Alerts

Alerts from Blog Synchronized 40s Scrolling Alerts – Gemini Internet

18, అక్టోబర్ 2021, సోమవారం

గుడ్ న్యూస్.. రైతులందరికీ ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్.. ఇలా పొందండి!

మీరు వ్యవసాయం చేస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీరు ప్రతి నెలా రూ.3 వేలు పొందొచ్చు. అయితే దీని కోసం నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు చెల్లించాల్సి ఉంటుంది. 60 ఏళ్లు దాటిన తర్వాత పెన్షన్ వస్తుంది.

ప్రధానాంశాలు:

  • రైతులకు తీపికబురు
  • ప్రతి నెలా డబ్బులు
  • ఈ స్కీమ్‌లో చేరండి
మీరు వ్యవసాయం చేస్తుంటారా? మీ పేరుపై పొలం ఉందా? అయితే మీకు శుభవార్త. మీరు ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ పొందొచ్చు. ఇది ప్రధాని మోదీ అందిస్తున్న పీఎం కిసాన్ స్కీమ్ రూ.2 వేల డబ్బులకు అదనం. అలాగే ఇప్పటికే పెన్షన్ వస్తున్నా కూడా ఈ రూ.3 వేలు వస్తూనే ఉంటాయి.

కేంద్ర ప్రభుత్వం ఒక పథకాన్ని అందుబాటులో ఉంచింది. దీని పేరు పీఎం కిసాన్ మాన్ ధన్ యోజన. ఈ స్కీమ్‌లో చేరడం వల్ల రైతులకు 60 ఏళ్లు దాటిన తర్వాత ప్రతి నెలా రూ.3 వేల పెన్షన్ వస్తుంది. దీని కోసం రైతులు ఇప్పుడే స్కీమ్‌లో చేరాలి. ప్రతి నెలా కొంత డబ్బు కట్టాలి.

వయసు ప్రాతిపదికన నెలకు రూ.55 నుంచి రూ.200 వరకు కట్టాల్సి రావొచ్చు. ఇది పెద్ద మొత్తం ఏమీ కాదు. అందుకే రైతులు సులభంగానే ఈ పథకంలో చేరొచ్చు. ప్రతి నెలా కొంత మొత్తం చెల్లిస్తూ వెళ్లాలి. 60 ఏళ్ల తర్వాత ప్రతి నెలా రూ.3 వేలు వస్తాయి.

కామెంట్‌లు లేవు:

Recent

✅ *SSC GD Constable Correction/ Edit Form 2026* 👇

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...