ్యవధి మూడు గంటలు. 

హాస్టల్‌ వార్డెన్‌ రాత పరీక్ష

ఏకలవ్య గురుకుల పాఠశాలల్లో భర్తీ చేయనున్న హాస్టల్‌ వార్డెన్‌ పోస్ట్‌లకు పత్యేక రాత పరీక్ష నిర్వహిస్తారు. ఈ పరీక్ష ఆరు విభాగాల్లో 120 మార్కులకు ఉంటుంది. పార్ట్‌–1 జనరల్‌ అవేర్‌నెస్‌ 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–2 రీజనింగ్‌ ఎబిలిటీ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–3 ఐసీటీ నాలెడ్జ్‌ 20 ప్రశ్నలు–20 మార్కులు; పార్ట్‌–4 పోస్కో, బాలల భద్రతకు సంబంధించిన చట్టాలు 10 ప్రశ్నలు–10 మార్కులు; పార్ట్‌–5 అడ్మినిస్ట్రేటివ్‌ ఆప్టిట్యూడ్‌ 30 ప్రశ్నలు–30 మార్కులు; పార్ట్‌–6 లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ(హిందీ, ఇంగ్లిష్, ప్రాంతీయ భాష) 30 ప్రశ్నలు–30 మార్కులు.. ఇలా మొత్తం 120 ప్రశ్నలు–120 మార్కులకు పరీక్ష జరుగుతుంది. పరీక్ష వ్యవధి రెండున్నర గంటలు.

లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌

  • టీజీటీ, హాస్టల్‌ వార్డెన్‌ పోస్టులకు అయిదు విభాగాల్లో పరీక్షతోపాటు.. ప్రత్యేకంగా లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను 30 మార్కులకు నిర్వహిస్తారు. అ­భ్యర్థులు తాము పరీక్షకు హాజరవుతున్న మాధ్యమానికి సంబంధించిన భాషలో ఈ టెస్ట్‌ ఉంటుంది. ఇందులో జనరల్‌ ఇంగ్లిష్‌ నుంచి 10 ప్రశ్నలు, హిందీ నుంచి 10 ప్రశ్నలు, ఎంచుకున్న లాంగ్వేజ్‌ నుంచి 10 ప్రశ్నలు చొప్పున అడుగుతారు. 
  • లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌లో భాగంగా మొత్తం 18 భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకునే అవకాశముంది. బెంగాలీ, డోంగ్రి, గారో, గుజరాతీ, హిందీ, కన్నడ, కశ్మీరీ, ఖాసీ, మళయాళం, మణిపురి, మరాఠి, మిజో, నేపాలి, ఒడియా, సంథాలి, తెలుగు, ఉర్దూ బాషల్లో ఏదో ఒక భాషను రీజనల్‌ లాంగ్వేజ్‌గా ఎంచుకోవచ్చు.
  • టీజీటీ పోస్ట్‌లకు సంబంధించి లాంగ్వేజ్‌ కాంపిటెన్సీ టెస్ట్‌ను కేవలం అర్హత విభాగంగానే పేర్కొన్నారు. ఇందులో ఇంగ్లిష్, హిందీ, రీజనల్‌ లాంగ్వేజ్‌ మూడు భాషల్లోనూ 40 శాతం మార్కులు చొప్పున పొందాల్సి ఉంటుంది. అప్పుడే మిగతా విభాగాలను మూల్యాంకన చేస్తారు.

నెగెటివ్‌ మార్కులు

టీజీటీతోపాటు హాస్టల్‌ వార్డెన్‌.. ఈ రెండు పరీక్షలు ఓఎంఆర్‌ బేస్డ్‌ టెస్ట్‌గా పెన్‌–పేపర్‌ విధానంలో ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు కేటాయిస్తారు. ప్రతి తప్పు సమాధానానికి 1/4వ వంతు మార్కు తగ్గిస్తారు. 

ముఖ్య సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 18.08.2023
  • ఈఎస్‌ఈఈ పరీక్ష తేదీ: నవంబర్‌లో నిర్వహించే అవకాశం ఉంది.
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: విజయవాడ, హైదరాబాద్‌.
  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://emrs.tribal.gov.in/

రాత పరీక్షలో రాణించేలా

జనరల్‌ అవేర్‌నెస్‌

ఈ విభాగంలో మంచి మార్కుల కోసం స్టాక్‌ జీకేతో పాటు కరెంట్‌ అఫైర్స్‌పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. ముఖ్యంగా ఇటీవల కాలంలో జరిగిన జాతీయ–అంతర్జాతీయ ఒప్పందాలు, కేంద్ర ప్రభుత్వ తాజా సంస్కరణలు/విధానాలు వంటి వాటిపై దృష్టి పెట్టాలి.

