15, డిసెంబర్ 2020, మంగళవారం

Anantapuramu District Classifieds

 

Mini Job Mela 2020 Update Telugu || కాకినాడ లో ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా

 

కాకినాడలో ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మినీ జాబ్ మేళా :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కాకినాడ నగరంలో ఉన్న ఆలీవ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు ఉద్యోగాలను కల్పించడానికి మినీ జాబ్ మేళా ను నిర్వహించనున్నారు. దీనికి సంబంధించిన ఒక ప్రకటన తాజాగా విడుదల అయినది.

ఈ మినీ జాబ్ మేళా లో పలు సంస్థలలో ఉద్యోగాలను నిరుద్యోగులకు కల్పించనున్నారు. అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ మినీ జాబ్ మేళా కు హాజరు కావచ్చు.

ముఖ్యమైన వివరాలు :

మినీ జాబ్ మేళా నిర్వహణ తేదిడిసెంబర్ 16,2020
జాబ్ మేళా నిర్వహణ సమయంఉదయం 9 గంటలకు

జాబ్ మేళా నిర్వహణ ప్రదేశం  :

ఆలీవ్ ఫౌండేషన్,ఫౌండేషన్ కార్యాలయం, కరణం గారి జంక్షన్,కాకినాడ.

సంస్థల వారీగా ఉద్యోగాలు – వివరాలు :

ఐసీఐసీఐ బ్యాంకు :

ఈ బ్యాంకు లో క్యాషియర్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

సింప్లిజిత్ అకాడమీ :

ఈ అకాడమీ లో హెచ్. ఆర్ పొజిషన్ ను భర్తీ చేయనున్నారు.

స్టార్ హాస్పిటల్ :

ఈ సంస్థలో స్టాఫ్ నర్స్ ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అపోలో ఫార్మసీ :

ఈ ఫార్మసీ సంస్థలో ఫార్మాసిస్ట్ ఉద్యోగాలను మినీ జాబ్ మేళా ద్వారా భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాల జాబ్ మేళా కు హాజరు కాబోయే అభ్యర్థులు వివిధ సంస్థల ఉద్యోగాలను అనుసరించి డిగ్రీ/ బీ. టెక్/జిఎన్ఎం/బీ. ఎస్సీ (నర్సింగ్ )/బీ. ఫార్మసీ /ఎం. ఫార్మసీ /ఎంబీఏ(హెచ్. ఆర్ ) కోర్సులను పూర్తి చేసి ఉండవలెను.

వయసు :

ఈ మినీ జాబ్ మేళా కు హాజరు కావాలంటే అభ్యర్థుల వయసు 18 సంవత్సరాలనుండి 35 సంవత్సరాలు కలిగి ఉండవలెను.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 11,500 రూపాయలు నుండి 20,000 రూపాయలు వరకు జీతం లభించనుంది.

మినీ జాబ్ మేళా కు హాజరు అయ్యే అభ్యర్థులు వారి ఒరిజినల్ సర్టిఫికెట్స్ ను తమ వెంట తీసుకుని వెళ్లవలెను.

ఈ మినీ జాబ్ మేళా గురించి మరింత ముఖ్యమైన సమాచారం కొరకు ఈ క్రింది మొబైల్ నంబర్లను సంప్రదించవచ్చు.

ఫోన్ నెంబర్లు :

8985487872,

7981891042.

 

జనవరి 9న జగనన్న అమ్మఒడి రెండో విడత ఆర్థిక సాయం



• రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్

• ఈ నెల 16న లబ్ధిదారుల జాబితా ప్రదర్శన

• షెడ్యూల్ విడుదల చేసిన మంత్రి

అమరావతి

2020-21 ఏడాదికి గానూ వచ్చే నెల (జనవరి) 9వ తేదీన జగనన్న అమ్మ ఒడిపథకం రెండో విడత ఆర్థిక సాయం సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేతుల మీదుగా అందివ్వనున్నట్లు రాష్ట్ర విద్యా శాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. రెండో ఫేజ్ చెల్లింపుల్లో భాగంగా షెడ్యూల్ ను మంత్రి ప్రకటించారు. ఇప్పటికే పాఠశాలల్లో అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్లు నమోదుచేపట్టామన్నారు. ఈనెల 16న అర్హుల జాబితాను వార్డు, గ్రామ సచివాలయల్లో ప్రదర్శనకు పెడతామన్నారు. సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్ లో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చదువుకు పేదరికం అడ్డురాకూడదనే ఉద్దేశంతో సీఎం జగన్మోహన్ రెడ్డి... జగనన్న అమ్మఒడి పథకానికి శ్రీకారం చుట్టారన్నారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకూ చదువుతున్న పేద విద్యార్థుల తల్లిదండ్రులకు ఈ పథకం కింద రూ.15 వేల ఆర్థిక సాయం అందిస్తామన్నారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలు, ఎయిడెడ్ అన్ ఎయిడెడ్, ప్రభుత్వ గురుకుల పాఠశాలలో చదువే విద్యార్థులకు ఈ పథకం వర్తింపజేస్తామన్నారు. ఇప్పటికే జగనన్న అమ్మ ఒడి పథకం కింద మొదటి విడతగా 43,54,600లపైగా లబ్ధిదారులకు రూ.6.336 కోట్లు అందజేశామన్నారు. 2020-21 ఏడాదికి గానూ కుల, మత, ప్రాంతాలకు అతీతంగా, పారదర్శకంగా...అవినీతికి ఆస్కారం లేకుండా లబ్ధిదారుల ఎంపిక జరుగుతోందన్నారు. ఇప్పటికే అర్హులైన విద్యార్థులు తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు ప్రక్రియ ఈ నెల 10 తేదీ నుంచి ప్రారంభమైందన్నారు. ఈ నెల 20 వరకూ ఈ నమోదు ప్రక్రియ కొనసాగుతుందన్నారు. 
పాదర్శకంగా ‘జగనన్న అమ్మ ఒడి’ అమలు
అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకులు తమ పేర్లను నమోదు చేసుకునే సమయంలో ఆధార్ కార్డు, బ్యాంకు ఖాతా నెంబరు, రేషన్ కార్డు అందజేయాలని మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు. కులం, ప్రాంతం, వివక్ష లేకుండా ఈ పథకం అమలు చేస్తున్నామన్నారు. వచ్చే నెల(జనవరి)9వ తేదీన సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిచేతుల మీదుగా జగనన్న అమ్మఒడి రెండో విడత ఆర్థికసాయం అందజేస్తామన్నారు. లబ్ధిదారుల ఎంపిక కోసం షెడ్యూల్ రూపొందించామన్నారు. 
వరుస సంఖ్య తేదీ కార్యక్రమం

1 10.12.2020 నుంచి 20.12.2020 అర్హులై విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల పేర్ల నమోదు 

2 16.12.2020 అర్హులైన విద్యార్థుల తల్లిదండ్రులు, సంరక్షకుల జాబితాలను వార్డు సచివాలయాలు, గ్రామ సచివాయల్లో ప్రదర్శన

3 19.12.2020 ప్రదర్శనకు ఉంచిన జాబితాలో తప్పొప్పుల సవరణ అనంతరం అదే రోజు సాయంత్రం 6 గంటలకు అమ్మ ఒడి పోర్టల్ ప్రదర్శన

4 20.12.2020 నుంచి 24.12.2020 సంబంధిత పాఠశాల, కళాశాల ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లతో పాటు వార్డు, గ్రామ సచివాలయాల సిబ్బంది చే సవరించిన జాబితా పరిశీలన

5 26.12.2020 తుది సవరణ అనంతరం జాబితాలను వార్డు, గ్రామ సచివాలయాల్లో ప్రదర్శన

6 27.12.2020 నుంచి 28.12.2020 తుది సవరణ జాబితాలను గ్రామ, వార్డు సభల్లో ఆమోదం

7 29.12.2020 గ్రామ సభల ద్వారా ఆమోదం పొందిన జాబితాలను ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లచే ఆన్ లైన్లో పొందుపర్చుట

8 30.12.2020 ప్రధానోపాధ్యాయులు, ప్రిన్సిపాళ్లు ద్వారా వచ్చిన ఫైనల్ జాబితాలను ఆయా జిల్లా డీఈవోలు.. కలెక్టర్లకు పంపుట

9 30.12.2020 ఫైనల్  జాబితాలను జిల్లా కలెక్టర్ల ఆమోదం తెలుపుట
ఎటువంటి అవకతవకులకు, అవినీతికి ఆస్కారం లేకుండా పారదర్శకంగా ఉపాధ్యాయ బదిలీలు జరుగుతున్నాయని ఒక ప్రశ్నకు సమాధానంగా మంత్రి ఆదిమూలపు సురేష్ తెలిపారు.

