11, జూన్ 2020, గురువారం

🔳రేపటి నుంచి సచివాలయాల ద్వారా ఇసుక బుకింగ్ 10 Jun, 2020 03:47 IST|Sakshi

కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో వివిధ ప«థకాలపై వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడుతున్న ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి
జేసీ పూర్తి బాధ్యత తీసుకోవాలి.. కలెక్టర్లు పర్యవేక్షించాలి

జిల్లా కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలతో ‘స్పందన’పై వీడియో కాన్ఫరెన్స్‌లో సీఎం జగన్‌ 

వర్షాలు ప్రారంభమయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలి

జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నులు లక్ష్యంగా పెట్టుకోవాలి

కొత్త మెడికల్‌ కాలేజీల నిర్మాణానికి కనీసం 50 ఎకరాల మేర స్థలాన్ని త్వరగా అప్పగించాలి

గ్రామ, వార్డు సచివాలయాల పనితీరుపై రోజు వారీ సమీక్ష నిర్వహించాలి

మద్యం, ఇసుక అక్రమ రవాణపై ఉక్కుపాదం మోపితేనే తర్వాతి తరాలకు మంచి భవిష్యత్తును అందించగలుగుతాం. కుటుంబాల్లో ప్రేమ, అనురాగాలను నింపగలుగుతాం. మద్యం, ఇసుక అక్రమాల్లో ఎవరున్నా కూడా ఉపేక్షించొద్దు. సీఎం మీతో ఉన్నాడు.. దూకుడుగానే ఉండండి.  

రెండు వారాల క్రితం 35 లక్షల మంది ఉపాధి హామీ పనులకు వచ్చే వారని, ఇప్పుడు 54.5 లక్షల మంది వస్తున్నారని చెబుతున్నారు. ఇంత పెద్ద మొత్తంలో పనులు కల్పిస్తున్నందుకు కలెక్టర్లను అభినందిస్తున్నా. వచ్చే సమీక్షా సమావేశం నాటికి కనీసం 60 లక్షల మందికి పనులు కల్పించాలి.

కరోనా పట్ల ప్రజల్లో భయాందోళనలను తొలగించాలి. కరోనా అని అనుమానం రాగానే ఎవరికి కాల్‌ చేయాలి.. ఎక్కడ పరీక్షలు చేయించుకోవాలి.. పాజిటివ్‌ వస్తే ఎలాంటి వైద్యం చేయించుకోవాలి.. అనే కీలక విషయాలపై ప్రజల్లో మరింతగా అవగాహన కల్పించాలి. ఇది చేస్తేనే వైరస్‌ అనుమానితులు ముందుకు వచ్చి పరీక్షలు చేయించుకుంటారు. ఏ ఇబ్బందీ ఉండదు. అప్పుడే మరణాల సంఖ్య బాగా తగ్గుతుంది. లేకపోతే అది ముదిరి ప్రాణాల మీదకు వస్తుంది.

సాక్షి, అమరావతి: గురువారం నుంచి గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా ఇసుకను బుక్‌ చేసుకోవచ్చునని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వెల్లడించారు. సొంత అవసరాల కోసం గ్రామాల్లో ఉన్న వాళ్లు పక్కనే ఉన్న రీచ్‌ల నుంచి ఎడ్ల బండ్ల ద్వారా 5 కి.మీ పరిధిలో ఇసుకను తెచ్చుకోవచ్చన్నారు. ఇందుకు సంబంధించిన జీవో విడుదల అవుతుందని, గ్రామ సచివాలయంలో అనుమతులు తీసుకోవచ్చని స్పష్టం చేశారు. స్పందన కార్యక్రమంలో భాగంగా మంగళవారం ఆయన వివిధ పథకాలపై తన క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్లు, జేసీలు, ఎస్పీలు, ఇతర ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సమీక్షలో సీఎం సూచనలు, ఆదేశాలు ఇలా ఉన్నాయి. 

