12, నవంబర్ 2021, శుక్రవారం

Pension Alert: పెన్షన్ కావాలంటే నవంబర్ 30 లోగా ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇంటి నుంచే ఈ సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి.

Pension Alert | పెన్షనర్లకు అలర్ట్. లైఫ్ సర్టిఫికెట్‌ను (Life Certificate) సమర్పించడానికి గడువు సమీపిస్తోంది. నవంబర్ 30 లోగా జీవన ప్రమాణ పత్రం (Jeevan Pramaan Patra) సమర్పించాలి.

ఈజీగా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ను SMS లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.

Gemini Internet

1. పెన్షన్​ పొందే రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగులు ఏటా జీవన ప్రమాణ పత్రం (లైఫ్​ సర్టిఫికెట్​) సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్యాంకులకు వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించడం నిజంగా వృద్ధులకు ఇబ్బంది కలిగిస్తుంది. మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కేంద్రం శుభవార్త చెప్పింది.

2. ఆన్​లైన్​ ద్వారానే లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించే అవకాశం కల్పించింది. రిటైనర్​ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.

3. సర్టిఫికేట్‌ను అధీకృత పెన్షన్ పంపిణీదారు లేదా ఏజెన్సీ ముందు చూపించాలి. ఆ తర్వాత వారి ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుంది. పెన్షనర్లు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలను పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీస్ (PDA)ల వద్ద నేరుగా సబ్​మిట్​ చేయవచ్చు.

4. లేదంటే కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తున్న డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​ సేవలను ఉపయోగించుకొని నేరుగా ఇంటి వద్దే ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనూ సమర్పించే వెసులుబాటు కూడా ఉంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSB) ద్వారా పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేయవచ్చు.

5.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్​తో సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​కు మద్ధతిస్తున్నాయి. పింఛనుదారుడు ఈ సేవను పొందేందుకు గూగుల్​ ప్లేస్టోర్​ నుండి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా https://doorstepbanks.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 


6. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు పెన్షనర్లు ముందుగా తమ వివరాలను నమోదు చేయాలి. వ్యక్తి పెన్షన్ ఖాతా నంబర్‌ను ఎంటర్​ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి. దీంతో, ప్రక్రియను పూర్తి చేయడానికి మీ ఇంటికి వచ్చే బ్యాంక్ ఏజెంట్ వివరాలు ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా అందుకుంటారు. ఏజెంట్ వ్యక్తి ఇంటిని సందర్శించి, ప్రక్రియను పూర్తి చేస్తాడు. 

7. ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు పోస్ట్‌మ్యాన్ లైఫ్​ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. సేవను పొందేందుకు పెన్షనర్ పోస్ట్ ఇన్ఫో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తగిన ఫీజు చెల్లిస్తే పోస్ట్​ మ్యాన్ మీ ఇంటికే వచ్చి పెన్షన్​ సర్టిఫికెట్​ తీసకుంటారు. ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

 

11, నవంబర్ 2021, గురువారం

TTD Update

తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత

భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా విరిగి పడుతున్న కొండచరియల

ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు

టిటిడి భద్రతా సిబ్బంది

Gemini Internet


*తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత*

తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు.

మరోవైపు వర్షం కారణంగా రెండు ఘాట్‌ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలకోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ..

Gemini Internet

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా స్కీమ్‌లను రూపొందించింది పోస్టల్‌ శాఖ. ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాల స్కీమ్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్టు చేసే సదుపాయం ఉంది. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి.

