అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
1, డిసెంబర్ 2020, మంగళవారం
Private Jobs at Vizag
Private Jobs in Vijayawada
House Keepers
PrivateJob Details
Mechanics
PrivateJob Details
Service Super Visor
PrivateJob Details
Service Advisor
PrivateJob Details
Helpers
PrivateJob Details
Spare Parts Supervisor
PrivateJob Details
Receptionist
PrivateJob Details
Computer Operator
PrivateJob Details
Sales Executive
PrivateJob Details
Cashier
PrivateJob Details
AP గ్రూప్ -1 మెయిన్స్ హాల్ టికెట్స్ విడుదల
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గ్రూప్ -1 మెయిన్స్ పరీక్షలు వ్రాసే అభ్యర్థులకు సంబంధించి ముఖ్యమైన అప్డేట్ వచ్చింది.
ఈ నెల డిసెంబర్ లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగే గ్రూప్ -1మెయిన్స్ పరీక్షల హాల్ టికెట్స్ ను ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ఏపీపీఎస్సి ) వెబ్సైటు లో పొందుపరిచ్చినట్లు ఒక ప్రకటన విడుదల అయినది.
డిసెంబర్ 14 నుండి 20వ తేదీ వరకూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీపీఎస్సీ మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో పాటు తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ నగరంలో కూడా ఈ పరీక్షలు నిర్వహించనున్నారు.
AP ఎంబీబీఎస్, బీడీఎస్ -2020 మెరిట్ లిస్ట్ విడుదల
2020-21 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఎంబీబీఎస్, బీడీఎస్ అడ్మిషన్స్ కు సంబంధించిన అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ ను డాక్టర్ ఎన్టీఆర్ ఆరోగ్య విశ్వావిద్యాలయం విడుదల చేసినది.
ఈ అడ్మిషన్స్ ప్రొవిజినల్ మెరిట్ లిస్ట్ కు సంబంధించిన ఏమైనా అభ్యంతరాలు ఉంటే డిసెంబర్ 3వ తేదీ మధ్యాహ్నం 3 గంటల లోపు తమ ర్యాంక్, రోల్ నంబర్స్, సంబంధిత సర్టిఫికెట్స్ తో యూనివర్సిటీ లో సంప్రదించవచ్చును.
ఈ ప్రొవిజినల్ మెరిట్ లిస్టులను అభ్యర్థులు ఎన్టీఆర్ విశ్వ విద్యాలయం అధికారిక వెబ్సైటు లో చూడవచ్చు.
MBBS-BDS-AYUSH 2020-List of Not Eligiable candidates
TTD News | తిరుమల సమాచారం
వసంత మండపంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ
కార్తీక మాసంలో టిటిడి తలపెట్టిన విష్ణుపూజల్లో భాగంగా మంగళవారం తిరుమల వసంత మండపంలో శ్రీ ధాత్రివిష్ణు పూజ ఘనంగా జరిగింది. ఉదయం 8.30 నుండి 9.30 గంటల వరకు జరిగిన ఈ పూజా కార్యక్రమాన్ని శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్ ప్రత్యక్ష ప్రసారం చేసింది.
ఉదయం శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ మలయప్పస్వామివారు, శ్రీ ధాత్రి ( నెల్లికాయ) వృక్షాన్నివసంత మండపానికి వేంచేపు చేశారు.
ఈ సందర్భంగా వైఖానస ఆగమ సలహాదారులు శ్రీ మోహన రంగాచార్యులు మాట్లాడుతూ ధాత్రి అంటే లక్ష్మీ నారాయణుల రూపమన్నారు.
కార్తీక మాసంలో ధాత్రిని పూజించడం వలన సమస్త దేవతల ఆశీర్వాదం లభిస్తుందని, తద్వారా సంవత్సర కాలం సర్వదోషాలు తొలగి, నిత్యం గంగా స్నానం చేసిన ఫలితం సిద్ధిస్తుందని తెలిపారు. ఉసిరి చెట్టు కింద ఒక బ్రాహ్మణుడికి అన్నదానం చేస్తే కోటి మందికి అన్నదానం చేసిన ఫలితం వస్తుందన్నారు.
అదేవిధంగా ఉసిరి, తులసీ రెండు కలిపిన జలాన్ని తీర్థంగా స్వీకరిస్తే జన్మ జన్మల పాపం నశిస్తుందని, మనోవాంచలు నెరవేరుతాయని వివరించారు.
ముందుగా ఘంటా నాదంతో సకల దేవతలను ఆహ్వానించి, కార్తీక విష్ణుపూజా సంకల్పం చేసి, అష్టదిక్పాలకులు, నవగ్రహాల అనుగ్రహంతో లోక క్షేమం కొరకు ప్రార్థన చేశారు. ఆ తరువాత ధాత్రి వృక్షానికి పూజ, నివేదన, హారతి సమర్పించారు. అనంతరం క్షమా ప్రార్థన, మంగళంతో ఈ పూజ ముగిసింది.
వైకుంఠ ఏకాదశి ఆన్లైన్ కోటా విడుదల వాయిదా : టీటీడీ
వైకుంఠ ఏకాదశి సందర్బంగా డిసెంబర్ 24వ తేదీ నుంచి జనవరి 3వ తేదీ వరకు మంగళవారం ఉదయం 11 గంటలకు విడుదల చేయదలచిన రూ 300 టికెట్ల విడుదల సాంకేతిక కారణాల వల్ల వాయిదా వేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.
ఆన్లైన్లో టికెట్లు ఎప్పుడు విడుదల చేస్తారనే విషయం తరువాత ప్రకటించడం జరుగుతుంది.
..........
..........
🙏ఓం నమో వేంకటేశాయ🙏
శ్రీవారి ఆలయంలో వైభవంగా కార్తీక పౌర్ణమి గరుడ సేవ | కార్తీక దీపం వెలిగించిన కంచి కామకోటి పీఠాధిపతి శ్రీశ్రీశ్రీ విజయేంద్ర సరస్వతి
30, నవంబర్ 2020, సోమవారం
Competitive Exams 2020 Current Affairs
1).అస్సాం రాష్ట్రంలోని గువాహటి లో జనవరి 10వ తేదీన ప్రారంభం అయిన మూడవ సీజన్ ఖేలో ఇండియా యూత్ క్రీడల్లో మొదటి స్థానమును దక్కించుకున్న రాష్ట్రం?
A). ఆంధ్రప్రదేశ్
B). బీహార్
C). సిక్కిం
D). మహారాష్ట్ర
సమాధానం : D ( మహారాష్ట్ర ).
2).50 వ ప్రపంచ ఆర్థిక వేదిక (వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ )వార్షిక సదస్సు 2020 జనవరి 21 నుండి 24వరకూ ఏ దేశంలో నిర్వహించారు?
A). అమెరికా
B). రష్యా
C). చైనా
D).స్విట్జర్లాండ్
సమాధానం : D ( స్విట్జర్లాండ్ ).
3).రైల్వే ఆస్తులను, భద్రతను పర్యవేక్షించే రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( RPF ) పేరును ఇటీవల భారతీయ రైల్వే ఏ విధంగా మార్చినది?
A). రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్
B).రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్
C).రైల్వే ప్రొటెస్ట్ సర్వీస్
D). రైల్వే ప్రొటెక్షన్ బోర్డ్ సర్వీస్
సమాధానం : A ( రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ సర్వీస్ -RPFS ).
4). భారత వాయుసేనలో బహదూర్ గా పేరు పొందిన అతి శక్తివంతమైన యుద్ధ విమానాలకు భారత వాయుసేన ఘనంగా వీడ్కోలు పలికింది. అయితే ఈ అత్యంత శక్తివంతమైన యుద్ధ విమానం పేరు?
A). మిగ్ -21
B). మిగ్ -25
C). మిగ్ -27
D). మిగ్ -29
సమాధానం : D ( మిగ్ -27 ).
5).భారత దేశంలో ఢిల్లీ మెట్రో తర్వాత రెండవ అతిపెద్ద మెట్రో రైల్ నెట్ వర్క్ గా క్రింది ఏ నగరపు మెట్రో రికార్డు సృష్టించింది?
A). బెంగళూరు మెట్రో
B). హైదరాబాద్ మెట్రో
C). చెన్నై మెట్రో
D). కలకత్తా మెట్రో
సమాధానం : B ( హైదరాబాద్ మెట్రో ).
6). ఇటీవల టామ్ 2 అనే సంస్థ వెల్లడించిన నివేదికలో ప్రపంచ వ్యాప్తంగా అత్యధిక ట్రాఫిక్ రద్దీ ఉన్న నగరాల్లో ఈ క్రింది ఏ భారతదేశ నగరం తొలిస్థానంలో నిలిచింది?
A). హైదరాబాద్
B). న్యూ ఢిల్లీ
C). చెన్నై
D). బెంగళూరు
సమాధానం : D (బెంగళూరు ).
7). రష్యా దేశాధ్యక్ష పీఠంపై ప్రస్తుత అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సుదీర్ఘ కాలం వరకూ కొనసాగేందుకు వీలు కల్పించే రాజ్యాంగ సంస్కరణలకు ఇటీవలే రష్యా ప్రజలు తమ ఆమోదాన్ని తెలిపారు.ఈ క్రమంలో పుతిన్ ఏ సంవత్సరం వరకు రష్యా దేశ అధ్యక్షుడిగా కొనసాగనున్నారు?
A).2025
B).2035
C).2036
D).2042
సమాధానం : C ( 2036 ).
8).భారతదేశ 13వ రాష్ట్రపతిగా సేవలు అందించిన మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ ఢిల్లీలో ఆగష్టు 31వ తేదీన మరణించారు. అయితే భారత ప్రభుత్వం ఈ క్రింది ఏ సంవత్సరంలో ప్రణబ్ ముఖర్జీ కీ దేశ అత్యున్నత పురస్కారం భారత రత్న ను ప్రకటించింది?
A).2015
B).2017
C).2019
D).2020
సమాధానం : C ( 2019 ).
9). జమ్మూ కాశ్మీర్ లో నిర్మిస్తున్న ప్రపంచంలోనే ఎత్తైన రైల్వే వంతెన ఆగష్టు 2022 కు పూర్తయ్యే అవకాశం ఉంది.అయితే ఈ వంతెనను జమ్మూ కాశ్మీర్ లో ఏ నది పై నిర్మిస్తున్నారు?
A). గంగోత్రి
B). రావి
C). చీనాబ్
D). సట్లైజ్
సమాధానం : C ( చీనాబ్ ).
10).ఇటీవల పుస్తక విక్రయ రంగంలో ఎక్కువ కాపీలు అమ్ముడుపోయిన పుస్తకంగా ” ఏ ప్రామిస్డ్ ల్యాండ్ ” అనే పుస్తకం నూతన రికార్డులను సృష్టిస్తోంది. అయితే క్రింది వారిలో ఎవరు “ఏ ప్రామిస్డ్ ల్యాండ్” పుస్తకాన్ని రచించారు?
A). డోనాల్డ్ ట్రంప్
B). జో బైడెన్
C). జై శంకర్
D). బరాక్ ఒబామా
సమాధానం : D ( బరాక్ ఒబామా ).
11.మైక్రో బ్లాగింగ్ సైట్ అయిన ట్విట్టర్ లో ఇటీవల 10 లక్షల ట్విట్టర్ ఫాలోయర్స్ కలిగిన తొలి బ్యాంకుగా రికార్డును సృష్టించిన బ్యాంకు ఏది?
A).రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా
B). మెక్సికో సెంట్రల్ బ్యాంకు
C). బ్యాంకు ఆఫ్ ఇండోనేషియా
D). అమెరికా ఫెడరల్ రిజర్వ్ బ్యాంకు
సమాధానం : A ( రిజర్వ్ బ్యాంకు ఆఫ్ ఇండియా ).
12). సముద్రయాన రంగంలో దేశీయ సాంకేతిక ప్రాబల్యాన్ని పెంచేలా నూతనంగా హైటెక్ ఓడను ఆవిష్కరించిన పరిశోధకులు ఏ ఐఐటీ కీ చెందినవారు?
A). ఐఐటీ ఖరగ్ పూర్
B). ఐఐటీ బెంగళూరు
C). ఐఐటీ మద్రాస్
D). ఐఐటీ ఢిల్లీ
సమాధానం : C ( ఐఐటీ మద్రాస్ ).
13).2023 వ సంవత్సరంలో G-20 సమ్మిట్ ను ఈ క్రింది వానిలో ఏ దేశం నిర్వహించబోతుంది?
A). రష్యా
B). ఇండియా
C). యూ ఎస్ ఏ
D). యూ ఏ ఈ
సమాధానం : B ( ఇండియా ).
14). నవంబర్ 23,2020 న WWE కు వీడ్కోలు పలికిన ప్రముఖ ప్లేయర్ ఎవరు?
A).ట్రిపుల్ హెచ్
B). కాన్ విల్లియమ్స్
C). అండర్ట్ కేర్
D).జాన్ సేనా
సమాధానం : C ( అండర్ట్ కేర్ ).
15). ఇండియన్ సూపర్ లీగ్ ఫుట్ బాల్ టోర్నమెంట్( ఐఎస్ఎల్ ) 7వ సీజన్ నవంబర్ 20,2020 న భారత్ లో ఎక్కడ ప్రారంభం అయ్యాయి?
A). మధ్య ప్రదేశ్
B). ఉత్తర ప్రదేశ్
C). ఆంధ్రప్రదేశ్
D). గోవా
సమాధానం : D ( గోవా ).
General Knowledge Bits for Competitive Exams
1). ఈ క్రింది తేదీలలో ఏ తేదీని ఐక్య రాజ్య సమితి దినోత్సవం గా పరిగణిస్తారు?
A). అక్టోబర్ 21
B). అక్టోబర్ 22
C). అక్టోబర్ 23
D). అక్టోబర్ 24
సమాధానం : D ( అక్టోబర్ 24 ).
2). పంచశీల ఒప్పందం 1954 వ సంవత్సరంలో మే 29వ తేదీన జరిగింది.అయితే ఈ పంచశీల ఒప్పందం ఏ యే దేశాల మధ్య జరిగినది?
A) భారత్ – అమెరికా
B). భారత్ – చైనా
C). భారత్ – రష్యా
D). భారత్ – పాకిస్తాన్
సమాధానం : B ( భారత్ – చైనా ).
3). ఈ క్రింది వానిలో బంగ్లాదేశ్ కరెన్సీ ఏది?
A). డాలర్
B). యెన్
C). రూపాయి
D). టాకా
సమాధానం : D ( టాకా ).
4). దేవనాం ప్రియ, ప్రియదర్శి అనే బిరుదులు క్రింది వారిలో ఎవరికీ కలవు?
A).అశోకుడు
B). కనిష్కుడు
C).వసుమిత్రుడు
D). అశ్వఘోషుడు
సమాధానం : A ( అశోకుడు ).
5). క్రింది వారిలో ‘ ప్లాస్టిక్ సర్జరీ ‘ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు?
A). చరకుడు
B). సుశ్రుతుడు
C). సిసిరో
D). ముత్తుస్వామి దీక్షితార్
సమాధానం : A ( చరకుడు ).
6). 1919 వ సంవత్సరంలో జలియన్ వాలాబాగ్ దుర్ఘటన జరిగిన స్థలం?
A).అలెప్పి (కేరళ )
B). అమర్ కంటక్ (మధ్యప్రదేశ్ )
C). అంబాలా ( హర్యానా )
D). అమృత్ సర్ ( పంజాబ్ )
సమాధానం : D ( అమృత్ సర్ -పంజాబ్ ).
7). ఈ క్రింది నగరాలలో పింక్ సిటీ అని ఏ నగరమును పిలుస్తారు?
A). మదురై ( తమిళనాడు )
B). జంషెడ్ పూర్ ( జార్ఖండ్ )
C). జై పూర్ ( రాజస్థాన్ )
D). సారనాధ్ ( ఉత్తరప్రదేశ్ )
సమాధానం : C ( జైపూర్ – రాజస్థాన్ ).
8). భారత జాతీయ గీతం జనగణమన ను పూర్తిగా ఆలపించడానికి పట్టే పూర్తి సమయం?
A).20 సెకన్లు
B).52 సెకన్లు
C).60 సెకన్లు
D).118 సెకన్లు
సమాధానం : B ( 52 సెకన్లు )
9). ఈ క్రింది వానిలో భారతదేశ జాతీయ నది?
A). గోదావరి
B). కృష్ణా
C). బ్రహ్మపుత్ర
D). గంగా
సమాధానం : D ( గంగా ).
10).రాజీవ్ ఖేల్ రత్న అవార్డు పొందిన తొలి క్రీడాకారుడు ఎవరు?
A). సచిన్ టెండూల్కర్ ( క్రికెట్ )
B). విశ్వనాథన్ ఆనంద్ ( చెస్ )
C). అభినవ్ బింద్రా ( షూటింగ్ )
D). పుల్లెల గోపీచంద్ ( బాడ్మింటన్ )
సమాధానం : B ( విశ్వనాథన్ ఆనంద్ ).
11). ఈ క్రింది వారిలో పంజాబ్ కేసరి అనే బిరుదు ఎవరికీ కలదు?
A). భగత్ సింగ్
B). సుభాష్ చంద్ర బోస్
C). లాలా లజపతి రాయ్
D). దాదాబాయ్ నౌరోజీ
సమాధానం : B ( సుభాష్ చంద్ర బోస్ ).
12).క్రింది వానిలో డ్యూరాండ్ కప్ ఏ క్రీడకు చెందినది?
A). క్రికెట్
B). వాలీబాల్
C). బాడ్మింటన్
D). ఫుట్ బాల్
సమాధానం : D ( ఫుట్ బాల్ ).
13). ధ్యాన్ చంద్ ట్రోఫీ ఏ ఆటకు సంబంధించినది?
A). ఫుట్ బాల్
B). హాకీ
C). క్రికెట్
D). బాడ్మింటన్
సమాధానం : B ( హాకీ ).