అన్ని ఇసుక రీచ్‌లనూ ఓపెన్‌ చేయాలి
► వర్షాలు ప్రారంభం అయ్యే నాటికి 70 లక్షల మెట్రిక్‌ టన్నుల ఇసుక నిల్వ చేయాలి. జూన్‌ చివరి నాటికి రోజుకు 3 లక్షల టన్నుల ఇసుక నిల్వ లక్ష్యంగా పెట్టుకోవాలి. ప్రస్తుతం లక్షన్నర టన్నుల వరకూ ఇస్తున్నాం.
► శ్రీకాకుళం, ఉభయ గోదావరి, కృష్ణా, గుంటూరు, నెల్లూరు జిల్లాల్లో ఇసుక ఉత్పత్తిని బాగా పెంచాలి. అన్ని రకాల రీచ్‌లను తెరవాలి. కొత్త సోర్స్‌లను గుర్తించాలి.
► బల్క్‌ బుకింగ్‌ అనుమతులు జాయింట్‌ కలెక్టర్‌ చూసుకోవాలి. ఈ విధానం పారదర్శకంగా ఉండాలి. ఇందుకు సంబంధించిన ఎస్‌ఓపీ (స్టాండర్డ్‌ ఆపరేషన్‌ ప్రొసీజర్‌) రేపటి నుంచి అమల్లోకి వస్తుంది. వర్షాలు వస్తున్నందున మళ్లీ ఇసుకకు ఇబ్బందులు రాకుండా ఇప్పుడే చర్యలు తీసుకోవాలి. 

ఇళ్ల స్థలాల పంపిణీ చిరస్మరణీయం
► ఇళ్ల స్థలాలకు సంబంధించి కొత్త వారితో కలిపి 30.30 లక్షల మందికిపైగా లబ్ధిదారులుండొచ్చు. వీరందరికీ  జూలై 8న ఇళ్ల స్థలాల పట్టాలు పంపిణీ చేస్తున్నాం. ఇంకా ఎవరైనా మిగిలిపోతే దరఖాస్తు చేసుకోవాలని చెప్పాం. జూన్‌ 12 కల్లా లబ్ధిదారుల తుది జాబితాను డిస్‌ప్లే చేయాలి. 
► జూన్‌ 15 నాటికి పాత, జూన్‌ 30 నాటికి కొత్త లబ్ధిదారులకు సంబంధించి ఇళ్ల స్థలాల పట్టాలు ఇచ్చేందుకు అవసరమైన కార్యక్రమాలు పూర్తి చేయాలి. ఏమైనా సమస్యలు ఉంటే కచ్చితంగా ప్లాన్‌ బి ఉండాలి. జూన్‌ 15 నాటికి ప్లాన్‌ బి కూడా సిద్ధంగా ఉండాలి. జూలై 8న అక్క చెల్లెమ్మల పేరు మీద రిజిస్ట్రేషన్‌ చేసి ఇవ్వాలి. 
► సంతృప్త స్థాయిలో మనం ఇళ్ల స్థలాల పట్టాలు, ఇళ్లు ఇవ్వబోతున్నాం. ఈ కార్యక్రమాల ద్వారా ప్రతి కలెక్టర్‌ను ప్రజలు గుర్తు పెట్టుకుంటారు. ఇది చిరస్మరణీయంగా నిలిచిపోతుంది. ఇళ్ల స్థలాల పంపిణీ ప్రక్రియలో చివరి దశకు వచ్చాం. కొత్త అప్లికేషన్లు వచ్చినప్పటికీ అదే ఉత్సాహంతో వారికీ ఇళ్ల స్థలాల పట్టాలు ఇవ్వడానికి ప్రయత్నించాలని కోరుతున్నా.  

ఇ–క్రాప్‌ బుకింగ్‌ కీలకం
► ఇ–క్రాప్‌ బుకింగ్‌ 100 శాతం కచ్చితత్వంతో జరగాలి. వ్యవసాయ అసిస్టెంట్, రెవెన్యూ అసిస్టెంట్‌ ద్వారా ఇ–క్రాప్‌ బుకింగ్‌ చేయించాలి. తప్పులు లేకుండా పారదర్శకంగా జరగాలి. రూ.3 వేల కోట్ల ధరల స్థిరీకరణ నిధి ప్రయోజనాలకు ఇ– క్రాప్‌ బుకింగ్‌ అనేది పునాదిగా నిలుస్తుంది. 
► కనీస గిట్టుబాటు ధర పొందడానికి ఈ విధానం చాలా కీలకం. ప్రకృతి వైపరీత్యాలు వస్తే, ఆదుకోవడానికి ఇది ఉపయోగపడుతుంది. అలాగే పంట రుణాలకు, ఇన్సూరెన్స్‌కు కూడా ఉపకరిస్తుంది. 
► ఉద్యాన పంటలకు ప్రత్యేక అప్లికేషన్‌ ఉంది. ఆక్వాను కూడా ఇ–క్రాపింగ్‌లో ప్రత్యేక అప్లికేషన్‌లో పెడుతున్నాం. మార్కెటింగ్‌లో ఇది కీలకం కాబోతుంది. 

నాడు–నేడుపై జేసీ నిత్యం పర్యవేక్షించాలి
► అభివృద్ధి కార్యక్రమాలను చూస్తున్న జేసీ స్కూళ్లలో నాడు– నేడు కార్యక్రమాలను ప్రతిరోజూ పర్యవేక్షించాలి. ఏం కావాలన్నా వెంటనే చర్యలు తీసుకోవాలి. పనులు మాత్రం వేగంగా జరగాలి.
► 15 కొత్త మెడికల్‌ కాలేజీలను మనం కట్టబోతున్నాం. ఇందుకు సంబంధించిన స్థలాలను హేండోవర్‌ చేయాల్సి ఉంది. ఒక్కో కాలేజీ కోసం కనీసం 50 ఎకరాలు గుర్తించాలి. 
► వచ్చే సమీక్షా సమావేశం నాటికి రైతు భరోసా కేంద్రాలు (ఆర్బీకేలు), అంగన్‌వాడీ కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్, గ్రామ సచివాలయాలు, అర్బన్‌ హెల్త్‌ క్లినిక్స్, మెడికల్‌ కాలేజీలకు సంబంధించి భూముల గుర్తింపు పూర్తి కావాలి.
► గ్రామ సచివాలయాలు, వైఎస్సార్‌ రైతు భరోసా కేంద్రాలు, విలేజ్‌ క్లినిక్స్‌పై మరింతగా దృష్టి పెట్టాలి. వీటికి సంబంధించి ఏవైనా పెండింగ్‌లో ఉంటే అనుమతులు ఇచ్చి పనులు వేగవంతం చేయాలి. 
► పట్టణ, నగరాల్లోని వైఎస్సార్‌ క్లినిక్స్‌కు సంబంధించి రేపటికి మ్యాపింగ్‌ చేయబోతున్నారు. వీటికి స్థలాలను గుర్తించే పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సి ఉంటుంది. 
► అంగన్‌వాడీ కేంద్రాలు కూడా అన్యాయమైన పరిస్థితిలో ఉన్నాయి. 55 వేల అంగన్‌వాడీల్లో 31 వేల చోట్ల కొత్త బిల్డింగులు కట్టాలి. మిగిలిన వాటిలో మరమ్మతులు చేయాలి. వీటిలో కూడా నాడు–నేడు కింద కార్యక్రమాలు చేపడుతున్నాం. వీటిపై కూడా కలెక్టర్లు దృష్టి పెట్టాలి. 
 
కోవిడ్‌–19పై ప్రజల్లో అవగాహన పెంచాలి
► కోవిడ్‌–19 వ్యాప్తిని అరికట్టడంలో కలెక్టర్లు చాలా బాగా పని చేశారు. వలంటీర్లు, ఆశాలు, ఏఎన్‌ఎంలు,  నర్సులు, ల్యాబ్‌ టెక్నీషియన్లు, వైద్యులు, మున్సిపల్‌ సిబ్బంది, శానిటరీ వర్కర్లు.. అందరూ చాలా బాగా పని చేశారు. 
► కరోనా వైరస్‌ విషయంలో దేశంలో పాజిటివిటీ రేటు 6 శాతం అయితే రాష్ట్రంలో 1 శాతం ఉంది. ప్రస్తుతం దేశంలో దాదాపు అన్ని రకాల వెసులుబాట్లు ఇచ్చారు. అన్ని రకాల కార్యకలాపాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితిలో కోవిడ్‌తో ఎలా కలిసి బతకాలన్న దాని గురించి మనం ఆలోచించాలి. 
► 85 శాతం కేసులు ఇంట్లోనే మందులు తీసుకోవడం ద్వారా తగ్గిపోతాయి. కేవలం 2 శాతం కేసుల్లో మాత్రమే మరణాలు ఉంటున్నాయి. ఆస్పత్రుల సన్నద్ధతను కలెక్టర్లు పర్యవేక్షించాలి. ఐసోలేషన్‌ ఫెసిలిటీస్‌ మీద కూడా దృష్టి పెట్టాలి. 

