ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.   వెబ్‌సైట్‌   -| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన...

హిందూపురానికి అయోధ్య రామయ్య పాదుకలు | Ayodhya Ramaya's Footsteps to Hindupuram

పురానికి అయోధ్య రామయ్య పాదుకలు హిందూపురం అర్బన్, న వంబరు 24: ఆదర్శ ప్రాయుడు సీతారామచంద్రమూర్తి పాదుకలు హిందూపురానికి శుక్రవారం చేరాయి. రామజన్మభూమి అయోధ్యలోని శ్రీరామునికి కర్ణాటక  రాష్ట్రం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మఠం ఆధ్వర్యంలో శారదా పాదుకలు అందజేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి తెలిపారు. అలాగే 16 నదుల నుంచి గంగా జలాన్ని సేకరించి కర్ణాటకలో కోటి ఇళ్లలో పూజలు చేయించి జనవరి 22వ తేదీన  మాలయానికి అందజేస్తారన్నారు. ఎంఎఫ్ రోడ్డులోని హయగ్రీవ ఆలయానికి పాదుకలు చేరుకున్నాయి. భక్తులు పాదుక లను దర్శించుకున్నారు. భగవత్ కార్యక్రమానికి ప్రతి హిందువు పాల్గొనాల న్నారు. పూజలు చేయించాలనుకునేవారు రామాంజనేయ బేకరి జనార్ధన్ 9030443900, 9182079188లను సంప్రదించాలన్నారు.

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం | విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ | Free training for unemployed, followed by job with certificate Free training and job placement training in Health Counselor and Coordinator Course at Keats Trust, Vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ అనంతపురం క్లాక్వర్, నవంబరు 24: విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ చదివి 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 1 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు. పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు 90004 87423ను సంప్రదించాలన్నారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు | Results of Town planning overseer on APPSC website

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టు భర్తీ నియామక ఫలితాలను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

● AP ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.ఒక లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ | ● High Court's decision on the filling of AP SI posts ● Bench clarification that if found ineligible, costs of Rs one lakh will be imposed on each

మా పర్యవేక్షణలో ‘ఎత్తు’ కొలుస్తాం! ● ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎత్తు వివాదంలో కోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థులకు హైకోర్టు పర్యవేక్షణలో, కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. అయితే, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇచ్చిన వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొలతలకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలకు డిజిటల్‌ విధానాన్ని అవలంభించడాన్ని సవాల్‌...

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం వెనుక భారత మహిళ పాత్ర | Indian woman's role behind Australia's victory in the World Cup

కంగారూల విజయం వెనక భారత మహిళ పాత్ర ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ ప్రపంచ కప్‌ గెలుపులో మంగుళూరు మహిళ ఊర్మిళ రోజారియో కీలక పాత్ర పోషించిందనే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించిన ఊర్మిళ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు. ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్రపంచ కప్‌ను పట్టుకుని ఉన్న ఊర్మిళ ఫొటో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ భారతీయ మహిళకూ క్రికెట్‌కూ మధ్య ఉన్న సంబంధం వెలుగులోకొచ్చింది. బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఊర్మిళ బాస్కెట్‌ బాల్‌, రోవింగ్‌, టెన్నిస్‌, బంజీ జంపింగ్‌ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. వీటన్నిట్లో టెన్నిస్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఊర్మిళ ఆ క్రీడలో రాణించాలనుకుంది. ఆ క్రీడనే తన వృత్తిగా మలుచుకోవాలని కలలు కన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం కారణంగా టెన్నిస్‌ ఆటకు దూరమైంది. అయినప్పటికీ క్రీడలకు ఆమె దూరం కాలేదు. ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొనకపోయినా, పరోక్షంగా ఆ...

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! | Medicine for women's diseases is a banana!

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! అరటిదూటలో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. ఇది మధుమేహవ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. ‘‘ వృంతచ్ఛిన్నః సలిల విధృతః కృత్తతంతు ప్రధవాత్‌! కంబుభ్రాంత్యా జలవిరహితః క్షార జంబీర భృష్టః మధ్యే మధ్యే తనుసకాలితష్టార్ద్రకేనాతిపూర్ణ స్వాదుస్తూర్ణ భతిగర్భదండః కదల్యాః ’’అంటాడు క్షేమశర్మ. అరటిదూట వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ చెప్పిన శ్లోకమిది. అరటి చెట్టు స్తంభం(స్టెమ్‌) పైన డొప్పలు వలిచేస్తే, లోపల శంఖంలా తెల్లగా ఉండే సారవంతమైన భాగాన్ని అరటి ఊచ లేదా దూట అంటారు. కదళీదండం అనేది దీని సంస్కృతనామం. ఇది తెల్లగా, నిండా పీచుకలిగి ఉంటుంది. ఆహార పీచు (డయటరీ ఫైబర్‌) కోసమే దీన్ని వండుకుని తింటారు. అరటి గెలలను కోసేసాక ...