ఒక వ్యక్తి లేదా సంస్థ ఆదాయంపై విధించిన పన్ను, వారి ఆదాయ లేదా లాభాలను 
బట్టి మారుతుంది. చట్ట ప్రకారం వ్యక్తులు లేదా సంస్థలు ఆదాయ పన్ను 
రిటర్న్స్ దాఖలు చేయాలి. ఇందులో స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు ఉంటుంది. 
ఆదాయపు పన్ను ప్రకారం మినహాయించడం లేదా వ్యక్తి పెట్టిన పెట్టుబడి 
స్టాండర్డ్ డిడక్షన్. స్టాండర్డ్ డిడక్షన్ అనేది స్థిర మినహాయింపు సంస్థతో 
ఉన్న స్థానంతో సంబంధం లేకుండా వేతనం నుండి తీయడం జరుగుతుంది. 
స్థిర డబ్బు వార్షిక వేతనం నుండి తీసివేయబడుతుంది. తద్వారా పన్ను 
విధించదగిన ఆదాయాన్ని తగ్గిస్తుంది. అప్పుడు చెల్లించే పన్ను మొత్తం 
తగ్గుతుంది. శాలరైడ్ లేదా పెన్షన్దారు స్టాండర్డ్ డిడక్షన్ పొందవచ్చు. 
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపుః-
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంపు
రాబోయే బడ్జెట్లో వేతనం పొందే పన్ను చెల్లింపుదారులు, పెన్షనర్లకు 
అందుబాటులో ఉన్న స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని 30 శాతం నుండి 35 శాతం 
పెంచనున్నట్లు ప్రభుత్వం ఆలోచిస్తోందని తెలుస్తోంది. అయితే పరిమిత ఆర్థిక 
హెడ్ రూమ్ ఇచ్చిన ఆదాయపు పన్ను స్లాబ్స్ మారకుండా ఉండవచ్చునని అధికారులు 
తెలిపారు. 
ప్రస్తుతం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి రూ.50,000గా ఉంది. అయితే దీనిని 
పెంచాలని పరిశ్రమ వర్గాలు కోరుతున్నాయి. 
వ్యక్తిగత పన్నులపై పరిశ్రమ నుండి పలు సూచనలు ఉన్నాయి. ఈ సంవత్సరం ఒక 
సాధారణ డిమాండ్ స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి పెంచడం. ముఖ్యంగా కరోనా 
కారణంగా వైద్య ఖర్చులు పెరిగాయని, పెరిగిన ధరలను పరిగణలోకి తీసుకోవాలని 
ఆర్థికమంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారులు చెబుతున్నారు. ఈ పెంపు 30 
శాతం నుండి 35 శాతం పెంచాలనే ప్రతిపాదన ఉంది. 
2019లో రూ.50,000కు పెంపుః-
2019లో రూ.50,000కు పెంపు
2018లో స్టాండర్డ్ డిడక్షన్ రూ.40,000గా ఉంది. గతంలో దీని పరిమితిని 2019లో
 రూ.50,000కు పెంచారు. ఇప్పుడు మరోసారి దీనిని పెంచాలనే ప్రతిపాదనలు 
ఉన్నాయి. అయితే తాజా పన్ను వసూళ్ల పరిస్థితిని బట్టి ప్రతిపాదన తుది 
ఆమోదానికి లోబడి ఉంటుందని చెబుతున్నారు. కొత్త పన్ను విధానాన్ని ఎంచుకున్న 
పన్ను చెల్లింపుదారులకు ఎలాంటి స్టాండర్డ్ డిడక్షన్ మినహాయింపు అందుబాటులో 
లేదు. 
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిః-
స్టాండర్డ్ డిడక్షన్ పరిమితి
ప్రతి సంవత్సరం స్టాండర్డ్ డిడక్షన్ పరిమితిని పునఃపరిశీలించడాన్ని 
ప్రభుత్వం ఒక క్రమ పద్ధతిలో చేయాలని బిగ్ ఫోర్ అకౌంటింగ్ సంస్థ డెలాయిట్ 
భాగస్వామి సుధాకర్ సేతురామ అన్నారు. పెరిగిన ద్రవ్యోల్భణం, వర్క్ ఫ్రమ్ 
హోమ్ కారణంగా ఖర్చులు పెరిగాయని, ఇందుకు అనుగుణంగా కనీసం 25 శాతం వరకు 
పెంచాలన్నారు. ఫిబ్రవరి 1వ తేదీన కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ 
2022-23 ఆర్థిక సంవత్సరానికి గాను బడ్జెట్ను ప్రవేశ పెడుతున్నారు.
Gemini Internet
కామెంట్లు