సాక్షి, అమరావతి: ఇంటర్ బోర్డు నిర్వహించే ఎథిక్స్-హ్యూమన్ వాల్యూస్, పర్యావరణ విద్య సబ్జెక్టులపై నిర్వహించే పరీక్షలలో పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థులందరూ తప్పనిసరిగా అర్హత సాధించాల్సి ఉంటుందని ఇంటర్ బోర్డు తెలిపింది. ఈ పరీక్షలు ఈ నెల 15, 17 తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగుతాయి. ప్రస్తుత విద్యాసంవత్సరపు ఇంటర్ విద్యార్థులు తమ పబ్లిక్ ఎగ్జామినేషన్ రిజిస్టర్డ్ నంబర్ పరీక్షలు రాయాలని ఇంటర్ బోర్డు కార్యదర్శి ఎం.వి.శేషగిరి బాబు మంగళవారం తెలిపారు. ఇంతకు ముందరి పరీక్షల్లో ఫెయిలైన పాత విద్యార్థులు తమ పాత హాల్టికెట్ నంబర్లో పరీక్షలకు హాజరుకావాలన్నారు. ఈ పరీక్షలకు ఎలాంటి ఫీజు ఉండదన్నారు. ఈ ఎథిక్స్- హ్యూమన్ వాల్యూస్, పర్యావరణ విద్య సబ్జెక్టుల పరీక్షల్లో అర్హత సాధించని వారికి ఇంటర్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన పాస్ సర్టిఫికెట్లు జారీ కావని చెప్పారు. ------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్...
అప్లికేషన్ల కోసం సంప్రదించండి హిందూపూర్ ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications