అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
19, అక్టోబర్ 2021, మంగళవారం
18, అక్టోబర్ 2021, సోమవారం
APPSC Recruitment 2021: ఆంధ్రప్రదేశ్ శాసనసభలో ఉద్యోగాలు... దరఖాస్తు చేయండి ఇలా
APPSC Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్లోని నిరుద్యోగులకు శుభవార్త. ఏపీలో ఖాళీల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేస్తోంది ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC). ఏపీ శాసనసభలో ఖాళీల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
APPSC Recruitment 2021: నోటిఫికేషన్ వివరాలు
భర్తీ చేసే పోస్టు పేరు | తెలుగు రిపోర్టర్ |
మొత్తం ఖాళీలు | 5 |
దరఖాస్తు ప్రారంభం | 2021 అక్టోబర్ 18 |
దరఖాస్తుకు చివరి తేదీ | 2021 నవంబర్ 8 |
APPSC Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హతలు- ఏదైనా డిగ్రీ పాస్ కావాలి. షార్ట్ హ్యాండ్, తెలుగు టైప్ రైటింగ్లో హయ్యర్ గ్రేడ్ పాస్ కావాలి.
వయస్సు- 2021 జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 నుంచి 42 ఏళ్లు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 ఏళ్లు, దివ్యాంగులకు 10 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.
దరఖాస్తు ఫీజు- రూ.250 అప్లికేషన్ ఫీజు, రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లించాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు, దివ్యాంగులు, ఎక్స్-సర్వీస్మెన్ రూ.120 ఎగ్జామినేషన్ ఫీజు చెల్లిస్తే చాలు.
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ద్వారా ఎంపిక చేస్తారు.
వేతనం- రూ.37,100 బేసిక్ వేతనంతో మొత్తం రూ.91,450 వేతనం లభిస్తుంది.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
APPSC Recruitment 2021: అప్లై చేయండి ఇలా
Step 1- అభ్యర్థులు ముందుగా https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేయాలి.
Step 2- హోమ్ పేజీలో One Time Profile Registration పైన క్లిక్ చేయాలి.
Step 3- ఆ తర్వాత New Registration పైన క్లిక్ చేయాలి.
Step 4- అభ్యర్థి పేరు, పుట్టిన తేదీ, విద్యార్హతల వివరాలతో రిజిస్ట్రేషన్ చేయాలి.
Step 5- యూజర్ ఐడీ జనరేట్ అవుతుంది.
Step 6- ఆ తర్వాత లాగిన్ అయి పాస్వర్డ్ సెట్ చేసుకోవాలి.
Step 7- ఆ తర్వాత https://psc.ap.gov.in/ వెబ్సైట్ ఓపెన్ చేసి వన్టైమ్ ప్రొఫైల్ రిజిస్ట్రేషన్ నెంబర్తో లాగిన్ కావాలి.
Step 8- Online Application Submission పైన క్లిక్ చేయాలి.
Step 9- యూజర్ ఐడీ, మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి లాగిన్ చేయాలి.
Step 10- పోస్టు పేరు సెలెక్ట్ చేసి దరఖాస్తు ప్రక్రియ పూర్తి చేయాలి.
Step 11- అప్లికేషన్ ఫామ్ డౌన్లోడ్ చేసుకొని భద్రపర్చుకోవాలి.
ONGC Recruitment 2021: బీటెక్ పాస్ అయినవారికి ఓఎన్జీసీలో 309 ఉద్యోగాలు... అప్లై చేయండి ఇలా
ఈ పోస్టులే కాకుండా 4 డీపీఆర్ఓ పోస్టులకు 2021 అక్టోబర్ 19న, 6 అసిస్టెంట్ డైరెక్టర్ పోస్టులకు 2021 అక్టోబర్ 22న, 6 అసిస్టెంట్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, 29 అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్స్, 1 ఫుడ్ సేఫ్టీ ఆఫీసర్, 2 హాస్టల్ వెల్ఫేర్ ఆఫీసర్ గ్రేడ్ 2 పోస్టులకు నవంబర్ 12న దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి గల అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) అధికారిక వెబ్సైట్ https://psc.ap.gov.in/ ఫాలో కావాలి.
Online Course : ఇంటి నుంచే చదివేయండి.. ఉపాధి అవకాశలిచ్చే ఆన్లైన్ కోర్సుల వివరాలు
Online Courses : కోవిడ్ తరువాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్లైన్ విద్య సౌలభ్యం అందరికీ అర్థం అయ్యింది. ప్రముఖ కంపెనీలు, యూనివర్సీటీలు (Universities) ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు కల్పించే ఆన్లైన్ కోర్సులను ఇంటి నుంచే నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి
Online Course : ఇంటి నుంచే చదివేయండి.. ఉపాధి అవకాశలిచ్చే ఆన్లైన్ కోర్సుల వివరాలు
Online Courses : కోవిడ్ తరువాత విద్యావిధానంలో చాలా మార్పులు వచ్చాయి. ఆన్లైన్ విద్య సౌలభ్యం అందరికీ అర్థం అయ్యింది. ప్రముఖ కంపెనీలు, యూనివర్సీటీలు (Universities) ఆన్లైన్ కోర్సులను ప్రవేశపెట్టాయి. ప్రస్తుతం ఉపాధి అవకాశాలు కల్పించే ఆన్లైన్ కోర్సులను ఇంటి నుంచే నేర్చుకొనే అవకాశం కల్పిస్తున్నాయి. వాటి వివరాలు తెలుసుకోండి
కోర్సుకు అర్హతలు
1. అభ్యర్థులు 12 వారాల కోర్స్ వ్యవధిలో సోమవారం నుంచి శుక్రవారం వరకు హాజరు కావడానికి పూర్తి స్థాయిలో అందుబాటులో ఉండాలి.
2. ట్రైనింగ్ కోర్స్ తీసుకున్న తర్వాత ఫుల్ టైం జాబ్ చేయగలగాలి.
3. దరఖాస్తుదారుల్లో క్లౌడ్ కంప్యూటింగ్ లో కెరీర్ ని తప్పకుండా ప్రారంభించాలనే ఆసక్తి ఉండాలి.
TCS Careers : "టీసీఎస్ పిలుస్తోంది".. నిరుద్యోగులకు ఉచిత శిక్షణ.. ఉపాధి అవకాశాలు
4. అభ్యర్థులు హైస్కూల్ డిప్లొమా లేదా జనరల్ ఎక్వివలెన్సీ డిప్లొమా (GED) కలిగి ఉండాలి.
అంతేకాకుండా ఈ ప్రోగ్రామ్.. పార్టిసిపెంట్లను క్లౌడ్ ప్రాక్టీషనర్ సర్టిఫికేషన్ పరీక్షకు సిద్ధం చేస్తుంది. ఈ ఎగ్జామ్ ఖర్చులను కూడా భరిస్తుంది. ఇక్కడ నేర్చుకున్న క్లౌడ్ స్కిల్స్ సర్టిఫికేషన్ ఎక్కడైనా సరే వాలీడ్ గా ఉంటుంది. ఈ ప్రోగ్రామ్ చెన్నై, కోల్కతా, ముంబై, పూణే, తిరువనంతపురం సిటీల నుంచి నిర్వహిస్తారు. ఎడ్యూబ్రిడ్జి లెర్నింగ్, ఎడ్యూజాబ్స్ అకాడమీ వంటి ఐదు స్థానిక విద్యా సంస్థలతో కలిసి వర్చువల్ ట్రైనింగ్ అందించనున్నారు.
ఈ కోర్సు గురించి మరిన్ని వివరాల కోసం https://aws.amazon.com/training/restart/ లింక్ ను విజిట్ చేయవచ్చు.
IIIT ఢిల్లీలో కంప్యూటర్ సైన్స్ ఉపాధ్యాయులకు ప్రత్యేక కోర్సు
సైన్స్ఢిల్లీలోని ఇంద్రప్రస్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (Indraprastha Institute of Information Technology) ప్రొఫెసర్ల కోసం కంప్యూటర్ సైన్స్లో సర్టిఫికెట్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. ఈ కోర్సు కోవిడ్ ప్రోటోకాల్ నిబంధనలకు అనుగుణంగా వర్చువల్ విధానంలో యూనివర్సిటీ అందిస్తుంది. ఈ కోర్సు బీఈ/ బీటెక్ అండ్ నాన్- ఇంజనీరింగ్ విభాగాలు బీఎస్సీ/ బీసీఏ / ఎంసీఏ నేపథ్యాల నుంచి వచ్చివారు చేసేందుకు రూపొందించిన సర్టిఫికెట్ ప్రోగ్రామ్ (Certificate Program) ముఖ్యంగా కంప్యూటర్ సైన్స్ (Computer Science) విభాగాల్లో ఉపాధ్యాయులు బోధనా సామర్థ్యాలు మెరుగు పర్చుకొనేందుకు రూపొందించిన కోర్సుగా యూనివర్సిటీ తెలిపింది. ఈ కోర్సు చేసేందుక ఇతర యూనివర్సిటీలు తమ అధ్యాపకులను ప్రోత్సహిస్తున్నాయి. అంతే కాకుండా అసోసియేషన్ ఫర్ కంప్యూటింగ్ మిషనరీ (Association for Computing Machinery) ఈ కోర్సు చేసేందుకు అధ్యాపకులను పాక్షిక ఆర్థిక చేయూత అందించనుంది.
వారానికి 6 నుంచి 8 గంటల బోధన..
- ఈ
కోర్సు బోధించేందుకు ఆయా రంగాల్లో స్పెషలిస్టులను ఎంపిక చేసి బోధన
అందించస్తారు. ముఖ్యంగా ఏఐసీటీ (AICTE) సెలబస్ నిబంధనలకు అనుగుణంగా
పాఠ్యాంశాలను బోధిస్తున్నారు.
- ఈ మాడ్యుల్ బోధనకు ఐఐటీ, ఐఐఐటీ విద్యావేత్తలను నియమించనున్నారు. ఈ కోర్సు మొదటి మాడ్యూల్ జనవరి 2022న ప్రారంభమవుతుంది. ఈ కోర్సు రెగ్యులర్ సెమిస్టర్లో పాఠ్యాంశాలు ఆన్లైన్ మాడ్యూల్ (Online Module)లను కలిగి ఉన్నందున ఫ్యాకల్టీ ఎప్పుడైనా సెలవు తీసుకోవాల్సిన అవసరం లేదు.
- -ప్రతి వారం, ప్రతి వారం దాదాపు 5 నుంచి 6 గంటల మొత్తం ప్రయత్నం కోసం, కొన్ని వారపు ప్రాక్టీస్ పనితో పాటు ఒక సింగిల్ సెషన్ జరుగుతుంది. ఒక ప్రోగ్రామ్ పూర్తి చేసిన తర్వాత హాజరైనవారు సర్టిఫికెట్ పొందుతారు.
- ఈ కోర్సులో ప్రతీ మాడ్యూల్ ధర రూ. 10,000 అదనంగా జీఎస్టీ చెల్లించాలి. ఈ ఫీజులోనే ఆన్లైన్ క్లాస్లు, మెటీరియల్ (Material) అందిస్తారు.
- మాడ్యూల్ పూర్తి చేసుకొన్న వారు వారి డిపార్ట్మెంట్/ ఇన్స్టిట్యూట్ ద్వారా నిమినేట్ చేయబడతారు. వారానిఇక 6 నుంచి 8 గంటల పాటు కోర్సు విధానాన్ని నిర్ణయిస్తారు.
ట్రిపుల్ఐటీ హైదరాబాద్లో కొత్త కోర్సు..
మారుతున్న టెక్నాలజీ, మార్కెట్ అవసరాలకు అనుగుణంగా కొత్త కొత్త కోర్సులను ప్రవేశపెడుతున్నాయి ప్రతిష్టాత్మక సంస్థలు. తాజాగా హైదరాబాద్లోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ట్రిపుల్ఐటీ) సరికొత్త కోర్సుకు శ్రీకారం చుట్టింది. ప్రొడక్ట్ డిజైన్ అండ్ మేనేజ్మెంట్లో రెండేళ్ల ఎంటెక్ ప్రోగ్రామ్ను ప్రారంభించింది. అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు ఐఐటీ హైదరాబాద్ అధికారిక వెబ్సైట్ www.pdm.iiit.ac.in ద్వారా నవంబర్ 10లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరింది. టెక్నాలజిస్ట్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, ప్రొడక్ట్ మేనేజర్లు, స్టార్టప్ ఫౌండర్లు, ఎంటర్ప్రెన్యూర్లను తయారు చేయడమే లక్ష్యంగా ఈ కోర్సును ఆవిష్కరించింది.
ఈ ప్రోగ్రామ్ కొత్త ఉత్పత్తులు, కొత్త స్టార్టప్ (Startup) లు లేదా కొత్త ఐటీ కొలువుల సృష్టికి దారి తీస్తుంది. ఎంటెక్ ప్రోగ్రామ్ మొదటి సంవత్సరంలో నూతన టెక్నాలజీపై అవగాహన, టెక్నాలజీ కన్వర్జెన్స్, డిజైన్, మార్కెట్లు & బిజినెస్, ప్రొడక్ట్ డిజైన్, డెవలప్మెంట్, మేనేజ్మెంట్, ఎమర్జింగ్ టెక్నాలజీస్పైలోతైన అవగాహన కల్పిస్తారు. ఇక, రెండో సంవత్సరంలో క్రియేటింగ్ ప్రొడక్ట్స్, డీప్టెక్నాలజీస్లోకి ఐడియాలు ట్రాన్స్లేట్ చేసుకోవడం, ప్రోగ్రామ్ ప్రాజెక్ట్ మార్కెట్ వంటి సబ్జెక్ట్లపై అవగాహన కల్పిస్తారు.
ఇలా దరఖాస్తు చేసుకోండి..
Step 1 : ముందుగా www.pdm.iiit.ac.in క్లిక్ చేసి వెబ్ సైట్ కు వెళ్లాలి.
Step 2 : అందులో టాప్ లో అడ్మిషన్స్ అనే ఆప్షన్ కనపడుతుంది. దానిపై క్లిక్ చేయాలి.
Step 3 : కొత్త పేజీ ఓ పెన్ అయిన తర్వాత బాటమ్ లో అప్లై(Apply)అనే ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
Step 3 : తదనంతరం New Users click here to register పైన క్లిక్ చేసి వ్యక్తిగత వివరాలను నమోదు చేసి దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయులకు బ్రిడ్జ్ కోర్సులు తప్పనిసరి: ఎన్సీటీఈ తాజా నిర్ణయం
ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుల శిక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం బ్రిడ్జ్ కోర్సులను తప్పనిసరి చేసింది. ప్రాథమిక ఉపాధ్యాయుడిగా నియామకం పొందిన రెండేళ్లలోపు ప్రాథమిక విద్యలో ఆరు నెలల బ్రిడ్జ్ కోర్సు (Bridge Course) చేయాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధించి నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ (National Council for Teacher Education) మార్గదర్శకాలు విడుదల చేసింది.
అంతే కాకుండా పలు సవరణలు చేసింది. "కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేషన్ మరియు బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ (B.Ed.)" లేదా "కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన గ్రేడ్ మరియు మూడు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ B.Ed.-M.Ed , ”కనీస అర్హతగా మార్పులు చేసింది.
పాత నిబంధన..
సవరణ చేస్తూ నోటిఫికేషన్ జారీ..
ఇక నుంచి 6 నుంచి 8 తరగతులకు ఉపాధ్యాయులుగా నియమించబడాలంటే, అభ్యర్థులు కనీసం 50% మార్కులతో గ్రాడ్యుయేట్-స్థాయి డిగ్రీ మరియు ఒక సంవత్సరం BEd ప్రత్యేక విద్యను కలిగి ఉండాలి లేదా కనీసం 55% మార్కులతో పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తత్సమాన గ్రేడ్ మరియు మూడు సంవత్సరాల ఇంటిగ్రేటెడ్ ఉండాలి B.Ed.- M.Ed. ప్రభుత్వం ఉచిత మరియు నిర్బంధ విద్యాహక్కు చట్టం, 2009 (2009 లో 35) యొక్క సెక్షన్ 23 లోని సెక్షన్ 23 (1) మరియు నోటిఫికేషన్ నంబర్ S.O ని అనుసరించి తన అధికారాలను అమలు చేస్తుంది. 750 (E), 31 మార్చి, 2010 తేదీన, ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
ఒక్కసారి టెట్ పాసైతే చాలు..
ఇంతలో, ప్రభుత్వం ఉపాధ్యాయుల అర్హత పరీక్ష (Teachers Eligibility Test) సర్టిఫికెట్ల చెల్లుబాటును కూడా పొడిగించింది. ఇంతకు ముందు, చెల్లుబాటు ఏడేళ్లపాటు ఉండేది, కానీ ఇది 2011 నుంచి అమలు అయ్యేలా టెట్ సర్టిఫికెట్ వ్యాలిడిటీని జీవితకాలం వరకు చెల్లుబాటు అయ్యేలా మార్చారు. TET కేంద్ర మరియు రాష్ట్ర స్థాయిలో నిర్వహించబడుతుంది. పాఠశాలల్లో బోధించడానికి సిద్ధంగా ఉన్నవారు CTET లేదా రాష్ట్ర-నిర్దిష్ట TET ని క్లియర్ చేయాలి. సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) సెంట్రల్ టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్ (CTET) నిర్వహిస్తుంది, దీని ఆధారంగా, ప్రాథమిక పాఠశాలల్లో టీచింగ్ పోస్టుల కోసం అభ్యర్థులను నియమించారు.
గుడ్ న్యూస్.. రైతులందరికీ ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఇలా పొందండి!
మీరు వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీరు ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. అయితే దీని కోసం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ వస్తుంది.
ప్రధానాంశాలు:
- రైతులకు తీపికబురు
- ప్రతి నెలా డబ్బులు
- ఈ స్కీమ్లో చేరండి
కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులో ఉంచింది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్లో చేరడం వల్ల రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. దీని కోసం రైతులు ఇప్పుడే స్కీమ్లో చేరాలి. ప్రతి నెలా కొంత డబ్బు కట్టాలి.
వయసు ప్రాతిపదికన నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి రావొచ్చు. ఇది పెద్ద మొత్తం ఏమీ కాదు. అందుకే రైతులు సులభంగానే ఈ పథకంలో చేరొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి.
17, అక్టోబర్ 2021, ఆదివారం
Pushpa: బన్నీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్
ఇప్పుడు మన హీరోల రేంజ్ పెరిగింది. ఒక్క తెలుగు బాషలోనే కాదు.. దేశం మొత్తం బాషలలో వస్తున్న మన సినిమాలను ప్రపంచంలో ఎక్కడెక్కడ మన దేశస్థులు ఉన్నారో అక్కడా.. అన్ని బాషలలో విడుదల..
Pushpa: ఇప్పుడు మన హీరోల రేంజ్ పెరిగింది. ఒక్క తెలుగు బాషలోనే కాదు.. దేశం మొత్తం బాషలలో వస్తున్న మన సినిమాలను ప్రపంచంలో ఎక్కడెక్కడ మన దేశస్థులు ఉన్నారో అక్కడా.. అన్ని బాషలలో విడుదల చేస్తున్నారు. తెలుగు సినిమా ఇప్పుడు ఇండియాలోనే బిగ్గెస్ట్ మార్కెట్ స్థాయికి వెళ్ళింది. ఇక, బన్నీ విషయానికి వస్తే.. ఈ ఐకాన్ స్టార్ ఇప్పుడు పుష్ప సినిమాను తన కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా తీసుకురాబోతున్నాడు.
Pushpa: శ్రీవల్లి సాంగ్.. మరోసారి యూట్యూబ్లో పుష్ప మేనియా!
తొలి నుండి పాన్ ఇండియా స్థాయికి ప్లాన్ చేసిన ఈ సినిమా అనూహ్యంగా మధ్యలో రెండు భాగాలు కాగా.. అదే స్థాయిలో సినిమాని కూడా మిగతా ఇతర బాషా నటులను నింపి పాన్ ఇండియా పేరుకు తగ్గట్లే మార్చేశాడు దర్శకుడు సుకుమార్. ఇప్పటి వరకు బన్నీ సినిమాకి తెలుగుతో పాటు తమిళ, మలయాళంలో మార్కెట్ ఉండేది. కానీ, ఇప్పుడు తొలిసారి ఇండియా వైడ్ మార్కెట్ ను టార్గెట్ చేశాడు. అంతేకాదు.. ఓవర్సీస్ లో కూడా బన్నీ కెరీర్ లోనే లేనంతగా కనీవినీ ఎరుగని స్థాయిలో పుష్ప ఫస్ట్ పార్ట్ విడుదలకి సన్నాహాలు చేస్తున్నారు.
Pushpa: రిలీజ్ డేట్ ఇచ్చినా.. బన్నీ నుండి ప్రచారం లేదేంటి?
పుష్ప ఫస్ట్ పార్ట్ కి సంబంధించి హంసిని ఎంటర్టైన్మెంట్స్, క్లాసిక్ ఎంటర్టైన్మెంట్స్ వారు యూఎస్ మార్కెట్ లో అన్ని భారతీయ భాషల్లో విడుదల చేయనున్నారు. అల్లు అర్జున్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ రిలీజ్ గా, అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ విడుదలకి ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తుంది. డిసెంబర్ 16 నుంచే ప్రీమియర్స్ మొదలు కానుండగా ఇదే విషయాన్ని మేకర్స్, డిస్టిబ్యూటర్స్ తెలియజేస్తూ ఈ మేరకు ఒక పోస్టర్ ను కూడా విడుదల చేశారు.
WhatsApp Loan: మీకు డబ్బు అవసరం పడిందా.. వాట్సప్లో హాయ్ అని చెప్పండి.. పదిలక్షల వరకూ లోన్ పొందండి!
స్పందించే ముందు జాగ్రత్త వహించండి
టెక్నాలజీ పెరిగిన తరువాత రుణాలు పొందడం కూడా సులభంగా మారిపోయింది. ఇప్పుడు ఎన్నో యాప్లు రుణాలు ఇవ్వడానికి అందుబాటులో ఉన్నాయి. వాట్సప్లో హాయ్ అని చెబితే చాలు మీకు రుణం ఇస్తామంతోంది ఓ సంస్థ ఎలానో తెలుసుకుందాం.
Business Loan: మీకు రూ.10 లక్షల వరకు రుణం అవసరమైతే, ఇది మీ కోసం కొన్ని నిమిషాల పని. మీరు వాట్సప్ (WhatsApp) లో హాయ్ చెప్పాలి. మీకు రూ. 10 లక్షల వరకు రుణం లభిస్తుంది.
మొదటిసారి అలాంటి సదుపాయం
భారతదేశంలో మొట్టమొదటిసారిగా, ఇటువంటి సదుపాయాన్ని నాన్-బ్యాంకింగ్ ఫైనాన్షియల్ కంపెనీ (NBFC) ఇండియా ఇన్ఫోలిన్ (IIFL) ప్రారంభించింది. 10 లక్షల వ్యాపార రుణం వెంటనే ఇచ్చే పథకాన్ని ప్రారంభించింది. మీరు వాట్సప్ (WhatsApp)లో ఈ లోన్ పొందుతారు. కంపెనీ ప్రకారం, వాట్సాప్ వినియోగదారులు ఈ రుణాన్ని కొన్ని నిమిషాల్లో పొందవచ్చు.
కనీస పత్రాలు అవసరం
దేశంలో ఈ పథకాన్ని ప్రారంభించిన మొదటి కంపెనీ ఐఐఎఫ్ఎల్ అని కంపెనీ తెలిపింది. దీని కోసం కనీస పత్రాలు అవసరం. ఈ రుణం కోసం కంపెనీ కృత్రిమ మేధస్సు (AI) ని ఉపయోగిస్తుంది. దీని ద్వారా, వినియోగదారుల వివరాలు తనిఖీ చేయబడతాయి. దీని ద్వారా రుణగ్రహీత యొక్క దరఖాస్తు .. KYC మాత్రమే పూర్తి చేయబడతాయి. దీనితో పాటు, బ్యాంక్ ఖాతా కూడా దీని ద్వారా ధృవీకరించబడుతుంది.
కనీసం 10 వేల రూపాయల రుణం
ఈ పథకం కింద, మీరు కనీసం 10 వేలు మరియు గరిష్టంగా 10 లక్షల రూపాయల వరకు రుణం తీసుకోవచ్చు. మీరు ఈ రుణాన్ని 5 సంవత్సరాలలో అంటే 60 నెలల్లో తిరిగి చెల్లించాలి. మీ లోన్ మొత్తం 24 గంటల్లోపు మీ అకౌంట్లో జమ చేస్తారు. ఈ లోన్ 10 నిమిషాల్లో ఆమోదం పొందుతుంది.
ఈ నంబర్లో వాట్సప్ చేయండి
రుణం తీసుకోవడానికి, మీరు 9019702184 లో WhatsApp ద్వారా హాయ్ చెప్పాలి. ఈ వాట్సాప్ నంబర్ IIFL ఫైనాన్స్. దీని తర్వాత మీకు కంపెనీ నుండి స్వాగత సందేశం వస్తుంది. ఇందులో, బిజినెస్ లోన్ కోసం ఎలా అప్లై చేయాలి అలాగే, అలర్ట్ అందుకోవడం గురించి మిమ్మల్ని అడుగుతారు.
ఆర్టిఫిషియల్ బాట్ సమాచారం అడుగుతుంది
ఆర్టిఫిషియల్ బాట్ కొంత సమాచారం కోసం మిమ్మల్ని అడుగుతుంది. ఇందులో మీ పేరు, వ్యాపారం మీదేనా లేదా భాగస్వామ్యంలో నడుస్తుందా? అప్పుడు మీరు వ్యాపారం యొక్క టర్నోవర్. అది ఎంతకాలం నడుస్తోంది అనే సమాచారాన్ని ఇవ్వవలసి ఉంటుంది. అన్ని వివరాలను ఇచ్చిన తర్వాత, మీ వివరాలను నిర్ధారించమని బాట్ మిమ్మల్ని అడుగుతుంది. దీని తర్వాత మీ క్రెడిట్ చరిత్ర తనిఖీ చేస్తుంది.
వివరాలు నిర్ధారించిన తరువాత..
మీ వివరాలను నిర్ధారించిన తర్వాత, ఐఐఎఫ్ఎల్ మీ క్రెడిట్ చరిత్రను ఒటీపీ ద్వారా ధృవీకరిస్తుంది. ధృవీకరణ తర్వాత, మీకు రుణ మొత్తం అందిస్తారు. ఇందులో, రుణ మొత్తం, వడ్డీ, నెలవారీ వాయిదాల గురించి సమాచారం ఇస్టారు. తుది రుణ మొత్తాన్ని ఎంచుకున్న తర్వాత, మీరు మీ బ్యాంక్ మరియు IFSC కోడ్ను అందించాలి. దీని తరువాత రుణ మొత్తం మీ ఖాతాలో జమ అవుతుంది. మీరు రూ. 8.11 లక్షలు రుణం తీసుకుంటే, మీ నెలవారీ వాయిదా రూ .23,333 అవుతుంది. అంటే, మీరు ఏటా 24% వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...