స్కీమ్‌ గడువు ఐదేళ్లు:

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతూనే వస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే ఒకవేళ వడ్డీ రేటు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చు. లేదంటే అలానే స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరితే నెలకు 10 వేల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఐదు సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. ఖచ్చితమైన లాభం వస్తుంది తప్ప.. రిస్క్‌ అనేది ఉండదు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తిగానీ, ముగ్గురు కలిపి కూడా ఉమ్మడి ఖాతాగా తీసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే మైనర్ల పేరు మీద కూడా ఖాతా ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టువచ్చు. కనీసం 10 సంవత్సరాలపైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఉదాహారణకు చెప్పాలంటే.. మీరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్లయితే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ తర్వాత ఖాతా తీసినట్లయితే ప్రతి నెల చివరి దినం వరకు మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. గడువులోగా మొత్తాన్ని జమ చేయనట్లయితే కొంత పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే కొంత మినహాయింపు కూడా ఉంటుంది. మీరు ఆరు నెలల పాటు అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే నెలవారీ ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఎవరైనా ప్రతి నెల డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల పాటు అతను రూ.6000కు బదులు రూ.5900 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం మొత్తం డిపాజిట్‌ చేస్తే ఈతనికి నెలవారీ ప్రీమియంలో 40 శాతం వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి మొత్తం డిపాజిట్‌ రూ.12,000కు బదులు రూ.11,600 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మొత్తం రుణ సదుపాయం:

ఇక రుణ సదుపాయం విషయానికొస్తే.. డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం రుణం పొందే అవకాశం ఉంటుంది. ఏడాది తర్వాత డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందవచ్చు. దానిని వివిధ వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించి సౌకర్యం ఉంటుంది. రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతం వీడిగా ఉంటుంది. ఇక కాలిక్యులేటర్‌ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ.10 వేలు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీపై మొత్తం రూ.69,6967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్‌ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తం రూ.99967 అవుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ వివరాలన్ని వివిధ వెబ్‌సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు స్కీమ్‌లో చేరి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.

 

 

CIIL రిక్రూట్‌మెంట్ 2021 రిసోర్స్ పర్సన్ – 6 పోస్టులు www.ciil.org చివరి తేదీ 14-11-2021

Name of Organization Or Company Name :Central Institute of Indian Languages

Total No of vacancies:– 6 Posts

Job Role Or Post Name:Resource Person 

Educational Qualification:MA/ MLISc(Relevant Discipline)

Who Can Apply:All India

Last Date:14-11-2021

Website: www.ciil.org

Click here for Official Notification


బోస్ ఇన్‌స్టిట్యూట్ రిక్రూట్‌మెంట్ 2021 ప్రాజెక్ట్ అసోసియేట్ II, అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్, ప్రాజెక్ట్ అసిస్టెంట్, మాస్టర్ ట్రైనర్ – 8 పోస్టులు www.jcbose.ac.in చివరి తేదీ 24-11-2021

Name of Organization Or Company Name :Bose Institute

Total No of vacancies: – 8 Posts

Job Role Or Post Name:Project Associate II, Administrative Assistant, Project Assistant, Master Trainer 

Educational Qualification:Secondary, B.Sc,/ B.Com, M.Sc (Relevant Discipline)

Who Can Apply:All India

Last Date:24-11-2021

Website: www.jcbose.ac.in

Click here for Official Notification


నేషనల్ సెంటర్ ఫర్ పోలార్ & ఓషన్ రీసెర్చ్ రిక్రూట్‌మెంట్ 2021 సీనియర్ కన్సల్టెంట్, కన్సల్టెంట్ – 10 పోస్ట్‌లు ncpor.res.in చివరి తేదీ 15-11-2021


Name of Organization Or Company Name :National Centre for Polar & Ocean Research


Total No of vacancies:– 10 Posts


Job Role Or Post Name:Senior Consultant, Consultant 


Educational Qualification:Degree (Engg), Any Degree, PG (Science)


Who Can Apply:All India


Last Date:15-11-2021


Website: ncpor.res.in


Click here for Official Notification


cfw ap nic in MLHP Recruitment Zone wise Provisional Merit List

nrhm

Gemini Internet

MLHP RECRUITMENT ZONE-1 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-2 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-3 PROVISIONAL MERIT LIST.

 MLHP RECRUITMENT ZONE-4 PROVISIONAL MERIT LIST.

 

TTD UPDATE

🕉 *తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగం*
        ➖〰〰〰〰〰〰➖
🕉 TTD News ™ తిరుమల:
        నవంబరు 11వ తేదీన తిరుమల శ్రీవారి ఆలయంలో పుష్పయాగ మహోత్సవం శాస్త్రోక్తంగా జరుగనుంది. నవంబరు 10న  పుష్పయాగానికి అంకురార్పణ  నిర్వహించనున్నారు.

🕉 పుష్పయాగం రోజున ఆలయంలో రెండవ అర్చన, రెండవ గంట, నైవేద్యం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామి ఉత్సవర్లను సంపంగి ప్రదక్షిణంలోని కల్యాణమండపానికి వేంచేపు చేసి స్నపనతిరుమంజనం నిర్వహిస్తారు. 👉ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేస్తారు.

★★ మధ్యాహ్నం 1 నుంచి 5 గంటల వరకు వివిధ రకాల పుష్పాలు, పత్రాలతో వేడుకగా పుష్పయాగం నిర్వహిస్తారు. సాయంత్రం సహస్రదీపాలంకార సేవ తరువాత ఆలయ నాలుగు మాడ వీధుల్లో శ్రీమలయప్పస్వామివారు భక్తులకు దర్శనమిస్తారు. 

👉 ఈ కారణంగా వర్చువల్  ఆర్జితసేవలైన కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, బ్రహ్మోత్సవాన్ని టిటిడి రద్దు చేసింది.
 *Dept.Of PRO TTD* 

10, నవంబర్ 2021, బుధవారం

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.

Gemini Internet

తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో వెల్లడించింది.


ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.

 

Update for NEET Qualified Candidates: Online Counselling for Allotment of Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) Seats

NEET-UG, 2021 పరీక్షలో అర్హత సాధించి, అండర్ గ్రాడ్యుయేట్ (BAMS/BSMS/BUMS/BHMS) కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థులందరికీ ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, డీమ్డ్ యూనివర్సిటీలు సహా ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. 2021-22 సెషన్ కోసం విశ్వవిద్యాలయాలు మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC), ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.

AACCC-UG కౌన్సెలింగ్ 2021లో పాల్గొనడానికి, అభ్యర్థులు AACCC అధికారిక వెబ్‌సైట్ (www.aaccc.gov.in)లో తమను తాము నమోదు చేసుకోవాలి.

అభ్యర్థులు వారి కేటగిరీ ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించాలని దయచేసి గమనించండి.

2వ రౌండ్‌లో కేటాయించిన సీటు/ఇన్‌స్టిట్యూట్‌కు అభ్యర్థి రాజీనామా చేస్తే తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది. ఇంకా, అభ్యర్థి రౌండ్-3 / మాప్ అప్ రౌండ్‌లో కేటాయించిన సీట్లలో చేరకపోతే/నిష్క్రమించకపోతే, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది.

All the eligible candidates who qualified in NEET-UG, 2021 examination and aspiring for admission in Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) courses are hereby informed that Counselling for All India Quota seats including Government, Government Aided, Deemed Universities, Central Universities, and National Institutes for the session 2021-22 will be conducted by Ayush Admissions Central Counseling Committee (AACCC), Ministry of Ayush, Government of India.

  • For participation in AACCC-UG Counseling 2021, the candidates are required to register themselves at the official website of AACCC (www.aaccc.gov.in).

  • Kindly note that Non-Refundable registration fees and Refundable Security deposits have to be paid by the candidates at the time of registration as per their category.

  • The Refundable Security Deposit will be forfeited if a candidate resigned from the seat/institute allotted during the 2nd Round. Further, the Refundable Security Deposit will be forfeited, if the candidate does not join/exit the allotted seats in Round-3 / Mop Up Round.

 Gemini Internet

DOT డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్‌మెంట్ 2021 అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ – 9 పోస్టులు dot.gov.in చివరి తేదీ 07-12-2021


Name of Organization Or Company Name :Department of Telecommunications


Total No of vacancies:– 9 Posts


Job Role Or Post Name:Assistant Director, Junior Telecom Officer 


Educational Qualification:Diploma, Degree (Engg/ Science)


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: dot.gov.in


Click here for Official Notification


*తిరుమలలో ఉచిత వివాహలు*

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

👉 ఇందులో భాగంగా...
◆ పురోహితుడు,
◆ మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, 
◆ పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను 
    టిటిడి ఉచితంగా అందిస్తుంది.
 
🟢 వీటితోపాటు...
  ● 12 లడ్డూలను
 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. 
● వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.

■ వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

📜 👉 పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

★ వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.

👉 📄 ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

🕉 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...

★ ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

🟢 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 
◆ అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.

★ వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక
● ఓటర్‌, 
● ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 
■ వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

■ కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

■ కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.

🟢 వధువుకు 18 సంవత్సరాలు,
🟢 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. 

❌ ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.


☎️  ఇతర వివరాలకు...
*ఫోన్‌ – 0877 – 2263433*  
          సంప్రదించవచ్చు.
 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు
               ➖➖➖
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, 
తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.

👉 ఇందుకోసం నూతన వదూవరులు తమ 
◆ వయస్సు ధృవపత్రములు,
◆ నివాస ధృవపత్రము,
◆ వివాహము ఫోటో,
◆ పెండ్లి పత్రిక, 
◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. 
◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. 

👉 ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ 
☎️ *0877 – 2277744* సంప్రదించవచ్చు.

✳️ తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
*Dept of PRO TTD.*
టీటీడీ టెలిగ్రామ్ న్యూస్ రిపోర్టర్  ౼ రెడ్డేరి శేఖర్ రెడ్డి
  📞  701 345 1212

AP Postal Jobs Update | ఆంధ్రప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్స్ 2021-22 Last Date is 18-11-2021

Dear Applicant, You require to re-exercise options for the GDS posts applied during Jan-Mar21. Visit /appost.in/gdsonline for more details-IndiaPost ఈ మేసేజ్ వచ్చిన వారు వారి యొక్క లాగిన్ డోటెయిల్స్ తో గతంలో మీరు ఖాళీలకు పెట్టుకున్న ఆప్షన్లను మరొక సారి పెట్టుకోవలసినదిగా అభ్యర్థన.

కారణంః ప్రస్తుతం కొన్ని పోస్టులను తగ్గించడమో లేదా తొలగించడమో లేదా పెంచడమో జరినట్లు తెలుస్తోంది (కొందరి ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఏరియాలలో ఉద్యోగాలను తొలగించినట్టు ఉంది) కాబట్టి ఎక్కడెక్కడ మీ క్యాటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా క్రింద ఉన్న లింక్ చూసుకుని ఆప్షన్లలోమళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవలసినదిగా మనవి.

సంప్రదించండి Gemini Internet

గతంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్పటి లాగిన్ ఐడి మరియు అప్లికేషన్ లో అప్పుడిచ్చిన మొబైల్ కు కొత్తగా వచ్చిన OTP to అప్లై చేసుకోవడానికి లింక్  

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఎంపికలను పునఃపరిశీలించాలని తెలియజేయడమైనది 03.11.2021 నుండి 18.11.2021 వరకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన 27.01.2021 నుండి 01.03.2021 వరకు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.


NIELIT రిక్రూట్‌మెంట్ 2021 సైంటిస్ట్ C & D – 33 పోస్టులు www.nielit.gov.in చివరి తేదీ 07-12-2021



Name of Organization Or Company Name :National Institute of Electronics and Information Technology 


Total No of vacancies:– 33 Posts


Job Role Or Post Name:Scientist C & D 


Educational Qualification:BE/ B.Tech, M.Sc, ME/ M.Tech, M.Phil


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: www.nielit.gov.in


Click here for Official Notification


BCCL రిక్రూట్‌మెంట్ 2021 డ్రైవర్ – 94 పోస్టులు www.bcclweb.in చివరి తేదీ 22-11-2021


Name of Organization Or Company Name :Bharat Coking Coal Limited


Total No of vacancies: 94 Posts


Job Role Or Post Name:Driver 


Educational Qualification:8th Class, Valid Driving Licence


Who Can Apply:All India


Last Date:22-11-2021


Website: www.bcclweb.in


Click here for Official Notification


PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.

మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‏ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.

 

Gemini Internet

ఆదాయాన్ని పెంచుకునే ఆరు అద్భుత మార్గాలు.. ఆచరిస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు

ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది ఒకే ఒక్క ఆదాయ మార్గంతోనే జీవితం వెళ్లదీస్తుంటారు. ఇంకేమైనా ఆదాయమార్గాలున్నాయేమో కూడా ఆలోచించరు. అయితే ఈ రోజుల్లో ఒక్క ఆదాయమార్గంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ప్రస్తుతం మనిషి అవసరాలకు తోడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పలు విధాలుగా సౌకర్యాలను అందించే వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే మల్టిపుల్ సోర్సెస్ గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే ఆరు మార్గాల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

1. ఏదో ఒక విద్యలో నైపుణ్యం పెంచుకోవడం 

ఈ రోజులల్లో అన్నిరంగాలలోనూ నిపుణుల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిపుణత సాధించాలి. మిగిలినవారికన్నా ఏదోఒక ప్రత్యేక పరిజ్ఞానం కలిగివుండాలి. అప్పుడు మీ సేవలు ఏదో ఒక సంస్థ స్వీకరించి మీకు ఆదాయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్రీయ సంగీతం మొదలు కొని కంటెంట్ రైటింగ్ వరకూ ఏదైనా సరే మీకు ఇష్టమైన విద్యను నేర్చుకోవచ్చు. 

2. మీ స్కిల్స్ పదిమందికీ తెలియజేయండి

ఈ రోజుల్లో తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీఒక్కరూ పరితపిస్తున్నారు. ఏదో ఒకవిధంగా ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే మీకున్న స్కిల్స్ పదిమందికీ తెలియజేసి ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆర్టికల్ రైటింగ్, కొత్త భాష నేర్పడం, కోడింగ్, కుకింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ మొదలైనవన్నీ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. 

3 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకోండి

ఈ రోజుల్లో చాలామంది పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌పై ఆధారపడుతున్నారు. ఒకసారి పనిచేసి జీవితాంతం ఆదాయం అందుకోవడం పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌తో సాధ్యమవుతుంది. దీనిని స్మార్ట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోకి బ్లాగింగ్, బుక్ రైటింగ్, రాయల్టీ ఇన్కమ్, ఆన్‌లైన్ కోర్సులు అందించడం, రెంటల్ ఇన్కమ్ మొదలైనవన్నీ పాసివ్ ఇన్కమ్ కోవలోకి వస్తాయి. 

సైడ్ బిజినెస్ చేయడం

మీరు మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటే సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. 8 గంటలపాటు ఏదోఒక ఉద్యోగం చేసిన తరువాత మరో 6 గంటల సమయంలో మరో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు అభిరుచి కలిగిన వ్యాపారాన్ని చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, కోచింగ్ సెంటర్ నడపడం, జనరల్ స్టోర్ నడపడం మొదలైనవి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 

ఇన్వెస్ట్‌మెంట్ చేయడం

అదనపు ఆదాయాన్ని అందుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది మరో ఉత్తమ మార్గం. తగిన మొత్తంలో వివిధ బ్యాంకులు లేదా పోస్టల్ పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ప్రతీనెలా ఆదాయాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. 

హాబీలను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం

మీకున్న హాబీలను ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రాయడం అంటే ఇష్టముంటే పుస్తకాలు రాయవచ్చు లేదా బ్లాగ్ నిర్వహించవచ్చు. మెహందీ దగ్గర నుంచి పెయింటింగ్ వరకూ ఇలా ఏ హాబీనైనా ఆదాయమార్గంగా మార్చుకోవచ్చు.