23, నవంబర్ 2021, మంగళవారం

Scholarship: కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నారా..? అయితే ఈ స్కాల‌ర్‌షిప్ మీ కోస‌మే

Gemini Internet

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.

అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..
- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.

- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.

- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.

- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.

Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.

Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.

Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

AISSEE -2022: సైనిక్ స్కూల్‌లో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేశారా.. ప‌రీక్ష విధానం గురించి తెలుసుకోండి

AISSEE -2022: దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 9, 2022న జ‌ర‌గే ప‌రీక్ష‌కు సంబంధించిన ప‌రీక్ష విధానం మార్కుల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగిసింది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.


ముఖ్య స‌మాచారం ..

ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in

 అర్హ‌త‌లు..

- ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.


- వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.


ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125
300

తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150
500

విద్యాప్రమాణాలు మెరుగుప‌డ్డాయి: యూనిసెఫ్‌
ద్యాప్ర‌మాణాలు పాటించ‌డంలో భార‌త్‌ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేష‌న్స్ చిల్డ్ర‌న్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్న‌ట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్ల‌డించారు.

ఈ స‌ర్వేలో 21000 మంది పాల్గ‌న్నారు. భార‌త్‌లో విద్యా ప్ర‌మాణాలు పెర‌గ‌డంపై యూనిసెఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక యువ జ‌నాభా ఉన్న భార‌త్‌లో ఈ మార్పు ఆహ్వ‌నించ‌ద‌గ్గ‌ద‌ని పేర్కొన్నారు. కోవిడ్ (Covid 19) కార‌ణంగా కొద్ది మంది బాలికలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. తిరిగా మ‌ళ్లీ వారు వారిని పాఠ‌శాల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించింది.

AICTE Scholarship: నవంబర్ 30న ముగియనున్న ఏఐసీటీఈ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్.. నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇటీవలే ఏఐసీటీఈ 2022 సంవత్సరం కొరకు స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది ప్రస్తుతం వివిధ రకాల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ (AICTE) పేర్కొంది. నేషనల్ స్కాలర్‌షిప్‌ పోర్టల్ (NSP) scholarships.gov.in లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా విద్యార్థినుల (girl students)కు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా దివ్యాంగ (specially-abled) విద్యార్థులకు ఏఐసీటీఈ సక్షం(Saksham) స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా కోసం ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ అనే మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆఫర్ చేస్తోంది. నాలుగేళ్ల చదువుకు ప్రగతి స్కాలర్‌షిప్‌ పొందాలంటే విద్యార్థినులు టెక్నికల్ డిగ్రీ/ టెక్నికల్ డిప్లమాలో మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతుండాలి. అయితే విద్యార్థినులు ఏఐసీటీఈ ఆమోదించిన కాలేజీల్లోనే చదువుతుండాలి. దివ్యాంగ విద్యార్థులు, అర్హత గల ఇతర విద్యార్థులు సైతం పైన పేర్కొన్న విధంగా చదువుతుండాలి.

పైన పేర్కొన్న మూడు రకాల స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థులు aicte-india.orgలో AICTE PG స్కాలర్‌షిప్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదించిన రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరిన గేట్, జీప్యాట్‌, సీడ్ క్వాలిఫైడ్ విద్యార్థులు ఏఐసీటీఈ పీజీ స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు 24 నెలలకు లేదా కోర్సు వ్యవధికి నెలకు రూ.2,400 అందుకుంటారు. స్కాలర్‌షిప్ పథకాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీటి రిజిస్ట్రేషన్ నవంబర్ 30న ముగుస్తుందని విద్యార్థులు గమనించాలి.

* ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE Pragati Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ (AICTE Saksham Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ (AICTE SWATH Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ప్రతియేటా స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ విద్యార్థులకు వేయి కంటే ఎక్కువగానే స్కాలర్‌షిప్‌లు కేటాయించింది ఏఐసీటీఈ. ఆసక్తిగల విద్యార్థులు Scholarships.gov.in స్కాలర్‌షిప్‌ గైడ్ లైన్స్ చెక్ చేయగలరు.

Gemini Internet

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

22, నవంబర్ 2021, సోమవారం

Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో 896 ఉద్యోగాలు | దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు

APVVP Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

Gemini Internet

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో (APVVP Hospitals) రెగ్యులర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 896 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి, డెర్మటాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

APVVP Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

 మొత్తం ఖాళీలు 896
 గైనకాలజీ 302
 పీడియాట్రిక్స్ 120
 అనస్తీషియా 118
 జనరల్ మెడిసిన్ 61
 జనరల్ సర్జరీ 53
 ఆర్థోపెడిక్స్ 29
 ప్యాథాలజీ 19
 ఆప్తమాలజీ 29
 రేడియాలజీ 21
 సైకియాట్రి 8
 డెర్మటాలజీ 13
 ఈఎన్‌టీ 21
 సీఎఎస్ జనరల్  86
 డీఏఎస్ 16

APVVP Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు
వేతనం- రూ.53,500

విద్యార్హతలు- సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాస్ కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.1,000.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

APVVP Recruitment 2021: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
For New Applicant Register Here పైన క్లిక్ చేయాలి.
Step 2- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 3- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 4- లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో వ్యక్తిగత వివరాలు, రెండో స్టెప్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- మూడో స్టెప్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ వివరాలు, నాలుగో స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
Step 6- ఐదో స్టెప్‌లో టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీన్‌బీ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 7- చివరగా వివరాలన్నీ సరిచూసుకొని ఫీజు చెల్లించాలి.
Step 8- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు. దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మరో 1317 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు తెలుసుకోండి.

Gemini Internet


దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

 

 

ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో డిగ్రీ ఆ పై అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు | The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

Gemini Internet

అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు కోసం లింక్ క్రింద ఇవ్వబడింది

The link for application to the post of ASSISTANT MANAGER and STAFF ASSISTANT is given below 

Jobs purely for Local Candidates only

Click here for Application link

Click here to download notification for Staff Assistants

Click here to download notification for Assistant Managers

DCCB బ్యాంకు అనంతపురం జిల్లాలో 86 అసిస్టెంట్ మేనేజర్, క్లర్కు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్లకు చివరి తేది డిసెంబర్ 03-2021

ఏపీ, అనంతపురం జిల్లాలోని ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో అపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఎడిసిసిబి) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్లకోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఉద్యోగాల పేర్లుః 1) అసిస్టెంట్ మేనేజర్లు 20 | 2) స్టాఫ్ అసిస్టెంట్లు / క్లర్కులు 66 మొత్తం ఖాళీలు 86

విద్యార్హతలుః 

అసిస్టెంట్ మేనేజర్లుః కనీసం 60 శాతం  మార్కులతో గ్రాడ్యుయేషన్, ఎకనమిక్స్ / స్టాటిస్టిక్స్ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారి ప్రాధాన్యం, అలాగే కంప్యూటర్ లో పరిజ్ఞానం కలిగిఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

క్లర్కు/స్టాఫ్ అసిస్టెంట్ః గ్రాడ్యుయేషన్, ఇంగ్లీషు, తెలుగు భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ లో  ప్రావీణ్యం ఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

వయస్సుః పోస్టును అనుసరించి 30 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కలదు

వేతనంః పోస్ట్ ని బట్టి నెలకు 35,000/- నుండి 1,20,000/- వరకు 

ఫీజు వివరాలుః జనరల్ కు 590/-, SC/ST లకు 413/-

ఎంపికః ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ప్రారంభమైన తేదిః నవంబరు 19

చివరి తేదిః డిసెంబర్ 3

అప్లికేషన్ లింక్ కోసం Click here for Application link

Click here to download notification for Staff Assistants స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Click here to download notification for Assistant Managers అసిస్టెంట్ మేనేజర్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 

 



Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు ఉండి ఆ తేదీల్లో దర్శనానికి వెళ్లని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Tirupati: తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందిస్తూ.. తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయన్నారు. ఈ వర్షాల వలన తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలిగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని సుబ్బారెడ్డి చెప్పారు. అంతేకాదు రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.  ఈ ఘాట్ రోడ్డులో కూడా టీటీడీ సిబ్బంది కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని చైర్మన్ వివరించారు.

శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు.  స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని  సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

 

Gemini Internet

మాజీ సైనికుల పిల్లలకు స్కాలర్ షిప్స్ | Scholarships for Ex Army Children -2021-22

పత్రికా ముఖంగా ప్రకటన

కేంద్రీయ సైనిక బోర్డు వారు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు మొదటి ఏడాది చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకానికి దరఖాస్తు గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించామని జిల్లా సైనిక సంక్షేమాధికారి వి.భక్తవత్సలరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను www.ksb.in వెబ్ సైట్లో పొందుపచరాలన్నారు.

Gemini Internet


 

RFCL- 2021-22 నోటిఫికేషన్… దరఖాస్తు చేసుకోండి Last Date 24 నవంబర్ 2021

RFCL ఉద్యోగ నోటిఫికేషన్:: NFL,FCIL,EIL… జాయింట్ వెంచర్ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం 2021లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు 24 నవంబర్ 2021 వరకు లేదా అంతకు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాస్ కావాలి, ఈ అర్హత గల విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

కెమికల్ ల్యాబ్ -1

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-08

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ప్రొడక్షన్ 8

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ మెకానికల్ 4

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ 2

Godan కీపర్ 1

స్టోర్ అసిస్టెంట్ 1

అసిస్టెంట్ గ్రేడ్-3

అసిస్టెంట్ గ్రేడ్-3 – రవాణా 3

అర్హతలు

జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (కెమికల్ ల్యాబ్)/జనరల్ ఓ బి సి/ews విద్యార్థులకు మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ తో రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ, ఎస్సీ ఎస్టీలకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (ప్రొడక్షన్)-రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ (ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్) obc వారికి 50 శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి

 

కెమికల్ ఇంజనీరింగ్ లో రెగ్యులర్ 

మూడు సంవత్సరాల డిప్లమా

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ 2

రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లతో జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమా

మరియు రిజర్వ్ చేయబడినది స్థానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://www.nationalfertilizers.com/ అనే వెబ్ సైట్ ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

 

Gemini Internet

20, నవంబర్ 2021, శనివారం

For Bi.P.C. EAPCET 2021-22 Qualified Candidates | B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి.

B.Sc., (ఆనర్స్.) అగ్రికల్చర్ B.Tech (అగ్రికల్చర్ ఇంజినీరింగ్), B.Tech., (Food Technology) మరియు B.Sc., (Hons.) కమ్యూనిటీ సైన్స్ - UG కోర్సులలో ప్రవేశానికి దరఖాస్తులు ఆహ్వానించబడ్డాయి. 2021-22 విద్యా సంవత్సరంలో మిగిలిపోయిన సీట్ల కోసం NRI/NRI ప్రాయోజిత కోటా కింద ANGRAU, Guntur, AP

దరఖాస్తు ఫారమ్ మరియు సమాచారం బ్రౌచర్‌ను ANGRAU.AC.IN వెబ్‌సైట్ నుండి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు, పూర్తి చేసిన దరఖాస్తు ఫారమ్‌తో పాటు అవసరమైన ఎన్‌క్లోజర్‌లు మరియు ఆన్‌లైన్ చెల్లింపు రసీదు రిజిస్ట్రార్, ఆచార్య ఎన్‌జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్, LAM గుంటూరు - 522034కు చేరుకోవాలి. AP

ముఖ్యమైన తేదీలు

దరఖాస్తు స్వీకరణ చివరి తేదీ

06-12-2021 (సాయంత్రం 4.00)

వెబ్సైట్లో మెరిట్ జాబితా

09-12-2021

మాన్యువల్ కౌన్సెలింగ్

15-12-2021

Venue / వేదిక

Auditorium, PARS, Lam, Guntur

ఎన్‌ఆర్‌ఐ/ఎన్‌ఆర్‌ఐ ప్రాయోజిత కేటగిరీ కింద ఇప్పటికే మొదటి నోటిఫికేషన్‌కి దరఖాస్తు చేసి, మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరుకాని వారు మళ్లీ దరఖాస్తు చేయనవసరం లేదు, అయితే రెండవ మాన్యువల్ కౌన్సెలింగ్‌కు హాజరు కావడానికి అభ్యర్థన లేఖ ఈ కార్యాలయానికి (registrar@angrau.ac.in) లేదా అంతకు ముందు చేరుకోవాలి. 06-12-2021 

Click here for information Broucher

Gemini Internet

Applications are invited for admission in to the U G Courses – B.Sc., (Hons.)  Agriculture B.Tech (Agricultural Engineering), B.Tech., (Food Technology) and B.Sc., (Hons.) Community Science of ANGRAU, Guntur, AP under NRI/NRI Sponsored Quota for left over seats during the Academic year 2021-22

The  application form and information Broucher may be downloaded from the website ANGRAU.AC.IN the duly filled in application form along with required enclosures and online payment receipt should reach the registrar, Acharya N G Ranga Agricultural University, Administrative  office, LAM Guntur – 522034. AP

Important Dates

Last date  of receipt of application

06-12-2021 (4.00 PM)

Merit List on website

09-12-2021

Manual counseling

15-12-2021

Venue

Auditorium, PARS, Lam, Guntur

Those who already applied for first notification under NRI/NRI sponsored category and not attended for manual counseling need not apply again however, request letter for attending the second manual counseling has to reach this office (registrar@angrau.ac.in) on or before 06-12-2021

Click here for information Broucher

 


Helpdesk Numbers 7893520988, 7331148417, 9989872921, 8008987458


 

 

ఇండియన్ మిలిటరీ అకాడమీ రిక్రూట్‌మెంట్ 2021 కుక్, MT డ్రైవర్, LDC, MTS, గ్రౌండ్స్‌మ్యాన్ & ఇతర - 188 పోస్టులకు చివరి తేదీ 45 రోజుల్లోపు



Name of Organization Or Company Name :Indian Military Academy, Dehradun


Total No of vacancies: 188 Posts


Job Role Or Post Name:Cook, MT Driver, LDC, MTS, Groundsman & Other 


Educational Qualification:10th & 12th Class


Who Can Apply:All India


Last Date:Within 45 days from the date of advertisement (refer Noification)


Click here for Official Notification


Online Aadhaar Update ఆధార్ అప్డేట్: మీ ఫోన్ లోనే మీ ఆధార్ కార్డ్ అడ్రెస్స్ అప్డేట్ చేసుకోవచ్చు

ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు 

మీ ఫోన్ లోనే మీ ఆధార్ అప్డేట్ చేసుకోవచ్చు 

చాలా సింపుల్ గా అప్డేట్ చేసుకోవచ్చు

Gemini Internet

ఆధార్ కార్డ్ లో పేరు వయసు లేదా మరింకేదైనా వివరాలను మార్చాలన్నా లేదా అప్డేట్ చేయాల్సివచ్చినా కూడా ఆధార్ కేంద్రాలకు వెళ్ళవలసి వచ్చేది. కానీ, ఇపుడు మీకు ఆ శ్రమ ఉండదు. మీరు ఆధార్ కేంద్రానికి వెళ్లకుండానే మీ అడ్రెస్స్ ను ఆన్లైన్లో అప్డేట్ చేసుకోవచ్చు. దీనికోసం మీరు ఇంటర్నెట్ కనెక్షన్ మరియు ప్రభుత్వం యొక్క గుర్తింపు పొందిన ఐడెండిటీ ప్రూఫ్ ఏదైనా ఒకటి ఒకటి కలిగి ఉంటే సరిపోతుంది.

ఆన్లైన్లో ఆధార్ అప్డేట్ ఈ క్రింద విధంగా చేయాలి:

ముందుగా మీ ఫోన్ లో అధికారిక ఆధార్ వెబ్సైట్ uidai.gov.in ని తెరవండి

ఇక్కడ మీకు మైన్ పేజ్ లో మూడవ అప్షన్ 'Update Address In Your Aadhaar' కనిపిస్తుంది

దీని పైన క్లిక్ చెయ్యగానే కొత్త పేజ్ కి మళ్ళించబడతారు

ఇక్కడ మీకు కనిపించే క్యాప్చా ను సరిగా నింపి OTP అప్షన్ పైన నొక్కండి

మీకు మీ ఆధార్ రిజిస్టర్డ్ మొబైల్ నంబర్ పైన OTP అందించబడుతుంది

మీరు OTP ని ఎంటర్ చేసి సబ్మిట్ చేసిన వెంటనే మరొక కొత్త పేజ్ తెరుచుకుంటుంది

ఇక్కడ  Change/Update కోసం Adress అప్షన్ పైన నొక్కండి

ఇక్కడ మీరుమీ వివరాలను నింపి, మీ ఐడెండిటీ ప్రూఫ్ ను సబ్మిట్ చేయాలి

తరువాత, మీరు మీ మొబైల్ నంబర్ పైన మరొక OTP అందుకుంటారు

OTP ఎంటర్ చేసి Save అప్షన్ పైన నొక్కండి

అంతే, మీరు మీ అడ్రెస్ చేంజ్ రిక్వెస్ట్ కోసం అప్లై చేకున్నట్లే. మీరు మీ అడ్రస్ చేంజ్ రిక్వెస్ట్ ప్రాసెస్ అయిందో లేదో తెలుసుకోవడానికి Update Request Number అనే ఆప్షన్ ను ఉపయోగించవచ్చు.

 

Business Opportunity Electric Vehicle Conversion Course ఎలెక్ట్రిక్ వెహికల్ కన్వర్షన్ కోర్సు


స్పందించే ముందు జాగ్రత్త వహించండి ఇది కేవలం సమాచార చేరవేత నిమిత్తం ప్రచురితం ఈ కోర్సుకు మా సంస్థకు మాకు ఎలాంటి సంబంధము లేదు.