రీజనింగ్‌ ఎబిలిటీ

పజిల్స్, సీటింగ్‌ అరేంజ్‌మెంట్, డేటా సఫిషియన్సీ, వెర్బల్‌ రీజనింగ్, బ్లడ్‌ రిలేషన్స్, సీక్వెన్సెస్, సిరీస్, డైరెక్షన్స్, అసెర్షన్‌ అండ్‌ రీజన్, వెన్‌ డయాగ్రమ్‌లను ప్రాక్టీస్‌ చేయాలి.

టీచింగ్‌ ఆప్టిట్యూడ్‌

ఈ విభాగం కోసం టీచింగ్‌ విధానాలు, భావన లు,లక్ష్యాలు, ప్రాథమిక అవసరాలు, అభ్యాసకు ల ధర్మాలు, టీచింగ్‌ను ప్రభావితం చేసే అంశాలు, టీచింగ్‌ మెథడ్స్, టీచింగ్‌ ఎయిడ్స్, మూల్యాంకన విధానాలపై అవగాహన పెంచుకోవాలి.

ఐసీటీ నాలెడ్జ్‌

ఈ విభాగం కోసం కంప్యూటర్‌ సిస్టమ్‌ ప్రాథమిక భావనలు, ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌ బేసిక్స్, ఎంఎస్‌ ఆఫీస్, కీ–బోర్డ్‌ షాట్‌ కర్ట్స్, కంప్యూటర్‌కు సంబంధించిన పదజాలం, అబ్రివేషన్లు, కంప్యూటర్‌ నెటవర్క్స్, సైబర్‌ సెక్యూరిటీ, ఇంటర్నెట్‌ సంబంధిత అంశాలపై దృష్టి పెట్టాలి.

సబ్జెక్ట్‌ మెథడాలజీ

పార్ట్‌–5గా ఉండే డొమైన్‌ నాలెడ్జ్‌లో.. సబ్జెక్ట్‌ మెథడాలజీ నుంచి 65 ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు బ్యాచిలర్‌ డిగ్రీ స్థాయిలో తాము చదివిన సబ్జెక్ట్‌లపై అవగాహన పెంచుకోవాలి. ఆయా సబ్జెక్ట్‌లకు సంబంధించి భావనలు, సిద్ధాంతాలు, నిబంధనలను విశ్లేషిస్తూ అధ్యయనం చేస్తే..ఏ కోణంలో ప్రశ్న అడిగినా సమాధానం ఇచ్చే సన్నద్ధత లభిస్తుంది.

పెడగాజీపైనా

పార్ట్‌–5లోనే యాక్టివిటీ బేస్డ్‌ పెడగాజీ, కేస్‌ ఆధారిత ప్రశ్నలు 10 అడుగుతారు. అభ్యర్థులు.. విద్యా దృక్పథాలు, పెడగాజీ, చైల్డ్‌ డెవలప్‌మెంట్, శిశు వికాసం వంటి అంశాలపై దృష్టి పెట్టాలి. పెడగాజికి సంబంధించి సహిత విద్య, శిశువు విద్యా ప్రణాళిక, బోధన పద్ధతులు, మూల్యాంకనం–నాయకత్వం–గైడెన్స్‌–కౌన్సెలింగ్‌ గురించి అధ్యయనం చేయాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించిన చట్టాలపై పూర్తి అవగాహన పొందాలి. ముఖ్యంగా నూతన విద్యా విధానం–2020పై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 

లైబ్రేరియన్‌ రాత పరీక్ష

లైబ్రేరియన్‌ పోస్ట్‌లకు నిర్వహించే రాత పరీక్షలో రాణించేందుకు.. లైబ్రరీ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సైన్స్‌ ఫౌండేషన్, నాలెడ్జ్‌ ఆర్గనైజేషన్, ఇన్ఫర్మేషన్‌ ప్రాసెసింగ్, ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ బేసిక్స్, మేనేజ్‌మెంట్‌ ఆఫ్‌ లైబ్రరీస్‌ అండ్‌ ఇన్ఫర్మేషన్‌ సెంటర్స్‌/ ఇన్‌స్టిట్యూషన్స్, ఇన్ఫర్మేషన్‌ సోర్సెస్, సర్వీసెస్, లైబ్రరీ యూజర్స్‌కు సంబంధించి అన్ని అంశాలపైనా అవగాహన పెంచుకోవాలి.

- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html