16, మే 2020, శనివారం

DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ | జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు

డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.

‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ లిస్టులో ఉండి..  సెలెక్షన్‌ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్‌ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

🔳టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ సైన్స్‌ : ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-1లో 12, సెక్షన్‌-2లో 16, సెక్షన్‌-3లో 32, సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్‌ స్టడీస్‌: సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.

మ్యాథ్స్‌ పేపర్‌: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

🔳జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.



🔳కొలువు చూపే కొత్త డిగ్రీ, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ


పాఠ్యాంశాలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
ఈనాడు - అమరావతి

కొలువు చూపే కొత్త డిగ్రీ

కొత్త విద్యా సంవత్సరం(2020-21) నుంచి డిగ్రీ విద్యలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మూడేళ్ల కోర్సులో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి అప్రెంటిస్‌షిప్‌ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి చేర్చింది. ఆ మేరకు మార్చిన కొత్త పాఠ్యాంశాలు జూన్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

కొత్తగా ఇలా..


అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్యాల సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో ప్రతి సెమిస్టర్‌కు ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో ఏడాదిలో రెండేసి నెలలను ‘అప్రెంటిస్‌షిప్‌’గా పిలుస్తారు. ఇందుకు సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరు నెలల శిక్షణను ‘ఉద్యోగ నైపుణ్య శిక్షణ’గా పిలవనున్నారు.

నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు

* బీఏ: డేటా ఎనలిటిక్స్‌, పబ్లిక్‌ స్పీచ్‌, బడ్జెట్‌ తయారీ, కార్యాలయ ప్రాసెస్‌, పర్యాటక గైడెన్స్‌, సర్వే, రిపోర్టింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, జర్నలిజం.
* బీకాం: పర్యాటకం, చిల్లర వర్తకం, జీఎస్టీ, వాణిజ్య విశ్లేషణ.
* బీఎస్సీ: వైద్య ప్రయోగశాల సాంకేతికత, ఆక్వా, మత్స్య, బయోలజీ ప్రయోగశాల సాంకేతికత, ఫుడ్‌ అడల్‌ట్రేషన్‌.

Ad

జీవన నైపుణ్య సబ్జెక్టులు

* మానవ విలువలు, వృత్తి నైతికత,
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, * స్టాటిస్టిక్స్‌,
* ఇండియన్‌ కల్చర్‌, సైన్సు,
* ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ,
* ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌,
* ఎనటికల్‌ నైపుణ్యం, * పర్సనాలిటీ ఎన్‌హాన్స్‌, లీడర్‌షిప్‌, ‌* హెల్త్‌ ‌* పర్యావరణ విద్య.


* కొత్త పాఠ్యాంశాలపైఅధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వనున్నారు.

10th Class 2020 Marks Model Papers Download | పదవ తరగతి మార్కుల నమూనా పత్రాలు 2020

వార్తల్లో నేటి హిందూపురం


జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ఇందులో తనకల్లుకు చెందిన మహిళ, ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంట పల్లికి చెండిన మరో మహిళ, హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఒక మహిళ, మేళాపురానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కరోనా నియంత్రణ విషయమై ఎవ్వరు కూడా హిందూపురం వాసులను రానివ్వకూడదని హిందూపురానికి వెళ్ళకూడదని కర్ణాటక మరియు దాని సరహద్దు గ్రామాలలో చాటింపులు వేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు శాఖకు సూచనలిస్తూ మరింత అప్రమత్తం చేశారు ఎస్పీ సత్య యేసు బాబు. మన ఊరి పేరును నిలబెట్టాలి రా అని ఇంటిలో వారు చిన్నప్పుడు చెప్పుంటారు దానిని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్టున్నారు హిందూపురం వాసులు.

పాత పద్దతి ప్రకారం నేటి నుండి 4వ విడత ఉచిత రేషన్ ను ఈ నెల 27 వరకు ఇవ్వనున్నారు ఇందులో బియ్యం పప్పుశెనగ వంటి వస్తువులు ఉంటాయి. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

డి ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబరు 3 వ తేదీ నుండి ప్రారంభం అదే నెల 8వ తేదీవరకు వరుసగా ఆరు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

టెన్త్ పరీక్షలు మార్కుల నమూనా పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. 4 పేపర్ల నమూనాలను ఎస్సెస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. మిగిలిన పేపర్లని కూడా త్వరలో వెబ్ సైట్ లో చూడొచ్చు. మరింత సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్స్పాట్.కామ్ ను చూడొచ్చు.

వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3వ తేదీన. జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

2018-19 బ్యాచ్ కి చెందిన కన్వీనర్ కోటా అభ్యర్థులకు, ఒక సారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మార్కుల మెమోలకు బి ఎస్ ఇ ఎ పి.ఓ ఆర్జీ లో చూడొచ్చు.

జి ఎస్ టి ఆర్ 1 గడువు పెంపు ఏడాదికి 1.5 కోట్ల టర్నోవర్ కలిగిన వారు ఏప్రిల్ లో గా సమర్పించాల్సిన జి ఎస్ టి ఆర్ 1 ఫారాలను జూన్ లో, జులైలో సమర్పించాల్సిన ఫారాలను సెప్టెంబరులో సమర్పించవచ్చు.

యుజిసి నెట్ సి ఎస్ ఐ ఆర్ నెట్, జె ఎన్ యూ ఇ ఇ, ఐ సి ఎ ఆర్ నెట్ దరఖాస్తు గడువులను ఈ నెల 31 వరకు పెంచారు. 

2008 డి ఎస్సీ మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన అభ్యర్థులకు 21230 రూపాయలతో కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో 4579 మంది బి ఇడి 78 మంది డి ఇడి అభ్యర్థులు కలిపి 4657 మందికి ఉన్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి 641 మంది ఉన్నారు. అయితే వీరిలో కొంత మంది ఇప్పటికే తరువాతి డి ఎస్సీలో, మరి కొందరు ఇతర ప్రభుత్వోద్యోగాలను సంపాదించారు. మిగిలిన వారిలో ఎంత మంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోనున్నారు. అనంతపురం జిల్లా అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు తమ ఆసక్తిని డి ఇ ఓ అనంతపురం వెబ్ సైట్ లో తెలపాలన్నారు తెలియజేయాలని డి ఇ ఓ శామ్యూల్ శుక్రవారం తెలిపారు. ఎస్ జి టీ తెలుగు కామన్ మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు జిల్లా వెబ్ సైట్ లో ఉంచామన్నారు. 

ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్త్ పద్దతిలో సైకియాట్రిస్ట్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 19.

గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సైక్రియాటిట్స్ లేదా ఎం బి బి ఎస్ డాక్టర్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 20.





 

UGC NET దరఖాస్తు గడువు పెంపు | ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు | గుంటూరుజి జి హెచ్ లో ఖాళీలు


టెన్త్ నమూనా పత్రాలు వివరాలు | జూన్ 3వ తేదీన వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు | ఎల్ పి టి పరీక్షా ఫలితాలు విడుదల | జి ఎస్ టి ఆర్ 1 సమర్పణ గడువు పెంపు




డి ఎస్సీ 2008 అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్ జి టీ ఉద్యోగాలకు రేపటి లోగా ఆసక్తిని ఆన్ లైన్ ద్వారా తెలపాలి | సెప్టెంబరు 3 నుండి డి ఎడ్ ఫస్ట్ ఇయర్ పరీక్షలు (వార్తా పత్రికల ద్వారా సేకరణ)





Private Jobs



























14, మే 2020, గురువారం

🎯డీఆర్‌డీఓ-ఆర్‌ఏసీలో 167 సైంటిస్టులు🎯



🏵డిఫెన్స్‌ రిసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ ఆర్గనైజేషన్‌(డీఆర్‌డీఓ)కి చెందిన దిల్లీలోని రిక్రూట్‌మెంట్‌ అండ్‌ అసెస్‌మెంట్‌ సెంటర్‌(ఆర్‌ఏసీ) కింది పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.

🏵 సైంటిస్ట్‌-బి మొత్తం ఖాళీలు: 167

🏵విభాగాలు: ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌, మెకానికల్‌, కంప్యూటర్‌ సైన్స్‌, ఎలక్ట్రికల్‌ ఇంజినీరింగ్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, ఎరోనాటికల్‌ ఇంజినీరింగ్‌ తదితరాలు.

👉అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/ బీటెక్‌, మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత, వాలిడ్‌ గేట్‌ స్కోర్‌.

👉ఎంపిక విధానం: వాలిడ్‌ గేట్‌ స్కోర్‌, డిస్క్రిప్టివ్‌ టెస్ట్‌, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా.

👉దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

👉దరఖాస్తుకు చివరి తేది: జులై 10, 2020.

⭕వెబ్‌సైట్‌: https://rac.gov.in/

ఐఐటీ కౌన్సెలింగ్‌ రౌండ్ల తగ్గింపు!!



హైదరాబాద్‌, మే 13(ఆంధ్రజ్యోతి): లాక్‌డౌన్‌ కారణంగా ఇప్పటికే జేఈఈ-మెయిన్‌, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షలు వాయిదా పడటంతో తరగతుల ప్రారంభం కూడా ఆలస్యమవడం అనివార్యంగా మారింది. దీంతో పరీక్షల నిర్వహణ, ఫలితాల వెల్లడి, కౌన్సెలింగ్‌ ప్రక్రియలను సాధ్యమైనంత త్వరగా పూర్తిచేయాలని కేంద్ర మానవ వనరుల శాఖ భావిస్తోంది. ఇందులో భాగంగానే ఐఐటీ, నీట్‌లలో ప్రవేశాలకుగానూ జేఈఈ కౌన్సెలింగ్‌కు ఈ ఏడాది తక్కువ రౌండ్లు నిర్వహించాలని యోచిస్తోంది. 2019లో సీట్ల భర్తీకి జోసా 7 రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించింది. ఈసారి రౌండ్లు తగ్గించాలని ఐఐటీలు మంత్రిత్వ శాఖకు ప్రతిపాదనలు పంపాయి. దీంతో ఈ ఏడాది ఐదు లేదా ఆరు రౌండ్ల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు. జేఈఈ-మెయిన్‌ పరీక్షను జూలై 18 నుంచి 23 వరకు, జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్షను ఆగస్టు 23న నిర్వహించాలని నిర్ణయించిన సంగతి తెలిసిందే

AP ELECTRICITY NEW TARIFF

*ఏపీ కరెంట్ బిల్ కొత్త టారిఫ్* 

కన్ఫ్యూజ్ కాకుండా ఈ కింది కొత్త స్లాబ్స్ చూడండి.

1. *కేటగిరి A* 

నెలకు 75 యూనిట్స్ లోపు కరెంట్ వాడుకున్న వారు కేటగిరీ A లోకి వస్తారు. కేటగిరి A స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50  --->  1.45
51-75 ----> 2.60

*2. కేటగిరి B*

నెలకు 75 యూనిట్స్ దాటి 225 యూనిట్స్ వరకు  వాడుకున్న వారు కేటగిరి B లోకి వస్తారు. కేటగిరి B స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.60
51 - 100 ----->   2.60
101 - 200 -----> 3.60
201 - 225 -----> 6.90

*3. కేటగిరి C*

నెలకు 225 యూనిట్స్ పైన వాడుకున్న వారు కేటగిరి C లోకి వస్తారు. కేటగిరి C స్లాబ్స్ ఈ కింది విధంగా ఉన్నాయి.

0 - 50      ---->   2.65
51 - 100 ----->   3.35
101 - 200 -----> 5.40 
201 - 300 -----> 7.10
301 - 400 -----> 7.95
401 - 500 ----->  8.50
500 పైన  ----->   9.95 

చదివారు కదా, ఇప్పుడు మీ కరెంట్ బిల్ తీసుకుని మీరు నెలలో ఎన్ని యూనిట్స్ వాడుకున్నారో దానిని బట్టి మీ కేటగిరి తెలుసుకోండి. దానిని బట్టి మీ యూనిట్ రేట్స్ స్లాబ్స్ వారీగా లెక్క కట్టుకొని దానిని టోటల్ చెయ్యండి. దీనికి సర్ చార్జీలు అదనం.

SVMVV | SRM JEEJEEE Entrance | Sathybhama Entrance Exams details

🔳ఎస్పీఎంవీవీ పీజీ సెట్‌ దరఖాస్తు గడువు పెంపు

తిరుపతి (మహిళా వర్సిటీ), న్యూస్‌టుడే: తిరుపతి శ్రీ పద్మావతి మహిళా వర్సిటీలో పీజీ ప్రవేశాలకు ఏటా నిర్వహించే.. ఎస్పీఎంవీవీ-2020 పీజీసెట్‌ ప్రవేశ పరీక్ష దరఖాస్తు గడువును జూన్‌ 10 వరకు పొడిగించినట్లు వీసీ ఆచార్య జమున తెలిపారు. కొవిడ్‌-19 కారణంగా జులై లేదా ఆగస్టులో ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు.

జులై 30 నుంచి ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ ప్రవేశ పరీక్షలు
ఎస్‌ఆర్‌ఎం జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌ ఇంజినీరింగ్‌(ఎస్‌ఆర్‌ఎం జేఈఈఈ) ప్రవేశపరీక్షలు జులై 30 నుంచి ఆగస్టు 4 వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నిర్వాహకులు బుధవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆన్‌లైన్‌ విధానంలో పరీక్షలు జరుగుతాయన్నారు. ఆగస్టు 2 లేదా 3వ వారం నుంచి ప్రవేశాలకు కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామన్నారు.


ఆగస్టు 3 నుంచి ‘సత్యభామ’లో ప్రవేశ పరీక్షలు
‘సత్యభామ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ’ వర్సిటీలో ఇంజినీరింగ్‌ ప్రవేశాలకు ఆగస్టు 3 నుంచి 5 వరకు జాతీయ స్థాయి ప్రవేశపరీక్ష నిర్వహిస్తారు. ఈ మేరకు బుధవారం ఆ సంస్థ నిర్వాహకులు ఓ ప్రకటన విడుదల చేశారు. ఈ నెల 30లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఆగస్టు 8న ఫలితాలు, 12న కౌన్సెలింగ్‌ నిర్వహిస్తామని తెలిపారు.

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!



ఈనాడు, అమరావతి: డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం
డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.

Ad

జూన్‌ నుంచి ఈ-ఎస్‌ఆర్‌
ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌) స్థానంలో ఈ-ఎస్‌ఆర్‌ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్‌ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్‌ చేయనున్నారు.

టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.
►జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 11న సెకండ్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 12న ఇంగ్లీషు(9.30am- 12.45pm)
►జులై 13న మ్యాథ్స్‌(9.30am- 12.45pm)
►జులై 14న జనరల్ సైన్స్(9.30am- 12.45pm)
►జులై 15న సోషల్ స్టడీస్‌(9.30am- 12.45pm)

లాక్ డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితులలో ప్రయాణానికి

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారంగా  ఏపి పోలీసులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు
అత్యవసర ప్రయాణానికి పోలీసు వారి వెబ్ సైట్ ద్వారా ఇ పాస్ లను ఇవ్వనున్నట్టు అందుకు
ఫోటో, పూర్తి పేరు, మొబైల్ నంబర్, మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు, ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు, పూర్తి ప్రయాణ వివరాలు, ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్యను వెబ్ సైట్ లో నమోదు చేయాలి. త్వరితగతిన అందించే అత్యవసర ఇ పాస్ ను అప్లై చేసిన అభ్యర్థి యొక్క మెబైల్ ఫోన్ కు లేదా ఇ మెయిల్ ఐడికు చేరవేస్తారు, కారుకు (1+3) మాత్రమే అనుమతి ఉంటుంది. ఇ పాస్ లభించిన తరువాత  ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వెబ్ సైట్ లింక్ https://citizen.appolice.gov.in/

13, మే 2020, బుధవారం

సంక్షిప్తంగా ఉద్యోగాలు వాటి వివరాలు


Andhra Pradesh DME Covid Hospital Vacancies 550 on one year contract basis
Post: General Duty Medical Officer
Qualification: MBBS
Age: below 40 years
Mode of Selection: MBBS Marks and others details
Application Mode: Online
Last Date: May 18
Website:  https://dme.ap.nic.in

CIPET Senior Project Associate Vacancies
Post: Senior Project Assoicate
Qualification: M.Sc/M.E./M Tech Chemistry/Material Science/Polymer Science / Material Science and Engineering/Plastic Engineering/Polymer Nano Technology) with NET/GATE Qualification
Age: 35 years
Application Mode: Through E-mail
e-mail: larpmadmin@larpm.in
Last Date: May 18
Website: https://www.cipet.gov.in

అనంతపురము సర్వజన ఆసుపత్రి నందు ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఒక ఏడాది కాలము పాటు పనిచేయుట కొరకు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు గాను అన్ని అర్హతలు కలిగి ఉన్న ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియామకాలు మెరిట్ ఆధారముగా భర్తీ చేయబడును వివరల కొరకు www.ananthapuramu.ap.gov.in ను సంప్రదించవలయునని కోరడమైనది