 

Be Smart Before pay and click here for Payment Link

Gemini Internet

PMVVY: ఈ స్కీమ్‌లో చేరితే పదేళ్లు ప్రతి నెల రూ.10వేల పెన్షన్‌! | 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

Pradhan Mantri Vaya Vandana Yojana: భారత ప్రభుత్వం ప్రజల కోసం సామాజిక భద్రతా పథకాలను తీసుకొని ముందుకు వస్తుంది. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్(పీపీఎఫ్), అటల్ పెన్షన్ యోజన, నేషనల్ పెన్షన్ స్కీం, సీనియర్ సిటిజన్స్ సేవింగ్ స్కీం వంటి అనేక పథకాలు ఎప్పుడో తీసుకొని వచ్చింది. ముఖ్యంగా నరేంద్ర మోడి నేతృత్వంలోని ప్రభుత్వం వృద్దుల కష్టాలను గుర్తించి ప్రధాన్ మంత్రి వయ వందన యోజన పేరుతో ఒక పథకాన్ని 2017 మార్చిలో తీసుకొని వచ్చింది. ఈ పథకం రిటైర్ మెంట్ & పెన్షన్ స్కీం. ఈ స్కీమ్‌ సీనియర్‌ సిటిజన్లకు ఎంతో భద్రతగా ఉంటుంది. 60 ఏళ్లకంటే ఎక్కువ ఉన్న వారు ఈ స్కీమ్‌లో చేరవచ్చు. 

ఇందులో డబ్బులను పొదుపు చేస్తే 10 ఏళ్ల పాటు ఫించన్‌ పొందవచ్చు. ఈ స్కీమ్‌ను ఎల్‌ఐసీ నిర్వహిస్తుంది. ఈ స్కీమ్‌లో చేరేందుకు ముందుగా 2020 మార్చి 31 వరకు గడువు ఉండేది. దానిని 2023 మార్చి వరకు పొడిగించారు. ఈ పెన్షన్ పథకంను సీనియర్ సిటిజన్స్ కోసం తీసుకొచ్చిందని గుర్తుంచుకోవాలి. ఈ పాలసీలో చేరాలంటే కనీస వయస్సు 60 ఏళ్లు ఉండాలి. ఇందులో పెట్టుబడి పెట్టిన నగదుపై 7.40 శాతం వడ్డీ చెల్లించనున్నారు. ఈ పథకం గడువు కాలం 10 ఏళ్లు ఉంటుంది. దీనిలో చేరినవారు నెల, మూడు నెలలు, ఆరు నెలలు, సంవత్సరం ఒకసారి పెన్షన్ పొందవచ్చు. ఈ పాలసీ కింద కనిష్ఠ పెన్షన్ నెలకు రూ.100 కాగా, గరిష్టంగా రూ.9,250 పెన్షన్ ఇవ్వనుంది. మీకు నెలకు రూ.1000 పెన్షన్ కావాలంటే రూ.1.62 లక్షల వరకు పెట్టుబడి పెట్టాల్సి ఉంటుంది. ఇక నెలకు రూ.9250 పెన్షన్ కావాలంటే రూ.15 లక్షలు ఇన్వెస్ట్ చేయాలి. 

ఒకవేళ మీరు నెలనెల వద్దు అనుకుంటే మూడు నెలలు, ఆరు నెలలకోసారి పింఛన్‌ పొందే సదుపాయం ఉంటుంది. నెలనెల బ్యాంకు ఖాతాకు ఫించన్‌ డబ్బులు జమ అవుతాయి. ఒకవేళ పాలసీదారుడు మధ్యలోనే చనిపోతే పెట్టుబడి పెట్టిన డబ్బులు నామినీకి తిరిగి ఇవ్వనున్నారు.అలాగే గడువుకాలం ముగిసాక పాలసీదారుడిక పెట్టుబడి డబ్బులు తిరిగి ఇవ్వనున్నారు. ఇందులో లోన్ తీసుకునే సదుపాయం కూడా ఉంది. పాలసీలో చేరిన మూడు సంవత్సరాల తర్వాత అప్పటి వరకు కట్టిన దానిలో 75 శాతం మొత్తాన్ని లోన్ కింద తీసుకోవచ్చు. పాలసీదారుడికి ఈ పాలసీ నచ్చకపోతే కార్పొరేషన్ నుంచి 15 రోజుల్లో వెనక్కి తీసుకోవచ్చు. ఈ పథకంలో మీరు ఎంత పెట్టుబడి పెట్టారో అనేదానిపై ప్రతి నెల పెన్షన్ ఆధారపడి ఉంటుంది. 10 ఏళ్ల గడువు పూర్తికాకముందే పాలసీ వద్దనుకుంటే మీరు ఇన్వెస్ట్ చేసిన దాంట్లో 98 శాతం మాత్రమే వెనక్కి వస్తుంది.

Gemini Internet