అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
12, జూన్ 2020, శుక్రవారం
ఇంటర్ రిజల్ట్స్ కావలసిన వారు
ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టీచర్ ఎడ్యుకేషన్
(IITE) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:
జాబ్ : | ఫ్యాకల్టీ, నాన్ ఫ్యాకల్టీ |
ఖాళీలు : | 46 |
అర్హత : | SSC,బీఎస్సీ, పీహెచ్డీ,ఎమ్మెస్సీ |
వయసు : | 65 ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ.39,000-1,38,000/- |
ఎంపిక విధానం: | ఇంటర్వ్యూ ద్వారా |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ 400/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం: | ఆన్లైన్/ ఆఫ్లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | మే 29, 2020 |
దరఖాస్తులకు చివరితేది: | జూన్ 13, 2020 |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.
Please Share: ప్రతిరోజు కొత్త కొత్త ప్రభుత్వ ఉద్యోగాలు మన ఆప్ లో పోస్ట్ చేస్తుంటాం. దయచేసి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి అని కోరుకుంటున్నాం. అలాగే చాలా మంది కొత్త కొత్త జాబ్స్ ఎక్కడ ఉన్నాయో తెలుసుకోలేకపోతున్నారు. అలాంటి వాళ్ళకు మన APP ని షేర్ చెయ్యండి.
♦పెన్షనర్లకు ఈపీఎఫ్ వెసులుబాటు
🔹న్యూఢిల్లీ: పింఛనుదారులు తమ లైఫ్ సర్టిఫికెట్(జీవన్ ప్రమాణ్)ను అందజేయడంలో ఎదురవుతున్న ఇబ్బందులను అధిగమించేందుకు ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (ఈపీఎఫ్) మరో వెసులుబాటు కల్పించింది.
🔹కామన్ సర్వీస్ సెంటర్(సీఎస్ఈ)ల ద్వారా వీటిని అందజేయవచ్చునని పేర్కొంది. కోవిడ్ మహమ్మారి దృష్ట్యా ఎంప్లాయీస్ పెన్షన్ స్కీం(ఈపీఎస్) పింఛనుదారుల కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లు వివరించింది.
🔹పింఛనుదారులు ఏటా డిసెంబర్ లో లైఫ్ సర్టిఫికెట్ ను అందజేయాల్సి ఉంటుంది. దీనివల్ల పింఛను అందకపోవడం వంటి ఇబ్బందులు తలెత్తుతున్నాయి.
🔸తాజా నిర్ణయంతో దేశవ్యాప్తంగా ఉన్న 3.65 లక్షల సీఎస్ ఈల్లోనూ డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సమర్పించే వీలుంటుందని కార్మిక శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.
🍁దేశవ్యాప్తంగా ఉన్న 135 ప్రాంతీయ కార్యాలయాలు, 117 జిల్లా కార్యాలయాలకు ఇవి అదనమని తెలిపింది.
🔸పింఛనుదారులు ఇకపై తమకు వీలున్న సమయంలో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ను సీఎస్ ఈల్లో ఇవ్వవచ్చని, ఇచ్చిన రోజు నుంచి ఇది ఏడాది పాటు చెల్లుబాటవుతుందని స్పష్టం చేసింది.
11, జూన్ 2020, గురువారం
అసిస్టెంట్ మేనేజర్ (జనరల్)
సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (SEBI)
సంఖ్య : | 80 |
అర్హతలు | మాస్టర్స్ డిగ్రీ / లా డిగ్రీ / CA |
విడుదల తేదీ: | 11-06-2020 |
ముగింపు తేదీ: | 31-07-2020 |
వేతనం: | రూ. 28,150 - 55,600 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | ఆంధ్రప్రదేశ్ |
మరింత సమాచారం:
వయసు పరిమితి :
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
జనరల్ / ఓబిసి అభ్యర్థులు .రూ. 1000 /-
ఇతర అభ్యర్థులు ఎస్సీ / ఎస్టీ / Ex-:రూ.100 /-
---------------------------------------------------------
వేతనం:
రూ. 28,150 - 55,600 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.sebi.gov.in వద్ద 11-06-2020 నుండి 31-07-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
Website:
www.sebi.gov.in
---------------------------------------------------------
Notification :-
https://www.sebi.gov.in/sebiweb/other/careerdetail.jsp?careerId=147
---------------------------------------------------------
---------------------------------------------------------
🔳ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమాలు ఇంటర్/ఐటీఐ అభ్యర్థులకు లేటరల్ ఎంట్రీ
ప్యాకింగ్, కంటెయినర్లు, ఆటోమొబైల్ తదితర ఎన్నో విభాగాల్లో ప్లాస్టిక్ వినియోగం పెద్ద ఎత్తున పెరిగింది. ప్లాస్టిక్ లేని జీవనాన్ని ఊహించు కోవడం కష్టమే. అందుకే పాలిమర్ల ప్రాసెసింగ్, డిజైనింగ్, డెవలప్మెంట్, ఉత్పత్తుల్లో కొత్త కొత్త విధానాలు అమలులోకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో కిందిస్థాయి నిపుణుల అవసరాలు ఎక్కువయ్యాయి. వారిని సిద్ధం చేయడం కోసం డిప్లొమా కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఇంటర్ లేదా ఐటీఐ అర్హతతో వీటిలోకి ప్రవేశించవచ్చు.
ప్లాస్టిక్ టెక్నాలజీలో డిప్లొమాలు
కేంద్ర రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సెంట్రల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ (సిపెట్) నెలకొల్పారు. ఈ సంస్థ దేశవ్యాప్తంగా పలు కేంద్రాల్లో వివిధ స్థాయుల్లో కోర్సులను అందిస్తోంది. తాజాగా సిపెట్కు చెందిన ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాస్టిక్ టెక్నాలజీ (ఐపీటీ) -కొచ్చి ఇంటర్ విద్యార్థుల కోసం డిప్లొమా కోర్సుల్లో లేటరల్ ఎంట్రీ విధానంలో ప్రవేశాలకు ప్రకటన విడుదల చేసింది.
కోర్సులు
*డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ మౌల్డ్ టెక్నాలజీ
* డిప్లొమా ఇన్ ప్లాస్టిక్స్ టెక్నాలజీ
అర్హత: ఇంటర్ ఎంపీసీ/బైపీసీ లేదా నిర్దేశిత బ్రాంచీల్లో రెండేళ్ల ఐటీఐ ఉత్తీర్ణత. ఫలితాల కోసం ఎదురుచూస్తున్న విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం: వచ్చిన దరఖాస్తులను పరిశీలించి ఇంటర్/ఐటీఐ మార్కుల మెరిట్ ప్రకారం సీట్లు కేటాయిస్తారు.
కోర్సు స్వరూపం: లేటరల్ ఎంట్రీ డిప్లొమా కోర్సుల వ్యవధి రెండేళ్లు. ఇందులో చేరినవారు మూడేళ్ల డిప్లొమాలో రెండో ఏడాది కోర్సులోకి నేరుగా చేరిపోవచ్చు. తొలి మూడు సెమిస్టర్లకు కొచ్చి క్యాంపస్లో తరగతులు ఉంటాయి. చివరి సెమిస్టర్ సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్షిప్ ఉంటుంది. ఆగస్టు నుంచి తరగతులు మొదలవుతాయి.
ఉద్యోగాలు
రెండేళ్ల ఈ కోర్సును విజయవంతంగా పూర్తి చేసుకున్నవారికి ఆటోమోటివ్, ప్యాకేజింగ్, కన్స్యూమర్ గూడ్స్, మెషిన్ మాన్యుఫ్యాక్చరింగ్, ఎల్రక్టికల్ అండ్ ఎల్రక్టానిక్స్, ఆర్ అండ్ డీ, ఇంజినీరింగ్ తదితర విభాగాలకు చెందిన సంస్థల్లో అవకాశాలు ఉంటాయి. మిల్టన్, సెలో, ఎల్ అండ్ టీ, మారుతీ సుజుకీ, ఓఎన్జీసీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఆదానీ, గోద్రెజ్, అరవింద్ మొదలైన సంస్థలు క్యాంపస్ నియామకాల ద్వారా వీరిని ఎంపిక చేసుకుంటున్నాయి.
ఉన్నత విద్య: డిప్లొమా అనంతరం ఉన్నత చదువులకూ వీలుంది. సిపెట్ అందించే బీటెక్ ప్లాస్టిక్ ఇంజినీరింగ్ లేదా బీటెక్ మాన్యుఫ్యాక్చరింగ్ ఇంజినీరింగ్లో లేటరల్ ఎంట్రీ విధానంలో చేరి మూడేళ్లకే కోర్సు పూర్తిచేసుకోవచ్చు.
దరఖాస్తులకు చివరి తేదీ: జులై 10, 2020.
వెబ్సైట్: https://www.cipet.gov.in/centres/cipet-kochi/le_2020.php
1️⃣💁♀️వైద్య, ఆరోగ్యశాఖలో పోస్టుల భర్తీకి అనుమతి
🍁ఈనాడు, అమరావతి:
🔰వైద్య, ఆరోగ్య శాఖలో 5,701 పోస్టుల భర్తీకి అనుమతిస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్త ర్వులిచ్చింది. వైద్య విద్య, వైద్య విధానపరిషత్తు, ప్రజా రోగ్య సంచాలకుల పరిధిలో వీటిని భర్తీ చేయనున్నారు. ప్రస్తుతం ఉన్న స్టాఫ్ నర్సులు, ఫార్మసిస్టు, ల్యాబ్ టెక్నీషియన్ల ఖాళీల్లో 2,186మందిని ఒప్పంద ప్రాతిప దికన నియమించేందుకు ప్రభుత్వం అనుమతించింది .
●వైద్య విద్య, ప్రజారోగ్యం, వైద్య విధాన పరిషత్తులో 1,021 పోస్టులను భర్తీ చేయనున్నారు .
●ఖాళీగా 804 ఉన్న సహాయ ఆచార్యులు, అసిస్టెంట్ సర్జన్, దంత సహాయ సర్జన్ పోస్టులు భర్తీ చేస్తారు
🍁పరిశ్రమల శాఖ డైరెక్టర్ కు అసోం పురస్కారం
🔰ప్రజారోగ్య పరిరక్షణలో నూతన విధానాల అమలుకు గుర్తింపుగా అసోం ప్రభుత్వం 2018-19 సంవత్సరానికి అందించే 'కర్మశ్రీ' పురస్కారానికి పరిశ్రమల శాఖ డైరెక్టర్ సుబ్రమణ్యం ఎంపికయ్యారు జాతీయ ఆరోగ్య మిషన్ డైరెక్ట్ గా గతంలో అసోంలో పనిచేశారు
★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗
2️⃣✍నాడు- నేడు పనుల పరిశీలనకు క్విక్ ప్రొఫార్మా: ఆర్జేడీ
🍁ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 :
🔰ప్రభుత్వ పాఠశాలల ను కార్పొరేట్ పాఠశాలలుగా తీర్చిదిద్దేందుకు రాష్ట్ర ప్రభు త్వం చేపట్టిన నాడు - నేడు పనుల పురోగతిని క్షేత్రస్థాయి నుంచి సులువుగా తెలుసుకునేందుకు క్విక్ ప్రొఫార్మా విధానాన్ని ప్రవేశ పెట్టినట్టు పాఠశాల విద్యాశాఖ ప్రాంతీ య సంయుక్త సంచాలకులు (కాకినాడ ఆర్జేడీ) నరసింహా రావు వెల్లడించారు. ఏలూరు సమగ్ర శిక్ష జిల్లా సమావేశ మందిరంలో బుధవారం నాడు - నేడు పనుల ప్రగతిపై నియోజకవర్గ స్థాయి అధి కారులు డీఈవో, సమగ్ర శిక్ష ఏపీసీ, డీవై ఈ వోలు, ఇంజనీరింగ్ సిబ్బంది, కంప్యూ టర్ ఆపరేటర్లతో సమీక్షించారు. జూన్ నెలాఖరు నాటికి పనులు పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. డీఈవో రేణుక మాట్లాడుతూ పనులను క్షేత్రస్థాయిలో పర్యవేక్షిస్తున్నారు.
★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗
3️⃣✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష
🍁ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10:
🔰 విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
★彡 Divi Teachers Info 彡★ 🅢🅤🅡🅔🅢🅗
4️⃣💁♀️ఉపాధ్యాయ బదిలీలు చేపట్టాలి: ఏపీటీఎఫ్
🍁అమరావతి, జూన్ 10(ఆంధ్రజ్యోతి):
🔰రాష్ట్రంలో ఉపాధ్యాయ బదిలీలకు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన నేపథ్యంలో వెంటనే షెడ్యూల్ జారీచేసి, బదిలీల ప్రక్రియ చేప ట్టాలి ఏపీటీఎఫ్ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కె.వెంకటేశ్వరరావు, జి.హృద యరాజు ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కరోనా నేపథ్యంలో పదో తరగతి పరీక్ష లను రద్దు చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
📚✍టెన్త్ పరీక్షలు ఉంటాయి✍📚
♦11కు బదులు ఆరు పేపర్లే
♦పరీక్షలు రద్దు కావు
♦ప్రచారాలు నమ్మొద్దు
🌻అమరావతి, ఆంధ్రప్రభ: పదో తరగతి పరీక్షల నిర్వహణపై విద్యా శాఖ మంత్రి డా. ఆదిమూలపు సురేష్ స్పష్టతనిచ్చారు. పొరుగు రాష్ట్రాలైన తమిళనాడు, తెలంగాణ, ఛత్తీస్గఢ్ తదితర రాష్ట్రాలు పదో తరగతి పరీక్షల ను రద్దు చేస్తున్నట్లు ప్రకటించడంతో ఆంధ్రప్రదేశ్ నిర్వహణపై సందే హాలు తలెత్తాయి. ఈ నేపథ్యంలో బుధవారం స్పందించిన మంత్రి డా సురేష్, రాష్ట్రంలో పదో తరగతి పరీక్ష లు జరుగుతుందో తేల్చి చెప్పారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జూలై పదో తేదీ నుంచి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయని వివరించారు. అయితే ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్లు 11 పేపర్లకు బదులుగా ఆరు పేపర్ కుదించి నిర్వహిస్తామని స్పష్టం చేశారు. ప్రభుత్వం ప్రకటించకుండా అనవసర ప్రచారాలతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులను గందరగోళానికి గురి చేయొద్దని సూచించారు.కరోనా విస్తరిస్తున్న నేపథ్యంలో పటిష్ట రక్షణ చర్యలు పరీక్షలు జరిపేందుకు కసరత్తు చేస్తున్నామని, విద్యార్థులు, ఉపాధ్యాయుల ఆరో గ్యం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకుంటామని మంత్రి స్పష్టం చేశారు.
📚✍జూలై 30న గిరిజన వర్సిటీ ప్రవేశ పరీక్ష✍📚
🌻ఏయూ క్యాంపస్ (విశాఖపట్నం), జూన్ 10: విజయనగరం కేంద్రీయ గిరిజన యూనివర్సిటీ (సీటీయూ)లో ప్రవేశాలకు జూలై 30న పరీక్ష నిర్వహిస్తున్నట్టు అన్ని నిస్ట్రేటివ్ ఆఫీసర్ ఎన్వీ సూర్యనారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లా డుతూ ఈ నెల 14 నుంచి జూలై 10వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, రాయ్పూర్, బరం పూర్ (ఒడిశా), బెంగళూరు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తామన్నారు.
📚✍డీఎల్ ఎడ్ పరీక్ష ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚 | 📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం
ఫీజు చెల్లింపునకు సూచనలు✍📚
🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ ప్రథమ సంవత్సరం 20182020 బ్యాచ్) రెగ్యులర్, ఫెయిల్డ్ విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిందని డీఈవో రేణుక ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫీజును ఫైన్ లేకుండా ఈనెల 20వ తేదీ వరకు రూ.50 ఫై తో ఈనెల 25వ తేదీ వరకూ చెల్లించి దరఖాస్తులను ఆన్లైన్ చేసు కునేందుకు అవకాశం ఉందన్నారు. దరఖాస్తు ఫారం www.bseap.gov.in వెబ్లిం కులో అందుబాటులో ఉందన్నారు. రెగ్యులర్ విద్యార్థులు పరీక్ష ఫీజు రూ. 250 చెల్లించాల్సి ఉంటుందన్నారు. ఫీజును గేట్వే ద్వారా చెల్లించాలని సూచించారు.
🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹🔹
📚✍భారతీయ భాషల్లో డిప్లొమా టీచర్లకు అవకాశం
🌻ఏలూరు ఎడ్యుకేషన్, జూన్ 10 : పది నెలల వ్యవధితో కూడిన డిప్లొమా ఇన్ లాంగ్వేజ్ ఎడ్యుకేషన్ చేరేందుకు డిప్యూటేషన్ పై టీచర్లు నుంచి దరఖాస్తులను సెంట్రల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ లాంగ్వేజెస్ ఒక ప్రకటన విడుదల చేసింది.
జూలై 3వ తేదీ నుంచి ఈ కోర్సు ప్రారంభమవుతుంది. ఆసక్తి గల ఉపాధ్యాయులు వివరాలను www.cil.org నుంచి వివరాలు తెలుసుకోవచ్చు
🔳ఏఐఏఎస్ఎల్, న్యూదిల్లీ
మొత్తం ఖాళీలు: 17. పోస్టులు: చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, డిప్యూటీ చీఫ్ ఫైనాన్స్ ఆఫీసర్, మేనేజర్ (ఫైనాన్స్) తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, చార్టెడ్ అకౌంటెంట్ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా. దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా.
చివరి తేది: జూన్ 18, 2020
వెబ్సైట్: http://www.aiatsl.com/
🔳ఈఎస్ఐసీ, న్యూదిల్లీ
మొత్తం ఖాళీలు: 45 పోస్టులు-ఖాళీలు: సీనియర్ రెసిడెంట్-43, స్పెషలిస్ట్-02.
విభాగాలు: మెడిసిన్, సర్జరీ, అనెస్తీషియా, ఆర్థోపెడిక్స్, రేడియాలజీ, క్యాజువాలిటీ, గైనకాలజీ తదితరాలు.
అర్హత: సంబంధిత స్పెషలైజేషన్లలో పీజీ డిగ్రీ/ డిప్లొమా ఉత్తీర్ణత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 09, 2020. వేదిక: ఇందిరా గాంధీ ఈఎస్ఐ హాస్పిటల్, జిల్మీ, దిల్లీ-110095.
వెబ్సైట్: https://www.esic.nic.in/
🔳ఐకార్-ఐవీఆర్ఐ
మొత్తం ఖాళీలు: 06 పోస్టుల: సీనియర్ రిసెర్చ్ ఫెలో (ఎస్ఆర్ఎఫ్), యంగ్ ప్రొఫెషనల్.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్ డిగ్రీ, పీజీ డిగ్రీ (లైఫ్ సైన్సెస్) ఉత్తీర్ణత, నెట్ అర్హత, అనుభవం.
వాక్ఇన్ తేది: జూన్ 16, 2020.
వేదిక: ఐవీఆర్ఐ క్యాంపస్ ఇన్స్టిట్యూట్ ఆడిటోరియం, హెబ్బల్, బెంగళూరు.
వెబ్సైట్: http://www.ivri.nic.in/
🔳కంటి వెలుగును కాపాడే కొలువులు! ఇంటర్ తర్వాత ఆప్టోమెట్రీ కోర్సులు కంటి వెలుగును కాపాడే కొలువులు!
కంటి వెలుగును కాపాడే కొలువులు!
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ప్రతి జీవికీ ప్రధానమైనది కన్ను. ఏ పనైనా ఎలాంటి ఇబ్బందీ లేకుండా సక్రమంగా సాగిపోవాలంటే కళ్లు కచ్చితంగా బాగుండాలి. అన్ని వయసుల వారూ దాదాపు ఏదో ఒక కంటి ఇబ్బందితో ఉంటారని అంచనా. లోపం ఎలాంటిదైనా పరీక్షలు జరపాలి. తగిన చికిత్సను అందించాలి. ఈ కంటి పరీక్షలను ప్రాథమిక స్థాయిలో క్షుణ్ణంగా నిర్వహించేవాళ్లు ఆప్టోమెట్రీషియన్లు. వీళ్లు చేసే టెస్ట్ల ఆధారంగానే తర్వాతి దశలో చికిత్సలు మొదలవుతాయి. కంప్యూటర్లు, మొబైళ్ల వంటి ఆధునిక పరికరాల వినియోగం కళ్లపై తీవ్రమైన ప్రభావాన్ని చూపుతోంది. చిన్న వయసులోనే పలు రకాల కంటి సమస్యలు తలెత్తుతున్నాయి. వీటికి పరిష్కారాలను ప్రాథమిక దశలో ఆప్టోమెట్రీ కోర్సులు చదివిన అభ్యర్థులు చూపుతారు. కొన్ని ఆప్టిక్లను వినియోగించి కంటి చూపుపై సరైన అంచనాకు వస్తారు. ఆ సమయంలో నమోదు చేసే వివరాలే చికిత్సకు కీలకమైనవి. ఆ పరిశీలనలను డాక్టర్కు వివరిస్తారు. వాటి ఆధారంగానే అవసరమైన మందులు, లెన్స్లు, ఇతర సూచనలను వైద్యులు అందిస్తారు. ఈ ప్రక్రియ మొత్తంలో మొదటి దశలో కీలంగా పనిచేసేవారే ఆప్టోమెట్రీషియన్లు. దాదాపు ప్రతి కంటి ఆసుపత్రిలోనూ వీళ్లు ఉంటారు. ఆసక్తి ఉన్న వాళ్లు ఇంటర్మీడియట్ అర్హతతో ఆప్టోమెట్రీ కోర్సులు చేయవచ్చు.
డిప్లొమా.. డిగ్రీ
కంటి వెలుగును కాపాడే కొలువులు!
ఇంటర్ విద్యార్హతతో ఆప్టోమెట్రీలో డిప్లొమా, బ్యాచిలర్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంటర్ అన్ని గ్రూపుల వారూ డిప్లొమాలో చేరవచ్చు. వ్యవధి రెండేళ్లు. అది పూర్తిచేసుకున్నవారు ఆప్టోమెట్రీ యూజీ కోర్సులో నేరుగా రెండో ఏడాదిలోకి ప్రవేశించవచ్చు. ఈ అవకాశం కొన్ని సంస్థల్లోనే లభిస్తుంది. బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ వ్యవధి నాలుగేళ్లు. రాష్ట్ర స్థాయి సంస్థల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ లేదా బీఎస్సీ ఆప్టోమెట్రీలో చేరాలంటే ఇంటర్మీడియట్ బైపీసీ గ్రూపుతో ఉత్తీర్ణులై ఉండాలి. జాతీయస్థాయి, పేరున్న సంస్థలు మాత్రం బైపీసీతోపాటు ఎంపీసీ వారికీ అవకాశం కల్పిస్తున్నాయి. ఇంటర్ ఎంపీసీ, బైపీసీ విద్యార్థులు నాలుగేళ్ల యూజీ కోర్సులో చేరడానికి ప్రాధాన్యం ఇవ్వవచ్చు. నాలుగేళ్ల కోర్సులో చివరి ఏడాది మొత్తం ఇంటర్న్షిప్ ఉంటుంది. ఏదైనా కంటి ఆసుపత్రిలో దీన్ని చేయాలి. జాతీయ, రాష్ట్ర స్థాయుల్లో పలు సంస్థలు బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సులను నిర్వహిస్తున్నాయి. తర్వాత ఆసక్తి ఉన్నవారు రెండేళ్ల మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీలో చేరవచ్చు. అనంతరం పీహెచ్డీకీ అవకాశాలు ఉన్నాయి. బీ-ఆప్టోమెట్రీ అందించే సంస్థల్లో కొన్ని పీజీ, పీహెచ్డీలనూ నిర్వహిస్తున్నాయి. దేశంలోని ప్రసిద్ధ నేత్ర వైద్యశాలలూ యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, పీహెచ్డీ స్థాయుల్లో నాణ్యమైన విద్యను అందిస్తున్నాయి. యూజీ విద్యార్థులకు ఏడాది ఇంటర్న్షిప్ అవకాశాన్నీ కల్పిస్తున్నాయి. ఇంటర్ బోర్డు లేదా ఓపెన్ విధానంలో బైపీసీ గ్రూపు చదివినవారు; బయాలజీ, ఫిజిక్స్ల్లో బ్రిడ్జ్ కోర్సు పూర్తిచేసుకున్న ఒకేషనల్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సంస్థల్లో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు ప్రారంభమైన సంవత్సరం డిసెంబరు 31 నాటికి 17 ఏళ్లు నిండడం తప్పనిసరి. ఇంటర్ మార్కుల ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు. ప్రకటనలు జూన్ లేదా జులైల్లో వెలువడతాయి. జాతీయ స్థాయి సంస్థలు ప్రత్యేక ప్రవేశ పరీక్ష లేదా నీట్ స్కోర్తో చేర్చుకుంటున్నాయి.
ఏయే నైపుణ్యాలు?
ఆప్టోమెట్రిస్ట్గా సేవలు అందించాలకునే వారికి దృష్టిలోపం ఉండకపోతే మంచిది. సహనం, సమన్వయంతో వ్యవహరించడం, చురుగ్గా నిర్ణయాలు తీసుకునే నైపుణ్యాలు ఉన్నవారు ఇందులో రాణించే అవకాశం ఉంది. కోర్సులో భాగంగా అనాటమీ, ఫిజియాలజీ, బయోకెమిస్ట్రీ, ఫార్మకాలజీ, మైక్రో బయాలజీ, ఆప్టిక్స్పై అవగాహన కల్పిస్తారు. క్లినికల్ ఆఫ్తాల్మాలజీకి చెందిన ప్రాథమికాంశాల గురించీ తెలుసుకుంటారు. ఈ సబ్జెక్టుల నుంచి ఆప్టోమెట్రీకి అవసరమైన అనువర్తనాలను అధ్యయనం చేస్తారు.
ఉద్యోగావకాశాలు
దేశంలో పది కోట్ల మంది ఏదో ఒక దృష్టి లోపంతో బాధపడుతున్నారని అంచనా. తగిన సేవలు అందించడానికి కనీసం లక్ష మంది ఆప్టోమెట్రీషియన్లు అవసరం. కానీ అంతమంది ప్రస్తుతం మనదేశంలో లేరు. ఈ విభాగంలో డిగ్రీ చేస్తే ప్రభుత్వ కంటి ఆసుపత్రుల్లో ఆకర్షణీయ వేతనంతో ఆప్టోమెట్రీషియన్లుగా సేవలు అందించవచ్చు. ఎక్కువ ఉద్యోగాలు కార్పొరేట్ కంటి ఆసుపత్రులు, కార్పొరేట్ కళ్లద్దాల విక్రయ శాలలు, ప్రైవేటు ఆసుపత్రులు, ఎన్జీవోల్లో లభిస్తాయి. కొంత అనుభవం వచ్చిన తర్వాత సొంతంగా కళ్లద్దాల దుకాణం నిర్వహించుకోవచ్చు. ఎల్వీ ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్, మ్యాక్సీ విజన్, వాసన్ ఐ కేర్, అగర్వాల్ ఐ హాస్పిటల్ తదితర కార్పొరేట్ కంటి ఆసుపత్రుల్లో వీరి సేవలు వినియోగించుకుంటారు. కంటివైద్యులు సేవలందిస్తున్న ప్రతిచోటా ఆప్టోమెట్రీషియన్లు దాదాపు ఉంటారు. టైటాన్ ఐ ప్లస్, లెన్స్కార్ట్, లారెన్స్ అండ్ మేయో, విజన్ ఎక్స్ప్రెస్, జీకేబీ తదితర కార్పొరేట్ ఆప్టికల్ దుకాణాల్లోనూ వీరి సేవలు అవసరమవుతాయి. పీజీ, పీహెచ్డీ పూర్తి చేసుకున్నవారికి బోధన రంగంలో అవకాశాలు లభిస్తాయి.
ఇవీ సంస్థలు
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం ఆరేళ్ల వ్యవధితో ఇంటిగ్రేటెడ్ మాస్టర్ ఆఫ్ ఆప్టోమెట్రీ (ఎం-ఆప్టోమ్) కోర్సు అందిస్తోంది. ఇందులో 28 సీట్లు ఉన్నాయి. ఇంటర్లో బయాలజీ, ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథ్స్ సబ్జెక్టులు చదువుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. 60 శాతం మార్కులు తప్పనిసరి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశాలుంటాయి. ప్రకటన వెలువడింది. జూన్ 30లోగా దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. వంద మార్కులకు జనరల్ సైన్స్, మ్యాథ్స్ సబ్జెక్టుల నుంచి ఆబ్జెక్టివ్ ప్రశ్నలు వస్తాయి.
* అఖిల భారత వైద్య విజ్ఞాన సంస్థ (ఎయిమ్స్) న్యూదిల్లీ, రిషికేశ్ క్యాంపస్ల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆప్టోమెట్రీ కోర్సు అందిస్తున్నారు. ఈ రెండు సంస్థల్లో కలిపి 34 సీట్లు ఉన్నాయి. పరీక్షలో చూపిన ప్రతిభతో ప్రవేశం లభిస్తుంది. ఈ సంస్థల్లో చేరిన విద్యార్థులకు నెలకు రూ.500 స్ట్టైపెండ్ చెల్లిస్తారు. నాలుగో ఏడాది ఇంటర్న్షిప్లో ప్రతి నెల రూ. 10,250 అందుతుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథ్స్ సబ్జెక్టుల్లో ప్రశ్నలు వస్తాయి. విద్యార్థులు బయాలజీ లేదా మ్యాథ్స్ల్లో ఒక సబ్జెక్టు ప్రశ్నలకు జవాబులు రాస్తే సరిపోతుంది.
* శంకర నేత్రాలయ, చెన్నై ఆధ్వర్యంలో నడుస్తున్న ఎలైట్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీలో బ్యాచిలర్, మాస్టర్, డాక్టరేట్ స్థాయి కోర్సులున్నాయి.బ్యాచిలర్స్లో చేరినవారు మొదటి రెండేళ్లు శస్త్ర యూనివర్సిటీ, తంజావూరులో చదువుతారు. తర్వాత రెండేళ్లు ఎలైట్ స్కూల్, శంకర నేత్రాలయలో చదువు, ఇంటర్న్షిప్ పూర్తిచేస్తారు. ప్రవేశం నీట్ స్కోర్, ఇంటర్ మార్కులతో ఉంటుంది లేదా శస్త్ర నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ సాధించాలి. ఈ కోర్సులకు బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రకటన వెలువడింది. ఆసక్తి ఉన్నవారు శస్త్ర వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవచ్చు.
* ఆప్టోమెట్రీలో యూజీ, పీజీలను మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ అందిస్తోంది. పరీక్ష, ఇంటర్వ్యూలతో ప్రవేశం లభిస్తుంది. బైపీసీ, ఎంపీసీ రెండు గ్రూపుల విద్యార్థులూ దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రస్తుతం రిజిస్ట్రేషన్ ప్రక్రియ కొనసాగుతోంది.
* ఆప్టోమెట్రీ మూడేళ్ల కోర్సు పూర్తిచేసుకున్న విద్యార్థులు నాలుగో ఏడాది ఇంటర్న్షిప్ను హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, భువనేశ్వర్ల్లోని ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్ క్యాంపస్ల్లో చేసుకోవచ్చు. పరీక్షలో చూపిన ప్రతిభతో అవకాశం లభిస్తుంది. ఈ సంస్థ వివిధ మాడ్యూళ్లలో పీజీ డిప్లొమా ఇన్ ఆప్టోమెట్రీ అండ్ విజన్ సైన్సెస్ కోర్సులను 18 నెలల వ్యవధితో అందిస్తోంది. ఆప్టోమెట్రీలో బ్యాచిలర్ కోర్సులు చదివినవారు వీటికి అర్హులు.
* అమృత విశ్వవిద్యాపీఠం, కొచ్చి క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సు ఉంది. రాత పరీక్ష ఆధారంగా అడ్మిషన్ ఇస్తారు.
* భారతీ విద్యాపీఠ్ స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ, పుణెలో యూజీ, పీజీలు ఉన్నాయి.
* గీతం, విశాఖపట్నం క్యాంపస్లో ఆప్టోమెట్రీ కోర్సులో ప్రవేశానికి దరఖాస్తుల స్వీకరణ ప్రారంభమైంది.
* ఆంధ్రప్రదేశ్లో బీ-ఆప్టోమెట్రీని కర్నూల్ మెడికల్ కాలేజీ, ఆంధ్రా మెడికల్ కాలేజీ, సిద్ధార్థ మెడికల్ కాలేజీ, కోనసీమ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్-అమలాపురం, బొల్లినేని మెడ్ స్కిల్స్ శ్రీకాకుళం (రాగోలు), జీఎస్ఎల్ పారామెడికల్ ఇన్స్టిట్యూట్స్-రాజమండ్రి, సమత స్కూల్ ఆఫ్ ఆప్టోమెట్రీ-విశాఖపట్నం (వేపగుంట)ల్లో అందిస్తున్నారు. ఇంటర్ బైపీసీ మార్కుల ఆధారంగా ప్రవేశాలుంటాయి. జులైలో ప్రకటన వెలువడుతుంది.
దరఖాస్తు చేశారా?
కంటి వెలుగును కాపాడే కొలువులు!
*సీడీఎఫ్డీ, హైదరాబాద్లో ఫెలోషిప్
అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ డిగ్రీ (ఎండీ/ ఎంఎస్/ డీఎన్బీ) ఉత్తీర్ణత. చివరి తేది: జూన్ 04, 2020.
* ఏఐఏపీజీసెట్-2020
అర్హత: బీఏఎంఎస్/ బీయూఎంఎస్/ బీఎస్ఎంఎస్/ బీహెచ్ఎంఎస్ ఉత్తీర్ణత, ఇంటర్న్షిప్ చేసి ఉండాలి. చివరి తేది: జూన్ 05, 2020.
* ఏపీ డీఈఈసెట్-2020
అర్హత: ఇంటర్మీడియట్/ తత్సమాన ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 05, 2020.
* ఎన్ఐఆర్డీపీఆర్లో వివిధ ఖాళీలు
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్, ఎల్ఎల్బీ; బీసీఏ/ ఎంసీఏ/ ఎంఎస్సీ, ఎంబీఏ; ఇతర పీజీ డిగ్రీల్లో ఉత్తీర్ణత, అనుభవం. చివరి తేది: జూన్ 10, 2020.
* సీఎంటీఐ, బెంగళూరులో ప్రాజెక్ట్ స్టాఫ్
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో ఐటీఐ, డిప్లొమా, బీఎస్సీ, బీఈ/ బీటెక్/ ఎంఈ/ ఎంటెక్, ఎంఎస్సీ ఉత్తీర్ణత.
చివరి తేది: జూన్ 12, 2020.
🔳ఎయిమ్స్, భోపాల్
మొత్తం ఖాళీలు: 155. పోస్టులు: ప్రొఫెసర్, అడిషనల్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. దరఖాస్తుకు చివరి తేది: ఎంప్లాయిమెంట్ న్యూస్లో ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 45 రోజుల్లోపు.
వెబ్సైట్: https://www.aiimsbhopal.edu.in/
🔳ఐఏఎస్ఎస్టీలో ప్రాజెక్ట్ స్టాఫ్
మొత్తం ఖాళీలు: 14 పోస్టులు: ప్రాజెక్ట్ సైంటిస్ట్, సీనియర్ రిసెర్చ్ అసోసియేట్, ల్యాబొరేటరీ అసిస్టెంట్ తదితరాలు.
అర్హత: పోస్టును అనుసరించి సంబంధిత సబ్జెక్టుల్లో గ్రాడ్యుయేషన్, పోస్టు గ్రాడ్యుయేషన్, పీహెచ్డీ ఉత్తీర్ణత, అనుభవం.
ఎంపిక విధానం: షార్ట్లిస్టింగ్, ఇంటర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం: ఆన్లైన్. చివరి తేది: ఈ ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోపు.
వెబ్సైట్: https://iasst.res.in/
🔳పాఠశాల విద్యార్థుల సిలబస్ తగ్గింపు? అభిప్రాయాలు కోరిన కేంద్ర ప్రభుత్వం
రోటరీ ఇండియాతో కలిసి ఈ-లెర్నింగ్ పాఠాల తయారీ
1 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ఈ-లెర్నింగ్ పాఠాలను తమ టీవీ ఛానళ్ల ద్వారా ప్రసారం చేసేందుకు... రోటరీ ఇండియాతో జాతీయ విద్యా పరిశోధన, శిక్షణ మండలి (ఎన్సీఈఆర్టీ) చేతులు కలిపింది. ఆధునిక సాంకేతికత, నవకల్పన పునాదులపై సరికొత్త విద్యా వ్యవస్థను అభివృద్ధి చేస్తున్నట్టు నిశాంక్ చెప్పారు. విద్యాదాన్ పథకం కింద రోటరీ సంస్థ 1-12 తరగతుల పాఠ్యాంశాలన్నింటినీ హిందీ భాషలో అందిస్తున్నట్టు ఆయన తెలిపారు. వచ్చే నెల నుంచి మొత్తం 12 ఎన్సీఈఆర్టీ ఛానళ్ల ద్వారా ఈ పాఠాలను ప్రసారమవుతాయి.
🔳రేపటి నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ 10 Jun, 2020 03:47 IST|Sakshi
జేసీ పూర్తి బాధ్యత తీసుకోవాలి.. కలెక్టర్లు పర్యవేక్షించాలి
జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్లో సీఎం జగన్
వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి
జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోవాలి
కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణానికి కనీసం 50 ఎకరాల మేర స్థలాన్ని త్వరగా అప్పగించాలి
గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై రోజు వారీ సమీక్ష నిర్వహించాలి
మద్యం, ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపితేనే తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం. కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. సీఎం మీతో ఉన్నాడు.. దూకుడుగానే ఉండండి.
రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే వారని, ఇప్పుడు 54.5 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందిస్తున్నా. వచ్చే సమీక్షా సమావేశం నాటికి కనీసం 60 లక్షల మందికి పనులు కల్పించాలి.
కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి. కరోనా అని అనుమానం రాగానే ఎవరికి కాల్ చేయాలి.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి.. పాజిటివ్ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అనే కీలక విషయాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఇది చేస్తేనే వైరస్ అనుమానితులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ఏ ఇబ్బందీ ఉండదు. అప్పుడే మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లేకపోతే అది ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది.
సాక్షి, అమరావతి: గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి వెల్లడించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు పక్కనే ఉన్న రీచ్ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల అవుతుందని, గ్రామ సచివాలయంలో అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి.
అన్ని ఇసుక రీచ్లనూ ఓపెన్ చేయాలి
► వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్ టన్నుల ఇసుక నిల్వ చేయాలి. జూన్ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం లక్షన్నర టన్నుల వరకూ ఇస్తున్నాం.
► శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి. అన్ని రకాల రీచ్లను తెరవాలి. కొత్త సోర్స్లను గుర్తించాలి.
► బల్క్ బుకింగ్ అనుమతులు జాయింట్ కలెక్టర్ చూసుకోవాలి. ఈ విధానం పారదర్శకంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎస్ఓపీ (స్టాండర్డ్ ఆపరేషన్ ప్రొసీజర్) రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. వర్షాలు వస్తున్నందున మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి.
ఇళ్ల స్థలాల పంపిణీ చిరస్మరణీయం
► ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్త వారితో కలిపి 30.30 లక్షల మందికిపైగా లబ్ధిదారులుండొచ్చు. వీరందరికీ జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. జూన్ 12 కల్లా లబ్ధిదారుల తుది జాబితాను డిస్ప్లే చేయాలి.
► జూన్ 15 నాటికి పాత, జూన్ 30 నాటికి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్ బి ఉండాలి. జూన్ 15 నాటికి ప్లాన్ బి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై 8న అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్ చేసి ఇవ్వాలి.
► సంతృప్త స్థాయిలో మనం ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో చివరి దశకు వచ్చాం. కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో వారికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరుతున్నా.
ఇ–క్రాప్ బుకింగ్ కీలకం
► ఇ–క్రాప్ బుకింగ్ 100 శాతం కచ్చితత్వంతో జరగాలి. వ్యవసాయ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్ ద్వారా ఇ–క్రాప్ బుకింగ్ చేయించాలి. తప్పులు లేకుండా పారదర్శకంగా జరగాలి. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఇ– క్రాప్ బుకింగ్ అనేది పునాదిగా నిలుస్తుంది.
► కనీస గిట్టుబాటు ధర పొందడానికి ఈ విధానం చాలా కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఆదుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట రుణాలకు, ఇన్సూరెన్స్కు కూడా ఉపకరిస్తుంది.
► ఉద్యాన పంటలకు ప్రత్యేక అప్లికేషన్ ఉంది. ఆక్వాను కూడా ఇ–క్రాపింగ్లో ప్రత్యేక అప్లికేషన్లో పెడుతున్నాం. మార్కెటింగ్లో ఇది కీలకం కాబోతుంది.
నాడు–నేడుపై జేసీ నిత్యం పర్యవేక్షించాలి
► అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్న జేసీ స్కూళ్లలో నాడు– నేడు కార్యక్రమాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఏం కావాలన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులు మాత్రం వేగంగా జరగాలి.
► 15 కొత్త మెడికల్ కాలేజీలను మనం కట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాలను హేండోవర్ చేయాల్సి ఉంది. ఒక్కో కాలేజీ కోసం కనీసం 50 ఎకరాలు గుర్తించాలి.
► వచ్చే సమీక్షా సమావేశం నాటికి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), అంగన్వాడీ కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, అర్బన్ హెల్త్ క్లినిక్స్, మెడికల్ కాలేజీలకు సంబంధించి భూముల గుర్తింపు పూర్తి కావాలి.
► గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్పై మరింతగా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ఏవైనా పెండింగ్లో ఉంటే అనుమతులు ఇచ్చి పనులు వేగవంతం చేయాలి.
► పట్టణ, నగరాల్లోని వైఎస్సార్ క్లినిక్స్కు సంబంధించి రేపటికి మ్యాపింగ్ చేయబోతున్నారు. వీటికి స్థలాలను గుర్తించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది.
► అంగన్వాడీ కేంద్రాలు కూడా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాయి. 55 వేల అంగన్వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగులు కట్టాలి. మిగిలిన వాటిలో మరమ్మతులు చేయాలి. వీటిలో కూడా నాడు–నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి.
కోవిడ్–19పై ప్రజల్లో అవగాహన పెంచాలి
► కోవిడ్–19 వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు చాలా బాగా పని చేశారు. వలంటీర్లు, ఆశాలు, ఏఎన్ఎంలు, నర్సులు, ల్యాబ్ టెక్నీషియన్లు, వైద్యులు, మున్సిపల్ సిబ్బంది, శానిటరీ వర్కర్లు.. అందరూ చాలా బాగా పని చేశారు.
► కరోనా వైరస్ విషయంలో దేశంలో పాజిటివిటీ రేటు 6 శాతం అయితే రాష్ట్రంలో 1 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు. అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కోవిడ్తో ఎలా కలిసి బతకాలన్న దాని గురించి మనం ఆలోచించాలి.
► 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. కేవలం 2 శాతం కేసుల్లో మాత్రమే మరణాలు ఉంటున్నాయి. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్ ఫెసిలిటీస్ మీద కూడా దృష్టి పెట్టాలి.
సచివాలయాల ఉద్యోగులపై జేసీ దృష్టి పెట్టాలి
► గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులపై సంబంధిత జేసీ దృష్టి పెట్టాలి. పనీతీరుపై, ప్రజలకు అందుతున్న సేవలపై రోజూ సమీక్ష నిర్వహించాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ► స్పందన కింద వచ్చే వినతులను జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలుపెడితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి.
► ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఇచ్చిన అతి ముఖ్యమైన నంబర్లు, సచివాలయాల్లో అందే సేవల గురించి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పకుండా డిస్ ప్లే కావాలి. అలాగే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలిపేలా ప్రకటించిన సంక్షేమ క్యాలండర్నూ ప్రదర్శించాలి.
► లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్ డెలివరీ చేయాలి. బయోమెట్రిక్ అక్నాలెడ్జ్మెంట్ తీసుకోవాలి.
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.
మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
► మద్యం వినియోగం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశాం. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాం.
► మద్యం విక్రయించే వేళలనూ బాగా తగ్గించాం. పద్ధ్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం. షాక్ కొట్టే రీతిలో రేట్లు పెంచాం.
► ఇవన్నీ చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు.
🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM
జూలై 12న అంబేద్కర్ వర్సిటీ అర్హత పరీక్షJun 10 2020 @ 04:37AM
యూజీ పరీక్షలు వాయిదా
అంబేద్కర్ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్ ఎడ్యుకేషన్) మొదటి సెమిస్టర్, బీఈడీ (బ్యాక్లాగ్), ఎంబీఏ (హాస్పిటల్ అండ్ హెల్త్కేర్ మేనేజ్మెంట్) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్ (సీబీఎస్) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్ బ్యాచ్ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్ చేసుకోవాలని అధికారులు సూచించారు.
10, జూన్ 2020, బుధవారం
ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్
ముఖ్యమైన తేదీలు:
దరఖాస్తులకు చివరి తేదీ | 19.06.2020 |
మొత్తం ఖాళీలు:
3
విభాగాల వారీగా ఖాళీలు:
ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రాజెక్ట్లు | 1 |
జరనరల్ మేనేజర్ | 1 |
కంపెనీ సెక్రటరీ | 1 |
అర్హతలు:
పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో బీఈ/బీటెక్, ఎంబీఏ
ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , కంప్యూటర్స్/ఐటీలో బ్యాచిలర్స్
ఇన్స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం మరియు అనుభవం ఉండాలి
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.
ఎలా అప్లై చేసుకోవాలి:
ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. recruitmentapsfl@gmail.com దానికి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి.
భారత వైమానిక దళ నియామకం | Indian Air Force Recruitment
Click here for Official Notification(Detailed Notification)
Click here for Official Notification(Short Notification)
సైంటిస్ట్-H Job
సంఖ్య : | - |
అర్హతలు | Ph.D (వెటర్నరీ సైన్సెస్ / యానిమల్ సైన్సెస్ / మోడరన్ బయాలజీ / లైఫ్ సైన్సెస్ ) |
విడుదల తేదీ: | 10-06-2020 |
ముగింపు తేదీ: | 06-07-2020 |
వేతనం: | రూ. 27,200 - 30,200 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | హైదరాబాద్ (తెలంగాణ) |
మరింత సమాచారం:
వయసు పరిమితి:
50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ. 27,200- 30,200 / - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి గల అభ్యర్థులకు అవసరమైన పత్రాలను ఇమెయిల్ చేయమని అభ్యర్థించారు .
---------------------------------------------------------
E-Mail : - diroffice@niab.org.in
---------------------------------------------------------
WEBSITE: http://niab.org.in/
---------------------------------------------------------
Notification :- http://niab.org.in/Notifications_6_2020.aspx
---------------------------------------------------------
---------------------------------------------------------
ల్యాబ్ టెక్నీషియన్ Job
సంఖ్య : | - |
అర్హతలు | Bsc / Msc |
విడుదల తేదీ: | 10-06-2020 |
ముగింపు తేదీ: | 24-06-2020 |
వేతనం: | రూ.13,000 / - నెలకు |
ఉద్యోగ స్థలం: | హైదరాబాద్ (తెలంగాణ) |
మరింత సమాచారం:
వయసు పరిమితి:
30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ.13,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు ఇక్కడ వస్తాయి Walk-In-Interview @10:00 AM - 12:00PM
---------------------------------------------------------
Walk-In-Interview Address:
AN AUTONOMOUS INSTITUTE OF DEPT.
OF BIOTECHNOLOGY, MINISTRY OF SCIENCE & TECHNOLOGY,
SURVEY NO. 37, OPP. JOURNALIST COLONY,
EXTENDED Q CITY ROAD,
NEAR GOWLIDODDI, GACHIBOWLI,
HYDERABAD-500032
---------------------------------------------------------
WEBSITE: http://niab.org.in/
---------------------------------------------------------
Notification :- http://niab.org.in/Careers.aspx
---------------------------------------------------------
---------------------------------------------------------
GEMINI TIMES | 10-06-2020 | HINDUPUR
నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ | National Investigation Agency Recruitment
NIA రిక్రూట్మెంట్ | NIA Recruitment
9, జూన్ 2020, మంగళవారం
NTPC జాబ్ నోటిఫికేషన్ పరీక్ష లేదు | NTPC JOB NOTIFICATION NO EXAM
ముఖ్యమైన తేదీలు:
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ |
02 జూన్ 2020 |
ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ |
22 జూన్ 2020 |
మొత్తం ఖాళీలు: 23
విభాగాల వారిగా ఖాళీలు:
తవ్వకం అధిపతి |
1 |
ఎగ్జిక్యూటివ్ (తవ్వకం) |
1 |
ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP) |
2 |
మైన్ సర్వేయర్ హెడ్ |
1 |
అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్ |
18 ( UR-11, OBC-4, SC-2, ST-1) |
అర్హతలు:
పోస్ట్ ను బట్టి అర్హతలు ఇవ్వడం జరిగింది. మెకానికల్ / మైనింగ్ మెషినరీలో ఇంజనీరింగ్ డిగ్రీ,మైనింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా జియాలజీ / అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/సివిల్ / మైనింగ్ / మైన్స్ సర్వేలో డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
వయస్సు:
తవ్వకం అధిపతి |
52 |
ఎగ్జిక్యూటివ్ (తవ్వకం) |
47 |
ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP) |
47 |
మైన్ సర్వేయర్ హెడ్ |
47 |
అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్ |
37-42 |
విశ్రాంతి (ఉన్నత వయస్సు పరిమితిలో) |
sc,st వారికి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది. |
జీతం:
తవ్వకం అధిపతి |
227000 |
ఎగ్జిక్యూటివ్ (తవ్వకం) |
170000 |
ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP) |
189000 |
మైన్ సర్వేయర్ హెడ్ |
189000 |
అసిస్టెంట్ మైన్ సర్వేయర్ |
57000 |
మైన్ సర్వేయర్ |
76000 |
జాబ్ ఎక్కడ చెయ్యాలి:
ఎన్టిపిసి లిమిటెడ్, 7, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, లోధి రోడ్. న్యూడిల్లీ-110003
ఎలా ఎంపిక చేస్తారు:
ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.
ఎలా అప్లై చేసుకోవాలి:
అన్లైన్ లో అప్లై చేసుకోవాలి.
ఆన్ లైన్ అప్లికేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015.
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...