25, నవంబర్ 2023, శనివారం

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌ * పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

JEE Advanced: మే 26న జేఈఈ అడ్వాన్స్‌డ్‌

* పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసిన ఎన్‌టీఏ

ఐఐటీల్లో బీటెక్‌ సీట్ల భర్తీకి ఉద్దేశించిన జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష వచ్చే ఏడాది మే 26న నిర్వహిస్తున్నట్టు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్‌టీఏ) వెల్లడించింది. వచ్చే ఏడాది ఏప్రిల్‌ 21 నుంచి 30వ తేదీ వరకు అర్హులైన అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష రుసుము మే 6వ తేదీలోగా చెల్లించాలి. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. జేఈఈ మెయిన్స్‌లో అర్హత పొందిన వారికి అడ్వాన్స్‌డ్‌ పరీక్షకు అర్హత ఉంటుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ ర్యాంకు ఆధారంగా ఐఐటీల్లో ప్రవేశాలు పొందవచ్చు. ఎన్ఐటీ, ట్రిపుల్ ఐటీ తదితర మేటి సంస్థల్లో అడ్మిషన్లకు మెయిన్స్ ర్యాంకే ఆధారం.


 వెబ్‌సైట్‌ 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

హిందూపురానికి అయోధ్య రామయ్య పాదుకలు | Ayodhya Ramaya's Footsteps to Hindupuram

పురానికి అయోధ్య రామయ్య పాదుకలు
హిందూపురం అర్బన్, న వంబరు 24: ఆదర్శ ప్రాయుడు సీతారామచంద్రమూర్తి పాదుకలు హిందూపురానికి శుక్రవారం చేరాయి. రామజన్మభూమి అయోధ్యలోని శ్రీరామునికి కర్ణాటక రాష్ట్రం ఆది శంకరాచార్యులు స్థాపించిన శృంగేరి మఠం ఆధ్వర్యంలో శారదా పాదుకలు అందజేయనున్నట్లు బీజేపీ రాష్ట్ర నాయకుడు కేవీ చలపతి తెలిపారు. అలాగే 16 నదుల నుంచి గంగా జలాన్ని సేకరించి కర్ణాటకలో కోటి ఇళ్లలో పూజలు చేయించి జనవరి 22వ తేదీన  మాలయానికి అందజేస్తారన్నారు. ఎంఎఫ్ రోడ్డులోని హయగ్రీవ ఆలయానికి పాదుకలు చేరుకున్నాయి. భక్తులు పాదుక లను దర్శించుకున్నారు. భగవత్ కార్యక్రమానికి ప్రతి హిందువు పాల్గొనాల న్నారు. పూజలు చేయించాలనుకునేవారు రామాంజనేయ బేకరి జనార్ధన్ 9030443900, 9182079188లను సంప్రదించాలన్నారు.






నిరుద్యోగులకు ఉచిత శిక్షణ, అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం | విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ | Free training for unemployed, followed by job with certificate Free training and job placement training in Health Counselor and Coordinator Course at Keats Trust, Vijayawada

నిరుద్యోగులకు ఉచిత శిక్షణ
అనంతపురం క్లాక్వర్, నవంబరు 24: విజయవాడకు చెందిన కీట్స్ ట్రస్టులో హెల్త్ కౌన్సిలర్, కో-ఆర్డినేటర్ కోర్సులో ఉచిత శిక్షణ, ఉద్యోగాలు కల్పినకు శిక్షణ ఇస్తున్నట్లు కో-ఆర్డినేటర్ హరిప్రసాద్ తెలిపారు. డిగ్రీ చదివి 19-30 సంవత్సరాల మధ్య వయస్సు కలిగిన నిరుద్యోగ యువతీ, యువకులు అర్హులన్నారు. ఎంపికైన అభ్యర్థులకు డిసెంబరు 1 నుంచి 60 రోజుల పాటు ఉచిత శిక్షణ, భోజనం, వసతి సదుపాయం కల్పిస్తామన్నారు. అనంతరం సర్టిఫికెట్తో పాటు ఉద్యోగం కల్పిస్తామని తెలిపారు.
పేర్ల నమోదు, మరిన్ని వివరాలకు 90004 87423ను సంప్రదించాలన్నారు.

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు | Results of Town planning overseer on APPSC website

ఏపీపీఎస్సీ వెబ్సైట్లో టౌన్ ప్లానింగ్ ఓవర్సీర్ ఫలితాలు
సాక్షి, అమరావతి: ఏపీ టౌన్ అండ్ కంట్రీ ప్లానింగ్ విభాగంలో టౌన్ ప్లానింగ్ అండ్ బిల్డింగ్ ఓవర్సీర్ పోస్టు భర్తీ నియామక ఫలితాలను కమిషన్ వెబ్సైట్ https://psc.ap.gov.in లో ఉంచినట్టు ఏపీపీఎస్సీ కార్యదర్శి శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. దీన్ని అభ్యర్థులు గమనించాలని పేర్కొన్నారు.

● AP ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం ● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.ఒక లక్ష ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ | ● High Court's decision on the filling of AP SI posts ● Bench clarification that if found ineligible, costs of Rs one lakh will be imposed on each

మా పర్యవేక్షణలో ‘ఎత్తు’ కొలుస్తాం!
● ఎస్సై పోస్టుల భర్తీపై హైకోర్టు నిర్ణయం
● అనర్హులుగా తేలితే ఒక్కొక్కరికీ రూ.లక్ష

ఖర్చులు విధిస్తామని ధర్మాసనం స్పష్టీకరణ

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): రాష్ట్రంలో ఎస్సై పోస్టుల భర్తీ వ్యవహారంపై హైకోర్టులో కీలక పరిణామం చోటు చేసుకొంది. ఎత్తు వివాదంలో కోర్టును ఆశ్రయించిన 24 మంది అభ్యర్థులకు హైకోర్టు పర్యవేక్షణలో, కోర్టు ప్రాంగణంలో ఎత్తు కొలతలు తీసేందుకు నిర్ణయించింది. అయితే, పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ఇచ్చిన వివరాలు వాస్తవమని తేలితే ఒక్కో పిటిషనర్‌ ఖర్చుల కింద రూ.లక్ష చెల్లించాల్సి ఉంటుందని స్పష్టంచేసింది. కొలతలకు సిద్ధంగా ఉన్న పిటిషనర్ల వివరాలను కోర్టుకు సమర్పించాలని పిటిషనర్‌ తరఫు న్యాయవాదిని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 29కి వాయిదా వేసింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ జి. నరేంద్ర, జస్టిస్‌ న్యాపతి విజయ్‌తో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. ఎస్‌ఐ నియామక ప్రక్రియలో దేహదారుఢ్య పరీక్షలకు డిజిటల్‌ విధానాన్ని అవలంభించడాన్ని సవాల్‌ చేస్తూ పలువురు హైకోర్టులో పిటిషన్లు వేశారు. ఛాతీ కొలత, ఎత్తు విషయంలో డిజిటల్‌ కొలతలు తీసుకోవడంతో చాలా మంది అభ్యర్ధులు అనర్హులయ్యారని పిటిషన్‌లో పేర్కొన్నారు. ఈ వ్యాజ్యం పై విచారణ జరిపిన సింగిల్‌ జడ్జి.. మాన్యువల్‌ విధానాన్ని అనుసరించి ఎత్తును నిర్ధారించాలని బోర్టును ఆదేశించారు. దీనికి అనుగుణంగా మాన్యువల్‌ విధానంలో ఎత్తును నిర్ధారించిన అధికారులు పిటిషనర్లను అనర్హులుగా ప్రకటించారు. దీంతో అభ్యర్థులు ఎ. దుర్గాప్రసాద్‌ సహా 23 మంది మరోసారి హైకోర్టును ఆశ్రయించారు. వీరి వ్యాజ్యంపై విచారణ జరిపిన న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు ఇచ్చేవరకు ఎస్‌ఐ ఎంపిక ఫలితాలను ప్రకటించవద్దని ఆదేశించింది. ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ పోలీస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు చైర్మన్‌ ధర్మాసనం ముందు అప్పీల్‌ చేశారు. శుక్రవారం ఈ అప్పీల్‌ విచారణకురాగా బోర్డు తరఫున జీపీ కిశోర్‌ కుమార్‌, పిటిషనర్ల తరఫున న్యాయవాది జడ శ్రవణ్‌కుమార్‌ వాదనలు వినిపించారు.

మహిళా పోలీసుల ఉత్తర్వులు రద్దు చేయండి

● పిటిషనర్‌ తరఫు వాదనలు.. తీర్పు రిజర్వ్‌ చేసిన హైకోర్టు

అమరావతి, నవంబరు 24(ఆంధ్రజ్యోతి): గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన చట్టం, జీవోలను సవాల్‌ చేస్తూ దాఖలైన వ్యాజ్యాలపై శుక్రవారం హైకోర్టులో వాదనలు ముగిశాయి. ఇరువైపుల వాదనలు ముగియడంతో ధర్మాసనం తీర్పును రిజర్వ్‌ చేసింది. రాతపూర్వక వాదనలు ఓ వారంలో సమర్పించాలని ఇరువైపుల న్యాయవాదులకు సూచించింది. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తులు జస్టిస్‌ యు. దుర్గాప్రసాదరావు, జస్టిస్‌ వెంకట జ్యోతిర్మయితో కూడిన ధర్మాసనం శుక్రవారం ఆదేశాలిచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాల్లోని మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా పరిగణిస్తూ ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ విశాఖకు చెందిన ఆరేటి ఉమామహేశ్వరరావు హైకోర్టులో పిల్‌ వేశారు. మరోవైపు కొంతమంది మహిళా కార్యదర్శులు కూడా హైకోర్టును ఆశ్రయించారు. ఈ వ్యాజ్యాలు శుక్రవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాదులు బాలాజీ వడేరా, నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. ప్రభుత్వం చట్టవిరుద్ధంగా మహిళా కార్యదర్శులకు పోలీసు విధులు అప్పగిస్తోందన్నారు. వారిని దొడ్డిదారిలో పోలీసుశాఖలోకి తీసుకొచ్చిందని తెలిపారు. మహిళా సంరక్షణ కార్యదర్శులను మహిళా పోలీసులుగా గుర్తిస్తూ ప్రభుత్వం తీసుకొచ్చిన నిబంధనలను రద్దు చేయాలని కోరారు. అడ్వకేట్‌ జనరల్‌(ఏజీ) ఎస్‌. శ్రీరామ్‌ వాదనలు వినిపిస్తూ.. సాధారణ పోలీసులకు ఉండే అధికారాలు మహిళా పోలీసులకు ఉండవని తెలిపారు. మహిళా పోలీస్‌గా వారిని సంబోధిస్తారు తప్ప పోలీస్‌ విధులు నిర్వర్తించేందుకు వారిని అనుమతించబోమన్నారు. యునిఫాం ధరించారనే కారణంతో వారిని రెగ్యులర్‌ పోలీసుగా చూడకూడదని చెప్పారు. బందోబస్తు, పోలీసుస్టేషన్‌ రిసెప్షన్‌ లాంటి సాధారణ పోలీసు కానిస్టేబుల్‌ విధులను మహిళా పోలీసులకు అప్పగించకుండా దిగువస్థాయి అధికారులకు డీజీపీ ఇప్పటికే సర్క్యులర్‌ జారీ చేశారని తెలిపారు. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

వరల్డ్ కప్ లో ఆస్ట్రేలియా జట్టు విజయం వెనుక భారత మహిళ పాత్ర | Indian woman's role behind Australia's victory in the World Cup

కంగారూల విజయం వెనక భారత మహిళ పాత్ర

ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌ ప్రపంచ కప్‌ గెలుపులో మంగుళూరు మహిళ ఊర్మిళ రోజారియో కీలక పాత్ర పోషించిందనే ఒక ఆసక్తికరమైన విషయం తాజాగా వెలుగులోకొచ్చింది. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించిన ఊర్మిళ గురించి మరిన్ని ఆసక్తికరమైన విశేషాలు.

ఆస్ట్రేలియన్‌ క్రికెటర్‌ మిచెల్‌ స్టార్క్‌తో కలిసి ప్రపంచ కప్‌ను పట్టుకుని ఉన్న ఊర్మిళ ఫొటో తాజాగా వైరల్‌గా మారింది. దాంతో ఈ భారతీయ మహిళకూ క్రికెట్‌కూ మధ్య ఉన్న సంబంధం వెలుగులోకొచ్చింది. బాల్యం నుంచే క్రీడల పట్ల ఆసక్తిని కలిగి ఉన్న ఊర్మిళ బాస్కెట్‌ బాల్‌, రోవింగ్‌, టెన్నిస్‌, బంజీ జంపింగ్‌ లాంటి క్రీడల్లో చురుగ్గా పాల్గొనేది. వీటన్నిట్లో టెన్నిస్‌ పట్ల మక్కువ పెంచుకున్న ఊర్మిళ ఆ క్రీడలో రాణించాలనుకుంది. ఆ క్రీడనే తన వృత్తిగా మలుచుకోవాలని కలలు కన్నది. కానీ దురదృష్టవశాత్తూ ఒక ప్రమాదం కారణంగా టెన్నిస్‌ ఆటకు దూరమైంది. అయినప్పటికీ క్రీడలకు ఆమె దూరం కాలేదు. ప్రత్యక్షంగా క్రీడల్లో పాల్గొనకపోయినా, పరోక్షంగా ఆటల్లో కీలక వ్యక్తిగా తన స్థానాన్ని పదిలపరుచునే ప్రయత్నాలు మొదలు పెట్టింది. ఆ క్రమంలో స్పోర్ట్స్‌ మ్యానేజ్‌మెంట్‌ వృత్తిని ఎంచుకుంది.

ముద్దుల కూతురు

పెన్సిల్వేనియాలోని కార్నెజీ మెల్లన్‌ యూనివర్శిటీలో బిబిఎ చదివిన ఊర్మిళ సొంత ఊరు కర్నాటకలోని మంగుళూరు దగ్గరున్న కిన్నిగొలి. తల్లితండ్రులైన వ్యాలెంటైన్‌, ఐవీ రోజారియోలు నాలుగు దశాబ్దాలుగా ఖతార్‌లోని దోహాలో ఉద్యోగాలు చేసి, ప్రస్తుతం కాఫీ ప్లాంటర్స్‌గా సాక్లెష్‌పూర్‌లో స్థిరపడ్డారు. కూతురు ఊర్మిళ గురించి మాట్లాడుతూ... ‘‘ఊర్మిళ తల్లితండ్రులుగా మేమెంతో గర్వపడుతున్నాం. ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా ఊర్మిళ సాధించిన ఈ విజయం చిన్నదేమీ కాదు. ఈ స్థాయికి ఎదగడానికి ఎంతో కష్టపడింది. ఎలాంటి సవాలునైనా అధిగమించి, పట్టుదలతో అనుకున్నది సాధించవచ్చని మా అమ్మాయి నిరూపించింది.’’ అంటూ కూతుర్ని ఆకాశానికెత్తేస్తున్నారు ఆవిడ తల్లితండ్రులు. ఊర్మిళ తల్లి ఐవీ రోజారియో దోహాలో యుజిపిసి స్కూల్‌లో టీచర్‌గా పని చేశారు. తండ్రి వ్యాలెంటైన్‌ రోజారియో దోహాలోని ఒక ఫైనాన్స్‌ కంపెనీలో ఫైనాన్స్‌ ఎగ్జిక్యూటివ్‌గా పని చేశారు. 40 ఏళ్ల పాటు దోహాలో పని చేసిన ఈ జంట భారతదేశానికి తిరిగొచ్చి కాఫీ ప్లాంటర్స్‌గా స్థిరపడ్డారు. వీళ్ల నలుగురు సంతానంలో అందరికంటే ఊర్మిళ చిన్నది.

ప్రస్థానం సాగిందిలా...

ప్రారంభంలో ఖతార్‌ టెన్నిస్‌ ఫెడరేషన్‌కు మూడేళ్ల పాటు పని చేసిన ఊర్మిళ, తర్వాత ఆస్ట్రేలియాకు చేరుకుని, అడిలైడ్‌ క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా మూడేళ్ల పాటు సేవలందించింది. ఆ తర్వాత ఆస్ట్రేలియా విమెన్స్‌ క్రికెట్‌ టీమ్‌కు టీమ్‌ మ్యానేజర్‌గా పని చేసింది. ఫుట్‌బాల్‌ వరల్డ్‌ కప్‌ సమయంలో క్రికెట్‌ నుంచి నాలుగు నెలల పాటు లీవ్‌ తీసుకుని, ఖతార్‌లోని ఫుట్‌బాల్‌ స్టేడియం నిర్వహణ బాధ్యతలు చేపట్టింది. ఈ ఏడాది సెప్టెంబరులో ఆస్ట్రేలియాకు తిరిగి వచ్చిన తర్వాత, ప్రపంచ కప్‌ పర్యటనలో ఆస్ట్రేలియా క్రికెట్‌ టీమ్‌కు మ్యానేజర్‌గా వ్యవహరించే అవకాశం ఆమెను వరించింది. మ్యానేజర్‌గా ఊర్మిళ క్రికెటర్ల ట్రాన్స్‌పోర్ట్‌, నివాస ఏర్పాట్లు మొదలైన పనులను నిర్వహిస్తుంది. 

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట! | Medicine for women's diseases is a banana!

స్త్రీవ్యాధులకు ఔషధం అరటి దూట!

అరటిదూటలో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. ఇది మధుమేహవ్యాధి నివారణకు

ఉపకరిస్తుంది.

‘‘ వృంతచ్ఛిన్నః సలిల విధృతః కృత్తతంతు ప్రధవాత్‌!

కంబుభ్రాంత్యా జలవిరహితః క్షార జంబీర భృష్టః

మధ్యే మధ్యే తనుసకాలితష్టార్ద్రకేనాతిపూర్ణ

స్వాదుస్తూర్ణ భతిగర్భదండః కదల్యాః ’’అంటాడు క్షేమశర్మ. అరటిదూట వల్ల కలిగే లాభాలను తెలియజేస్తూ చెప్పిన శ్లోకమిది. అరటి చెట్టు స్తంభం(స్టెమ్‌) పైన డొప్పలు వలిచేస్తే, లోపల శంఖంలా తెల్లగా ఉండే సారవంతమైన భాగాన్ని అరటి ఊచ లేదా దూట అంటారు. కదళీదండం అనేది దీని సంస్కృతనామం. ఇది తెల్లగా, నిండా పీచుకలిగి ఉంటుంది. ఆహార పీచు (డయటరీ ఫైబర్‌) కోసమే దీన్ని వండుకుని తింటారు. అరటి గెలలను కోసేసాక ఈ అరటి స్తంభాన్ని కొట్టి బైట పారేస్తారు. దాని దుంపనుండి పిలకలొచ్చి తిరిగి మరో చెట్టు పెరుగుతుంది. చెట్టు కాండం లోపల ఉండే ఊచ పారేయవలసింది కాదు. అమూల్యమైన ఆరోగ్య సంపద దీనిలో ఉంది.

లాభాలెన్నో!

అరటి దూటలో ఉండే ఆహార పీచు పేగులకు శక్తినిస్తుంది. ఇది జీర్ణాశయ వ్యవస్థని సంరక్షిస్తుంది. కడుపులోని గ్యాసును అరికట్టి అల్సర్లు తగ్గేలా చేస్తుంది. జీర్ణకోశాన్ని శక్తిమంతం చేస్తుంది. శరీరానికి పోషకాలనిచ్చి బలాన్నిస్తుంది. చాలా మంది స్త్రీలలో తరచు కనిపించే అధిక రక్తస్రావాన్ని అరటి దూట హరిస్తుంది. కేవలం అధిక రక్త స్రావమే కాకుండా ఇతర స్త్రీ వ్యాధులకు కూడా ఔషధంలా పనిచేస్తుంది. మలబద్ధకంతో బాధపడే వాళ్లకి అరటిదూట గొప్ప ఔషధం. దీనిలో ఇందులో బి1 విటమిన్‌, పొటాషియం ఎక్కువగా ఉంటాయి. ఇవి రక్తహీనతని, రక్తపోటును నివారిస్తాయి. దీనిలో ఉండే లెక్టిన్‌ అనే పదార్ధానికి ఇన్సులిన్‌ను ఉత్తేజపరిచే శక్తి ఉంటుంది. అందువల్ల ఇది మధుమేహవ్యాధి నివారణకు ఉపకరిస్తుంది. అరటి దూటకు ఉన్న మరొక లక్షణం విష దోషాలను నివారించటం. దీనితో పాటుగా కిడ్నీలను శక్తిమంతం చేస్తుంది. మూత్రంలో మంట, చీముదోషం, మూత్రపిండాల్లో రాళ్లు ఉన్నవారు దీనిని క్రమం తప్పకుండా తింటే అనేక ప్రయోజనాలు కనిపిస్తాయి.

ఎలా వండుకోవాలి?

సాధారణంగా అరిటి దూట మనకు మార్కెట్లో లభిస్తోంది. ఈ దూటను చక్రాలుగా తరుగుతూ ఉంటే– కొంత పీచు వస్తూ ఉంటుంది. ఈ పీచును వేలుకు చుట్టుకుంటూ బయటకు తీసివేయాలి. ఆ తర్వాత చక్రాలను చిన్న చిన్న ముక్కలుగా తరిగి పసుపు నీళ్లలో వేయాలి.( లేకపోతే గాలిలోని ఆక్సిజన్‌ వల్ల దూట నల్లగా అయిపోతుంది). ఆ తర్వాత ఒక మూకుడులో కొద్దిగా నూనె వేసి వేడి చేయాలి. దూట ముక్కలను, సన్నగా తరిగిన అల్లం ముక్కలను నూనెలో వేసి మగ్గనివ్వాలి. ఆ తర్వాత దానిలో ఉప్పు వేసి తగినంత నిమ్మరసం వేసుకోవాలి. ఇలా తయారుచేసిన ముక్కలతో రకరకాల వంటకాలు చేసుకోవచ్చు. అవేమిటో ఇప్పుడు చూద్దాం.

పెరుగుపచ్చడి

ఉడకపెట్టిన ముక్కల్లో పెరుగు కలిపి కొత్తిమీర, ఆవపిండి వేయాలి. దీనిలో తాళింపు వేసుకుంటే పెరుగు పచ్చడి అవుతుంది. కొందరు ధనియాల పొడిని కూడా కలిపి పచ్చడిలా తయారుచేసుకుంటారు.

సూపు

ఈ ముక్కలను ఒక మిక్సిలో వేసి మెత్తగా చేసుకోవాలి. ఆ మిశ్రమాన్ని ఒక గిన్నె వేయాలి. దీనిలో కొన్ని నీళ్లు కలిపి వేడి చేయాలి. అప్పుడు అది సూపుగా తయారువుతుంది.


-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మెస్సేజ్ చేయండి ఛానెల్ లింక్ పంపుతాము. ఆ లింక్ క్లిక్ చేసి ఫాలో బటన్ నొక్కండి నిరంతర సమాచారాన్ని పొందండి |- - | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్‌ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్‌తో జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | - https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html