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ఇండియన్ కోస్ట్ గార్డ్ లో జనరల్ డ్యూటీ ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ :

భారతీయ కేంద్ర ప్రభుత్వ సంస్థ అయిన ఇండియన్ కోస్టల్ గార్డ్ లో అసిస్టెంట్ కమాండంట్ విభాగంలో ఖాళీగా ఉన్న జనరల్ డ్యూటీ బ్రాంచ్ ఉద్యోగాల భర్తీకి ఒక మంచి నోటిఫికేషన్ విడుదల 

ఈ ఉద్యోగాలకు అర్హతలు గల ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాలకు చెందిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ఇండియన్ సిటిజెన్స్ అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేయవచ్చును.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తు ప్రారంభం తేదీడిసెంబర్ 21,2020
దరఖాస్తుకు చివరి తేదీడిసెంబర్ 27,2020
వ్రాత పరీక్ష నిర్వహణ తేదీజనవరి /ఫిబ్రవరి,2021

విభాగాల వారీగా ఖాళీలు :

అసిస్టెంట్ కమాండంట్ విభాగం  :

ఎస్సీ5
ఎస్టీ14
ఓబీసీ6

మొత్తం ఉద్యోగాలు :

ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 25 ఉద్యోగాలను భర్తీ చేయనున్నారు.

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి ఇంటర్మీడియట్ విద్యను మరియు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి బాచిలర్ డిగ్రీ కోర్సులను పూర్తి చేసి ఉండవలెను. ఫైనల్ ఇయర్ పరీక్షలు పూర్తి చేసిన వారు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.

వయసు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు జూలై 1,1996 నుండి జూన్ 30,2000 మధ్యగల సంవత్సరాలలో జన్మించిన వారై ఉండవలెను.(ఇవ్వబడిన తేదీలు కలిపి ).ఎస్సీ /ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరాలు మరియు ఓబీసీ అభ్యర్థులకు 3 సంవత్సరాల వయోపరిమితి సడలింపు కలదు.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ విధానం లో ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవలెను.

దరఖాస్తు ఫీజు :

ఎటువంటి దరఖాస్తు ఫీజు లేదు.

ఎంపిక విధానం :

అకాడమిక్ మార్కులు, వ్రాత పరీక్ష మరియు ఇంటర్వ్యూ విధానాల ద్వారా అభ్యర్థులను ఈ ఉద్యోగాలకు ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 56,100 రూపాయలు నుండి 2,05,400 రూపాయలు జీతం అందనుంది.

Website

Notification

14, డిసెంబర్ 2020, సోమవారం

BARC బాబా అటామిక్ రిసెర్చ్ సెంట‌ర్

(బార్క్‌)లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :

జాబ్ :స్టైపెండ‌రీ ట్రెయినీ పోస్టులు.
ఖాళీలు :160
అర్హత :1) స్టైపెండ‌రీ ట్రెయినీ కేట‌గిరీ-1 (గ్రూప్‌-బి):మూడేళ్ల‌ డిప్లొమా ఇంజినీరింగ్‌, బీఎస్సీ(కెమిస్ట్రీ ప్ర‌ధాన స‌బ్జెక్టుగా ఫిజిక్స్‌, మ్యాథ్స్‌ ఇత‌ర స‌బ్జెక్టులుగా ఉండాలి.  
 2)స్టైపెండ‌ర్ ట్రెయినీ కేట‌గిరీ-2 (గ్రూప్‌-సీ):ప‌్టాంట్ ఆప‌రేట‌ర్, ల్యాబొరేట‌రీ అసిస్టెంట్‌, ఇంట‌ర్మీడియ‌ట్, ప‌దోత‌ర‌గ‌తి.
 3) గ్రూప్‌-సీ పోస్టులు:ప‌దోత‌ర‌గ‌తి , సంబంధిత ట్రేడుల్లో స‌ర్టిఫికెట్ ఉండాలి.
వయసు :40 ఏళ్ళు మించకుడదు.
వేతనం :రూ.20,000-50,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌.
దరఖాస్తు ఫీజు :OBC,General: 0/- , SC,ST: 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది:డిసెంబర్ 14, 2020.
దరఖాస్తులకు చివరితేది:జనవరి 31, 2021.
వెబ్సైట్:Click Here
నోటిఫికేషన్:Click Here


UPSC Engineering Services 2020 Mains Result 2020

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

RBI Assistant Mains 2020 Exam Result

ఆర్బీఐ అసిస్టెంట్ మెయిన్స్ పరీక్ష 2020 ఫలితాలు విడుదల :

ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలు వ్రాసిన ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ రాష్ట్రాల అభ్యర్థులకు ముఖ్య గమనిక.


రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా నవంబర్ 22,2020 న నిర్వహించిన ఆర్బీఐ అసిస్టెంట్స్ మెయిన్స్ 2020 పరీక్షలకు సంబంధించిన ఫలితాలు విడుదల అయ్యాయి.

ఇరు తెలుగు రాష్ట్రాలలో ఈ పరీక్షలు వ్రాసిన  అభ్యర్థులు ఈ క్రింది లింక్ ద్వారా పరీక్ష ఫలితాలను తెలుసుకోవచ్చు.

Result Link

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల

ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి జనవరి 7న నోటిఫికేషన్లు విడుదల :

ఏపీ లో ఉన్న నిరుద్యోగ విభిన్న ప్రతిభవంతులకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఒక శుభవార్తను అందించింది.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విభిన్న ప్రతిభవంతుల కోసం ప్రభుత్వ శాఖల్లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలు అన్నిటిని భర్తీ చేయడానికి జనవరి 7, 2021 నాడు నోటిఫికేషన్లు విడుదల చేస్తున్నట్లు ఒక ప్రకటన విడుదల అయినది.

డిసెంబర్ 25,2020 నాటికీ వివిధ ప్రభుత్వ శాఖలలో  ఖాళీగా ఉన్న పోస్టులను నోటిఫై చేసి జనవరి 7,2021 న నోటిఫికేషన్ జారీ చేయనున్నారు.

ఈ ఉద్యోగాల భర్తీ ప్రక్రియను మొత్తాన్ని జనవరి నెల నెలాఖరకు పూర్తి చేయడానికి ప్రణాళికలు రచిస్తున్నారు.

UPSC Engineering Services 2020 Mains Result 2020

 

Some Useful Important Links

Download Mains Result

Click Here

Download Mains Admit Card

Click Here

Download Mains Exam Schedule

Click Here

For Change Exam District

Click Here

Download Notice for Change Exam District

Click Here

Check Mains Exam Date

18 October 2020

Download Pre Result

Roll Wise | Name Wise

Download Admit Card

Click Here

How to Download Admit Card (Video Hindi)

Click Here

Apply Online Part I

Click Here

Pay Exam Fee Part II

Click Here

How to Fill Form (Video Hindi)

Click Here

Re Print Form Part III

Click Here

Download Syllabus

Click Here

Download Notification

Click Here

Official Website

Click Here

Gemini Products Price List

వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం

రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్‌ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం." పథక మార్గదర్శకాలు 1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి. 

2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు. 

3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు. 

4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు. 

5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు. వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే) వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి  

వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను. కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను. అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి. వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను. కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను కావలసిన ధ్రువీకరణ పత్రములు కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్) వయస్సు యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్ ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్ నవాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి) వతంతువు ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు కలిగి ఉండాలి ప్రోత్సాహకం వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/- వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/- వఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/- వఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/- 6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/- వఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/- వఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/- గమనిక: ప్రస్తుతం పెళ్లికానుక అమలులో లేదు, 2021 సంవత్సరంలో అమలు చేస్తాం అని ముఖ్యమంత్రి గారు చెపటం జరిగింది.