19, మే 2020, మంగళవారం

మారిన 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి ప్రిపరేషన్


హిందూపురం పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 19-05-2020

లాక్ డౌన్ కారణంగా హిందూపురంలో నిన్నటి రోజు ఉదయం సుమారుగా రెండు వందల మంది యుపి వాసులను వారి స్వస్థలాలకు చేర్చేందుకు విశ్వహిందూ పరిషత్ సభ్యులతో సహా చారు కీర్తి గారి అధ్యక్షతన స్వచ్ఛందంగా కార్యక్రమం నిర్వహించి వారికి అన్ని సౌకర్యాలతో వారి స్వస్థలాలకు పంపడం జరిగింది.

బీహార్ కు చెందిన 500మంది వలస కూలీలు నిన్నటి సాయంత్రం రైలులో వారి స్వస్థలమైన బీహార్ కు ప్రయాణమయ్యారు వారికి ప్రయాణంలో తినడానికి తనవంతుగా చపాతీలు ప్యాకెట్లను అక్కడి కాలనీ మహిళల సహాయంతో తయారు చేయించి శ్రీ సత్య సాయిబాబా సమితి సభ్యులకు అందించిన వైఎస్సార్సీపి నాయకులు మారుతి రెడ్డి. 

లాక్ డౌన్ మరియ ఇతర కారణాల వల్ల వాయిదా పడిన సి బి ఎస్ ఇ 10, 12వ తరగతి పరీక్షలు  జులై 1 వ తేదీ నుండి 15వ తేదీ వరకు జరుగుతాయి. 12వ తరగతికి విద్యార్థులకు జులై 1 న హోం సైన్స్, 2న హిందీ, 7న కంప్యూటర్ సైన్స్, 9న బిజినెస్ స్టడీస్, 10న బయో టెక్నాలజీ, 11న జియోగ్రఫీ, 13వ తేదీన సోషియాలజీ పరీక్షలుంటాయి.

డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ఫిబ్రవరి/మార్చిలో నిర్వహించిన ఎం బీ బీ ఎస్ ద్వితీయ సంవత్సరం పరీక్షల ఫలితాలను సోమవారం విడుదల చేసింది. మార్కుల రీటోటలింగ్ కోసం సబ్జెక్టుకు 2 వేల రూపాయలతో ఈ నెల 30 లోగా దరఖాస్తు చేసుకోవాలని యూనివర్సిటీ పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్ మేజర్ భీమేశ్వర్ తెలిపారు.


వై ఎస్ ఆర్ వాహన మిత్ర పథకం ద్వారా, సొంతంగా ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ లున్న డ్రైవర్లకు ఆర్థిక సాయం జూన్ 4న సి ఎం వై ఎస్ జగన్ చేతుల మీదుగా ఆన్ లైన్ ద్వారా చెల్లింపులు చేయనున్నారు. ఈ ఏడాది మే 17 వరకు రవాణా శాఖలో రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆటో, టాక్సీ, మ్యాక్సీ క్యాబ్ ల యజమానులే డ్రైవర్లు అయిన వారు ఈ పథకం కింద కొత్తగా దరఖాస్తులను ఈ నెల 18 నుండి 26వ తేదీలోగా గ్రామ లేదా వార్డు సచివాలయాల్లో అందించాలి. జూన్1వ తేదీలోపు లబ్దిదారుల ఎంపిక పూర్తి చేస్తామన్నారు.

విధులు నిర్వహిస్తూ ప్రమాదవశాత్తూ మృతి చెందిన 108 అంబులెన్స్ డ్రైవర్ నవీన్ బాబు కుటుంబానికి 108 ఉద్యోగుల సంఘ సభ్యులు 5 లక్షల 75 వేల రూపాయల ఆర్థిక సాయం చేశారు.

మారిన 10వ తరగతి తెలుగు ప్రశ్న పత్రానికి ప్రిపరేషన్ అలాగే ప్రశ్నపత్రంలో ఉండే వివరాలను దిన పత్రికల ద్వారా సేకరించిన సమాచారాన్ని స్పీడ్ జాబ్  అలర్ట్స్ . బ్లాగ్ స్పాట్  . కామ్ లో చూడొచ్చు.

వ్రాత పరీక్ష ద్వారా స్వామి వివేకానంద నేషనల్ ఇన్ స్టిట్యూట్ లో ఉద్యోగాలు 
మొత్తం ఖాళీలు 9
దరఖాస్తుకు చివరి తేది జులై 7
విభాగాల  వారీగా
ఆడిట్ ఆఫీసర్ 1
స్టాఫ్ నర్స్5
మహిళా హాస్టల్ వార్డెన్  1
జూనియర్ అసిస్టెంట్ 2
అర్హత
ఆడిట్ ఆఫీసర్ - బి కాం తో పాటు అకౌంటింగ్ లో అనుభవం ఉండాలి
స్టాఫ్ నర్స్ - బి ఎస్సి నర్సింగ్ లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్  కౌన్సిల్ లో మిడ్ వైఫరీగా రిజిస్టర్ అయి, అనుభవం ఉండాలి
మహిళా  హాస్టల్ వార్డెన్ - 1st క్లాస్ లేదా హైయర్ 2nd క్లాస్ లో గ్రాడ్యుయేట్ అయుండాలి
జూనియర్ అసిస్టెంట్ - గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి అనుభవం ఉండాలి.
వయసుః
ఆడిట్ ఆఫీసర్ 35
సిబ్బంది నర్స్ 30
మహిళా హాస్టల్ వార్డెన్  35 నుండి 40
జూనియర్ అసిస్టెంట్ 40
http://www.svnirtar.nic.in/


వ్రాత పరీక్శ ఇంటర్వ్యూ ఆధారంగా హెచ్‌పీసీఎల్ లోఉద్యోగాలు
విభాగాలు - ఇంజినీర్, ఫైనాన్, లీగల్
ఖాళీలు - 71
అర్హత -  ఉద్యోగాన్ని బట్టి ఇంజినీర్ కు డిగ్రీ లేదా బి టెక్, ఫైనాన్స్ కు సి ఎ లేదా ఎం బి ఎ లీగల్ కు పి జి లేదా లా
వయసు - 35
దరఖాస్తుకు చివరి తేది మే 31
https://hrrl.in/

ఆంధ్రప్రదేశ్ హై కోర్టులో ఉద్యోగాలు దరఖాస్తుకు చివరి తేది మే 26
మొత్తం ఖాళీలు 12
ఉద్యోగాలు - సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్స్టెంట్
విద్యార్హత - డిప్లొమా, ఐ టి ఐ, బి ఎస్సి, బి టెక్, సంబంధిత సబ్జెక్టుల్లో పి జి
hc.ap.gov.in



ఆన్ లైన్ అప్లికేషన్ సేవలు ఇంటి వద్దనుండే పొందండి ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | అప్లికేషన్ ఆన్ లైన్ ద్వారా చేయించాలనుకునే వారు మతో మాట్లాడి గూగుల్ పే/ఫోన్ పే ద్వారా గాని రూ.100/-లను 9640006015 కు చెల్లించి, సేవలను పొందచ్చు. దీని కోసం వ్యక్తి కి వాట్సాప్ ఛాటింగ్ ద్వారా మేము పంపే ప్రశ్నలకు సమాధానాలు పంపూతూ ఉంటే చాలు, అప్లికేషన్ ను సబ్మిట్ చేసే ముందు మేము పంపే స్ర్కీన్ షాట్ లను సరిచూసుకుని, అన్ని సరిపోయాయంటే అప్లికేషన్ ను ఫైనల్ సబ్మిట్ చేస్తాము.
అయితే నిర్ణీత అప్లికేషన్ ఫీజును చెల్లించుటకు మాత్రం మీ ATM ఉండాల్సిందే (మా వద్ద ATM లేదు) మా ఫోన్ నెంబరు 9640006015.




 


18, మే 2020, సోమవారం

Jr Assistant Jobs | స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో జాబ్స్


స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ లో ఉద్యోగాలు :

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన స్వామి వివేకానంద నేషనల్ ఇన్‌సిట్యూట్ ఆఫ్ రిహబిలిటేషన్ ట్రైనింగ్ అండ్ రిసెర్చ్ సెంటర్ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ రావడం జరిగింది. మంచి శాలరీ ఉంటుంది. తప్పనిసరిగా అప్లై చేసుకోండి. 

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేదీ11-07-2020

మొత్తం ఖాళీలు:

09

విభాగాల వారిగా ఖాళీలు:

ఆడిట్ ఆఫీసర్1
సిబ్బంది నర్స్5
హాస్టల్ వార్డెన్ (ఆడ)1
జూనియర్ అసిస్టెంట్2

అర్హత:

ఆడిట్ ఆఫీసర్B.com తో పాటు అకౌంటిగ్ లో అనుభవం ఉండాలి.
సిబ్బంది నర్స్B.Sc (నర్సింగ్) లేదా డిప్లొమా లో జనరల్ నర్సింగ్ మరియు స్టేట్ నర్సింగ్ కౌన్సిలో మిడ్ వైఫరిగా రిజిస్టర్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి.
హాస్టల్ వార్డెన్ (ఆడ)ఫస్ట్ క్లాస్/హైయర్ 2nd క్లాస్/ఏ విభాగం లో అయిన గ్రాడ్యుయేట్ పూర్తి చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. మరియు అనుభవం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
జూనియర్ అసిస్టెంట్గ్రాడ్యూయేట్ పూర్తి చేసి ఉండాలి మరియు అనుభవం ఉండాలి.

జీతం:

ఆడిట్ ఆఫీసర్44,900/- To 42,400/-
సిబ్బంది నర్స్44,900/- To 42,400/-
హాస్టల్ వార్డెన్ (ఆడ)35,400/- To 1,12,400/-
జూనియర్ అసిస్టెంట్25,500/- To 81,100/-

వయస్సు:

ఆడిట్ ఆఫీసర్35
సిబ్బంది నర్స్30
హాస్టల్ వార్డెన్ (ఆడ)35 To 40
జూనియర్ అసిస్టెంట్40

ఎలా ఎంపిక చేస్తారు:

రాతపరీక్ష (ఆబ్జెక్టివ్ / బహుళ ఎంపిక ప్రశ్నలు)80%
కావలసిన అర్హత10%
అనుభవం10%
శాతం తో ఎంపిక విధానం ఉంటుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

ఆఫ్‌లైన్ లో అప్లై చేసుకోవాలి. పోస్ట్ ద్వారా దరఖాస్తు ఫారం పంపవలసి ఉంటుంది.

చిరునామ:

The Director Swami Vivekanand National Institute of Rehabilitation Training and Research Olatpur post: Bairoi. Dist: Cuttak Odisha PIn 754010

మీకు కావలసిన జాబ్ కామెంట్ రాయండి, మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి.
Website
Notification

ఎల్ ఐ సిలో ఇద్యోగాలు | LIC Jobs

ఎన్ఎల్‌సీ ఇండియా లిమిటెడ్( NLC India) లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఎగ్జిక్యూటివ్ ట్రైనీ
ఖాళీలు :259
అర్హత :Degree/CA/MBA, PG/M.Tech.
వయసు :30 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.50,000-1,80,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 5,00/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 16, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 30, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

.

HPCL లో ఉద్యోగాలు

హెచ్‌పీసీఎల్ లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :ఇంజ‌నీర్, ఫైనాన్స్‌, లీగ‌ల్‌
ఖాళీలు :71
అర్హత :Degree/B.Tech,
CA/MBA, PG/LAW
వయసు :35 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.40,000-2,00,000/-
ఎంపిక విధానం:రాత పరీక్ష ,ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 500/- ,
ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 16, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 31, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here
The last date of the online application revised to 31st May 2020.
ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్

ఆంధ్రప్రదేశ్ హైకోర్టు రిక్రూట్మెంట్ 2020 సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్ - 12 పోస్ట్లు చివరి తేదీ 26-05-2020
తెలియదు / 5 రోజుల క్రితం
సంస్థ పేరు లేదా కంపెనీ పేరు: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు
మొత్తం ఖాళీల సంఖ్య: - 12 పోస్టులు
ఉద్యోగ పాత్ర లేదా పోస్ట్ పేరు: సిస్టమ్ ఆఫీసర్, సిస్టమ్ అసిస్టెంట్
విద్యా అర్హత: డిప్లొమా, ఐటిఐ, బిఎస్సి, బిటెక్, పిజి (సంబంధిత క్రమశిక్షణ)
ఎవరు దరఖాస్తు చేసుకోవచ్చు: ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులు
చివరి తేదీ: 26-05-2020

AP DME JOBS

AP DME లో వివిధ విభాగాల్లో ఖాళీగా ఉన్న పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు క్రింద చూడండి:

జాబ్ :జ‌న‌రల్ డ్యూటీ 
మెడిక‌ల్ ఆఫీస‌ర్
ఖాళీలు :550
అర్హత :MBBS
వయసు :40 ఏళ్లు మించకూడదు.
వేతనం :రూ.53,000-1,85,000/-
ఎంపిక విధానం:ఇంట‌ర్వ్యూ ఆధారంగా.
దరఖాస్తు ఫీజు :జనరల్ కు రూ 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తు విధానం:ఆన్‌లైన్‌/ ఆఫ్‌లైన్‌.
దరఖాస్తులకు ప్రారంభతేది:మే 12, 2020
దరఖాస్తులకు చివరితేది:మే 18, 2020
వెబ్‌సైట్‌:Click Here
నోటిఫికేషన్:Click Here

ముఖ్య గమనిక: ఇక్కడ పోస్ట్ చేసిన ఉద్యోగాలకు అప్లై చేసే ముందు ఒకసారి నోటిఫికేషన్ ని పూర్తిగా చదువుకొని అప్లై చెయ్యండి అని మా మనవి. అలాగే మీకు ఏమైనా సందేహం ఉంటె ఈ పోస్ట్ క్రింద కామెంట్ రూపంలో తెలియజేయండి.



IOCL Engineering base jobs


ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్

ఇండియన్ ఆయిల్


 
సంఖ్య :-
అర్హతలుఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్
విడుదల తేదీ:18-05-2020
ముగింపు తేదీ:24-05-2020
వేతనం:-
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
ఇంజనీర్స్/ఆఫీసర్స్ అండ్ గ్రాడ్యుయేట్ అప్రెంటిస్ ఇంజనీర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
ఎలక్ట్రికల్ & ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్.
---------------------------------------------------------
వయసు పరిమితి :

26 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము: 
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
-
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------








IOCL JOBS DEGREE BASE


అసిస్టెంట్ ఆఫీసర్స్

ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్


 
సంఖ్య :-
అర్హతలుగ్రాడ్యుయేట్
విడుదల తేదీ:18-05-2020
ముగింపు తేదీ:24-05-2020
వేతనం:రూ.40,000 / - నెలకు
ఉద్యోగ స్థలం:ఆంధ్రప్రదేశ్
 

మరింత సమాచారం:

పోస్ట్ పేరు:
అసిస్టెంట్ ఆఫీసర్స్.
---------------------------------------------------------
అర్హతలు:
గ్రాడ్యుయేట్
---------------------------------------------------------
వయసు పరిమితి :

30 సంవత్సరాలు.
---------------------------------------------------------
అప్లికేషన్ రుసుము: 
ఎలాంటి రుసుము.
---------------------------------------------------------
వేతనం:
రూ.40,000 / - నెలకు
---------------------------------------------------------
ఎంపిక ప్రక్రియ: 
ఇంటర్వ్యూ
---------------------------------------------------------
How to Apply:
ఆసక్తి కలిగిన, అర్హత గల అభ్యర్థులు అధికారిక వెబ్ సైట్ www.iocl.com వద్ద 18-05-2020 నుండి 24-05-2020 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
---------------------------------------------------------
WEBSITE: www.iocl.com
---------------------------------------------------------
Notification :-https://www.iocl.com/PeopleCareers/job.aspx
------------------------------------------------------

Private Jobs





















No Exam Railway 663 Jobs Notification 2020 | పరీక్ష లేకుండా రైల్వే లో ఉద్యోగాల భర్తీ

COVID-19 కారణంగా పారామెడికల్ స్టాఫ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. కాంట్రాక్టు పద్దతో ఈ పోస్టులను భర్తీ చెయ్యడం జరుగుతుంది. ఈస్ట్ రైల్వే హస్పటలో పోస్టింగ్ ఇవ్వడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

దరఖాస్తు చేసుకోవడానికి చివరి తేది22 మే 2020

విభాగాల వారీగా ఖాళీలు:

నర్సింగ్ సూపరింటెండెంట్255
ఫార్మసిస్ట్51
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్255

వయస్సు:

నర్సింగ్ సూపరింటెండెంట్20-38
ఫార్మసిస్ట్20-35
డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్18-33
sc,st వారికి 5 సంవత్సలు, OBC వారికి 3 సంవత్సరాలవరకు వయస్సులో సడలింపు ఉంటుంది.

అర్హతలు:

నర్సింగ్ సూపరింటెండెంట్:

జనరల్ నర్సింగ్ మరియు మిడ్‌వైఫరీలో మూడు సంవత్సరాల కోర్సు చేసి ఉండాలి. లేదా B.Sc నర్సింగ్ చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. ఈ అర్హతలు గుర్తింపు పొంది యూనివర్సిటి లేదా బోర్డ్ నుండి చేసి ఉండాలి.

ఫార్మసిస్ట్ :

సైన్స్ సబ్జెక్టు తో లేదా సమానమైన అర్హతతో ఫార్మసిలో డిప్లొమా చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది. లేదా బాచిలర్ డిగ్రీ ఫార్మసి లో చేసి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

డ్రస్సర్ / OTA / హాస్పిటల్ అటెండెంట్ :

పదోతరగతి పాస్ అయి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

సంబందిత మెయిల్ అడ్రస్ కి మెయిల్ పెట్టవలసి ఉంటుంది.
srdmohkur@gmail.com

ఎలా ఎంపిక చేస్తారు:

షార్ట్ లిస్ట్ మరియు ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

Website

Notification

Forest Jobs Inter, Degree,10th Class Telugu 2020 | ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

Indian Council of Forestry Research and Education

ఫారెస్ట్ రీసెర్చ్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీ

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులకు హిమలయ ఫారెస్ట్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ నుండి ఒక జాబ్ నోటిఫికేషన్ రావడం జరిగింది. రెండు తెలుగు రాష్ట్రాల వారు అప్లై చేసుకోవచ్చును. అభ్యర్థుల కు జాబ్ వచ్చిన తరువాత హైదరాబాద్ లోని HFRI కి బదిలి చెయ్యడం జరుగుతుంది.

ముఖ్యమైన తేదీలు:

అప్లై చేసుకొవడానికి చివరి తేది15-Jun-20

విభాగాల వారిగా ఖాళీలు:

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)1
ఫారెస్ట్ గార్డ్5
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)2

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.

ఫారెస్ట్ గార్డ్ :

సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి. అని చెప్పడం జరుగుతుంది.
శారీరక ప్రమాణాలు:
పురుషులు:
1. నడక: 4 గంటల్లో 25 కి.మీ.
2. ఎత్తు కనిష్టంగా 165 సెం.మీ. ఉండాలి. విస్తరణ లేకుండా ఛాతీ 79 సెం.మీ. ఉండాలి అని చెప్పడం జరుగుతుంది.
మహిళలు:
1. నడక: 4 గంటల్లో 14 కి.మీ. నడవ గలగాలి అని చెప్పడం జరుగుతుంది.
2. ఎత్తు కనిష్టంగా 150 సెం.మీ.
3. విస్తరణతో ఛాతీ 74 సెం.మీ మరియు విస్తరణతో 79 సెం.మీ.

మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)

10 వ తరగతి పాస్ సర్టిఫికెట్లు.

జీతం:

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 29200-92300
ఫారెస్ట్ గార్డ్స్థాయి – 2 యొక్క 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ ₹ 19900-63200
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)స్థాయి – 7 వ సిపిసి పే మ్యాట్రిక్స్, పే స్కేల్ 000 18000-56900

ఎంపిక విధానం:

రాత పరీక్ష ద్వారా ఎంపిక చెయ్యడం జరుగుతుంది.

ఎలా అప్లై చేసుకోవాలి:

అధికారిక వెబ్‌సైట్ నుండి దరఖాస్తు ఫారం డౌన్‌లోడ్ చేసి సంబందిత అడ్రస్ కి పంపవలసి ఉంటుంది.

చిరునామ:

ది హెడ్ ఆఫ్ ఆఫీస్, రిక్రూట్‌మెంట్ సెల్, హిమాలయన్ ఫారెస్ట్ రీసెర్చ్ ఇనిస్టిట్యూట్, కోనిఫెర్ క్యాంపస్, పంతఘాటి, సిమ్లా (హెచ్‌పి) – 171013

ఫీజు:

Gen/OBC వారికి 300/-, SC,ST,Ex-servicemen ఫీజు చెల్లించవలసిన అవసరం లేదు
మీకు కావలిసిన జాబ్ ని కామెంట్ రాయండి. మీ ప్రెండ్స్ కి షేర్ చెయ్యండి. మరిన్ని ఉద్యోగాల కొరకు క్లిక్ చెయ్యండి.

Website

Notification

 

హిందూపురం వార్తలు | విద్యా | ఉద్యోగ సమాచారం 18-05-2020

ప్రత్యేక పాసులున్నా పల్లెల నుండి కూరగాయలను తీసుకువస్తున్న  రైతులను, పోలీసులు అడ్డుకుని వాహనాలను లాక్కుని కేసులు పెడుతున్నారని, హిందూపురం తహశిల్దారు కార్యాలయం వద్ద కూరగాయలను పారబోసి కూరగాయల వ్యాపార్లు నిరసన వ్యక్తం చేశారు, దీంతో తహశీల్దార్ శ్రీనివాసులు వ్యపారుల సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించుకున్నారు.

ఈ నెల 31 వరకు లాక్ డౌన్ పొడిగించడంతో శ్రీవారి దర్శనం వాయిదా పడింది. అయితే భక్తులు దర్శనాలు ప్రారంభమయిన తరువాత భక్తులు భౌతిక దూరంతో స్వామిని దర్శించుకోవడానికి రెండు రోజుల క్రిందట క్యూలైన్లు లడ్డూ కౌంటర్లలో అధికార్లు మార్కింగ్ వేయించారు.

10వ తరగతి తరువాత సాంకేతిక విద్యకోసం ఎపి పాలిసెట్, 10వ తరగతి ఉతీర్ణత లేదా 2020 లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఓపెన్ స్కూల్ ద్వారా 10వ తరగతి చేసిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
https://polycetap.nic.in


యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 136
విభాగాలు వారిగా ఖాళీలు
మైనింగ్ మేట్ సి - 52
అప్రెంటీస్ మైనింగ్ మేట్ - 53
అప్రెంటీస్ లైబ్రరీ అసిస్టెంట్ - 6
వైండింగ్ ఇంజిన్ డ్రైవర్ బ ఇ - 14
బ్లాస్టర్ -బి 4
బాయిలర్ కమ్ కంప్రెసర్ అటెండెంట్ -3
గ్రాడ్యుయేట్ ఆపరేషనల్ ట్రైనీ కెమికల్ -4
ఆన్ లైన ద్వారా ధరఖాస్తుకు చివరి తేది జూన్ 22
ucil.gov.in

మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ లో పోస్టుల భర్తీ
మొత్తం ఖాళీలు 50
పోస్టుల వారిగా ఖాళీలు
యంగ్ ప్రొఫెషనల్ - 30
కన్సల్టెంట్ - 20
విభాగాలు
ఐటీ, స్టాటిస్టిక్స్, అడ్మిన్ అండ్ ప్రాజెక్ట్, లీగల్, నేషనల్ అకౌంట్స్
ఆన్ లైన్ ద్వారా దరఖాస్తుకు చివరితేది జూన్ 15
http://www.mospi.gov.in/


Indian Council of Forestry Research and Education లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
విభాగాల వారిగా ఖాళీల

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)1
ఫారెస్ట్ గార్డ్5
మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)2

టెక్నికల్ అసిస్టెంట్ (ఫీల్డ్ / ల్యాబ్ రీసెర్చ్)

సంబంధిత ఫీల్డ్ / స్పెషలైజేషన్ లో బ్యాచిలర్ డిగ్రీ లేదా తత్సమాన శాస్త్రం చదివి ఉండాలి

ఫారెస్ట్ గార్డ్ :

సైన్స్ తో 12 వ పాస్ అయి ఉండాలి దీనితో పాటు శారీరక ప్రమాణాలను పరిగణాలోనికి తీసుకుంటారు

మల్టీ టాస్కింగ్ సిబ్బంది (MTS)

10 వ తరగతి ఉత్తీర్ణత.

వ్రాత పరీక్షద్వారా ఎంపిక చేయబడే ఈ ఉద్యోగాలకు ఆఫ్ లైన ద్వారా దరఖాస్తుకు చివరి తేది జూన్ 15
మరింత విద్యా ఉద్యోగ సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్ స్పాట్ . కామ్ ను చూడవచ్చు
website http://www.icfre.org/







17, మే 2020, ఆదివారం

పది తెలుగు, హిందీ మోడల్ పేపర్లు, గురుకుల డిగ్రీ విద్య మరియు సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్ వివరాలు




హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ సమాచారం 17-05-2020


హిందూపురం, లేపాక్షి, చిలమత్తూరులలో వివిధ పరిశ్రమలలో పనిచేస్తున్న 17 మందిని వారి స్వస్థలాలకు పంపేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ఈ సందర్భంగా అస్సాం రాష్ట్ర కార్మికులను శనివారం రాత్రి స్థానిక హిందూపురం తహశిల్దార్ కార్యాలయం నుండి ప్రత్యేక బస్సులో విజయవాడకు పంపారు.

అత్యవసర వైద్య సేవల కోసం హిందూపురంలోని కంటైన్మెంట్ జోన్ల నుంచి ఆటోల్లో ఆస్పత్రులకు వెళ్ళడానికి అవకాశం కల్పించామని సబ్ కలెక్టరు నిశాంతి తెలిపారు అయితే అత్యవసర వైద్య సేవల కోసం ఆస్పత్రులకు వెళ్ళడానికి నిర్ణయించిన ఆటోలకు మాత్రమే అనుమతి ఇచ్చినట్లు తెలిపారు, కంటైన్మెంట్ జోన్లలో ఫీవర్ క్లినిక్ లు ఏర్పాటు చేస్తున్నామని, అక్కడ ప్రజలకు  వైద్య సేవలు అందుతాయని అత్యవసర  వైద్య సేవల కోసం స్థానికంగా ఉన్న నవాజ్ నర్సింగ్ హోం,  తేజా నర్సింగ్, మనోజ్ క్లినిక్, బాలాజి క్లినిక్, శిల్పక్లినిక్, హ్యాపి షైన్, గిరిష్ డెంటల్, శ్రీనివాస నర్సింగ్, శిల్ప నర్సింగ్ ఆస్పత్రుల్లో వైద్య సేవలు పొందొచ్చన్నారు.

హిందూపురానికి చెందిన కరోనా సోకిన 17, మరియు 35 ఏళ్ళ మహిళలకు ప్రస్తుత పరీక్షల్లో నెగిటివ్ రావడంతో బత్తలపల్లి ఆర్ డి టీ ఆసుపత్రిలో నుండి శనివారం డిశ్చార్జ్ చేశారు. వారి 14 రోజుల పాటు హోమ్ ఐసోలేషన్ లో  ఉండాలని సూచించామని కలెక్టరు గంధం చంద్రుడు పేర్కొన్నారు.

డి ఎస్సీ 2008 అభ్యర్థులు ఆన్ లైన్ ద్వారా మాత్రమే వివరాలను అందజేయాలని డి ఇ ఓ సామ్యూల్ తెలిపారు. మెరిట్ లిస్ట్ ల పై సందేహాల నివృత్తి కోసం సూపరింటెండెంట్ రంగస్వామి 9247719855 సీనియర్ అసిస్టెంట్ ఇక్బాల్ బాషా 9133356786 ఫోన్ నెంబర్లలో సంప్రదించవచ్చన్నారు.

సిల్వర్ జూబ్లీ కాలేజ్ కర్నూలు ఎపి రెసిడెన్షియల్ కాలేజ్ నాగార్జున సాగర్ లో ప్రవేశం
ఎంచుకున్న గ్రూపును బట్టి వ్రాత పరీక్ష ఆధారంగా ప్రవేశం

అర్హతః 2020 లో తెలంగాణ  లేదా ఆంధ్రప్రదేశ్ బోర్డు నుంచి మొదటి ప్రయత్నంలోనే ఇంటర్మీడియేట్ 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత. గతంలో ఉత్తీర్ణులయిన వారు అనర్హులు. ప్రత్యేకించి ఇంగ్లీషులో 40 శాతం మార్కులు ఉండాలి ఎస్సీ ఎస్టీ బిసీలకు 5 శాతం సడలింపు ఉంటుంది.
దరఖాస్తుకు చివరి తేది మే 30

అనంతపురం దగ్గరలోని ప్రసన్నయపల్లి కేంద్రంగా కార్యకలాపాలు సాగిస్తున్న సెంట్రల్ యూనివర్సిటీ ఆఫ్ అంధ్రప్రదేశ్ లో ప్రవేశాలు
అందించే కోర్సులు బి ఎ హానర్స్ లో ఎకనమిక్స్, పొలిటికల్ సైన్స్, ఎం ఏ ఇంగ్లీషు లాంగ్వేజ్ అండ్ లిటరేచర్, బి వొకేషనల్ టూరిజం అండ ట్రావెల్ మేనేజ్ మేంట్, బి వొకేషనల్ రిటైల్ మేనేజ్ మెంట్ అండ్ ఐటీ
ప్రవేశ పరీక్షల్లో సాధించిన మెరిట్ ఆధారంగా అడ్మిషన్ కల్పిస్తారు.
దరఖాస్తుకు చివరి తేది మే 23

ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ICMR)  జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్టుల భర్తీకి దరఖాస్తులు
మొత్తం ఖాళీలు 150
దరఖాస్తుకు చివరి తేది మే 27

టి హెచ్ డి సీ ఇండియా లిమిటెడ్ లో పలు పోస్టుల భర్తీ
ట్రెయినీ ఎగ్జిక్యూటివ్ ఖాళీలు 10
ఎగ్జిక్యూటివ్ ట్రెయినీ పబ్లిక్ రిలేషన్స్ 4
దరఖస్తుకు చేవరి తేది జూన్ 15
 











16, మే 2020, శనివారం

DSC 2018 కోటాలో 27మందికి ఉద్యోగాలు | డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు | టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ | జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు | ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల

🔳డీఎస్సీ-2018 క్రీడా కోటాలో 27మందికి ఉద్యోగాలు

డీఎస్సీ-2018 క్రీడా కోటా కింద ఎంపికైన ఉపాధ్యాయ అభ్యర్థుల జాబితాను పాఠశాల విద్యాశాఖ విడుదల చేసింది. అభ్యర్థుల ధ్రువపత్రాలు పరిశీలించిన క్రీడా ప్రాధికార సంస్థ 27 మందిని ఎంపిక చేసింది. వీరికి జిల్లా విద్యాధికారులు నియామక పత్రాలు అందజేస్తారు.

‘🔳డీఎస్సీ-2008’ అభ్యర్థులకు కాంట్రాక్టు ఎస్‌జీటీ ఉద్యోగాలు May 16 2020 @ 03:47AM
4,657 మందికి ఊరట

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): డీఎస్సీ-2008లో కామన్‌ మెరిట్‌ లిస్టులో ఉండి..  సెలెక్షన్‌ పద్ధతి మారడంతో గత 12 ఏళ్లుగా ఉద్యోగం పొందలేకపోయిన 4,657 మంది అభ్యర్థులకు ప్రభుత్వం ఊరట కల్పించింది. ఆయా అభ్యర్థులు అంగీకరించినట్టయితే.. వీరికి కాంట్రాక్టు పద్ధతిలో సెకండరీ గ్రేడ్‌ టీచర్‌(ఎ్‌సజీటీ) ఉద్యోగం ఇచ్చేందుకు ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. ఆయా అభ్యర్థుల నుంచి ఆన్‌లైన్‌లో ఈ నెల 18లోగా అంగీకారం తీసుకుని మెయిల్‌ చేయాలని డీఈవోలను ఆదేశించింది. ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ వాడ్రేవు చిన వీరభద్రుడు శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు.

🔳టెన్త్‌ మోడల్‌ పేపర్లు రెడీ May 16 2020 @ 04:59AM
100 మార్కులను విభజిస్తూ పేపర్ల వారీగా బ్లూప్రింట్‌ విడుదల చేసిన పరీక్షల విభాగం

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): పదో తరగతి పరీక్షల విధానం మారిన నేపథ్యంలో.. ప్రశ్నపత్రాలు ఎలా ఉంటాయన్న దానిపై ప్రభుత్వ పరీక్షల విభాగం బ్లూప్రింట్‌ విడుదల చేసింది. గతంలో 11 పేపర్లు ఉండగా.. ప్రస్తుతం పేపర్ల సంఖ్యను 6కు కుదించారు. ఈ నేపథ్యంలో..

ఇంగ్లీషు పేపర్‌ ఇలా.. : ప్రశ్నపత్రాన్ని 3 సెక్షన్లుగా విభజించారు. సెక్షన్‌-ఏలో రీడింగ్‌, కాంప్రహెన్షన్‌పై 30 మార్కులకు 15 ప్రశ్నలు, సెక్షన్‌-బీలో గ్రామర్‌, వొకాబులరీపై 40 మార్కులకు 17 ప్రశ్నలు, సెక్షన్‌-సీలో క్రియేటివ్‌ ఎక్స్‌ప్రెషన్స్‌పై 30 మార్కులకు 3 ప్రశ్నలు ఉంటాయి.

జనరల్‌ సైన్స్‌ : ఫిజికల్‌ సైన్స్‌లో 46 మార్కులకు 16 ప్రశ్నలు, బయలాజికల్‌ సైన్స్‌లో 54 మార్కులకు 17 ప్రశ్నలు ఉంటాయి. మొత్తం 4 సెక్షన్లలో కలిపి 33 ప్రశ్నలు ఇస్తారు. సెక్షన్‌-1లో 12, సెక్షన్‌-2లో 16, సెక్షన్‌-3లో 32, సెక్షన్‌-4లో 40 మార్కులకు ప్రశ్నలు ఇస్తారు.

సోషల్‌ స్టడీస్‌: సెక్షన్‌-1లో ఆబ్జెక్టివ్‌ టైపులో 12 మార్కులకు 12  ప్రశ్నలు ఉంటాయి. సెక్షన్‌-2లో 8 ప్రశ్నలకు రెండేసి మార్కుల చొప్పున ఉంటాయి. సెక్షన్‌-3లో 8  ప్రశ్నలకు 4 మార్కులు చొప్పున కేటాయించారు. సెక్షన్‌-4లో 5 ప్రశ్నలకు 8 మార్కుల చొప్పున ఉంటాయి.

మ్యాథ్స్‌ పేపర్‌: మొత్తం 4 సెక్షన్లు ఉంటాయి. సెక్షన్‌-1లో 12 మార్కులకు 12 ప్రశ్నలు ఉంటాయి. పేపర్‌-1కు 6, పేపర్‌-2కు 6 మార్కులు ఉంటాయి. సెక్షన్‌-2లో  రెండేసి మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-3లో 4 మార్కుల ప్రశ్నలు 8, సెక్షన్‌-4లో 8 మార్కుల ప్రశ్నలు 5 ఇస్తారు.

🔳జూన్‌ 3న ఇంటర్‌ ‘వాయిదా’ పరీక్షలు May 16 2020 @ 04:31AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): కరోనా వైరస్‌ నేపథ్యంలో వాయిదా పడిన ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షల షెడ్యూల్‌ను ఇంటర్‌ బోర్డు ప్రకటించింది. జూన్‌ 3న మోడ్రన్‌ లాంగ్వేజ్‌-2, జాగ్రఫీ పరీక్షలు నిర్వహిస్తామని తెలిపింది. ఉదయం 9  నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ ఈ పరీక్షలు జరుగుతాయని పేర్కొంది. ఈ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తప్పనిసరిగా మాస్కు ధరించాలని సూచించింది.

🔳ఎల్‌పీటీ పరీక్షా ఫలితాలు విడుదల May 16 2020 @ 04:32AM

అమరావతి, మే 15(ఆంధ్రజ్యోతి): 2018-19 బ్యాచ్‌కి చెందిన కన్వీనర్‌ కోటా అభ్యర్థులకు, ఒకసారి ఫెయిలైన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరి 20 నుంచి 24 వరకూ నిర్వహించిన లాంగ్వేజ్‌ పండిట్‌ ట్రైనింగ్‌ (ఎల్‌పీటీ) పరీక్షా ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. అభ్యర్థులు, కాలేజీల సౌకర్యార్థం మార్కుల మెమోలను www.bseap.org వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.



🔳కొలువు చూపే కొత్త డిగ్రీ, విద్యార్థులకు అప్రెంటిస్‌షిప్‌, ఉద్యోగ శిక్షణ


పాఠ్యాంశాలు ఖరారు చేసిన ఉన్నత విద్యామండలి
ఈనాడు - అమరావతి

కొలువు చూపే కొత్త డిగ్రీ

కొత్త విద్యా సంవత్సరం(2020-21) నుంచి డిగ్రీ విద్యలో అనేక మార్పులు రాబోతున్నాయి. ఈ మూడేళ్ల కోర్సులో విద్యార్థుల నైపుణ్యాల పెంపే లక్ష్యంగా ఉన్నత విద్యామండలి అప్రెంటిస్‌షిప్‌ విధానం, ఉద్యోగ నైపుణ్య శిక్షణ వంటివి చేర్చింది. ఆ మేరకు మార్చిన కొత్త పాఠ్యాంశాలు జూన్‌ నాటికి అందుబాటులోకి రానున్నాయి.

కొత్తగా ఇలా..


అప్రెంటిస్‌షిప్‌లో నైపుణ్యాభివృద్ధి, జీవన నైపుణ్యాల సబ్జెక్టులు ఉంటాయి. వీటిల్లో ప్రతి సెమిస్టర్‌కు ఒక్కో సబ్జెక్టును ఎంపిక చేసుకోవాలి. మొదటి, రెండో ఏడాదిలో రెండేసి నెలలను ‘అప్రెంటిస్‌షిప్‌’గా పిలుస్తారు. ఇందుకు సెలవుల్లో సమయం ఇస్తారు. చివరి ఏడాది ఆరు నెలల శిక్షణను ‘ఉద్యోగ నైపుణ్య శిక్షణ’గా పిలవనున్నారు.

నైపుణ్యాభివృద్ధి సబ్జెక్టులు

* బీఏ: డేటా ఎనలిటిక్స్‌, పబ్లిక్‌ స్పీచ్‌, బడ్జెట్‌ తయారీ, కార్యాలయ ప్రాసెస్‌, పర్యాటక గైడెన్స్‌, సర్వే, రిపోర్టింగ్‌, క్రియేటివ్‌ రైటింగ్‌, జర్నలిజం.
* బీకాం: పర్యాటకం, చిల్లర వర్తకం, జీఎస్టీ, వాణిజ్య విశ్లేషణ.
* బీఎస్సీ: వైద్య ప్రయోగశాల సాంకేతికత, ఆక్వా, మత్స్య, బయోలజీ ప్రయోగశాల సాంకేతికత, ఫుడ్‌ అడల్‌ట్రేషన్‌.

Ad

జీవన నైపుణ్య సబ్జెక్టులు

* మానవ విలువలు, వృత్తి నైతికత,
* కంప్యూటర్‌ అప్లికేషన్స్‌, * స్టాటిస్టిక్స్‌,
* ఇండియన్‌ కల్చర్‌, సైన్సు,
* ఇన్ఫర్మేషన్‌, కమ్యూనికేషన్‌ టెక్నాలజీ,
* ఎంటర్‌ప్రెన్యూర్‌ డెవలప్‌మెంట్‌,
* ఎనటికల్‌ నైపుణ్యం, * పర్సనాలిటీ ఎన్‌హాన్స్‌, లీడర్‌షిప్‌, ‌* హెల్త్‌ ‌* పర్యావరణ విద్య.


* కొత్త పాఠ్యాంశాలపైఅధ్యాపకులకు నైపుణ్యాభివృద్ధి సంస్థ సాయంతో శిక్షణ ఇవ్వనున్నారు.

10th Class 2020 Marks Model Papers Download | పదవ తరగతి మార్కుల నమూనా పత్రాలు 2020

వార్తల్లో నేటి హిందూపురం


జిల్లాలో మరో నాలుగు కరోనా పాజిటివ్ కేసులు ఇందులో తనకల్లుకు చెందిన మహిళ, ఓబుళదేవర చెరువు మండలం గాజుకుంట పల్లికి చెండిన మరో మహిళ, హిందూపురంలోని ముద్దిరెడ్డిపల్లికి చెందిన ఒక మహిళ, మేళాపురానికి చెందిన వ్యక్తులు ఉన్నారు. కరోనా నియంత్రణ విషయమై ఎవ్వరు కూడా హిందూపురం వాసులను రానివ్వకూడదని హిందూపురానికి వెళ్ళకూడదని కర్ణాటక మరియు దాని సరహద్దు గ్రామాలలో చాటింపులు వేయిస్తున్నారు. ఈ నేపధ్యంలో పోలీసు శాఖకు సూచనలిస్తూ మరింత అప్రమత్తం చేశారు ఎస్పీ సత్య యేసు బాబు. మన ఊరి పేరును నిలబెట్టాలి రా అని ఇంటిలో వారు చిన్నప్పుడు చెప్పుంటారు దానిని ఇప్పుడు నిలబెట్టుకుంటున్నట్టున్నారు హిందూపురం వాసులు.

పాత పద్దతి ప్రకారం నేటి నుండి 4వ విడత ఉచిత రేషన్ ను ఈ నెల 27 వరకు ఇవ్వనున్నారు ఇందులో బియ్యం పప్పుశెనగ వంటి వస్తువులు ఉంటాయి. శనివారం ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 7 గంటల వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది.

డి ఎడ్ మొదటి సంవత్సరం పరీక్షలు సెప్టెంబరు 3 వ తేదీ నుండి ప్రారంభం అదే నెల 8వ తేదీవరకు వరుసగా ఆరు సబ్జెక్టులకు పరీక్షలు నిర్వహించనున్నారు. ఉదయం 9.00 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు కొనసాగనున్నాయి.

టెన్త్ పరీక్షలు మార్కుల నమూనా పత్రాలు విడుదల చేసిన ప్రభుత్వం. 4 పేపర్ల నమూనాలను ఎస్సెస్సీ వెబ్ సైట్ లో పొందుపరిచారు. మిగిలిన పేపర్లని కూడా త్వరలో వెబ్ సైట్ లో చూడొచ్చు. మరింత సమాచారం కోసం స్పీడ్ జాబ్ అలర్ట్స్.బ్లాగ్స్పాట్.కామ్ ను చూడొచ్చు.

వాయిదా పడిన ఇంటర్ పరీక్షలు జూన్ 3వ తేదీన. జూన్ 3 మోడ్రన్ లాంగ్వేజ్-2, జాగ్రఫీ పరీక్షలు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి.

2018-19 బ్యాచ్ కి చెందిన కన్వీనర్ కోటా అభ్యర్థులకు, ఒక సారి ఫెయిల్ అయిన అభ్యర్థులకు ఈ ఏడాది జనవరిలో నిర్వహించిన లాంగ్వేజ్ పండిట్ ట్రైనింగ్ పరీక్షా ఫలితాలను విడుదల చేశారు. మార్కుల మెమోలకు బి ఎస్ ఇ ఎ పి.ఓ ఆర్జీ లో చూడొచ్చు.

జి ఎస్ టి ఆర్ 1 గడువు పెంపు ఏడాదికి 1.5 కోట్ల టర్నోవర్ కలిగిన వారు ఏప్రిల్ లో గా సమర్పించాల్సిన జి ఎస్ టి ఆర్ 1 ఫారాలను జూన్ లో, జులైలో సమర్పించాల్సిన ఫారాలను సెప్టెంబరులో సమర్పించవచ్చు.

యుజిసి నెట్ సి ఎస్ ఐ ఆర్ నెట్, జె ఎన్ యూ ఇ ఇ, ఐ సి ఎ ఆర్ నెట్ దరఖాస్తు గడువులను ఈ నెల 31 వరకు పెంచారు. 

2008 డి ఎస్సీ మెరిట్ జాబితాలో ఉండి పోస్టులు పొందలేకపోయిన అభ్యర్థులకు 21230 రూపాయలతో కాంట్రాక్ట్ టీచర్లుగా అవకాశం కల్పించి రాష్ట్ర ప్రభుత్వం. వీరిలో 4579 మంది బి ఇడి 78 మంది డి ఇడి అభ్యర్థులు కలిపి 4657 మందికి ఉన్నారు అనంతపురం జిల్లాకు సంబంధించి 641 మంది ఉన్నారు. అయితే వీరిలో కొంత మంది ఇప్పటికే తరువాతి డి ఎస్సీలో, మరి కొందరు ఇతర ప్రభుత్వోద్యోగాలను సంపాదించారు. మిగిలిన వారిలో ఎంత మంది కాంట్రాక్ట్ టీచర్లుగా పనిచేయడానికి ఆసక్తి చూపుతున్నారో తెలుసుకోనున్నారు. అనంతపురం జిల్లా అభ్యర్థులు ఈ నెల 17వ తేదీలోపు తమ ఆసక్తిని డి ఇ ఓ అనంతపురం వెబ్ సైట్ లో తెలపాలన్నారు తెలియజేయాలని డి ఇ ఓ శామ్యూల్ శుక్రవారం తెలిపారు. ఎస్ జి టీ తెలుగు కామన్ మెరిట్ జాబితాలో ఉన్న అభ్యర్థుల వివరాలు జిల్లా వెబ్ సైట్ లో ఉంచామన్నారు. 

ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో కాంట్రాక్త్ పద్దతిలో సైకియాట్రిస్ట్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 19.

గుంటూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో సైక్రియాటిట్స్ లేదా ఎం బి బి ఎస్ డాక్టర్, నర్సులు, వార్డు బాయ్స్, కౌన్సెలర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్, దరఖాస్తుకు చివరి తేది మే 20.





 

UGC NET దరఖాస్తు గడువు పెంపు | ఒంగోలు జనరల్ ఆసుపత్రిలో ఉద్యోగాలు | గుంటూరుజి జి హెచ్ లో ఖాళీలు