3, నవంబర్ 2021, బుధవారం

NIOS Registration: నేషనల్ ఇన్​స్టిట్యూట్ ఆఫ్ ఓపెన్ స్కూలింగ్​లో ఒకేషనల్​ కోర్సులు.. ఇలా దరఖాస్తు చేసుకోండి

ఓపెన్​ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు​ చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూలింగ్​(NIOS​) ఒకేషనల్​, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Notifications)​ విడుదల చేసింది.

Gemini Internet

ఓపెన్​ డిగ్రీ(Open Degree) విధానంలో వృత్తి విద్యా కోర్సులు(Vocational Courses)​ చేయాలనుకునే వారికి శుభవార్త. దేశంలోనే ప్రతిష్టాత్మక నేషనల్ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూలింగ్​(NIOS​) ఒకేషనల్​, D.El.Ed కోర్సులో ప్రవేశాలకు నోటిఫికేషన్(Admissions Notification)​ విడుదల చేసింది. 2021 ఏడాదికి సంబంధించి నేటి నుంచి దరఖాస్తులు(Applications) ఆహ్వానిస్తోంది. ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్​-నవంబర్​ సెషన్​ పరీక్షల(Exams) కోసం నవంబర్​ 20లోపు www.nios.ac.in వెబ్​సైట్​ ద్వారా దరఖాస్తు(Applications) చేసుకోవాల్సి ఉంటుంది. అయితే రూ.100 ఆలస్య రుసుముతో నవంబర్​ 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. రూ. 1500 ఆలస్య రుసుము చెల్లించి నవంబర్​ 30 వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఈ పరీక్షలను(Exams) 2021 డిసెంబర్‌లో లేదా 2022 జనవరిలో నిర్వహిస్తారు.

ఎలా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి?
Step 1: NIOS కోర్సుల కోసం అభ్యర్థులు www.nios.ac.in అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించాలి.
Step 2: హోమ్‌పేజీలో, ‘‘రిజిస్ట్రేషన్​ ఫర్​ ఒకేషనల్, D.El.Ed కోర్సులు’ అనే లింక్ ఉంటుంది. దానిపై క్లిక్​ చేయండి.

Step 3: మీ ఈ–మెయిల్ ఐడి, పాస్‌వర్డ్ వంటి మీ అకౌంట్​ క్రియేట్​ చేసుకోండి. ఆపై మీ అకౌంట్​లోకి లాగిన్ అవ్వండి.

Step 4: మీరు దరఖాస్తు చేయాలనుకుంటున్న కోర్సులను ఎంచుకోండి. అవసరమైన అన్ని వివరాలను పూరించండి.
Step 5: అవసరమైన అన్ని డాక్యుమెంట్లను అప్‌లోడ్ చేయండి. ఆ తర్వాత ఫీజు చెల్లించండి. అంతే, మీ రిజిస్ట్రేషన్​ ప్రక్రియ పూర్తవుతుంది.
Step 6: భవిష్యత్తు అవసరాల కోసం అప్లికేషన్​ ఫారమ్ కాపీని డౌన్‌లోడ్ చేసుకోండి.

వర్చువల్​ విధానంలో విద్యాబోధన..

నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూలింగ్​ (ఎన్​ఐఓఎస్​) ఒకేషనల్​, D.El.Ed కోర్సుకు సంబంధించిన అక్టోబర్ -నవంబర్ సెషన్​ పరీక్షలు డిసెంబర్ 2021 లేదా జనవరి 2022లో జరగనున్నాయి. ఈ పరీక్ష తేదీలపై త్వరలోనే క్లారిటీ రానుంది. నేషనల్​ ఇన్​స్టిట్యూట్​ ఆఫ్​ ఓపెన్​ స్కూలింగ్​ ఇటీవలే వర్చువల్​ స్కూల్​ను ప్రారంభించింది. వర్చువల్​ లైవ్​ క్లాస్​ రూమ్​లు, వర్చువల్​ ల్యాబ్​ ద్వారా విద్యా బోధన ఉంటుందని స్పష్టం చేసింది. ఈ అధునాతన డిజిటల్​ లెర్నింగ్​ ప్లాట్​ఫామ్ దేశంలోనే మొదటిదని విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్​ పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు: