14, ఫిబ్రవరి 2022, సోమవారం

RBI Recruitment: నిరుద్యోగులకు సదావకాశం.. ఆర్‌బీఐలో 950 ఖాళీలు

RBI Recruitment: రిజర్వర్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా త్వరలోనే భారీ నోటిఫికేషన్‌ను జారీ చేయనుంది. ఆర్‌బీఐ అసిస్టెంట్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేయనున్నారు. నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదల కానుంది.? ఎన్ని పోస్టులు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.?లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీచేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 950 అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* దేశ వ్యాప్తంగా అన్ని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా శాఖల్లో ఈ పోస్టులను భర్తీ చేయనున్నారు. హైదరాబాద్‌లోనూ ఖాళీలు ఉన్నాయి.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కనీసం 50 శాతం మార్కులతో డిగ్రీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులు ఉత్తీర్ణత సాధిస్తే చాలు.

* పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు తమ స్థానిక భాషలో ప్రావీణ్యత కలిగి ఉండాలి.

* అభ్యర్థుల వయసు 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను ఆన్‌లైన్‌ ఎగ్జామ్‌, లాంగ్వేజ్‌ ప్రొఫిషెన్సీ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* దరఖాస్తుల స్వీకరణ ఫిబ్రవరి 17, 2022న ప్రారంభం కానున్నాయి, చివరి తేదీగా 08-03-2022ని నిర్ణయించారు.

* పరీక్షలను మార్చి 26, 27 తేదీల్లో నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చూడండి..

Gemini Internet

AP SSC Exams Model Papers: ఏపీలోని టెన్త్ విద్యార్థులకు అలర్ట్.. ఫైనల్ ఎగ్జామ్స్ మోడల్ పేపర్లు

ఆంధ్రప్రదేశ్ టెన్త్, ఇంటర్ ఎగ్జామ్స్ (AP Tenth, Inter Exams)కు సంబంధించిన షెడ్యూళ్లను ఇటీవల మంత్రి ఆదిమూలపు సురేష్ (AP Minister Adimulapu Suresh) విడుదల చేసిన విషయం తెలిసిందే. ఏప్రిల్‌ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ ను, మే 2 నుంచి 13 వరకు టెన్త్ ఎగ్జామ్స్ ను నిర్వహించనున్నట్లు మంత్రి వెల్లడించారు. ఇంటర్ ఎగ్జామ్స్ ను ఉదయం 9 గంటల నుంచి 12 గంటల వరకు, టెన్త్ ఎగ్జామ్స్ ను ఉదయం 9.30 గంటల నుంచి 12.45 గంటల వరకు నిర్వహించనున్నట్లు వివరించారు. ఇదిలా ఉంటే విద్యార్థుల్లో ఒత్తిడి తగ్గించేందుకు పరీక్షలపై (Exams) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది మార్చిలో నిర్వహించనున్న పరీక్షల పేపర్లను తగ్గిస్తూ నిర్ణయం తీసుకుంది. ఇప్పటి వరకు టెన్త్ ఎగ్జామ్ ను 11 పేపర్లలో నిర్వహించేవారు. అయితే ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో ఆ సంఖ్యను 7కు కుదించింది జగన్ సర్కార్.

ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ ను సైతం ఏడు పేపర్లతోనే నిర్వహించున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అన్ని సబ్జెక్టులకు ఒకే ఎగ్జామ్ ఉండగా.. ఒక సైన్స్ మాత్రం రెండు పేపర్లను నిర్వహించనున్నారు. ఇందులో భౌతిక, రసాయన శాస్త్రాలు కలిపి 50 మార్కులకు ఒక పేపర్, జీవశాస్త్రానికి 50 మార్కులకు ఉంటుంది.

మిగతా అన్ని సబ్జెక్టులకు ఎగ్జామ్ ను ఒకే పేపర్ ద్వారా 100 మార్కులకు నిర్వహిస్తారు. అయితే, ఈ సిలబస్ కు సంబంధించి విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు మోడల్ పేపర్లను కూడా విడుదల చేసింది ప్రభుత్వం. విద్యార్థులు నేరుగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ నుంచి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకోవచ్చు. ఇందు కోసం విద్యార్థులు ఈ స్టెప్స్ ఫాలో కావాల్సి ఉంటుంది.

AP SSC SUBJECT WISE MODEL QUESTION PAPERS:

Step 1: విద్యార్థులు మొదటగా https://www.bse.ap.gov.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.

Step 2: అనంతరం హోం పేజీలో SSC Public Examinations - 2022 Model Paper ఆప్షన్ ను ఎంచుకోవాలి.

Step 3: తర్వాత మీకు కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.

Step 4: ఆ పేజీలో అన్ని సబ్జెక్టులకు సంబంధించి న ఇంగ్లిష్, తెలుగు మోడల్ పేపర్లకు సంబంధించిన లింక్ లు కనిపిస్తాయి.

Step 5: ప్రతీ పేపర్ పక్కన Click Here అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఆప్షన్ పై క్లిక్ చేసి మోడల్ పేపర్లను డౌన్ లోడ్ చేసుకునే అవకాశం ఉంటుంది.

Gemini Internet

SPM Recruitment 2022: కరెన్సీ నోట్లను ముద్రించే సెక్యురిటీ పేపర్ మిల్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ చదివినవారు అర్హులు

SPM Narmadapuram Recruitment 2022: భారత ప్రభుత్వ రంగ సంస్థ అయిన సెక్యూరిటీ ప్రింటింగ్‌ అండ్‌ మింటింగ్‌ కార్పొరేషన్ ఆఫ్‌ ఇండియా ఆధ్వర్యంలోని నర్మదాపురంలోనున్న సెక్యూరిటీ పేపర్‌ మిల్‌ (SPM) పలు పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 6

పోస్టుల వివరాలు: సూపర్‌ వైజర్లు, వెల్ఫేర్‌ ఆఫీసర్‌, జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులు

అర్హతలు:

  •  వెల్ఫేర్‌ ఆఫీసర్‌ పోస్టులకు సోషల్‌ సైన్స్‌లో డిగ్రీ లేదా డిప్లొమా ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.29,740ల నుంచి రూ.1,03,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  •  సూపర్‌ వైజర్‌ పోస్టులకు ఇంజనీరింగ్‌లో బీఎస్సీ/బీఈ/బీటెక్/డిప్లొమా (మెకానికల్‌/ఎలక్ట్రికల్‌/ఎలక్ట్రానిక్స్‌/కెమికల్/ఎన్విరాన్‌మెంటల్‌)లో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.

  •  జూనియర్‌ హిందీ ట్రాన్స్‌లేటర్‌ పోస్టులకు పీజీలో ఉత్తీర్ణత ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 30 ఏళ్ల మధ్య ఉండాలి.

పే స్కేల్‌: నెలకు రూ.27,600ల నుంచి రూ.95,910ల వరకు జీతంగా చెల్లిస్తారు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు ప్రారంభ తేదీ: ఫిబ్రవరి 16, 2022.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 11, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

ICMR Recruitment 2022: ఐసీఎంఆర్‌లో జూనియర్ నర్సు, డేటా ఎంట్రీ ఆపరేటర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్

ICMR Recruitment 2022: ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మలేరియా రీసెర్చ్ (ICMR NIMR) జూనియర్ నర్సు, లేబొరేటరీ టెక్నీషియన్, ఫీల్డ్ వర్కర్‌తో సహా పలు పోస్టుల భర్తీకి దరఖాస్తులను ఆహ్వానించింది. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు ఫిబ్రవరి 20 లోపు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ICMR రిక్రూట్‌మెంట్ 2022 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు తప్పనిసరిగా MBBS/ 12వ, 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలి. ఆసక్తి , అర్హత గల అభ్యర్థులు 20 ఫిబ్రవరి 2022లోపు లేదా సాయంత్రం 05:00 గంటల వరకు ఐసీఎంఆర్ అధికారక వెబ్ సైట్‌లో ద్వారా దరఖాస్తు ఫారమ్‌ను పూరించవచ్చు . మరిన్ని వివరాల కోసం అధికారిక నోటిఫికేషన్‌ని చెక్ చేయండి.

ఖాళీల వివరాలు ఇలా..

జూనియర్ మెడికల్ ఆఫీసర్-02 లేబొరేటరీ టెక్నీషియన్-01 డేటా ఎంట్రీ ఆపరేటర్-03 ఫీల్డ్ వర్కర్-04 జూనియర్ నర్సు-03

విద్యార్హతలు..

జూనియర్ మెడికల్ ఆఫీసర్ – గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి MBBS డిగ్రీ. లేబొరేటరీ టెక్నీషియన్ – సైన్స్ సబ్జెక్టులో 12వ తరగతి ఉత్తీర్ణత, మెడికల్ లేబొరేటరీ టెక్నీషియన్‌లో రెండేళ్ల డిప్లొమా. డేటా ఎంట్రీ ఆపరేటర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్ స్ట్రీమ్‌లో ఇంటర్మీడియట్ లేదా 12వ ఉత్తీర్ణత. ఫీల్డ్ వర్కర్ – గుర్తింపు పొందిన బోర్డు నుండి సైన్స్‌లో 12వ ఉత్తీర్ణత లేదా తత్సమానం మరియు రెండేళ్ల ఫీల్డ్ అనుభవం. జూనియర్ నర్స్ – సైన్స్ సబ్జెక్టులతో ANM లో హై స్కూల్ లేదా సర్టిఫికేట్ కోర్సు

జీతం వివరాలు..

జీతం ఇవ్వబడుతుంది జూనియర్ మెడికల్ ఆఫీసర్ పోస్టుకు ఎంపికైన అభ్యర్థులకు 60,000 (కన్సాలిడేటెడ్) జీతం ఇవ్వబడుతుంది. ఇది కాకుండా, లేబొరేటరీ టెక్నీషియన్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), డేటా ఎంట్రీ ఆపరేటర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్), ఫీల్డ్ వర్కర్‌కు 17,520 (కన్సాలిడేటెడ్) , జూనియర్ నర్సు అభ్యర్థులకు రూ.17,520 (కన్సాలిడేటెడ్) ఇవ్వబడుతుంది.

 

Gemini Internet

SBI Recruitment: స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నోటిఫికేషన్ వచ్చింది.

బ్యాంక్‌లో ఉద్యోగం కావాలని కలలు కంటున్న అభ్యర్థులకు మంచి అవకాశం వచ్చింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ (SCO) పోస్టుల భర్తీకి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించింది. ఆసక్తి , అర్హత ఉన్న అభ్యర్థులందరూ SBI అసిస్టెంట్ మేనేజర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022లోపు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ పోస్టుల భర్తీకి ఫిబ్రవరి 5 నుంచి దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఆన్‌లైన్ రాత పరీక్ష, ఇంటర్వ్యూ ఆధారంగా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఈ వ్రాత పరీక్షలో, అభ్యర్థుల నుండి 100 మార్కుల 80 ప్రశ్నలు అడుగుతారు. ఈ ప్రశ్నలను పరిష్కరించేందుకు అభ్యర్థులకు 120 నిమిషాల సమయం ఇవ్వబడుతుంది. 

పరీక్ష కేంద్రాలు..

ఈ రిక్రూట్‌మెంట్ పరీక్ష 2022 మార్చి 20న గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, గౌహతి, పాట్నా, రాయ్‌పూర్, బిలాస్‌పూర్, న్యూఢిల్లీ, నాగ్‌పూర్, పూణె, భువనేశ్వర్, జలంధర్, లూథియానా, జైపూర్, చెన్నై, హైదరాబాద్, అగర్తల, ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, లక్నో, వారణాసి.. అనేక ఇతర జిల్లాల్లో నిర్వహించే అవకాశం ఉంది.

స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్..

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్స్ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం, అభ్యర్థి తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఇన్‌స్టిట్యూట్ నుండి కనీసం 60% మార్కులతో బ్యాచిలర్ డిగ్రీని కలిగి ఉండాలి. ఇది కాకుండా, ఈ పోస్టులకు రిక్రూట్‌మెంట్ కోసం అభ్యర్థి వయస్సు 40 ఏళ్లు మించకూడదు. విద్యార్హత, వయోపరిమితికి సంబంధించిన వివరణాత్మక సమాచారం కోసం, అభ్యర్థులు అధికారిక నోటిఫికేషన్‌ను తనిఖీ చేయవచ్చు.

ఖాళీల వివరాలు..

ఈ ప్రక్రియ ద్వారా 15 అసిస్టెంట్ మేనేజర్ (నెట్‌వర్క్ సెక్యూరిటీ స్పెషలిస్ట్), 33 అసిస్టెంట్ మేనేజర్ (రూటింగ్ , స్విచింగ్) పోస్టులతో సహా మొత్తం 48 ఖాళీలను భర్తీ చేస్తారు. అర్హులైన అభ్యర్థులందరూ SBI స్పెషలిస్ట్ క్యాడర్ ఆఫీసర్ రిక్రూట్‌మెంట్ 2022 కోసం అధికారిక వెబ్‌సైట్‌లో 25 ఫిబ్రవరి 2022 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఇందుకోసం జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీలకు చెందిన అభ్యర్థులు కూడా రూ.750 అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

Gemini Internet

13, ఫిబ్రవరి 2022, ఆదివారం

FTII Recruitment 2022: నెలకు రూ.లక్షకు పైగా జీతంతో టీచర్‌ ఉద్యోగాలు..ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ద్వారా ఎంపికలు

FTII Faculty Recruitment 2022: పూణెలోని ఫిల్మ్‌ అండ్‌ టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా (FTII) వివిధ విభాగాల్లోని టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టుల (Teaching And Non Teaching  posts) భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 31

పోస్టుల వివరాలు: టీచింగ్‌, నాన్‌ టీచింగ్‌ పోస్టులు

ఖాళీల వివరాలు: అసోసియేట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, అసిస్టెంట్‌ ప్రొఫెసర్లు, సౌండ్‌ రికార్డిస్ట్‌, మెడికల్ ఆఫీసర్లు.

విభాగాలు: ఆర్ట్‌ డైరెక్షన్‌, సినిమాటోగ్రఫీ, ఫిల్మ్‌ ప్రొడక్షన్‌, స్క్రీన్‌ రైటింగ్‌, ఎడిటింగ్‌, వీడియో ఎడిటింగ్‌, ఐటీ మేనేజర్‌, అకడమిక్‌ కో ఆర్డినేటర్‌, ఫిల్మ్‌ రీసెర్చ్‌ ఆఫీసర్‌, సౌండ్‌ రికార్డిస్ట్‌, బీఏఎంఎస్‌ తదితర విభాగాల్లో ఖాళీలను పూరించనున్నారు.

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల నుంచి రూ.1,16,398ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 63 ఏళ్లు మించరాదు.

అర్హతలు: పోస్టును బట్టి సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ/డిప్లొమా/మాస్టర్స్‌ డిగ్రీ, బీఏఎంఎస్‌, ఎంబీబీఎస్‌ ఉత్తీర్ణత ఉండాలి. అలాగే సంబంధిత సబ్జెక్టులో టీచింగ్‌ అనుభవంతోపాటు, టెక్నికల్‌ నైనుణ్యాలు కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఆన్‌లైన్‌ ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఇంటర్వ్యూ తేదీలు: 2022, మార్చి 8 నుంచి ఏప్రిల్‌ 13 వరకు.

దరఖాస్తులకు చివరి తేదీ: ఫిబ్రవరి 26, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

click here for application

Gemini Internet

JNV Jobs: రంగారెడ్డి నవోదయ విద్యాలయంలో ఉద్యోగాలు.. ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్థుల ఎంపిక

JNV Jobs: జవహర్‌ నవోదయ విద్యాలయంలో పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేశారు. భారత ప్రభుత్వానికి చెందిన ఈ విద్యా సంస్థ రంగారెడ్డిలో ఉన్న ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులను కాంట్రాక్ట్‌ విధానంలో తీసుకోనున్నారు. ఏయే విభాగాల్లో పోస్టులు ఖాళీ ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా మొత్తం 04 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో పీజీటీ, మాట్రాన్‌ పోస్టులు ఉన్నాయి.

* మాట్రాన్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 10వ తరగతి పూర్తి చేసి ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

* పీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు సంబంధిత స్పెషలైజేషన్‌లో బీఈడీ, ఎంఈడీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 50 ఏళ్ల మించకూడదు.

ముఖ్యమైన విషయాలు…

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు సంబంధిత సర్టిఫికేట్లతో నేరుగా ఇంటర్వ్యూకి హాజరుకావాల్సి ఉంటుంది.

* ఇంటర్వ్యూలను జవహర్‌ నవోదయ విద్యాలయ, రంగారెడ్డిలో నిర్వహిస్తారు.

* 18-02-2022న ఇంటర్వ్యూను నిర్వహించనున్నారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 35,750 జీతంగా చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

 

Gemini Internet

UPSC Recruitment: పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసిన యూపీఎస్‌సీ.. రాత పరీక్ష లేకుండానే ఎంపిక

UPSC Recruitment: యూనియన్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (UPSC) పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. నోటిఫికేషన్‌లో భాగంగా వివిధ విభాగాల్లో ఉన్న మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఎన్ని ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషనలో భాగంగా మొత్తం 33 ఖాళీలను భర్తీ చేయనున్నారు.

* వీటిలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌, స్టోర్స్‌ ఆఫీసర్‌, అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులు ఉన్నాయి.

* అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌ (నేవీ,ఆయుష్‌) పోస్టుల్లో భాగంగా హిస్టరీ, ఆయుర్వేద విభాగాల్లో ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ పీహెచ్‌డీ, ఆయుర్వేద మెడినిసిన్‌లో డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేషన్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. నెట్‌/సెట్‌/స్లెట్‌ అర్హత పొంది ఉండాలి. అభ్యర్థుల వయసు 35 నుంచి 48 ఏళ్ల మధ్య ఉండాలి.

* స్టోర్స్‌ ఆఫీసర్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు డిగ్రీ ఉత్తీర్ణతతో పాటు సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 30 ఏళ్లు మించకూడదు.

* అసిస్టెంట్‌ మినరల్‌ ఎకనామిస్ట్‌ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో మాస్టర్స్‌ డిగ్రీ/ బ్యాచిలర్స్‌ డిగ్రీలో ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం ఉండాలి. అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను తొలుత పని అనుభవం ఆధారంగా షార్ట్‌లిస్ట్‌ చేస్తారు. అనంతరం ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది.

* ఎస్సీ/ ఎస్టీ/ పీడబ్ల్యూబీడీ/ మహిళలకు ఎలాంటి ఫీజు ఉండదు. ఇతరులు మాత్రం ఫీజు చెల్లించాల్సి ఉంటుంది.

* దరఖాస్తుల స్వీకరణకు 03-03-2022ను చివరి తేదీగా నిర్ణయించారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

Gemini Internet

11, ఫిబ్రవరి 2022, శుక్రవారం

ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్‌ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు

 

ICAI CA May Exam 2022 Schedule: సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, PQC పరీక్షలు – మే 2022 షెడ్యూల్ విడుదలైంది. సీఏ కొత్త షెడ్యూల్‌ను ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారిక వెబ్‌సైట్‌ icaiexam.icai.orgలో విద్యార్ధుల కోసం అందుబాటులో ఉంచింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్ధులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 13 వరకు https://icaiexam.icai.orgలో ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఆన్‌లైన్‌లో చెల్లించవల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు, పరీక్ష సమయాలు ఈకింది విధంగా ఉంటాయి..

షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలివే.. సీఏ ఫౌండేషన్‌ 2022 పరీక్షలు: మే 23, 24, 29 తేదీల్లో జరుగుతాయి.

సీఏ ఇంటర్మీడియట్‌ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 15, 18, 20, 22 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 24, 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి.

సీఏ మే ఫైనల్ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్‌ 1కు.. మే 14, 17, 19, 21 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్‌ 2కు.. మే 23, 25, 27, 29 తేదీల్లో జరుగుతాయి.

ఇంటర్నేషనల్‌ ట్యాక్సేషన్‌ – అసెస్‌మెంట్ టెస్ట్‌ (INTT – AT): మే 14, 17 తేదీల్లో జరుగుతాయి.

పరీక్ష సమయాలు: సీఏ ఫౌండేషన్‌ పరీక్షలు 2 గంటలపాటు, ఎలక్టివ్‌ పేపర్స్‌ ఫైనల్‌ పరీక్షలు 4 గంటలపాటు, ఇతర పరీక్షలన్నీ 3 గంటల పాటు నిర్వహించబడతాయి.

Gemini Internet

IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్‌లైన్‌ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు

IGNOU January 2022 Session Admission Last date: ఇందిరా గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం ఆన్‌లైన్‌ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈ మేరకు ఆన్‌లైన్‌ దరఖాస్తులను ఫిబ్రవరి 21 వరకు స్పీకరించనున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ సదావకాశాన్ని వినియోగించుకోవాలని ఇగ్నో పేర్కొ్ంది. అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ ignou.ac.in లేదా ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్‌లైన్ పద్ధతిలో అందించే ఓపెన్, డిస్టెన్స్ మోడ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన విద్యార్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్‌ను చేసుకుని, అన్ని వివరాలను నమోదు చేసి, ఏ కోర్సులో అడ్మిషన్‌ కావాలని భావిస్తున్నారో దానిని ఎంచుకోవాలి. ఇగ్నో తాజా నోటిఫికేషన్‌ ద్వారా మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీలు, పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, అప్రీషియేషన్‌/అవేర్‌నెస్ లెవల్‌ ప్రోగ్రామ్‌లతో సహా వివిధ విభాగాల్లో మొత్తం 200 కంటే ఎక్కువ ప్రోగ్రామ్‌లను వర్సిటీ అందించింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం ఇగ్నో అధికారిక సైట్‌ignou.ac.inను తనిఖీ చేయవచ్చు.

Gemini Internet

Deputy Manager Jobs: కేవలం ఇంటర్వ్యూతోనే.. డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగాలు

APMDC Recruitment 2022: విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ మినరల్‌ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌ లిమిటెడ్‌ (APMDC) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటి మేనేజర్‌ (deputy manager posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 4

పోస్టుల వివరాలు: డిప్యూటి మేనేజర్‌ పోస్టులు

విభాగాలు: లీగల్‌, మైనింగ్‌, ఫైనాన్స్‌ అండ్‌ అకౌంట్స్‌

పే స్కేల్‌: నెలకు రూ.51,000ల నుంచి 70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అదనంగా నెలకు రూ.25,000ల వరకు అలవెన్స్‌ ఇస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో డిగ్రీ, లా డిగ్రీ, ఇంజనీరింగ్‌ డిగ్రీ/డిప్లొమా (మైనింగ్‌)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: ఏపీఎండీసీ, కానూరు గ్రామం, పెనమలూరు మండలం, విజయవాడ 521137.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

Gemini Internet

Project Assistant Jobs: బీఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండానే సీఎస్‌ఐఆర్‌లో ఉద్యోగాలు.

CSIR – IPU Recruitment 2022: న్యూఢిల్లీలోని సీఎస్‌ఐఆర్‌ – ఇన్నోవేషన్‌ ప్రొటెక్షన్‌ యూనిట్‌ (IPU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 10

పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్‌ అసిస్టెంట్ పోస్టులు

విభాగాలు: కెమికల్‌, మయోటెక్‌, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్‌, మెకానికల్

పే స్కేల్‌: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.

అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్‌లో ఇంజనీరింగ్‌ డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.

ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.

 

Gemini Internet

10, ఫిబ్రవరి 2022, గురువారం

AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.

AWES Army School Admit Card 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్‌ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్‌సైట్ నుంచి అడ్మిట్ కార్డ్‌ను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ స్కూల్ టీజీటీ, పీజీటీ, పీఆర్టీ రిక్రూట్‌మెంట్ 2022 ద్వారా మొత్తం 8700 పోస్ట్‌లు రిక్రూట్ చేయనున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్‌ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, సబ్జెక్ట్ పేరు, రోల్ నంబర్, చిరునామా, పరీక్షా కేంద్రం, తేదీలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. కాగా ఆర్మీ స్కూల్‌లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఆన్‌లైన్‌ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి 28 వరకు జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్‌సైట్‌ awesindia.com ను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రయాగ్‌రాజ్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, గోరఖ్‌పూర్, లక్నో, మీరట్, బరేలీ, నోయిడా, ఢిల్లీ, ఝాన్సీ, డెహ్రాడూన్, జైపూర్, జబల్‌పూర్, భోపాల్‌లలో నిర్వహించబడుతుంది. ఆన్‌లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అభ్యర్ధులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత టీచింగ్‌ ఎబిలిటీని అంచనా వేస్తారు. ఈ దశలన్నింటి తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.

అడ్మిట్ కార్డును ఎలా డౌన్‌లోడ్ చేయాలంటే..

  • ముందుగా అధికారిక వెబ్‌సైట్- awesindia.com ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్ పేజీలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్‌ టీచర్‌ రిక్రూట్‌మెంట్‌ ఓఎస్టీపై క్లిక్ చెయ్యాలి.
  • న్యూ పేజీ ఓపెన్‌ అవుతుంది. దీనిలో రిజిస్టర్డ్ ఐడీని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్‌పై హాల్‌టికెట్‌ ఓపెన్‌ అవుతుంది.
  • సేవ్‌ చేసుకుని, డౌన్‌లోడ్‌ చేసుకోవాలి.

 

Gemini Internet

AP EAPCET 2022: ఏపీ ఈఏపీ 2022 పరీక్ష ‘మే’ లో..

ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది..

Gemini Internet

AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్‌ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది. ఏపీ ఈఏపీ 2022 పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణత సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇందులో ఉత్తీర్ణులైన వారు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్‌, అగ్రికల్చర్‌, ఫార్మసీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏపీ ఈఏసీ సెట్‌ 2022 లో మొత్తం 331 కళాశాలలు పాల్గొంటున్నాయి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (APSCHE) ఆధీనంలో కాకినాడలోని జవహర్‌లాల్ నెహ్రూ టెక్నలాజికల్ యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తుంది. కాగా ఏపీ ఈఏసీ సెట్‌ను గతంలో EAMCET (ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్‌ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) అనే పేరుండేది. ఐతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీస మార్కుల విషయంలో సడలింపు ఉంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులను 75 శాతం, ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్‌లో సాధించిన 25 శాతం మార్కుల ఆధారంగా ర్యాంకు కేటాయిస్తారు.

Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల

ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్‌ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి.  విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు.  కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.

మొత్తంగా  మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్‌ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు.

Gemini Internet

పదో తరగతి పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 


 

ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి 


 

 

 

CA Results 2021: సీఏ ఫైనల్‌, ఫౌండేషన్‌ జూలై 2021 పరీక్షల ఫలితాలు విడుదల

ICAI CA Result July 2021 Results: ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్‌, ఫైనల్‌ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది. అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.inలలో తనిఖీ చూసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రోల్ నంబర్‌ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్‌లతో లాగిన్‌ అయ్యి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెయిల్‌ ఐడీతో రిజిస్ట్రేషన్‌ చేసుకున్న విద్యార్ధులకు కూడా సీఏ ఫౌండేషన్‌, సీఏ ఫైనల్‌ పరీక్షల ఫలితాలను వారి వారి మెయిల్‌లకు పంచించింది. కాగా ఐసీఏఐ అధికారిక ట్విటర్‌ అకౌంట్ ద్వారా ఈ రోజు సీఏ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2021లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలు ప్రకటించినట్లు ట్విటర్‌ పోస్టులో పేర్కొంది.

ICAI CA జూలై  2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..

  • మొదటిగా icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.in ఏదైనా ఒక వెబ్‌సైట్‌ను ఓపెన్‌ చెయ్యాలి.
  • హోమ్‌పేజీలో కనిపించే రిజల్ట్స్‌ లింక్‌పై క్లిక్ చెయ్యాలి.
  • అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
  • స్క్రీన్‌ పై కనిపించే స్కోర్‌కార్డును డౌన్‌లోడ్ చేసుకోవాలి

సీఏ ఫౌండేషన్ పరీక్షలు గత యేడాది డిసెంబర్ 13,15,17,19 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఇక సీఏ ఫైనల్‌ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి 19 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ జిల్లాల్లో ఆఫ్‌లైన్ మోడ్‌లో పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.

Gemini Internet

Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియాలో స్పెషలిస్ట్‌ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..

Central Bank Of India Jobs: సెంట్రల్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్‌లో సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌లో భాగంగా ఇన్నర్మేషన్‌ టెక్నాలజీ విభాగంలో ఉన్న మొత్తం 19 సీనియర్‌ మేనేజర్‌ పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.

* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.

ముఖ్యమైన విషయాలు..

* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

* అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్‌ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.

* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు.

* ఆన్‌లైన్‌ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు.

* రాతపరీక్షను మార్చి 27న నిర్వహించనున్నారు.

* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి..

 

Gemini Internet

Indian Coast Guard Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్‌లో ఉద్యోగాలు

Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్‌ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా ఆఫ్‌లైన్‌ మోడ్‌ (offline application)లో దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్‌కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..

వివరాలు:

మొత్తం ఖాళీల సంఖ్య: 80

పోస్టుల వివరాలు: సివిలియన్ పోస్టులు

ఖాళీ వివరాలు:

ఇంజిన్ డ్రైవర్: 8 సారంగ్ లాస్కర్: 3 స్టోర్ కీపర్ గ్రేడ్ II: 4 సివిలియన్ మోటార్ ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్: 24 ఫైర్‌మ్యాన్: 6 ICE ఫిట్టర్: 6 స్ప్రే పెయింటర్: 1 MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్: 6 MTS: 19 షీట్ మెటల్ వర్కర్: 1 ఎలక్ట్రికల్ ఫిట్టర్: 1 లేబర్: 1

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.

అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్‌స్టిట్యూట్‌ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దీనితోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా అర్హతలు కూడా ఉండాలి.

వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.

ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

అడ్రస్‌: The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai- 600009.

దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్‌ జనవరి 23, 2022న విడుదలైంది. అప్పటినుంచి 30 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు చేసుకోవాలి.

పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి. 

 

Gemini Internet

22, జనవరి 2022, శనివారం

Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివ‌రాలు ...

బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ స్కూల్‌ టీచర్‌. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్‌ స్కూళ్లలోని టీచర్‌ పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ సిద్ధమైంది. తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌–2022కు నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్‌ తదితర వివరాలు...

దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్‌ఈకి అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్‌ స్కూల్స్‌ను ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్‌ ఎడ్యుకేషన్‌ సొసైటీ.. ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.

పోస్టుల వివరాలు

  • పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(పీజీటీ)
  • ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌(టీజీటీ)
  • ప్రైమరీ టీచర్‌(పీఆర్‌టీ) 

అర్హతలు

  • పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్‌ (పీజీ)తోపాటు 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • టీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌ పూర్తిచేసి, బీఈడీలో ఉత్తీర్ణత సాధించాలి.
  • పీఆర్‌టీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్‌తోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్‌లో రెండేళ్ల డిప్లొమా లేదా బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు.

వయోపరిమితి

  • ఐదేళ్లకు తక్కువగా టీచింగ్‌ అనుభవం ఉన్న అభ్యర్థులకు వయోపరిమితి 40 ఏళ్లు. ఐదేళ్లకు పైగా టీచింగ్‌ అనుభవం ఉండి, 57 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. 

ఎంపిక విధానం

ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్‌ స్కిల్స్, కంప్యూటర్‌ ప్రొఫిషియెన్సీ టెస్ట్‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

పరీక్ష విధానం

  • ఆన్‌లైన్‌ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్‌ చాయిస్‌ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్‌–ఎలో 80 ప్రశ్నలు, పార్ట్‌–బిలో 120 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్‌–బిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులకు చెందిన వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. పార్ట్‌–ఎ కాలవ్యవధి గంటన్నర, పార్ట్‌–బి కాలవ్యవధి రెండు గంటలు. అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు ప్రతి పార్ట్‌లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. నెగిటివ్‌ మార్కింగ్‌ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కులు కోత విధిస్తారు. 

పార్ట్‌–ఎ

సెక్షన్‌  ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ(బేసిక్‌ జీకే) 28 35%
సెక్షన్‌–బి(కరెంట్‌ అఫైర్స్‌) 28 35%
సెక్షన్‌–సి(ప్రొఫెషనల్‌ నాలెడ్డ్‌) 24 30%
మొత్తం 80 ప్రశ్నలు  

పార్ట్‌–బి (టీజీటీ)

సెక్షన్‌ ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ 42 35%
సెక్షన్‌–బి 42 35%
సెక్షన్‌–సి 12 10%
సెక్షన్‌–డి 24 20%
మొత్తం 120 ప్రశ్నలు  

పార్ట్‌–బి(పీజీటీ)

సెక్షన్‌ ప్రశ్నల సంఖ్య వెయిటేజీ
సెక్షన్‌–ఎ 42 35%
సెక్షన్‌–బి 42 35%
సెక్షన్‌–సి 36 30%
మొత్తం 120 ప్రశ్నలు  
  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి
  • దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి 28 
  • అడ్మిట్‌ కార్డుల డౌన్‌లోడ్‌: 2022 ఫిబ్రవరి 10
  • ఆన్‌లైన్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ తేది: 2022 ఫిబ్రవరి 19, 20
  • ఫలితాల వెల్లడి: 2022 ఫిబ్రవరి 28
  • తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, హైదరాబాద్‌
  • వివరాల కోసం వెబ్‌సైట్‌ https://www.awesindia.com/ చూడొచ్చు. 

ప్రిపరేషన్‌

ఆర్మీ స్కూల్స్‌లో టీచర్‌ పోస్టులకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులు ముందుగా పరీక్ష స్వరూపంపై అవగాహన పెంచుకోవాలి. వివిధ విభాగాల్లోని సెక్షన్లలో వెయిటేజీకి అనుగుణంగా ప్రణాళికను సిద్ధం చేసుకోవాలి. పార్ట్‌–ఎలోని సెక్షన్‌–ఎకి చెందిన బేసిక్‌ జీకేలో సోషల్‌ సైన్స్, జనరల్‌ సైన్స్‌కు సంబంధించిన జనరల్‌ అవేర్‌నెస్‌ అంశాలపై పట్టు సాధించాలి. వీటికోసం ఎన్‌సీఈఆర్‌టీకి చెందిన ఆరు నుంచి పదో తరగతి పాఠ్యపుస్తకాలను చదవాలి. మెంటల్‌ ఎబిలిటీ, కాంప్రహెన్షన్‌ అంశాలను కూడా సాధన చేయాలి. సెక్షన్‌–బిలో కరెంట్‌ అఫైర్స్‌లో మార్కుల సాధనకు జాతీయ స్థాయి కరెంట్‌ అఫైర్స్‌పై ఎక్కువ దృష్టి సారించాలి. అంతర్జాతీయ వర్తమాన వ్యవహారాలు, ముఖ్యమైన సంఘటనలకూ వెయిటేజీ ఉంది. కాబట్టి వాటిని కూడా నేర్చుకోవాలి. సెక్షన్‌–సికి సంబంధించిన ప్రొఫెషనల్‌ నాలెడ్జ్‌లో.. బీఈడీ/టీచింగ్‌ ప్రాక్టీసెస్, సీబీఎస్‌ఈ నిబంధనలు, ఈసీసీఈ, నేషనల్‌ ఎడ్యుకేషన్‌ పాలసీ(ఎన్‌ఈపీ) తదితర అంశాలతోపాటు ఇన్‌క్లూసివ్‌ ఎడ్యుకేషన్, ఇన్ఫోటెక్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. 

పార్ట్‌–బిలో.. టీజీటీ/పీజీటీకి చెందిన సబ్జెక్టుల్లోంచి నాలెడ్జ్, అనువర్తిత ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్ల వారీగా సాధారణ స్థాయి నుంచి ఉన్నత స్థాయి వరకు ప్రశ్నలు అడుగుతారు. అభ్యర్థులు ఏ చిన్న అంశాన్ని నిర్లక్ష్యం చేయకుండా.. ప్రిపరేషన్‌ కొనసాగించాలి. టీజీటీ అభ్యర్థులు ఆరోతరగతి నుంచి గ్రాడ్యుయేషన్‌ స్థాయి వరకు, పీజీటీ అభ్యర్థులు ఇంటర్మీడియెట్‌ నుంచి పీజీ స్థాయి వరకు.. సబ్జెక్టుకు సంబంధించిన అంశాలపై పట్టు పెంచుకోవాలి.

Gemini Internet