Angrau: 11న వ్యవసాయ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలకు స్పాట్ కౌన్సెలింగ్ గుంటూరు(జిల్లాపరిషత్), న్యూస్టుడే : ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం పరిధిలోని ఇంజినీరింగ్, పాలిటెక్నిక్ కళాశాలల్లో వ్యవసాయం, సేంద్రియ వ్యవసాయం, విత్తన సాంకేతిక పరిజ్ఞానం కోర్సుల్లో 2023-24 ఏడాదికి మిగిలిన సీట్ల భర్తీకి అక్టోబర్ 11న స్పాట్ కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు తెలిపారు. గుంటూరుకు సమీపంలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం లాంఫాం పాలిటెక్నిక్ విభాగంలో కౌన్సెలింగ్ ఉంటుందని, పూర్తి వివరాల కోసం angrau.ac.in వెబ్సైట్ని చూడాలని సూచించారు. * సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలు ఆచార్య ఎన్.జి.రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆన్లైన్లో నిర్వహించే 2 నెలల వ్యవధి వ్యవసాయ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వర్సిటీ రిజిస్ట్రార్ జి.రామారావు తెలిపారు. ఆయా కోర్సుల్లో ప్రవేశాలకు రూ.1500 చొప్పున ఫీజు చెల్లించి పేర్లు నమోదు...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications