Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

26, ఫిబ్రవరి 2023, ఆదివారం

EWS Age exemption ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితి పెంపు

సీఎం వైఎస్ జగన్కు ఓసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కరుణాకరరెడ్డి కృతజ్ఞతలు సాక్షి, అమరావతి/ కృష్ణలంక(విజయవా డతూర్పు): రాష్ట్రంలో అగ్రవర్ణ పేదల అభివృద్ధి, సంక్షేమం కోసం ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లను ఐదేళ్లు పొడిగించడం, ప్రభుత్వ ఉద్యోగాలకు పోటీ పడే అభ్యర్థులకు వయో పరిమితిని ఐదేళ్లు సడలించడం హర్షణీయమని ఓసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జి.కరుణాకరరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు అవకాశం కల్పించిన ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. దేశంలోని పలు రాష్ట్రాల్లో ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అమలు చేస్తున్నప్పటికీ ఎక్కడా వయోపరిమితి సడలించలేదని ఆయన పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం ఇక నుంచి వెలువడే అన్ని ప్రభుత్వ పోటీ పరీక్షలకు ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు వయోపరిమితిని 34 నుంచి 39 సంవత్సరాలకు పెంచుతూ ఉత్తర్వులు జారీ చేయడంతో వేలాది మంది నిరుద్యోగ ఓసీ అభ్యర్థులు లబ్ధి పొందే అవకాశం ఉందని తెలిపారు. కాపు, రెడ్డి, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, వైశ్య కార్పొరే షన్లను ఈడబ్ల్యూఎస్ శాఖ పరిధిలోకి తీసుకు రావడం శుభపరిణామమని అన్నారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల నిబంధనలను రాష్ట్రంలో సరళతరం చేసి రూ.8లక్షల ఆదాయ పరిమితిని మాత్రమే పరిగణలోకి తీసుకునేలా ఉత్తర్వులు ఇవ్వడం నిరుపేద ఓసీలకు మేలు చేస్తుందని తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

*సీపీటీ ఉత్తీర్ణులైతేనే గ్రూప్‌-2, 3 నియామకాలకు అర్హత✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఆధ్వర్యంలో గ్రూప్‌-2, 3 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఇక నుంచి కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష(సీపీటీ) ఉత్తీర్ణులైతేనే అర్హత సాధిస్తారని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీపీఎస్సీ నిర్వహించే సీపీటీ లేదంటే ఆంధ్రప్రదేశ్‌ సాంకేతిక విద్య, శిక్షణ బోర్డు, యూజీసీ గుర్తింపు పొందిన రాష్ట్ర, కేంద్ర విశ్వవిద్యాలయాల ద్వారా నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణత సాధించి ఉండాలని పేర్కొంది. 100 మార్కులకు కంప్యూటర్‌ ప్రొఫిషియన్సీ పరీక్ష నిర్వహిస్తారని.. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులైతే 30, బీసీలకు 35, ఓసీలకు 40 చొప్పున కనీస ఉత్తీర్ణత మార్కులుగా నిర్ణయించారు. పార్ట్‌-ఏ విభాగంలో కంప్యూటర్ల పరిచయం, సాఫ్ట్‌వేర్‌ రకాలు, ఆపరేటింగ్‌ విధానాలు, విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌, లినక్స్‌, మ్యాక్‌ ఓఎస్‌, ఇంటర్నెట్‌ కాన్సెప్ట్స్‌, ఎలక్ట్రానిక్‌ మెయిల్‌, వరల్డ్‌వైడ్‌ వెబ్‌ తదితర అంశాలపై 20 మార్కులకు.. పార్ట్‌ -బీలో ఆఫీస్‌ సూట్‌, ఆఫీస్‌ అప్లికేషన్లు, ఎంఎస్‌ వర్డ్‌, స్ప్రెడ్‌ షీట్‌, ప్రజంటేషన్‌ తదితర అంశాలకు సంబంధించి 80 మార్కులకు ప్రశ్నలు ఉంటాయి. గ్రూప్‌-1 ద్వారా నేరుగా జరిపే నియామకాలకు ఈ నిబంధన వర్తించదని సాధారణ పరిపాలన శాఖ కార్యదర్శి పోలా భాస్కర్‌ పేర్కొన్నారు.

*దివ్యాంగ విద్యార్థులకు**భత్యం విడుదల✍️📚*

*🌻ఈనాడు, అమరావతి*: ప్రత్యేక అవసరాలు గల పిల్లలకు గృహ ఆధారిత విద్యా భత్యం, రవాణా భత్యం కింద రూ.5.29 కోట్లు విడుదల చేసి నట్లు సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ (ఎస్పీడీ) సురేశ్కు మార్ తెలిపారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రత్యేక అవసరాలు గల విద్యార్థుల తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాలకు నిధులు జమ చేస్తామని వెల్లడించారు. ఇంటి వద్ద చదువుకుంటున్న 1-8 తరగతులకు చెందిన 5,559 మంది విద్యార్థులకు రూ. 3వేల చొప్పున అందిస్తున్నారు. పాఠశాల లకు వెళ్లలేని ప్రత్యేక అవసరాల పిల్లలకు సహిత విద్యా వనరుల ఉపాధ్యాయులు వెళ్లి ఇంటి వద్దే బోధన చేస్తున్నారని, 1-10 తరగతులు చదు వుతున్న విద్యార్థులకు రవాణా భత్యం అందిస్తున్నామని ఎస్పీడీ వెల్లడిం చారు. ప్రాథమిక స్థాయిలో 9,886 మంది, మాధ్యమిక స్థాయిలో 2,220 మంది విద్యార్థులు లబ్ధి పొందుతున్నారు. దివ్యాంగ బాలికలకు రూ. 2వేల చొప్పున ఉపకారవేతనం ఇస్తున్నామని తెలిపారు.

*8 నుంచి టెన్త్ ప్రీ ఫైనల్స్*

🌻ఏలూరు (ఆర్ఆర్పేట): పాఠశాల విద్యాశాఖ కమి షనర్ ఉత్తర్వుల మేరకు వచ్చేనెల 8వ తేదీ నుంచి 16 వరకూ 10వ తరగతి విద్యార్థులకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహించనున్నట్లు ఏలూరు జిల్లా పాఠ శాల విద్యాశాఖాధికారి ఎన్వీ రవిసాగర్ ఓ ప్రకట నలో తెలిపారు.

4వ ఫార్మేటివ్ పరీక్షలకు బదులుగా వీటిని నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...