సంక్షిప్త ఉద్యోగ వివరాలు (పూర్తి వివరాలను వెబ్ సైట్లలోని నోటిఫికేషన్ ను చూడగలరు)
Western Coal Fields
Vanacies 303
Job: Technician Apprentice
Last Date: May 19
Website: https://westerncoal.in

Heavy Engineering Limited
Job: Graduate Technician
Last Date May 27
Website: www.hecltd.com

SEBI
Job: Assistant Manager (Grade A)
Last Date: May 31
Website: www.sebi.gov.in

NIELT - Calicut
Job: Assistant, Scientist B
Last Date June 1st
Website: www.nielt.gov.in

CPET
Job :  Officer, Technician  Officer
Last Date: May 29
Website:  www.cipet.gov.in

National Fertilizers Limited
Job: Engineer and Chemist
Last  Date: 27 May
Website: www.nationalfertilizersc.com 

ITI Limited
Job: Finance, HR Executive
Last Date: May  17
Website: www.itiltd.in


హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ వార్తలు కోసం Hindupur Times


Hindupur Times | వార్తల్లో నేటి హిందూపురం

కర్నూలు జిల్లా నంద్యాలలోని రాఘవేంద్ర  కోచింగ్ సెంటర్ నందు బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటూ లాక్ డౌన్ తో నంద్యాలలో చిక్కున్న అనంతపురం,హిందూపురం, పెనుకొండ, ధర్మవరం,కదిరి,కొత్తచెరువు,గోరంట్ల,తాడిపత్రి, రామగిరి,పామిడి,గార్లదిన్న,ఓడిసి,సోమందేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 37 మంది (7మంది హిందూపురం వారు ఉన్నారు) అభ్యర్థులను అధికారులు 11.05.2020 ఉదయం నంద్యాల నుండి AP21Z/0781బస్సులో వాళ్ళ స్వస్థలాలకు తరలించారు. ఇందులో 16 మందిని అనంతపురం TTDCలో, నలుగురిని తాడిపత్రి quarentineలో, హిందూపురం వారితో సహా మిగిలిన 17 మంది, సోమందేపల్లిలోని కస్తూరిబా పాఠశాల నందు quarentineలో ఉంచారు.
మంజునాథ్,సవిత,శుభారాణి తదితరులు హిందూపురంకు చెందిన వారున్నారు.
---------------------------------------------------------------------------------------------------------------------
పోస్టాఫీసులో బ్యాంకు డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు తమకు అవసరమైన నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఖాతాదారుని బయోమెట్రిక్ ద్వారా నగదు ఇవ్వడం లేదా ఇతర అకౌంటుకు పంపడం జరుగుతోంది సరిగ్గా ఇలాంటి సౌకర్యాన్నే కల్పిస్తున్నాయి పోస్టాఫీసులు. ఇందుకోసం వ్యక్తి తమ  బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకుని ఉంటే ఊ సదుపాయాన్ని పోస్టాఫీసులో కూడా పొందవచ్చు.
---------------------------------------------------------------------------------------------------------------------
దేశ ఆర్థిక ప్రగతి గురించి దేశభక్తులు కోరుకుంటున్నట్టుగానే ప్రధాని మోదీ దేశ ప్రజలకు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకెజీ ప్రకటించడంతో పాటు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యతనివ్వాలని దేశప్రజల యొక్క బాధ్యతను గుర్తుచేశారు
--------------------------------------------------------------------------------------------------------------------------
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను వర్తించేలా  ప్రభుత్వం చర్యలు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, క్యాన్సర్, ధలసీమియా, పక్షవాతం రోగుల పింఛన్లకు మాత్రం దీనిని నుంచి మినిహాయించారు. ఆధార్ ప్రభుత్వ సర్వేల ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఒక రేషనుకు రెండు పింఛన్లను పొందుతున్న వారి వివరాలను ఇప్పటికే సేకరించి మునిసిపల్ కమీషనర్లకు మరియు ఎం పి డి వోలకు పంపింది ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ విషయమై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇన్ ఛార్జ్ రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సుమారు 51 సూపర్ మార్కెట్ లకు హిందూపురం పట్టణంలోడోర్ డెలివరీ కోసం జిల్లా కలెక్టరు అనుమతి ఇచ్చినా కొన్ని సూపర్ మార్కెట్ లో కౌంటర్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా రెండు సూపర్ మార్కెట్లపై ఎఫ్ ఐ అర్ నమోదు చేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులను రజకులను సమావేశ పరిచి ఎట్టి పరిస్థితులలో షాపులు తెరవకూడదని వినియోగదారుల ఇంటివద్దకు వెళ్ళరాదని, ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటుమన్నారు.
60 ఏళ్క పై బడిన వారు బయట తిరగకూడదని అలా కాదని బయట తిరిగిన వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నామని రెండవ సారి బయట కనబడితే వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు.
అత్యవసర సేవలు అందించే వారు మాస్కులు తప్పకుండా ధరించాలని పాల వ్యాపారస్తులు కేవలం డోర్ డెలివరీ ద్వారానే విక్రయించాలని  లేదంటే వారి పైన  కేసులు నమోదు చేస్తామని పెనుకొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=TE7Cvx6Tp4c 

Education News | విద్యావార్తలు | Hindupur Times

బీటెక్లో 10నెలలు ఇంటర్న్షిప్
* ఉన్నత విద్యామండలి కసరత్తు ఈనాడు, అమరావతి: బీటెక్పాఠ్యాంశాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతోపాటు ఇంటర్న్షిప్కాలాన్ని పెంచనున్నారు. బీటెక్లో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అదనంగా కొత్తవి తీసుకురానున్నారు. కమ్యూనికేషన్, సాఫ్ట్స్కిల్స్, మౌఖిక పరీక్షల సన్నద్ధత వంటివి నేర్పించనున్నారు. మూడు, నాలుగు ఏడాదిలో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ఆరు నెలలు ఇంటర్న్షిప్ఉండగా.. దీన్ని 10 నెలలకు పెంచనున్నారు. మొదటి రెండేళ్లు వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్షిప్ను తీసుకురానున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఏపీ ఎంసెట్జులై 27 నుంచి
* ఈసెట్‌ 24
*
ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఎంసెట్ను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్ప్రేమ్కుమార్తెలిపారు. ఇంజినీరింగ్రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ను జులై 24 నిర్వహించనున్నారు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు మే 20వరకు ఉంది. ఇప్పటి వరకు ఎంసెట్కు 2,48,614 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్కు 1,69,137 మంది, వ్యవసాయ, వైద్య విద్యకు 78,959 మంది, రెండింటికీ 518 మంది దరఖాస్తు చేశారు. 3 వేల మంది రుసుము చెల్లించినా దరఖాస్తులు సమర్పించలేదు. ఇంజినీరింగ్ను ఎనిమిది విడతలుగా, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయి.
పరీక్షలు.. తేదీలు
ప్రవేశ పరీక్ష    తేదీ
ఈసెట్‌    జులై 24
ఐసెట్‌    జులై 25
ఎంసెట్‌    జులై 27-31
పీజీ ఈసెట్‌    ఆగస్టు 2-4
ఎడ్సెట్‌    ఆగస్టు 5
లాసెట్‌    ఆగస్టు 6
పీఈసెట్‌    ఆగస్టు 7-9
-----------------------------------------------------------------------------------------------------------------------
జేఈఈ, నీట్పరీక్షల తేదీలు ఖరారు
దిల్లీ: ఇంజినీరింగ్‌, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్‌)‌, జులై 26 నీట్‌, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక వాయిదా పడిన సీబీఎస్ 10, 12 తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్‌, మే నెలలో నీట్జరగాల్సి ఉండగా.. లాక్డౌన్నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఆన్లైన్లో ఇంటర్పాఠాలు
* జూన్నుంచి అందుబాటులోకి ఈనాడు, అమరావతి: కరోనా వైరస్వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్లైన్తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఇంటర్మొదటి, రెండో ఏడాది మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. రికార్డు చేసిన వీడియోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్నుంచి ఆన్లైన్వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్జోన్లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.
రూపకల్పన ఇలా..
* ఒక పాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు(కంటెంట్‌)ను స్వీకరిస్తారు. ఎంపికైన వారి నుంచి పాఠం వీడియో రికార్డు చేస్తారు.
* తరగతిలో చెప్పే దానికి భిన్నంగా విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేందుకు పాఠ్యాంశానికి అవసరమైన వీడియోలను జత చేస్తారు.
* ఇంటర్అకడమిక్జూన్నుంచి ప్రారంభమవుతుంది. నెలకు సంబంధించి ఒక్కో సబ్జెక్టు నుంచి మూడు పాఠాలు అవసరం కానున్నాయి. ముందుగా వాటిని పూర్తి చేస్తారు.
* ఇంటర్మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.