అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
12, ఫిబ్రవరి 2022, శనివారం
11, ఫిబ్రవరి 2022, శుక్రవారం
ICAI CA May Exam 2022: సీఏ మే – 2022 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఈ తేదీల్లోనే పరీక్షలు
ICAI CA May Exam 2022 Schedule: సీఏ ఫైనల్, ఇంటర్మీడియట్, PQC పరీక్షలు – మే 2022 షెడ్యూల్ విడుదలైంది. సీఏ కొత్త షెడ్యూల్ను ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) అధికారిక వెబ్సైట్ icaiexam.icai.orgలో విద్యార్ధుల కోసం అందుబాటులో ఉంచింది. ఫౌండేషన్, ఇంటర్మీడియట్, ఫైనల్ కోర్సుల్లో ప్రవేశాల కోసం విద్యార్ధులు ఫిబ్రవరి 21 నుంచి మార్చి 13 వరకు https://icaiexam.icai.orgలో ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పరీక్ష రుసుమును ఆన్లైన్లో చెల్లించవల్సి ఉంటుంది. పరీక్ష తేదీలు, పరీక్ష సమయాలు ఈకింది విధంగా ఉంటాయి..
షెడ్యూల్ ప్రకారం పరీక్షల తేదీలివే.. సీఏ ఫౌండేషన్ 2022 పరీక్షలు: మే 23, 24, 29 తేదీల్లో జరుగుతాయి.
సీఏ ఇంటర్మీడియట్ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్ 1కు.. మే 15, 18, 20, 22 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్ 2కు.. మే 24, 26, 28, 30 తేదీల్లో జరుగుతాయి.
సీఏ మే ఫైనల్ కోర్సు 2022 పరీక్షలు: గ్రూప్ 1కు.. మే 14, 17, 19, 21 తేదీల్లో జరుగుతాయి. గ్రూప్ 2కు.. మే 23, 25, 27, 29 తేదీల్లో జరుగుతాయి.
ఇంటర్నేషనల్ ట్యాక్సేషన్ – అసెస్మెంట్ టెస్ట్ (INTT – AT): మే 14, 17 తేదీల్లో జరుగుతాయి.
పరీక్ష సమయాలు: సీఏ ఫౌండేషన్ పరీక్షలు 2 గంటలపాటు, ఎలక్టివ్ పేపర్స్ ఫైనల్ పరీక్షలు 4 గంటలపాటు, ఇతర పరీక్షలన్నీ 3 గంటల పాటు నిర్వహించబడతాయి.
Gemini Internet
IGNOU January 2022 Session: ఇగ్నో ఆన్లైన్ కోర్సుల్లో ప్రవేశాలకు చివరి తేదీ పొడిగింపు
IGNOU January 2022 Session Admission Last date: ఇందిరా
గాంధీ నేషనల్ ఓపెన్ యూనివర్శిటీ (IGNOU) జనవరి 2022-23 సెషన్ ప్రవేశాల కోసం
ఆన్లైన్ రిజిస్ట్రేషన్ తేదీని పొడిగించింది. ఈ మేరకు ఆన్లైన్
దరఖాస్తులను ఫిబ్రవరి 21 వరకు స్పీకరించనున్నట్లు ఇగ్నో నోటిఫికేషన్
విడుదల చేసింది. ఇంతవరకు దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు ఈ సదావకాశాన్ని
వినియోగించుకోవాలని ఇగ్నో పేర్కొ్ంది. అభ్యర్ధులు అధికారిక వెబ్సైట్
ignou.ac.in లేదా ignouadmission.samarth.edu.in ద్వారా ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్ పద్ధతిలో అందించే ఓపెన్, డిస్టెన్స్ మోడ్
కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన
విద్యార్ధులు కొత్తగా రిజిస్ట్రేషన్ను చేసుకుని, అన్ని వివరాలను నమోదు
చేసి, ఏ కోర్సులో అడ్మిషన్ కావాలని భావిస్తున్నారో దానిని ఎంచుకోవాలి.
ఇగ్నో తాజా నోటిఫికేషన్ ద్వారా మాస్టర్స్ డిగ్రీ, బ్యాచిలర్స్ డిగ్రీలు,
పీజీ డిప్లొమా, పీజీ సర్టిఫికేట్, అప్రీషియేషన్/అవేర్నెస్ లెవల్
ప్రోగ్రామ్లతో సహా వివిధ విభాగాల్లో మొత్తం 200 కంటే ఎక్కువ
ప్రోగ్రామ్లను వర్సిటీ అందించింది. మరిన్ని సంబంధిత వివరాల కోసం ఇగ్నో
అధికారిక సైట్ignou.ac.inను తనిఖీ చేయవచ్చు.
Gemini Internet
Deputy Manager Jobs: కేవలం ఇంటర్వ్యూతోనే.. డిగ్రీ అర్హతతో విజయవాడలో ఉద్యోగాలు
APMDC Recruitment 2022: విజయవాడలో ఉన్న ఆంధ్రప్రదేశ్ మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (APMDC) ఒప్పంద ప్రాతిపదికన డిప్యూటి మేనేజర్ (deputy manager posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 4
పోస్టుల వివరాలు: డిప్యూటి మేనేజర్ పోస్టులు
విభాగాలు: లీగల్, మైనింగ్, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్
పే స్కేల్: నెలకు రూ.51,000ల నుంచి 70,000ల వరకు జీతంగా చెల్లిస్తారు. అదనంగా నెలకు రూ.25,000ల వరకు అలవెన్స్ ఇస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 45 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో డిగ్రీ, లా డిగ్రీ, ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమా (మైనింగ్)లో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: ఏపీఎండీసీ, కానూరు గ్రామం, పెనమలూరు మండలం, విజయవాడ 521137.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 1, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
Project Assistant Jobs: బీఎస్సీ చేసి ఖాళీగా ఉన్నారా? రాత పరీక్ష లేకుండానే సీఎస్ఐఆర్లో ఉద్యోగాలు.
CSIR – IPU Recruitment 2022: న్యూఢిల్లీలోని సీఎస్ఐఆర్ – ఇన్నోవేషన్ ప్రొటెక్షన్ యూనిట్ (IPU) తాత్కాలిక ప్రాతిపదికన ప్రాజెక్ట్ అసిస్టెంట్ (Project Assistant posts) పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 10
పోస్టుల వివరాలు: ప్రాజెక్ట్ అసిస్టెంట్ పోస్టులు
విభాగాలు: కెమికల్, మయోటెక్, కెమిస్ట్రీ, ఐటీ, సివిల్, మెకానికల్
పే స్కేల్: నెలకు రూ.20,000ల వరకు జీతంగా చెల్లిస్తారు.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 50 ఏళ్లు మించరాదు.
అర్హతలు: సంబంధిత స్పెషలైజేషన్లో ఇంజనీరింగ్ డిప్లొమా/బీఎస్సీలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అలాగే సంబంధిత పనిలో అనుభవం కూడా ఉండాలి.
ఎంపిక విధానం: రాత పరీక్ష/ఇంటర్వ్యూ ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తులకు చివరి తేదీ: మార్చి 2, 2022.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
10, ఫిబ్రవరి 2022, గురువారం
AWES Recruitment 2022 : టీజీటీ, పీజీటీ ఉద్యోగాలకు హాల్ టికెట్లు విడుదల.
AWES Army School Admit Card 2022: ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ (AWES) దేశవ్యాప్తంగా వివిధ సైనిక పాఠశాలల్లో TGT, PGT, PRT టీచర్ పరీక్షల కోసం హాల్ టికెట్లను విడుదల చేసింది. ఈ పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థులు ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ అధికారిక వెబ్సైట్ నుంచి అడ్మిట్ కార్డ్ను డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆర్మీ స్కూల్ టీజీటీ, పీజీటీ, పీఆర్టీ రిక్రూట్మెంట్ 2022 ద్వారా మొత్తం 8700 పోస్ట్లు రిక్రూట్ చేయనున్నారు. అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేసుకున్న తర్వాత అభ్యర్థులు తమ పేరు, సబ్జెక్ట్ పేరు, రోల్ నంబర్, చిరునామా, పరీక్షా కేంద్రం, తేదీలను తనిఖీ చేసుకోవల్సి ఉంటుంది. కాగా ఆర్మీ స్కూల్లో ఉపాధ్యాయుల నియామకం కోసం ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ జనవరి 7 నుంచి 28 వరకు జరిగింది. ఈ పరీక్షకు సంబంధించిన పూర్తి సమాచారం కోసం అధికారిక వెబ్సైట్ awesindia.com ను తనిఖీ చేయవచ్చు. ఈ పరీక్ష ఫిబ్రవరి 19, 20 తేదీల్లో ప్రయాగ్రాజ్, కాన్పూర్, ఆగ్రా, వారణాసి, గోరఖ్పూర్, లక్నో, మీరట్, బరేలీ, నోయిడా, ఢిల్లీ, ఝాన్సీ, డెహ్రాడూన్, జైపూర్, జబల్పూర్, భోపాల్లలో నిర్వహించబడుతుంది. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తర్వాత అభ్యర్ధులకు ఇంటర్వ్యూ ఉంటుంది. ఆ తర్వాత టీచింగ్ ఎబిలిటీని అంచనా వేస్తారు. ఈ దశలన్నింటి తర్వాత తుది ఎంపిక జరుగుతుంది.
అడ్మిట్ కార్డును ఎలా డౌన్లోడ్ చేయాలంటే..
- ముందుగా అధికారిక వెబ్సైట్- awesindia.com ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్ పేజీలో ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ టీచర్ రిక్రూట్మెంట్ ఓఎస్టీపై క్లిక్ చెయ్యాలి.
- న్యూ పేజీ ఓపెన్ అవుతుంది. దీనిలో రిజిస్టర్డ్ ఐడీని నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్పై హాల్టికెట్ ఓపెన్ అవుతుంది.
- సేవ్ చేసుకుని, డౌన్లోడ్ చేసుకోవాలి.
Gemini Internet
AP EAPCET 2022: ఏపీ ఈఏపీ 2022 పరీక్ష ‘మే’ లో..
ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది..
Gemini Internet
AP EAPCET 2022: ఆంధ్రప్రదేశ్ ఇంజినీరింగ్, అగ్రికల్చర్
అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (AP EAPCET) 2022 ఈ ఏడాది మేలో
నిర్వహించనున్నట్లు JNTU Kakinada నోటీసు జారీ చేసింది. ఏపీ ఈఏపీ 2022
పరీక్షను ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. ఈ పరీక్షలో అభ్యర్ధులు ఉత్తీర్ణత
సాధించాలంటే కనీసం 25 శాతం మార్కులు తప్పనిసరిగా సాధించాలి. ఇందులో
ఉత్తీర్ణులైన వారు సంబంధిత కళాశాలల్లో అడ్మిషన్లు పొందేందుకు అర్హత
సాధిస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇంజనీరింగ్,
అగ్రికల్చర్, ఫార్మసీ కళాశాలల్లో సీట్లను భర్తీ చేయడానికి ప్రతి సంవత్సరం ఈ
పరీక్ష జరుగుతుంది. ఈ ఏడాది ఏపీ ఈఏసీ సెట్ 2022 లో మొత్తం 331 కళాశాలలు
పాల్గొంటున్నాయి. ఈ పరీక్షను ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హయ్యర్
ఎడ్యుకేషన్ (APSCHE) ఆధీనంలో కాకినాడలోని జవహర్లాల్ నెహ్రూ టెక్నలాజికల్
యూనివర్సిటీ (JNTU) నిర్వహిస్తుంది. కాగా ఏపీ ఈఏసీ సెట్ను గతంలో EAMCET
(ఇంజినీరింగ్ అగ్రికల్చర్ అండ్ మెడికల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్) అనే
పేరుండేది. ఐతే రిజర్వేషన్ వర్గాలకు చెందిన విద్యార్థులకు కనీస మార్కుల
విషయంలో సడలింపు ఉంది. ఈ పరీక్షలో సాధించిన మార్కులను 75 శాతం,
ఇంటర్మీడియట్ గ్రూప్ సబ్జెక్ట్లో సాధించిన 25 శాతం మార్కుల ఆధారంగా
ర్యాంకు కేటాయిస్తారు.
Andhra Pradesh: ఏపీ టెన్త్, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల
ఏపీలో పదో తరగతి, ఇంటర్ పరీక్షల షెడ్యూల్ను మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి విడుదల చేశారు. మే 2 నుంచి మే 13 వరకు పదో తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు పదో తరగతి ఎగ్జామ్స్ జరుగుతాయి. ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ నిర్వహించనున్నారు. ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 వరకు ఇంటర్ ఎగ్జామ్స్ జరుగుతాయి. విద్యార్థుల భవిష్యత్ దృష్ట్యా ఎగ్జామ్స్ పెట్టడం అవసరమని విద్యాశాఖ మంత్రి సురేష్ ఇప్పటికే స్పష్టం చేశారు. మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ ఉంటాయని మంత్రులు తెలిపారు. కరోనా కొత్త నిబంధనల ప్రకారం స్కూళ్లు, కాలేజీలు నడిపిస్తున్నామని ఆయన తెలిపారు. ఎగ్జామ్స్ కూడా కరోనా నిబంధలను పాటిస్తూ నిర్వహిస్తామని వెల్లడించారు.
మొత్తంగా మార్చి 11 నుంచి 31 వరకు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 8 నుండి 28 వరకు ఇంటర్మీడియట్ బోర్డు పరీక్షలు జరుగనున్నాయి. 1456 సెంటర్లలో ఈ పరిక్షలు నిర్వహిస్తున్నారు. మొదటి సంవత్సరం 5,05,052 మంది విద్యార్థులు, రెండో సంవత్సరం 4,81,481 విద్యార్థులు ఇంటర్మీడియట్ పరీక్షలు రాయనున్నారు. మొత్తం 9,86,533 మంది విద్యార్థులు ఈ పరీక్షలు రాయనున్నారు. 2022 సంవత్సరం మే 2 నుంచి మే13 వరకు పదో తరగతి పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 6,39,805 మంది విద్యార్థులు పదోతరగతి పరీక్షలు రాయనున్నారు.
Gemini Internet
పదో తరగతి పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి
ఇంటర్ పరీక్షల షెడ్యూల్ దిగువన చూడండి
CA Results 2021: సీఏ ఫైనల్, ఫౌండేషన్ జూలై 2021 పరీక్షల ఫలితాలు విడుదల
ICAI CA Result July 2021 Results: ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా (ICAI) చార్టర్డ్ అకౌంటెంట్స్ (CA) ఫౌండేషన్, ఫైనల్ (old and new courses) జూలై 2021 పరీక్ష ఫలితాలను ఈరోజు (ఫిబ్రవరి 10) విడుదలచేసింది. అభ్యర్థులు తమ పరీక్షల ఫలితాలను అధికారిక వెబ్సైట్ icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.inలలో తనిఖీ చూసుకోవచ్చు. అభ్యర్ధులకు సంబంధించిన రోల్ నంబర్ రిజిస్ట్రేషన్ నంబర్ లేదా పిన్ నంబర్లతో లాగిన్ అయ్యి ఫలితాలను పొందవచ్చు. అదేవిధంగా మెయిల్ ఐడీతో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్ధులకు కూడా సీఏ ఫౌండేషన్, సీఏ ఫైనల్ పరీక్షల ఫలితాలను వారి వారి మెయిల్లకు పంచించింది. కాగా ఐసీఏఐ అధికారిక ట్విటర్ అకౌంట్ ద్వారా ఈ రోజు సీఏ ఫలితాలను ప్రకటించింది. డిసెంబర్ 2021లో జరిగిన చార్టర్డ్ అకౌంటెంట్స్ ఫైనల్ ఎగ్జామినేషన్, సీఏ ఫౌండేషన్ ఎగ్జామినేషన్ ఫలితాలు ప్రకటించినట్లు ట్విటర్ పోస్టులో పేర్కొంది.
ICAI CA జూలై 2021 ఫలితాలను ఎలా చెక్ చేసుకోవాలంటే..
- మొదటిగా icaiexam.icai.org లేదా caresults.icai.org లేదా icai.nic.in ఏదైనా ఒక వెబ్సైట్ను ఓపెన్ చెయ్యాలి.
- హోమ్పేజీలో కనిపించే రిజల్ట్స్ లింక్పై క్లిక్ చెయ్యాలి.
- అవసరమైన వివరాలను నమోదు చేసి లాగిన్ అవ్వాలి.
- స్క్రీన్ పై కనిపించే స్కోర్కార్డును డౌన్లోడ్ చేసుకోవాలి
సీఏ ఫౌండేషన్ పరీక్షలు గత యేడాది డిసెంబర్ 13,15,17,19 తేదీల్లో నిర్వహించబడ్డాయి. ఇక సీఏ ఫైనల్ పరీక్షలు డిసెంబర్ 5 నుంచి 19 తేదీల మధ్య దేశవ్యాప్తంగా 190 కంటే ఎక్కువ జిల్లాల్లో ఆఫ్లైన్ మోడ్లో పరీక్షలు జరిగాయి. వీటికి సంబంధించిన ఫలితాలు ఈ రోజు విడుదలయ్యాయి.
Gemini Internet
Central Bank Of India: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో స్పెషలిస్ట్ పోస్టులు.. నెలకు రూ. 70 వేలకుపైగా జీతం..
Central Bank Of India Jobs: సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పలు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ భారత ప్రభుత్వ రంగ బ్యాంక్లో సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. ఏయే విభాగాల్లో ఖాళీలు ఉన్నాయి.? ఎలా దరఖాస్తు చేసుకోవాలి.? లాంటి పూర్తి వివరాలు మీకోసం..
భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..
* నోటిఫికేషన్లో భాగంగా ఇన్నర్మేషన్ టెక్నాలజీ విభాగంలో ఉన్న మొత్తం 19 సీనియర్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు.
* ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణత పొంది ఉండాలి. సంబంధిత పనిలో అనుభవం తప్పనిసరి.
* అభ్యర్థుల వయసు 35 ఏళ్లు మించకూడదు.
ముఖ్యమైన విషయాలు..
* ఆసక్తి, అర్హత ఉన్న అభ్యర్థులు ఆన్లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
* అభ్యర్థులను రాత పరీక్ష, పర్సనల్ ఇంటర్వ్యూ ఆధారంగా తుది ఎంపిక చేస్తారు.
* ఎంపికైన అభ్యర్థులకు నెలకు రూ. 63,480 నుంచి రూ. 78,230 వరకు చెల్లిస్తారు.
* ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ 10-02-2022న మొదలు కాగా చివరి తేదీగా 02-03-2022ని నిర్ణయించారు.
* రాతపరీక్షను మార్చి 27న నిర్వహించనున్నారు.
* పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..
Gemini Internet
Indian Coast Guard Jobs: నిరుద్యోగులకు అదిరిపోయే న్యూస్! పదో తరగతి అర్హతతో ఇండియన్ కోస్ట్ గార్డ్లో ఉద్యోగాలు
Indian Coast Guard Recruitment 2022: ఇండియన్ కోస్ట్ గార్డ్ (Indian Coast Guard) సివిలియన్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్ధుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి కలిగిన అభ్యర్ధులు నోటిఫికేషన్ విడుదలైన 30 రోజుల్లోపు పోస్టు ద్వారా ఆఫ్లైన్ మోడ్ (offline application)లో దరఖాస్తులు చేసుకోవల్సి ఉంటుంది. నోటిఫికేషన్కు సంబంధించి దరఖాస్తు ప్రక్రియ, ఖాళీల సంఖ్య, జీతభత్యాలు, ఎంపిక విధానం వంటి ఇతర ముఖ్య సమాచారం మీకోసం..
వివరాలు:
మొత్తం ఖాళీల సంఖ్య: 80
పోస్టుల వివరాలు: సివిలియన్ పోస్టులు
ఖాళీ వివరాలు:
ఇంజిన్ డ్రైవర్: 8 సారంగ్ లాస్కర్: 3 స్టోర్ కీపర్ గ్రేడ్ II: 4 సివిలియన్ మోటార్ ట్రాన్స్పోర్ట్ డ్రైవర్: 24 ఫైర్మ్యాన్: 6 ICE ఫిట్టర్: 6 స్ప్రే పెయింటర్: 1 MT ఫిట్టర్/ MT టెక్/ MT టెక్: 6 MTS: 19 షీట్ మెటల్ వర్కర్: 1 ఎలక్ట్రికల్ ఫిట్టర్: 1 లేబర్: 1
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 18 నుంచి 27 ఏళ్ల మధ్య ఉండాలి.
అర్హతలు: గుర్తింపు పొందిన బోర్డు లేదా ఇన్స్టిట్యూట్ నుంచి పదో తరగతి లేదా తత్సమాన అర్హత ఉండాలి. దీనితోపాటు నోటిఫికేషన్లో సూచించిన విధంగా అర్హతలు కూడా ఉండాలి.
వయోపరిమితి: అభ్యర్ధుల వయసు 42 ఏళ్లకు మించరాదు.
ఎంపిక విధానం: రాత పరీక్ష ఆధారంగా అభ్యర్ధులను ఎంపిక చేస్తారు.
దరఖాస్తు విధానం: ఆసక్తి కలిగిన అభ్యర్ధులు ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
అడ్రస్: The Commander, Coast Guard Region (East), Near Napier Bridge, Fort St George (PO), Chennai- 600009.
దరఖాస్తులకు చివరి తేదీ: నోటిఫికేషన్ జనవరి 23, 2022న విడుదలైంది. అప్పటినుంచి 30 రోజుల వ్యవధిలోపు దరఖాస్తు చేసుకోవాలి.
పూర్తి సమాచారం కోసం క్లిక్ చేయండి.
Gemini Internet
22, జనవరి 2022, శనివారం
Army School Teacher: టీచర్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల.. పోస్టుల వివరాలు, అర్హతల వివరాలు ...
బీఈడీ పూర్తి చేసి ఉపాధ్యాయ కొలువుల కోసం సన్నద్ధమవుతున్నవారి ముందున్న మరో అద్భుత అవకాశం..ఆర్మీ స్కూల్ టీచర్. దేశ వ్యాప్తంగా ఉన్న ఆర్మీ పబ్లిక్ స్కూళ్లలోని టీచర్ పోస్టుల నియామకానికి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ సిద్ధమైంది. తాజాగా పలు ఖాళీల భర్తీకి ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్2022కు నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నేపథ్యంలో.. పోస్టుల వివరాలు, అర్హతలు, దరఖాస్తు ప్రక్రియ, ఎంపిక విధానం, పరీక్ష ప్యాట్రన్, ప్రిపరేషన్ తదితర వివరాలు...
దేశంలోని వివిధ కంటోన్మెంట్లు, మిలిటరీ స్టేషన్లలో సీబీఎస్ఈకి అనుబంధంగా 136 ఆర్మీ పబ్లిక్ స్కూల్స్ను ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ నిర్వహిస్తోంది. ఆయా పాఠశాలల్లో దాదాపు 8700 మంది ఉపాధ్యాయులు కొనసాగుతున్నారు. వివిధ కారణాల వల్ల ఏటా భారీ సంఖ్యలో ఏర్పడుతున్న ఖాళీల భర్తీకి ఆర్మీ వెల్ఫేర్ ఎడ్యుకేషన్ సొసైటీ.. ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహిస్తోంది. ఈ పరీక్షలో చూపిన ప్రతిభ ఆధారంగా తదుపరి దశలో ఆయా పాఠశాలలు ఇంటర్వ్యూలను నిర్వహించి.. ఉద్యోగాల్లో నియమించుకుంటున్నాయి.
పోస్టుల వివరాలు
- పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచర్(పీజీటీ)
- ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్(టీజీటీ)
- ప్రైమరీ టీచర్(పీఆర్టీ)
అర్హతలు
- పీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా పోస్టు గ్రాడ్యుయేషన్ (పీజీ)తోపాటు 50 శాతం మార్కులతో బీఈడీ పూర్తిచేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.
- టీజీటీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్ పూర్తిచేసి, బీఈడీలో ఉత్తీర్ణత సాధించాలి.
- పీఆర్టీ పోస్టులకు కనీసం 50 శాతం మార్కులతో ఏదైనా గ్రాడ్యుయేషన్తోపాటు కనీసం 50 శాతం మార్కులతో ఎలిమెంటరీ ఎడ్యుకేషన్లో రెండేళ్ల డిప్లొమా లేదా బీఈడీ పూర్తిచేసిన వారు అర్హులు.
వయోపరిమితి
- ఐదేళ్లకు తక్కువగా టీచింగ్ అనుభవం ఉన్న అభ్యర్థులకు వయోపరిమితి 40 ఏళ్లు. ఐదేళ్లకు పైగా టీచింగ్ అనుభవం ఉండి, 57 ఏళ్ల లోపు వయసు ఉన్న అభ్యర్థులు కూడా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.
ఎంపిక విధానం
ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్, ఇంటర్వ్యూ, టీచింగ్ స్కిల్స్, కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
పరీక్ష విధానం
- ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ ప్రశ్నలు అడుగుతారు. పార్ట్ఎలో 80 ప్రశ్నలు, పార్ట్బిలో 120 ప్రశ్నలు ఉంటాయి. పార్ట్బిలో పీజీటీ, టీజీటీ పోస్టులకు సంబంధిత సబ్జెక్టులకు చెందిన వేర్వేరు ప్రశ్నలు ఇస్తారు. పార్ట్ఎ కాలవ్యవధి గంటన్నర, పార్ట్బి కాలవ్యవధి రెండు గంటలు. అర్హత సాధించాలంటే.. అభ్యర్థులు ప్రతి పార్ట్లో కనీసం 50 శాతం మార్కులు సాధించాలి. నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి నాలుగోవంతు మార్కులు కోత విధిస్తారు.
పార్ట్ఎ
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్ఎ(బేసిక్ జీకే) | 28 | 35% |
సెక్షన్బి(కరెంట్ అఫైర్స్) | 28 | 35% |
సెక్షన్సి(ప్రొఫెషనల్ నాలెడ్డ్) | 24 | 30% |
మొత్తం | 80 ప్రశ్నలు |
పార్ట్బి (టీజీటీ)
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్ఎ | 42 | 35% |
సెక్షన్బి | 42 | 35% |
సెక్షన్సి | 12 | 10% |
సెక్షన్డి | 24 | 20% |
మొత్తం | 120 ప్రశ్నలు |
పార్ట్బి(పీజీటీ)
సెక్షన్ | ప్రశ్నల సంఖ్య | వెయిటేజీ |
సెక్షన్ఎ | 42 | 35% |
సెక్షన్బి | 42 | 35% |
సెక్షన్సి | 36 | 30% |
మొత్తం | 120 ప్రశ్నలు |
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి
- దరఖాస్తులకు చివరి తేది: 2022 జనవరి 28
- అడ్మిట్ కార్డుల డౌన్లోడ్: 2022 ఫిబ్రవరి 10
- ఆన్లైన్ స్క్రీనింగ్ టెస్ట్ తేది: 2022 ఫిబ్రవరి 19, 20
- ఫలితాల వెల్లడి: 2022 ఫిబ్రవరి 28
- తెలుగు రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: సికింద్రాబాద్, హైదరాబాద్
- వివరాల కోసం వెబ్సైట్ https://www.awesindia.com/ చూడొచ్చు.
ప్రిపరేషన్
Gemini Internet
21, జనవరి 2022, శుక్రవారం
UPSC Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి యూపీఎస్సీ నోటిఫికేషన్.
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) నిరుద్యోగులకు శుభవార్త చెప్పింది. పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. జూనియర్ మైనింగ్ జియాలజిస్ట్ తో పాటు ఇతర ఖాళీలను (Jobs) భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. మొత్తం 78 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో
పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆన్లైన్లో అప్లై
చేసుకోవాల్సి ఉంటుంది. అభ్యర్థులు upsc.gov.in వెబ్ సైట్ ద్వారా అప్లై
చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తుకు జనవరి 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాలని
నోటిఫికేషన్లో స్పష్టం చేశారు.
Gemini Internet
పోస్టు | ఖాళీలు |
అసిస్టెంట్ ఎడిటర్ (Oriya): | 1 |
అసిస్టెంట్ డైరెక్టర్ (Cost): | 16 |
ఎకనామిక్ ఆఫీసర్: | 4 |
అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్: | 1 |
మెకానికల్ మెరైన్ ఇంజనీర్: | 1 |
లెక్చరర్: | 4 |
సైంటిస్ట్: | 2 |
కెమిస్ట్: | 5 |
జూనియర్ మైనింగ్ జియోలజిస్ట్: | 36 |
రీసెర్చ్ ఆఫీసర్: | 1 |
అసిస్టెంట్ ప్రొఫెసర్: | 7 |
మొత్తం: | 78 |
వేర్వేరు ఉద్యోగాలకు వేర్వేరుగా విద్యార్హతలను నిర్ణయించారు. విద్యార్హతలు, వయో పరిమితికి సంబంధించిన పూర్తి వివరాలను అభ్యర్థులు ఈ లింక్ ద్వారా నోటిఫికేషన్లో చూడొచ్చు.
అప్లికేషన్ ఫీజు: అభ్యర్థులు అప్లై చేసే సమయంలో రూ.25ను అప్లికేషన్ ఫీజుగా చెల్లించాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఆ ఫీజును ఆన్లైన్ బ్యాంకింగ్ ద్వారా చెల్లించొచ్చు. ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
ఎలా అప్లై చేయాలంటే:
Step 1: అభ్యర్థులు మొదటగా అధికారిక వెబ్ సైట్ ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం ONLINE RECRUITMENT APPLICATION (ORA) FOR VARIOUS RECRUITMENT POSTS ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
20, జనవరి 2022, గురువారం
IBPS Exam Calendar 2022: నిరుద్యోగులకు అలర్ట్... ఈ ఏడాది రాబోయే బ్యాంక్ జాబ్ నోటిఫికేషన్స్
బ్యాంక్ ఎగ్జామ్కు ప్రిపేర్ అవుతున్నారా? బ్యాంకు ఉద్యోగాల (Bank Jobs) కోసం కోచింగ్ తీసుకుంటున్నారా? అయితే అలర్ట్. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్
(IBPS) ఈ ఏడాది నిర్వహించబోయే పరీక్షల వివరాలను వెల్లడించింది. 2022-23
ఎగ్జామ్ క్యాలెండర్ను విడుదల చేసింది. ఈ ఏడాది రీజనల్ రూరల్ బ్యాంకుల్లో
ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్, ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్, ప్రొబెషనరీ
ఆఫీసర్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేయనుంది. ఈ
పోస్టుల భర్తీకి వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ విడుదల చేయనుంది. మరి ఏ
నోటిఫికేషన్ ఎప్పుడు ఉంటుంది? ఏ ఉద్యోగాలకు ఎగ్జామ్స్ ఎప్పుడు ఉంటాయి?
తెలుసుకోండి.
IBPS Exam Calendar 2022: ఐబీపీఎస్ ఎగ్జామ్ క్యాలెండర్ వివరాలివే...
పరీక్ష పేరు | తేదీలు |
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ 1 ప్రిలిమ్స్ | 2022 ఆగస్ట్ 7, 13, 14, 20, 21 |
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 2, 3 సింగిల్ ఎగ్జామ్ | 2022 సెప్టెంబర్ 24 |
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీసర్ స్కేల్ 1 మెయిన్ ఎగ్జామ్ | 2022 సెప్టెంబర్ 24 |
ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఆఫీస్ అసిస్టెంట్ మెయిన్ ఎగ్జామ్ | 2022 అక్టోబర్ 1 |
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ | 2022 ఆగస్ట్ 28, సెప్టెంబర్ 3, 4 |
ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ | 2022 అక్టోబర్ 10 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 2022 అక్టోబర్ 15, 16, 22 |
ఐబీపీఎస్ ప్రొబెషనరీ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 2022 నవంబర్ 26 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ ప్రిలిమ్స్ | 2022 డిసెంబర్ 24, 31 |
ఐబీపీఎస్ స్పెషలిస్ట్ ఆఫీసర్ మెయిన్ ఎగ్జామ్ | 2023 జనవరి 29 |
IBPS Exam Calendar 2022: ఐబీపీఎస్ ఎగ్జామ్ రిజిస్ట్రేషన్ ప్రాసెస్
అభ్యర్థులు
ఆన్లైన్లోనే రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. ప్రిలిమినరీ ఎగ్జామ్,
మెయిన్ ఎగ్జామ్కు ఒకేసారి రిజిస్ట్రేషన్ చేయాలి. అభ్యర్థులు
అడ్వర్టైజ్మెంట్లో వివరించినట్టుగా ఫోటోగ్రాఫ్, సంతకం, వేలిముద్ర,
చేతిరాతతో రాసిన డిక్లరేషన్ కాపీ అప్లోడ్ చేయాలి. మరిన్ని వివరాలను
డీటెయిల్డ్ నోటిఫికేషన్లో వెల్లడించనుంది ఐబీపీఎస్. ఆసక్తి గల అభ్యర్థులు
ఐబీపీఎస్ అధికారిక వెబ్సైట్ https://www.ibps.in/ ఫాలో కావాలి. పరీక్ష తేదీకి రెండు నెలల ముందు జాబ్ నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. కాబట్టి అభ్యర్థులు రెగ్యులర్గా ఐబీపీఎస్ వెబ్సైట్ ఫాలో అవుతూ ఉండాలి.
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ను తెలుగు, ఇంగ్లీష్, హిందీతో కలిపి మొత్తం 13 భాషల్లో నిర్వహించాలని గతేడాది ఐబీపీఎస్ నిర్ణయించిన సంగతి తెలిసిందే. ఇక రీజనల్ రూరల్ బ్యాంకుల్లో ఖాళీలకు, ఆఫీసర్ స్కేల్ 1 పోస్టులకు కూడా ప్రాంతీయ భాషల్లో పరీక్షలు నిర్వహించాలని 2019 లో ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం ఐబీపీఎస్, రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (RRB), స్టాఫ్ సెలెక్షన్ కమిషన్ (SSC) ప్రిలిమినరీ పరీక్షల్ని నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీని (NRA) ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. నేషనల్ రిక్రూట్మెంట్ ఏజెన్సీ ఇంకా నోటిఫికేషన్స్ విడుదల చేయాల్సి ఉంది.
18, జనవరి 2022, మంగళవారం
RRB NTPC CBT-2: ఆర్ఆర్బీ ఎన్టీపీసీ సీబీటీ–2 పరీక్షల షెడ్యూల్ విడుదల.. ఎగ్జామ్, సిలబస్, కటాఫ్ మార్కులు గురించి సమాచారం
రైల్వే రిక్రూట్మెంట్ బోర్డ్ (Railway Recruitment Board) ఎన్టీపీసీ(NTPC)
సీబీటీ–1 ఫలితాలను విడుదల చేసిన సంగతి తెలిసిందే. సీబీటీ–1 పరీక్షను
దాదాపు 7 లక్షల మంది క్లియర్ చేశారు. వీరంతా సీబీటీ–2 పరీక్ష కోసం
ప్రిపేరవుతున్నారు. సీబీటీ-1 పరీక్ష 2020 డిసెంబర్ 28 నుంచి 2021 జూలై 31
మధ్య వరకు మొత్తం ఏడు దశల్లో జరిగింది. తాజాగా బోర్డు జారీ చేసిన నోటీసు
ప్రకారం, రెండో దశ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (CBT–2) ఫిబ్రవరి 14 నుంచి 18
వరకు జరగనుంది. అంటే కేవలం నెల రోజుల సమయం మాత్రమే ఉంది. ఈ తక్కువ సమయంలో
సీబీటీ–2కు ఎలా ప్రిపేర్ (Prepare) అవ్వాలి..? ప్రశ్నల సరళి ఎలా ఉంటుంది?
సిలబస్ ఏంటి? అనే విషయాలను తెలుసుకుందాం.
Gemini Internet
ఆర్ఆర్బీ ఎన్టీపీసీ CBT 2 పరీక్ష 90 నిమిషాల వ్యవధి కలిగి ఉంటుంది.
దీనిలో జనరల్ అవేర్నెస్, మ్యాథమేటిక్స్, జనరల్ ఇంటలిజెన్స్ అండ్
రీజనింగ్ విభాగాల నుంచి 120 ప్రశ్నలొస్తాయి. మ్యాథ్స్, జనరల్
ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్ నుంచి 35 ప్రశ్నలు చొప్పున, జనరల్
అవేర్నెస్ నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు
కేటాయించారు. ప్రతి తప్పు సమాధానానికి మూడింట ఒక వంతు మార్కు కోత
విధిస్తారు.
ఆర్ఆర్ఆబీ ఎన్టీపీసీ సీబీటీ–2 సిలబస్
మ్యాథమెటిక్స్..
నంబర్
సిస్టమ్, డెసిమల్స్, ఫంక్షన్లు, LCM, HCF, రేషియో అండ్ ప్రపోర్షన్,
పర్సంటేజ్, టైమ్ అండ్ వర్క్, టైమ్ అండ్ డిస్టన్స్, సింపుల్ అండ్
కాంపౌండ్ ఇంట్రెస్ట్, ప్రాఫిట్ అండ్ లాస్, ఎలిమెంటరీ ఆల్జీబ్రా,
జామెట్రీ అండ్ ట్రిగనామెట్రీ, ఎలిమెంటరీ స్టాటిస్టిక్స్ నుంచి
ప్రశ్నలొస్తాయి.
జనరల్ ఇంటెలిజెన్స్ అండ్ రీజనింగ్..
అనాలజీస్, నంబర్స్, ఆల్ఫాబెటికల్ సిరీస్, కోడింగ్ అండ్ డీకోడింగ్, మ్యాథమెటికల్ ఆపరేషన్లు, సిమిలారిటీస్ అండ్ డిఫరెన్సస్, రిలేషన్షిప్స్, అనలిటికల్ రీజనింగ్, సిలోజిజం, జంబ్లింగ్, వెన్ డయాగ్రమ్స్, పజిల్, డేటా సఫిషియన్సీ, స్టేట్మెంట్ కన్క్లూజన్, స్టేట్మెంట్ కోర్సెస్ ఆఫ్ యాక్షన్, డెసిజన్ మేకింగ్, మ్యాప్స్, గ్రాఫ్ ఇంటర్ప్రిటేషన్ మొదలైనవి.
జనరల్ అవేర్నెస్..
జాతీయ, అంతర్జాతీయ
ప్రాముఖ్యత కలిగిన ప్రస్తుత సంఘటనలు, ఆటలు, క్రీడలు, భారతదేశ కళ, సంస్కృతి,
భారతీయ సాహిత్యం, స్మారక చిహ్నాలు, భారతదేశంలోని ప్రదేశాలు, జనరల్ సైన్స్
మరియు లైఫ్ సైన్స్ (10వ తరగతి వరకు), భారతదేశ చరిత్ర, స్వాతంత్య్ర పోరాటం,
భారత్తో పాటు ప్రపంచ సామాజిక ఆర్థిక భౌగోళిక శాస్త్రం, భారత రాజకీయాలు,
పాలన- రాజ్యాంగం, రాజకీయ వ్యవస్థ, ఐక్యరాజ్య సమితి, ఇతర ముఖ్యమైన ప్రపంచ
సంస్థలు, అంతరిక్ష, అణు కార్యక్రమాలతో సహా సాధారణ శాస్త్ర, సాంకేతిక
పరిణామాలు, భారతదేశం, ప్రపంచానికి సంబంధించిన పర్యావరణ సమస్యలు, ప్రాథమిక
అంశాలు కంప్యూటర్లు, కంప్యూటర్ అప్లికేషన్లు, సాధారణ సంక్షిప్తాలు,
భారతదేశంలో రవాణా వ్యవస్థలు, భారత ఆర్థిక వ్యవస్థ, భారతదేశంతో పాటు
ప్రపంచంలోని ప్రసిద్ధ వ్యక్తులు, ప్రధాన ప్రభుత్వ కార్యక్రమాలు,
భారతదేశంలోని వృక్షజాలం, జంతుజాలం, భారతదేశంలోని ముఖ్యమైన ప్రభుత్వ,
ప్రభుత్వ రంగ సంస్థలు మొదలైనవి.
సీబీటీ–2 కటాఫ్ మార్కులు..
సీబీటీ–2లో ఉత్తీర్ణత సాధించడానికి, అభ్యర్థులకు కనీస అర్హత మార్కుల సాధించాలి. అన్రిజర్వ్డ్ కేటగిరీ, EWS అభ్యర్థులు కనీసం 40 శాతం మార్కులు సాధించాలి. ఓబీసీ (నాన్ క్రీమీ లేయర్) అభ్యర్థులకు కనీసం 30 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి. సీబీటీ–‘లో ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు టైపింగ్ స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. సీబీటీ–2, టైపింగ్ టెస్ట్ మార్కుల ఆధారంగా ఫైనల్ సెలక్షన్ ఉంటుంది.
RBI Recruitment 2022: ఉద్యోగాల భర్తీకి ఆర్బీఐ జాబ్ నోటిఫికేషన్.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 14 ఖాళీలున్నాయి. ఆర్బీఐ
హెడ్క్వార్టర్స్తో పాటు కోల్కతాలోని ఆర్బీఐ మ్యూజియంలో ఈ
పోస్టులున్నాయి. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై
చేయడానికి 2022 ఫిబ్రవరి 4 చివరి తేదీ. ఇవి ఫుల్ టైమ్ కాంట్రాక్ట్
పోస్టులు. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్లైన్లో మాత్రమే దరఖాస్తు చేయాలి.
ఆఫ్లైన్ దరఖాస్తుల్ని స్వీకరించరు. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
RBI Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
మొత్తం ఖాళీలు | 14 | విద్యార్హతలు | వయస్సు |
లీగల్ ఆఫీసర్ ఇన్ గ్రేడ్ బీ | 2 | గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ లా కనీసం 50 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 32 ఏళ్లు |
మేనేజర్ (టెక్నికల్-సివిల్) | 6 | సివిల్ ఇంజనీరింగ్ లేదా తత్సమాన సబ్జెక్ట్లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 35 ఏళ్లు |
మేనేజర్ (టెక్నికల్-ఎలక్ట్రికల్) | 3 | ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో బీటెక్ లేదా బీఈ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 35 ఏళ్లు |
లైబ్రరీ ప్రొఫెషనల్స్ (అసిస్టెంట్ లైబ్రేరియన్) ఇన్ గ్రేడ్ ఏ | 1 | బ్యాచిలర్స్ డిగ్రీ ఇన్ ఆర్ట్స్, కామర్స్, సైన్స్తో పాటు మాస్టర్స్ డిగ్రీ ఇన్ లైబ్రరీ సైన్స్ లేదా లైబ్రరీ అండ్ ఇన్ఫర్మేషన్ సైన్స్ పాస్ కావాలి. | 21 నుంచి 30 ఏళ్లు |
ఆర్కిటెక్ట్ ఇన్ గ్రేడ్ ఏ | 1 | ఆర్కిటెక్చర్లో బ్యాచిలర్స్ డిగ్రీ కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. | 21 నుంచి 30 ఏళ్లు |
Gemini Internet
దరఖాస్తు ప్రారంభం- 2022 జనవరి 15
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 ఫిబ్రవరి 4 సాయంత్రం 6 గంటలు
పరీక్ష తేదీ- 2022 మార్చి 6
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.600, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.100 ఫీజు చెల్లించాలి.
ఎంపిక విధానం- ఇంటర్వ్యూ
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.
RBI Recruitment 2022: అప్లై చేయండి ఇలా...
Step 1- అభ్యర్థులు ఆర్బీఐ కెరీర్స్ వెబ్సైట్ https://opportunities.rbi.org.in/ ఓపెన్ చేయాలి.
Step 2- Current Vacancies సెక్షన్లో లీగల్ ఆఫీసర్, మేనేజర్, క్యూరేటర్ ఉద్యోగాల నోటిఫికేషన్ క్లిక్ చేయాలి.
Step 3- నియమనిబంధనలన్నీ చదివిన తర్వాత Online Application Form పైన క్లిక్ చేయాలి.
Step 4- కొత్త వెబ్సైట్ ఓపెన్ అవుతుంది.
Step 5- అందులో Click here for New Registration పైన క్లిక్ చేయాలి.
Step 6- మొత్తం 6 దశల్లో దరఖాస్తు ప్రక్రియ ఉంటుంది.
Step 7- మొదటి దశలో పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
Step 8- రెండో దశలో ఫోటో, సంతకం అప్లోడ్ చేయాలి.
Step 9- మూడో దశలో విద్యార్హతలు, ఇతర వివరాలు ఎంటర్ చేయాలి.
Step 10- నాలుగో దశలో అప్లికేషన్ ప్రివ్యూ చూసి వివరాలన్నీ సరిచూసుకోవాలి.
Step 11- ఐదో దశలో ఇతర సర్టిఫికెట్స్ అప్లోడ్ చేయాలి.
Step 12- ఆరో దశలో ఫీజు పేమెంట్ చేసి అప్లికేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలి.
NIRDPR Recruitment 2022: హైదరాబాద్లోని కేంద్ర ప్రభుత్వ సంస్థలో ఉద్యోగాలు
కేంద్ర గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన స్వయంప్రతిపత్తిగల
సంస్థ నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ రూరల్ డెవలప్మెంట్ అండ్ పంచాయతీరాజ్
(NIRD&PR) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification)
విడుదల చేసింది. రీసెర్చ్ అసోసియేట్, డేటా అనలిస్ట్, ప్రాజెక్ట్
అసోసియేట్, మల్టీ టాస్కింగ్ స్టాఫ్ లాంటి పోస్టుల్ని భర్తీ చేస్తోంది.
ఖాళీల సంఖ్య వెల్లడించలేదు. హైదరాబాద్తోపాటు గువాహతిలో ఈ పోస్టులు
ఉన్నాయి. ఇవి ఒక ఏడాది గడువు ఉన్న కాంట్రాక్ట్ పోస్టులు మాత్రమే. ఈ
పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి
2022 జనవరి 26 చివరి తేదీ. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు
చేయాలి. వేర్వేరు పోస్టులకు వేర్వేరు దరఖాస్తు లింక్స్ ఉన్నాయి. ఖాళీల
వివరాలు, దరఖాస్తు విధానం గురించి తెలుసుకోండి.
NIRDPR Recruitment 2022: ఖాళీల వివరాలు ఇవే...
పోస్టు పేరు | విద్యార్హతలు | వయస్సు | అనుభవం | వేతనం |
డేటా అనలిస్ట్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 40 ఏళ్లు | 2 నుంచి 5 ఏళ్లు | నెలకు రూ.40,000 |
ఆఫీస్ అసిస్టెంట్ | పదో తరగతి | 40 ఏళ్లు | 5 ఏళ్లు | నెలకు రూ.16,000 |
వుమెన్ అండ్ చైల్డ్ డెవలప్మెంట్ కో-ఆర్డినేటర్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 50 ఏళ్లు | 5 నుంచి 8 ఏళ్లు | నెలకు రూ.90,000 |
ప్రాజెక్ట్ అసోసియేట్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 40 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.30,000 |
ఫైనాన్స్ అసోసియేట్ | డిగ్రీ | 40 ఏళ్లు | 3 ఏళ్లు | నెలకు రూ.30,000 |
మల్టీ టాస్కింగ్ స్టాఫ్ | పదో తరగతి | 30 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.12,000 |
రీసెర్చ్ అసోసియేట్ | డాక్టోరల్ | 40 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.40,000 |
ట్రైనింగ్ మేనేజర్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 45 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.30,000 |
రీసెర్చ్ అసోసియేట్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 30 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.22,000 |
మేనేజర్ (టెక్నికల్) | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 35 ఏళ్లు | 3 ఏళ్లు | నెలకు రూ.50,000 |
ట్రైనింగ్ మేనేజర్ | పోస్ట్ గ్రాడ్యుయేషన్ | 35 ఏళ్లు | 2 ఏళ్లు | నెలకు రూ.45,000 |
దరఖాస్తుకు చివరి తేదీ- 2022 జనవరి 26 సాయంత్రం 6.30 గంటలు
విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
ఎంపిక ప్రక్రియ- ఇంటర్వ్యూ
కాంట్రాక్ట్ గడువు- 2022 ఫిబ్రవరి నుంచి 2023 మార్చి వరకు
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
16, జనవరి 2022, ఆదివారం
TTD Update 🕉 *జనవరి 16న శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం* 🕉 *జనవరి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*
🕉 *జనవరి 16న శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా పార్వేటు ఉత్సవం*
🕉 *జనవరి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*
➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుమల:
కోవిడ్ -19 వ్యాప్తి నేపథ్యంలో జనవరి 16వ తేదీ ఆదివారం శ్రీవారి ఆలయంలో ఏకాంతంలో పార్వేటు ఉత్సవం నిర్వహించనున్నారు.
◆ శ్రీవారి పార్వేటు ఉత్సవం సాంప్రదాయక వార్షిక ఉత్సవం. ఈ ఉత్సవాన్ని ప్రతి సంవత్సరం కనుమ రోజున జరుపుకుంటారు. ఈ ఉత్సవంలో శ్రీ మలయప్ప స్వామి అడవులకు వెళ్లి తన భక్తులను రక్షించడానికి క్రూర మృగాలను వేటాడతారు.
👉కనీ కోవిడ్ ప్రభావం కారణంగా, గత సంవత్సరం కల్యాణోత్సవ మండపం లోపల వనాన్ని పునర్నిర్మించి ఈ ఉత్సవాన్ని నిర్వహించారు.
కోవిడ్ కేసులు ఇంకా ప్రబలంగా ఉన్నందున, ఈ సంవత్సరం కూడా గత ఏడాది నిర్వహించిన విధంగానే ఏకాంతంగా ఈ ఉత్సవాన్ని నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది.
🕉 *జనవరి 17న ఏకాంతంగా శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటి*
అదేవిధంగా జనవరి 17న తిరుమలలో నిర్వహించే శ్రీరామకృష్ణ తీర్థ ముక్కోటిని ఏకాంతంలో నిర్వహించాలని టిటిడి నిర్ణయించింది. భక్తులు ఈ విషయాన్ని గమనించగలరు.
*Dept.Of PRO TTD*
Gemini Internet
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ప్రిపరేషన్ గురించి తెలుసుకోండి Know about APPSC Preparation
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్(ఏపీపీఎస్సీ).. ఒకేసారి ఏడు వందలకు పైగా పోస్ట్లతో నోటిఫికేషన్లు వెలువరించడంతో.. ఉద్యోగార్థులకు సంక్రాంతి పండగ ముందే వచ్చినట్లయింది. గత కొంత కాలంగా క్రమం తప్పకుండా పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్లను విడుదల చేస్తున్న ఏపీపీఎస్సీ.. తాజాగా మరో రెండు నోటిఫికేషన్లతో అభ్యర్థుల ముందుకొచ్చింది. రెవెన్యూ డిపార్ట్మెంట్లో జూనియర్ అసిస్టెంట్ పోస్ట్లు, దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 పోస్ట్లకు.. ప్రకటన విడుదల చేసింది. ఈ నేపథ్యంలో..ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లు, అర్హతలు, ఎంపిక ప్రక్రియ, పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్..
- రెండు శాఖల్లో కలిపి 730 పోస్ట్ల భర్తీకి నోటిఫికేషన్
- రూ.16,400–రూ.48,870 శ్రేణిలో ప్రారంభ వేతనం
- రాత పరీక్షలో మెరిట్ ఆధారంగా ఎంపిక
- దరఖాస్తుల సంఖ్య ఆధారంగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించే అవకాశం
- సిలబస్పై సంపూర్ణ అవగాహనతో విజయం సాధించొచ్చు
ఏపీపీఎస్సీ ఇటీవల 730 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు విడుదల చేసింది. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేందుకు.. అభ్యర్థులు ఇప్పటి నుంచే కృషి చేయాలి. ఇందుకోసం ఆయా నోటిఫికేషన్లలో పేర్కొన్న సిలబస్కు అనుగుణంగా ప్రిపరేషన్ సాగిస్తే.. విజయావకాశాలు మెరుగుపరచుకోవచ్చు అంటున్నారు నిపుణులు.
రెండు శాఖలు, 730 పోస్ట్లు
- ఏపీపీఎస్సీ రెండు శాఖల్లో మొత్తం 730 పోస్ట్లను భర్తీ చేయనుంది. అవి..
- ఏపీ రెవెన్యూ శాఖలో జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్టులు–670.
- దేవాదాయ శాఖలో ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3–పోస్టులు– 60.
- అభ్యర్థులు ఈ రెండు నోటిఫికేషన్లకు వేర్వేరుగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.
- బ్యాచిలర్ డిగ్రీ అర్హతగా పేర్కొన్న ఈ రెండు రకాల పోస్ట్ల భర్తీకి ఏపీపీఎస్సీ వేర్వేరుగా ఎంపిక ప్రక్రియ నిర్వహించనుంది.
రాత పరీక్షలో మెరిట్
ఏపీపీఎస్సీ నిర్వహించే రాత పరీక్షలో మెరిట్ ఆధారంగానే ఈ పోస్టుల భర్తీ చేపడతారు. ఈ రెండు పోస్ట్లకు సంబంధించిన రాత పరీక్షలో ఒక పేపర్ జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీ ఉంటుంది. రెండో పేపర్ మాత్రం జూనియర్ అసిస్టెంట్స్ పోస్ట్లకు,ఎండోమెంట్ ఆఫీసర్ పోస్ట్లకు వేర్వేరుగా ఉంటుంది. దీంతో..బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణులు సమయ పాలన, నిర్దిష్ట వ్యూహంతో..ప్రిపరేషన్ సాగిస్తే.. ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధమై.. రెండు పోస్ట్లకు పోటీ పడే అవకాశం ఉంది.
దరఖాస్తుల సంఖ్య ఆధారంగా
- ఒక్కో పోస్ట్కు దరఖాస్తుల సంఖ్య 200 దాటితే.. ముందుగా స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించనున్నట్లు ఏపీపీఎస్సీ ప్రకటించింది. స్క్రీనింగ్ టెస్ట్లో ప్రతిభ చూపిన వారిని తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తామని స్పష్టం చేసింది.
- ఒక్కో పోస్ట్కు నిర్దిష్ట నిష్పత్తిలో మెయిన్ పరీక్షకు అభ్యర్థులను ఎంపిక చేస్తామని పేర్కొంది. మెయిన్ పరీక్షలో పొందిన మెరిట్ ఆధారంగా మెరిట్ జాబితా రూపొందించి నియామకాలు ఖరారు చేయనున్నారు.
స్క్రీనింగ్ టెస్ట్లు ఇలా
- రెవెన్యూ శాఖలోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్, దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్లకు సంబంధించి స్క్రీనింగ్ పరీక్ష విధానాలు..
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ స్క్రీనింగ్ టెస్ట్: ఈ పరీక్ష రెండు విభాగాలుగా రెండు సబ్జెక్ట్లలో 150 మార్కులకు జరగనుంది.
విభాగం సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం ఎ జీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 100 100 100ని బి జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు 50 50 50ని
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 స్క్రీనింగ్ టెస్ట్:
- ఈ పరీక్ష కూడా రెండు విభాగాలుగా 150 మార్కులకు జరుగనుంది. వివరాలు..
విభాగం సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు సమయం ఎ జీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 50 50 50 ని బి హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 100 100 100 ని
- రెండు పోస్ట్లకు నిర్వహించే స్క్రీనింగ్ పరీక్ష పూర్తిగా పెన్ పేపర్ విధానంలోనే ఉంటుంది. అభ్యర్థులు ఓఎంఆర్ షీట్పై సమాధానాలు నింపాలి.
- నెగిటివ్ మార్కుల విధానం ఉంది. ప్రతి తప్పు సమాధానానికి సదరు ప్రశ్నకు కేటాయించిన మార్కుల నుంచి 1/3 మార్కులు తగ్గిస్తారు.
- రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్లకు నిర్వహించే పార్ట్–బి పేపర్లో.. జనరల్ ఇంగ్లిష్ నుంచి 25 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 25 ప్రశ్నలు అడుగుతారు.
మెయిన్ పరీక్ష
స్క్రీనింగ్ టెస్ట్లో నిర్దేశిత కటాఫ్ మార్కులు పొందిన వారికి తదుపరి దశలో మెయిన్ పరీక్ష నిర్వహిస్తారు. ఇది కంప్యూటర్ బేస్డ్(ఆన్లైన్) టెస్ట్గా ఉంటుంది.
- జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ మెయిన్: ఈ పరీక్ష
రెండు పేపర్లుగా మొత్తం 300 మార్కులకు జరగనుంది. పూర్తిగా ఆబ్జెక్టివ్
తరహా ప్రశ్నలు ఉంటాయి. వివరాలు..
పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు పేపర్–1 జీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 పేపర్–2 జనరల్ ఇంగ్లిష్ అండ్ జనరల్ తెలుగు 150 150
- పేపర్–2లో జనరల్ ఇంగ్లిష్ నుంచి 75 ప్రశ్నలు, జనరల్ తెలుగు నుంచి 75 ప్రశ్నలు అడుగుతారు. ప్రతి పేపర్కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.
- ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఎండోమెంట్ సబ్ సర్వీస్) మెయిన్: ఈ పరీక్ష కూడా రెండు పేపర్లుగా 300 మార్కులకు జరగనుంది. వివరాలు..
పేపర్ సబ్జెక్ట్ ప్రశ్నలు మార్కులు పేపర్–1 జీఎస్ అండ్ మెంటల్ ఎబిలిటీ 150 150 పేపర్–2 హిందూ తత్వం దేవాలయ వ్యవస్థ 150 150
- ఈ పరీక్ష కూడా పూర్తిగా ఆబ్జెక్టివ్ విధానంలోనే ఉంటుంది.
- ప్రతి పేపర్కు పరీక్ష సమయం రెండున్నర గంటలు.
ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గ్రేడ్–3 (ఏపీ ఎండోమెంట్స్ సబ్ సర్వీస్)
- మొత్తం పోస్టుల సంఖ్య: 60
- వేతన శ్రేణి: రూ.16,400 – రూ.49,870
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి
- వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
- దరఖాస్తులకు చివరి తేదీ: 19.01.2022
- వెబ్సైట్: https://psc.ap.gov.in
జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్(రెవెన్యూ శాఖ) (గ్రూప్–4 సర్వీసెస్)
- మొత్తం పోస్టుల సంఖ్య: 670
- ప్రారంభ వేతన శ్రేణి: రూ.16,400 –రూ.49,870.
- అర్హత: బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత ఉండాలి. తుది ఎంపికకు షార్ట్లిస్ట్ అయిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియన్సీ టెస్ట్లోనూ ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.
- వయో పరిమితి: జూలై 1, 2021 నాటికి 18–42 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ,ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితిలో అయిదేళ్ల సడలింపు లభిస్తుంది.
- దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి.
- దరఖాస్తులకు చివరి తేది: 19.01.2022
- వెబ్సైట్: https://psc.ap.gov.in
నిర్దిష్ట ప్రణాళికతో.. విజయం దిశగా
- రెండు శాఖల్లోని పోస్టులకు కూడా స్క్రీనింగ్ టెస్ట్లో పేర్కొన్న సబ్జెక్ట్లనే మెయిన్ పరీక్షలోనూ పేర్కొన్నారు.
- స్క్రీనింగ్, మెయిన్లకు ఒకే సిలబస్ అంశాలను పేపర్లుగా నిర్దేశించినా.. మెయిన్లో అడిగే ప్రశ్నలు లోతుగా ఉండే అవకాశం ఉంది.
- కాబట్టి మొదటి నుంచే మెయిన్ను దృష్టిలో పెట్టుకొని ప్రిపరేషన్ సాగించాలి. తద్వారా స్క్రీనింగ్ టెస్ట్లో సులభంగా విజయం సాధించి మెయిన్కు అర్హత పొందొచ్చు.
- అభ్యర్థులు ప్రిపరేషన్కు ముందే ఆయా సబ్జెక్ట్ల సిలబస్లను ఆమూలాగ్రం పరిశీలించాలి. స్క్రీనింగ్, మెయిన్ పరీక్షల సిలబస్ మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి.
- భిన్నంగా ఉన్న అంశాలను ప్రత్యేకంగా నోట్ చేసుకొని.. వాటి ప్రిపరేషన్కు ప్రత్యేక సమయం కేటాయించాలి.
- దేవాదాయ శాఖలోని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ పోస్ట్లకు స్క్రీనింగ్, మెయిన్లో ఉన్న హిందూతత్వం, దేవాలయ వ్యవస్థ పేపర్కు సంబంధించి ప్రత్యేకంగా అధ్యయనం కొనసాగించాలి.
- పురాణాలు, ఇతిహాసాలు, వేద సంస్కృతి, కళలు, ఉపనిషత్తులు, కుటుంబ వ్యవస్థ, దేవాలయాలకు వచ్చే ఆదాయ మార్గాలు, ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ విధులు, ఎండోమెంట్ భూములకు సంబంధించిన చట్టాలు, భూ రికార్డులపై అవగాహన పెంచుకోవాలి.
- జనరల్ స్టడీస్ అండ్ మెంటల్ ఎబిలిటీకి సంబంధించి.. ప్రాంతీయ, జాతీయ, అంతర్జాతీయ ప్రాధాన్యం ఉన్న అంశాలు; భారతదేశ, ఆంధ్రప్రదేశ్ చరిత్ర, ఆర్థికాభివృద్ధి ,ఆంధ్రప్రదేశ్ పునర్విభజన చట్టం, పునర్విభజన సమస్యల గురించి అధ్యయనం చేయాలి.
- ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, లక్షిత వర్గాలు, లబ్ధిదారులు, బడ్జెట్ కేటాయింపుల గురించి తెలుసుకోవాలి.
- మెంటల్ ఎబిలిటీ విభాగంలో.. రాణించేందుకు టాబ్యులేషన్, డేటా సమీకరణ, డేటా విశ్లేషణలపై అవగాహన పెంచుకోవాలి.
- రెవెన్యూ డిపార్ట్మెంట్లోని జూనియర్ అసిస్టెంట్ కమ్ కంప్యూటర్ అసిస్టెంట్ పోస్ట్లకు పేర్కొన్న జనరల్ ఇంగ్లిష్, జనరల్ తెలుగు పేపర్ కోసం ఈ రెండు భాషలకు సంబంధించి బేసిక్ గ్రామర్ అంశాలు, యాంటానిమ్స్, సినానిమ్స్, ఫ్రేజెస్లపై పట్టు సాధించాలి.
ఒకే సమయంలో రెండు పోస్ట్లకు
ఏపీపీఎస్సీ తాజా నోటిఫికేషన్లను పరిశీలిస్తే.. ఒకే సమయంలో రెండు శాఖల్లోని పోస్ట్లకు సన్నద్ధమయ్యే అవకాశం ఉంది. రెండు శాఖల్లోని పోస్ట్లకు జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ పేపర్ ఉంది. ఈ పేపర్కు ఉమ్మడి ప్రిపరేషన్ సాగిస్తూ.. రెండో పేపర్కు ప్రత్యేక సమయం కేటాయించుకోవాలి. ఫలితంగా ఒకే సమయంలో రెండు పరీక్షలకు సన్నద్ధత లభిస్తుంది. ఇలా సిలబస్ పరిశీలన నుంచి ప్రిపరేషన్ వరకు ప్రత్యేక వ్యూహంతో.. అడుగులు వేస్తే విజయం సొంతం చేసుకునే అవకాశం ఉంది.
Gemini Internet
Vivo Scholarship: విద్యార్థులకు వివో శుభవార్త.. స్కాలర్షిప్తో పాటు ఉచితంగా స్మార్ట్ ఫోన్.
కరోనా (Corona) నేపథ్యంలో పేద విద్యార్థులకు చేయూతను
అందించేందుకు అనేక కార్పొరేట్ సంస్థలు ముందుకు వస్తున్నాయి. విద్యార్థులకు స్కాలర్ షిప్ (Scholarship)లు అందిస్తూ వారి పై చదువులకు ప్రోత్సహిస్తున్నాయి. తాజాగా ప్రముఖ మొబైల్ తయారీదారు వివో
(Vivo) విద్యార్థులకు శుభవార్త చెప్పింది. 11 క్లాస్ విద్యార్థులకు
స్కాలర్ షిప్ అందించనున్నట్లు ప్రకటించింది. ప్రముఖ విద్యాసారథి
(Vidyasarathi) సంస్థతో కలిసి ఈ స్కాలర్ షిప్ లు అందించడానికి ఏర్పాట్లు
చేసినట్లు తెలిపింది. మెరిట్ ఆధారంగా విద్యార్థులకు స్కాలర్ షిప్ లు
అందించనున్నట్లు తెలిపింది. విద్యార్థులు వారి కలలను, ఉన్నత లక్ష్యాలను
సాకారం చేసుకోవడానికి ఈ స్కాలర్ షిప్ లను అందిస్తున్నట్లు వివో
తెలిపింది. ఈ స్కాలర్ షిప్ తో పాటు విద్యార్థులకు వారి ఆన్లైన్ విద్యకు
సహకరించేందుకు వివో స్మార్ట్ ఫోన్ ను కూడా అందించనున్నట్లు వివో తెలిపింది.
స్కాలర్ షిప్ అర్హతలు:
అభ్యర్థులు 80 శాతం మార్కులతో టెన్త్ పాసై ఉండాలి. అయితే 4 లక్షల వార్షికాదాయం కన్నా తక్కువ ఉన్న వారికే ఈ స్కాలర్ షిప్ అందించనున్నట్లు వివో తెలిపింది. అభ్యర్థులు జనవరి 13 నుంచి ఫిబ్రవరి 13 వరకు ఈ స్కాలర్ షిప్ కు అప్లై చేసుకోవాలని ప్రకటనలో పేర్కొన్నారు.
Gemini Internet
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే సమయంలో ఆధార్ వివరాలు, ఐడెంటిటీ ప్రూఫ్, అడ్రస్ ప్రూఫ్, పాస్ బుక్ కాపీ, టెన్త్ మార్క్స్ షీట్, ఆదాయ సర్టిఫికేట్, ఈ విద్యాసంవత్సరం ఫీజు రసీదు. బోనఫైడ్ సర్టిఫికేట్ .jpeg, .png కాపీలను వెంట తీసుకురావాల్సి ఉంటుంది. అభ్యర్థులు ఇతర వివరాలకు vidyasaarathi@nsdl.co.in మెయిల్ చిరునామాను సంప్రదించవచ్చు. 022-40904484 నంబర్ ను సైతం సంప్రదించవచ్చు.
Visit Gemini Internet, Hindupur for Scholarships
-విద్యార్థులు ఈ లింక్ పై క్లిక్ చేసి ఈ స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు.
-స్కాలర్ షిప్ కు సంబంధించి పూర్తి వివరాలను తెలుసుకోవడానికి ఈ లింక్ పై క్లిక్ చేయండి.
స్కాలర్ షిప్ వివరాలు: ఈ స్కాలర్ షిప్ కు ఎంపికైన వారికి రూ.1500తో పాటు, నూతన వివో స్మార్ట్ ఫోన్ కూడా అందిస్తారు.
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...