సచివాలయాల ఉద్యోగులపై జేసీ దృష్టి పెట్టాలి
► గ్రామ, వార్డు సచివాలయాల్లోని ఉద్యోగులపై సంబంధిత జేసీ దృష్టి పెట్టాలి. పనీతీరుపై, ప్రజలకు అందుతున్న సేవలపై రోజూ సమీక్ష నిర్వహించాలి. వారికి శిక్షణ ఇవ్వాలి. ► స్పందన కింద వచ్చే వినతులను జాగ్రత్తగా పర్యవేక్షించడం మొదలుపెడితే చాలా వరకు సమస్యలు పరిష్కారం అవుతాయి. ప్రతి సచివాలయంలో లబ్ధిదారుల జాబితా అందరికీ కనిపించేలా ప్రదర్శించాలి. 
► ఫిర్యాదులు, సలహాలు, సూచనల కోసం ఇచ్చిన అతి ముఖ్యమైన నంబర్లు, సచివాలయాల్లో అందే సేవల గురించి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్పకుండా డిస్‌ ప్లే కావాలి. అలాగే ఏ పథకం ఎప్పుడు అమలు అవుతుందో తెలిపేలా ప్రకటించిన సంక్షేమ క్యాలండర్‌నూ ప్రదర్శించాలి. 
► లబ్ధిదారులకు బియ్యం కార్డులు, పింఛన్‌ కార్డులు, ఆరోగ్య శ్రీ కార్డులను డోర్‌ డెలివరీ చేయాలి. బయోమెట్రిక్‌ అక్నాలెడ్జ్‌మెంట్‌ తీసుకోవాలి. 
► ఈ సమీక్షలో మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, కొడాలి నాని, ఆదిమూలపు సురేష్, సీఎస్‌ నీలం సాహ్ని, డీజీపీ గౌతం సవాంగ్, పలువురు అధికారులు పాల్గొన్నారు.  

మద్యం, ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం
► మద్యం వినియోగం తగ్గించడానికి అన్ని రకాల చర్యలు తీసుకున్నాం. 43 వేల బెల్టుషాపులు ఎత్తివేశాం. 33 శాతం మద్యం దుకాణాలు తగ్గించాం. ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మద్యం విక్రయాలు కొనసాగిస్తున్నాం.
► మద్యం విక్రయించే వేళలనూ బాగా తగ్గించాం. పద్ధ్దతి ప్రకారం మద్య నియంత్రణ చేస్తున్నాం. షాక్‌ కొట్టే రీతిలో రేట్లు పెంచాం. 
► ఇవన్నీ చేస్తున్నప్పుడు మద్యం అక్రమ రవాణా, తయారీ జరక్కుండా చూడాలి. బయట రాష్ట్రాల నుంచి మద్యం అక్రమ రవాణా జరక్కూడదు.

🔳ఇగ్నోలో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానంJun 10 2020 @ 04:38AM

మంగళ్‌హాట్‌, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): 2020 విద్యా సంవత్సరానికి పీజీ డిప్లొమా, డిగ్రీ, పీజీ తదితర కోర్సుల్లో ప్రవేశానికి ఇందిరా గాంధీ జాతీయ సార్వత్రిక విశ్వ విద్యాలయం(ఇగ్నో) దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఈ మేరకు ఇగ్నో ప్రాంతీయ సంచాలకులు డాక్టర్‌ ఎస్‌.ఫయాజ్‌ అహ్మద్‌ మంగళవారం ఓ ప్రకటన విడుదల చేశారు. ఆసక్తి గల అభ్యర్థులు జూలై 31వ తేదీలోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు

జూలై 12న అంబేద్కర్‌ వర్సిటీ అర్హత పరీక్షJun 10 2020 @ 04:37AM

హైదరాబాద్‌ సిటీ, జూన్‌ 9 (ఆంధ్రజ్యోతి): డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయ అర్హత పరీక్ష-2020ని తెలుగు రాష్ట్రాల్లో జూలై 12న  నిర్వహించనున్నట్లు అధికారులు ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 25వ తేదీలోపు ఆన్‌లైన్‌లో రిజిస్ర్టేషన్‌ చేసుకోవచ్చు.

యూజీ పరీక్షలు వాయిదా

అంబేద్కర్‌ వర్సిటీలో వివిధ యూజీ పరీక్షలు వాయిదాపడ్డాయి. బీఈడీ (స్పెషల్‌ ఎడ్యుకేషన్‌) మొదటి సెమిస్టర్‌, బీఈడీ (బ్యాక్‌లాగ్‌), ఎంబీఏ (హాస్పిటల్‌ అండ్‌ హెల్త్‌కేర్‌ మేనేజ్‌మెంట్‌) పరీక్షలు; బీఏ, బీకాం, బీఎస్సీ వార్షిక పరీక్షలు; డిగ్రీ మొదటి సంవత్సరం మొదటి సెమిస్టర్‌ (సీబీఎస్‌) పరీక్షలను వాయిదా వేశారు. వీటిని తిరిగి జూలైలో నిర్వహించే అవకాశాలున్నాయి. డిగ్రీ ఓల్డ్‌ బ్యాచ్‌ విద్యార్థులు ఈ నెల 20వ తేదీలోపు పూర్తి వివరాలతో రిజిస్ర్టేషన్‌ చేసుకోవాలని అధికారులు సూచించారు.

రజకులకు, నాయీబ్రాహ్మణులకు, దర్జీలకు సంక్షేమ పథకాలు



నాగార్జునా యూనివర్సిటీ పిజి సెట్ లో కొత్త కోర్సులు


ఉద్యోగాలు | వైజాక్ స్టీల్ ప్లాంట్ | IBPS అసిస్టెంట్ ప్రొఫెసర్లు 11-06-2020


10, జూన్ 2020, బుధవారం

ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఫైబర్ నెట్ లిమిటెడ్

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తులకు చివరి తేదీ19.06.2020

మొత్తం ఖాళీలు:

3

విభాగాల వారీగా ఖాళీలు:

ఎగ్జిక్యూటివ్ డైరక్టర్ ప్రాజెక్ట్‌లు1
జరనరల్ మేనేజర్1
కంపెనీ సెక్రటరీ1

అర్హతలు:

పోస్టును అనుసరించి సంబంధిత విభాగం లో బీఈ/బీటెక్, ఎంబీఏ

ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ , కంప్యూటర్స్/ఐటీలో బ్యాచిలర్స్

ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ కంపెనీ సెక్రటరీ ఆఫ్ ఇండియాలో సభ్యత్వం మరియు అనుభవం ఉండాలి 

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది. recruitmentapsfl@gmail.com దానికి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.

ఈ పోస్ట్ మీకు నచ్చితే మీ ప్రెండ్స్ కి వాట్సప్ ద్వారా షేర్ చెయ్యండి. 

Website

Notification

భారత వైమానిక దళ నియామకం | Indian Air Force Recruitment

భారత వైమానిక దళ నియామకం 2020 AFCAT 02/2020 - 256 పోస్ట్లు afcat.cdac.in చివరి తేదీ 14-07-2020

https://careerindianairforce.cdac.in
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: భారత వైమానిక దళం

మొత్తం ఖాళీల సంఖ్య: - 256 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: AFCAT 02/2020

విద్యా అర్హత: ఏదైనా డిగ్రీ, BE / B.Tech/ PG (Engg)

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 14-07-2020

వెబ్సైట్: https: //afcat.cdac.in/AFCAT/




సైంటిస్ట్-H Job

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అనిమల్ బయోటెక్నాలజీ

 
సంఖ్య :-
అర్హతలుPh.D (వెటర్నరీ సైన్సెస్ / యానిమల్ సైన్సెస్ / మోడరన్ బయాలజీ / లైఫ్ సైన్సెస్ )
విడుదల తేదీ:10-06-2020
ముగింపు తేదీ:06-07-2020
వేతనం:రూ. 27,200 - 30,200 / - నెలకు
ఉద్యోగ స్థలం:హైదరాబాద్ (తెలంగాణ)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి:

50 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ. 27,200- 30,200 / - నెలకు.
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి గల అభ్యర్థులకు అవసరమైన పత్రాలను ఇమెయిల్ చేయమని అభ్యర్థించారు .
---------------------------------------------------------
E-Mail : - diroffice@niab.org.in
---------------------------------------------------------
WEBSITE: http://niab.org.in/
---------------------------------------------------------
Notification :- http://niab.org.in/Notifications_6_2020.aspx
---------------------------------------------------------

---------------------------------------------------------








ల్యాబ్ టెక్నీషియన్ Job

నేషనల్ ఇన్స్టిట్యూట్ అఫ్ అనిమల్ బయోటెక్నాలజీ (NIAB)

 
సంఖ్య :-
అర్హతలుBsc / Msc
విడుదల తేదీ:10-06-2020
ముగింపు తేదీ:24-06-2020
వేతనం:రూ.13,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:హైదరాబాద్ (తెలంగాణ)
 

మరింత సమాచారం:

వయసు పరిమితి:

30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము:
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ.13,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ:
వాక్ ఇన్ ఇంటర్వ్యూ.
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు ఇక్కడ వస్తాయి Walk-In-Interview @10:00 AM - 12:00PM
---------------------------------------------------------
Walk-In-Interview Address:
AN AUTONOMOUS INSTITUTE OF DEPT.
OF BIOTECHNOLOGY, MINISTRY OF SCIENCE & TECHNOLOGY,
SURVEY NO. 37, OPP. JOURNALIST COLONY,
EXTENDED Q CITY ROAD,
NEAR GOWLIDODDI, GACHIBOWLI,
HYDERABAD-500032
---------------------------------------------------------
WEBSITE: http://niab.org.in/
---------------------------------------------------------
Notification :- http://niab.org.in/Careers.aspx
---------------------------------------------------------

---------------------------------------------------------








GEMINI TIMES | 10-06-2020 | HINDUPUR

నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఫర్ ది ఎంపవర్ మెంట్ ఆఫ్ పర్సన్స్ విత్ ఇంటెలెక్చువల్ డిసెబిలిటీస్ ఆఫీసు నియామకానికి దరఖస్తులు ఖాళీలు 11
ఉద్యోగాలుః- జూనియర్ స్పెషల్ ఎడ్యుకేషన్ ఇన్ స్టక్టర్, ప్రిన్సిపల్, హోం విజిటర్
అర్హతః- ఉద్యోగాన్ని అనుసరించి ఎనిమిదో తరగతి/ ఇంటర్మీడియెట్/గ్రాడ్యుయేషన్ డిప్లొమా/బి కాం/ బి ఎడ్/బి ఆర్ ఎస్/పి హి పూర్తి చేసి ఉండాలి. వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేసుకునే ఈ ఉద్యోగాల దరఖాస్తుకు చివరి తేది జూన్ 15

ఇంటర్వ్య ఆధారంగా కలికిరి సైనిక్ స్కూలులో 4 ఉద్యోగాలు
పోస్టుల వివరాలుః- స్కిల్డ్ ఇన్ స్ట్రక్టర్ 1, అన్ స్కిల్డ్ గ్రూమర్ 3
అర్హతలుః- పోస్టును అనుసరించి పదో తరగతి, ఇంటర్మీడియేట్ ఉత్తీర్ణత అనుభవం ఉండాలి
ఆఫ్ లైన్ లో దరఖాస్తుకు చివరి తేది 24-06-2020




నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ | National Investigation Agency Recruitment

నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ రిక్రూట్మెంట్ 2020 డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ - 07 పోస్టులు www.nia.gov.in చివరి తేదీ 2020 ఆగస్టు 2

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

మొత్తం ఖాళీల సంఖ్య: - 07 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: డిప్యూటీ పోలీస్ సూపరింటెండెంట్

విద్యా అర్హత: పేరెంట్ కేడర్ / డిపార్ట్‌మెంట్‌లో రోజూ సారూప్య పోస్టును కలిగి ఉండటం

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 2 ఆగస్టు 2020

ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ http://www.nia.gov.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపిన తరువాత, అభ్యర్థి 2020 ఆగస్టు 2 కి ముందు లేదా సంబంధిత కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి. రోడ్, న్యూ Delhi ిల్లీ -110003.

వెబ్సైట్: www.nia.gov.in

NIA రిక్రూట్మెంట్ | NIA Recruitment

 www.nia.gov.in 10 పోస్టులు చివరి తేదీ 2 ఆగస్టు 2020

సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ

మొత్తం ఖాళీల సంఖ్య: 10 పోస్టులు

ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: 1. పేలుడు నిపుణుడు - 04

2. బయాలజీ నిపుణుడు - 01

3. సైబర్ ఫోరెన్సిక్ ఎగ్జామినర్ - 01

4. క్రైమ్ సీన్ అసిస్టెంట్ - 03

5. ఫోటోగ్రాఫర్ - 01

విద్యా అర్హత: పేరెంట్ కేడర్ / డిపార్ట్‌మెంట్‌లో రోజూ సారూప్య పోస్టును కలిగి ఉండటం

ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆల్ ఇండియా

చివరి తేదీ: 2 ఆగస్టు 2020

ఎలా దరఖాస్తు చేయాలి: అర్హత మరియు ఆసక్తి ఉన్న అభ్యర్థులందరూ అధికారిక వెబ్‌సైట్ http://www.nia.gov.in ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. దరఖాస్తు ఫారమ్ నింపిన తరువాత, అభ్యర్థి 2020 ఆగస్టు 2 కి ముందు లేదా సంబంధిత కింది చిరునామాకు సంబంధిత టెస్టిమోనియల్స్ (వివరణాత్మక ప్రకటనలో పేర్కొనబడింది) తో పాటు దరఖాస్తు యొక్క హార్డ్ కాపీని పంపాలి. రోడ్, న్యూ Delhi ిల్లీ -110003.

వెబ్సైట్: www.nia.gov.in

9, జూన్ 2020, మంగళవారం

NTPC జాబ్ నోటిఫికేషన్ పరీక్ష లేదు | NTPC JOB NOTIFICATION NO EXAM

ముఖ్యమైన తేదీలు:

ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రారంభ తేదీ

02 జూన్ 2020

ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ముగింపు తేదీ

22 జూన్ 2020

మొత్తం ఖాళీలు: 23

విభాగాల వారిగా ఖాళీలు:

తవ్వకం అధిపతి

1

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

1

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

2

మైన్ సర్వేయర్ హెడ్

1

అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్

18 ( UR-11, OBC-4, SC-2, ST-1)

అర్హతలు:

పోస్ట్ ను బట్టి అర్హతలు ఇవ్వడం జరిగింది. మెకానికల్ / మైనింగ్ మెషినరీలో ఇంజనీరింగ్ డిగ్రీ,మైనింగ్లో ఇంజనీరింగ్ డిగ్రీ లేదా జియాలజీ / అప్లైడ్ జియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ/సివిల్ / మైనింగ్ / మైన్స్ సర్వేలో డిప్లొమా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

వయస్సు:

తవ్వకం అధిపతి

52

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

47

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

47

మైన్ సర్వేయర్ హెడ్

47

అసిస్టెంట్ మైన్ సర్వేయర్ / మైన్ సర్వేయర్

37-42

విశ్రాంతి (ఉన్నత వయస్సు పరిమితిలో)

sc,st వారికి 5 సంవత్సరాలు, OBC కి 3 సంవత్సరాల వరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

జీతం:

తవ్వకం అధిపతి

227000

ఎగ్జిక్యూటివ్ (తవ్వకం)

170000

ఎగ్జిక్యూటివ్ (మైన్ ప్లానింగ్- RQP)

189000

మైన్ సర్వేయర్ హెడ్

189000

అసిస్టెంట్ మైన్ సర్వేయర్

57000

మైన్ సర్వేయర్

76000

జాబ్ ఎక్కడ చెయ్యాలి:

ఎన్టిపిసి లిమిటెడ్, 7, ఇనిస్టిట్యూషనల్ ఏరియా, లోధి రోడ్. న్యూడిల్లీ-110003

ఎలా ఎంపిక చేస్తారు:

ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు.

ఎలా అప్లై చేసుకోవాలి:

అన్లైన్ లో అప్లై చేసుకోవాలి.

Website

Notification

Apply Now

ఆన్ లైన్ అప్లికేషన్ కోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, హిందూపురం 9640006015.



టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ -42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్ | TECHNICAL TEACHER'S CERTIFICATE-42 DAYS SUMMER TRAINING COURSE 2020

అడ్మిషన్ కోసం దరఖాస్తు అప్లై చేయబడును
టెక్నికల్ టీచర్ సర్టిఫికేట్ -42 డేస్ సమ్మర్ ట్రైనింగ్ కోర్స్, 2020
(22 వ జూన్ నుండి 2 వ ఆగస్టు 2020 వరకు)
కావలసినవి
Passport Photograph and Signature
ఆధార్ మరియు సెల్ ఫోన్ నెంబరు
జనన ధృవీకరణ పత్రము,
అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు
దరఖాస్తుకు చివరి తేది 15-06-2020 సాయంత్రం 5.00 గంటల లోపు
అప్లికేషన్ ఫారాన్ని అలాగే అప్ లోడ్ చేయబడిన సర్టిఫికేట్ల అటెస్టెడ్ పేపర్లను District Educational Officer కు అందజేయాలి
06-06-2020 నుండి 16-06-2020 వరకు మాత్రమే అడ్మిషన్ కు అవకాశం
ఒరిజినల్ సర్టిఫికేట్లైన అకాడమిక్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లు, టెక్నికల్ క్వాలిఫికేషన్ సర్టిఫికేట్లను వెరిఫికేషన్ కోసం తీసుకెళ్ళవలెను.
వివరాలకు
కె శ్రీనివాసులు 9177002464 డిప్యూటి కమీషనర్
పి ఎస్ ఆర్ కె లింగేశ్వర రావు 91770 02451 అసిస్టెంట్ కమీషనరు
ఆర్ రాశి కుమార్ 9908083660 సూపరింటెండెంట్ వారిని ఉదయం 10.00 నుండి సాయంత్రం 5.30 వరకు సంప్రదించవచ్చు
అప్లికేషన్ లు చేయించుకోదలచిన వారు సంప్రదించండి కార్తీక్ 9640006015, జెమిని ఇంటర్ నెట్, హిందూపురం
వెబ్ సైట్ / Website https://www.bseap.org/



📚✍రేపటి నుంచి విద్యార్థులకు బ్రిడ్జి కోర్సులు✍📚

Sakshi
    
♦దూరదర్శన్‌లో అన్ని తరగతులకు రోజూ వీడియో పాఠాలు

♦ఆన్‌లైన్‌లోనూ అందుబాటులో..

♦కోవిడ్‌ కారణంగా ఇంటి నుంచే నేర్చుకునేలా ఏర్పాట్లు

♦వారానికి ఒకరోజు స్కూళ్లకు టీచర్లు

🌻సాక్షి, అమరావతి:  పాఠశాలలు ఆగస్టు 3 నుంచి పునఃప్రారంభం కానున్న నేపథ్యంలో ఈలోగా విద్యార్థులను ఆంగ్ల మాధ్యమానికి సన్నద్ధం చేసేందుకు వీలుగా బుధవారం నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. దూరదర్శన్‌తోపాటు ఆన్‌లైన్‌లోనూ వీడియో పాఠాలు బోధించేలా పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసింది. బ్రిడ్జి కోర్సులను విద్యార్థులకు వసతి సదుపాయాలతో నిర్వహించాలని తొలుత భావించినా కరోనా కారణంగా నిలిచిపోయింది. 2020–21 విద్యాసంవత్సరం నుంచి 1 – 6వ తరగతి వరకు ఆంగ్ల మాధ్యమంలో బోధన ప్రారంభించి తదుపరి తరగతులను ఆపై ఏడాదుల్లో ఆంగ్ల మాధ్యమాలుగా మార్చాలని ప్రభుత్వం నిర్ణయించిన సంగతి తెలిసిందే. తల్లిదండ్రులు, విద్యార్థుల అభిప్రాయాలను సేకరించి విద్యాశాఖ ఆ దిశగా ఏర్పాట్లు చేపట్టింది. ఇప్పటికే టీచర్లకు ఆంగ్ల మాధ్యమంలో బోధనపై శిక్షణ కూడా పూర్తయింది.  

♦నిర్దేశిత తేదీల్లో స్కూలుకు రావాలి..

► మొబైల్‌ నెట్‌వర్క్, టీవీలో పాఠాలు చూసే అవకాశం లేని ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు పుస్తకాల ద్వారా బ్రిడ్జి కోర్సులు నేర్చుకొనేందుకు వీలుగా ప్రాథమిక పాఠశాలల టీచర్లు ప్రతి మంగళవారం పాఠశాలలకు హాజరు కావాలని ఆదేశించారు. ఈనెల 16వ తేదీ నుంచి ప్రారంభించి ప్రతి మంగళవారం పాఠశాలల్లో విద్యార్థుల నోట్‌ పుస్తకాలు, వర్కు పుస్తకాలను సరిచూసేందుకు తల్లిదండ్రులు, పేరెంట్స్‌ కమిటీలకు సమాచారం అందించాలి. విద్యార్థుల సామర్థ్యాల ఆధారంగా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 1 లేదా బ్రిడ్జి కోర్సు లెవెల్‌ – 2 పుస్తకాలను విద్యార్థులకు అందించాలని హెచ్‌ఎంలు, ఉపాధ్యాయులకు సూచించారు.

► 6, 7వ తరగతి విద్యార్థుల సందేహాలను నివృత్తి చేసేందుకు టీచర్లు 17 నుంచి ప్రతి బుధవారం హాజరు కావాలి.

► 8, 9వ తరగతుల విద్యార్థులకు బోధించే ఉపాధ్యాయులు 19 నుంచి ప్రతి శుక్రవారం పాఠశాలలకు హాజరు కావాలి.

► పదో తరగతి బోధించే టీచర్లు ప్రతి బుధ, శుక్రవారాల్లో పాఠశాలలకు హాజరు కావాలి.

► వీడియో పాఠాలు నేర్చుకునే విద్యార్థుల నోట్‌ బుక్స్, వర్క్‌ బుక్స్‌ను టీచర్లు తనిఖీ చేసి మూల్యాంకనం చేయాలి.

♦రేపట్నుంచి ‘సప్తగిరి’లో..

► ఈ నెల 10 నుంచి బ్రిడ్జి కోర్సులు ప్రారంభం కానున్నాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల్లో ఎక్కువ మందికి కంప్యూటర్లు అందుబాటులో ఉండనందున దూరదర్శన్‌ సప్తగిరి చానల్‌ ద్వారా బ్రిడ్జి కోర్సు పాఠాలను ప్రసారం చేయనున్నారు.

► దూరదర్శన్‌లో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు 1 – 5వ తరగతి విద్యార్థులకు, ఆ తర్వాత 2 గంటల నుంచి 3 వరకు 6, 7 తరగతులకు పాఠాలు ఉంటాయి. 3 నుంచి 4 గంటల వరకు 8, 9, 10వ తరగతులకు నిపుణులతో ప్రత్యేకంగా రూపొందించిన వీడియోలను రోజూ ప్రసారం చేయనున్నారు.
 
► జూలై నెల సిలబస్‌కు సంబంధించిన అంశాలన్నీ వీటిలో ఉంటాయి. రోజువారీ పాఠ్యాంశాల షెడ్యూల్‌ను కూడా విద్యాశాఖ విడుదల చేసింది.