14). ప్రపంచంలో అతి లోతైన సరస్సు పేరు బైకాల్ సరస్సు. ఈ బైకాల్ సరస్సు ఏ దేశంలో కలదు?
A).రష్యా
B).ఇరాన్
C). కెనడా
D). టాంజనియా
సమాధానం : A ( రష్యా ).
15). గిర్ జాతీయ పార్క్ భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఉంది?
A). గుజరాత్
B). మహారాష్ట్ర
C). అస్సాం
D). మేఘాలయ
సమాధానం : A ( గుజరాత్ ).
Indian Air force AFCAT 235 Job Recruitment 2020 || ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్:
ఇండియన్ ఎయిర్ ఫోర్స్ నుండి వివిధ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది. ఆంధ్ర ప్రదేశ్ మరియు తెలంగాణ లోని అర్హులైన అభ్యర్థులు అందరూ ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరియు ఇండియన్ సిటిజెన్స్ అందరూ దరఖాస్తు చేసుకోవచ్చు. Indian Air force AFCAT 235 Job Recruitment 2020
ముఖ్యమైన తేదీలు:
ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చే తేదీలు: జనవరి 2022
పోస్టుల సంఖ్య:
అన్ని విభాగాల్లో మొత్తం 235 ఖాళీల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేయడం జరిగింది
విభాగాల వారీగా ఖాళీలు:
ఫ్లయింగ్ మరియు గ్రౌండ్ డ్యూటీ టెక్నికల్ అండ్ నాన్ టెక్నికల్ విభాగాలలో ఖాళీలను ఈ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేయడం జరుగుతుంది
అర్హతలు:
పోస్ట్ ను బట్టి సంబంధిత విభాగానికి కావలసిన అర్హత కలిగి ఉండాలి. మరియు కావలసిన ఫిజికల్ అండ్ మెడికల్ స్టాండర్డ్స్ కలిగి ఉండాలి
వయసు:
పోస్ట్ ని బట్టి 20 నుండి 26 సంవత్సరాల లోపు వయసు కలిగిన అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు
జీతం:
56100 నుండి 1, 77500 వరకు ఇవ్వడం జరుగుతుంది మరియు ఇతర అలవెన్సులు కలవు
దరఖాస్తు చేసుకునే విధానం:
ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు పైన ఇవ్వబడిన తేదీ లోపు ఈ క్రింద ఇవ్వబడిన ఆఫీషియల్ వెబ్ సైట్ ద్వారా ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది
ఎంపిక చేసుకునే విధానం:
ఎయిర్ఫోర్స్ కామన్ అడ్మిషన్ టెస్ట్ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేసుకోవడం జరుగుతుంది.
ఈ పోస్టులకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కొరకు అఫీషియల్ వెబ్ సైట్ ను సంప్రదించగలరు
TTD News
వైకుంఠ ఏకాదశి 300 టికెట్స్ కోసం
వైకుంఠ ఏకాదశి (25.12.20 నుంచి 3.1.2021 వరకు) తిరుమల శ్రీవారి 300 రూపాయల ప్రత్యేక దర్శనం కోటాను టీటీడీ మంగళవారం (01.12.20) ఉదయం 11 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనుంది.
....
Rs. 300 online quota for Vaikunta Ekadasi (25-12-2020 to 03-01-2021) will be released on 01-12-2020 by 11am by TTD.
..........
.......
ఈ మెసేజ్ ను వీలైనంత మందికి షేర్ చేయండి.
............
హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సోమవారం నుండి రోగులకు అందుబాటులో డయాలసిస్ సేవలు
- జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు
గతంలో పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా వున్న నేపథ్యంలో ప్రైవేట్ ఆస్పత్రికి డయాలసిస్ యూనిట్ మార్పు
ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో హిందూపురం జిల్లా ఆస్పత్రి లో డయాలసిస్ యూనిట్ తిరిగి ప్రారంభం
అనంతపురం, నవంబర్ 30: హిందూపురం జిల్లా ఆస్పత్రిలో సోమవారం నుండి రోగులకు డయాలసిస్ సేవలు అందుబాటులోకి తెచ్చామని జిల్లా కలెక్టర్ గంధం చంద్రుడు వెల్లడించారు.. గతంలో హిందూపురంలో కోవిడ్ కేసులు ఎక్కువ ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు హిందూపురం జిల్లా ఆస్పత్రిని పూర్తి స్థాయి కోవిడ్ ఆస్పత్రిగా చేయడం వల్ల, డయాలసిస్ యూనిట్ ను ప్రైవేట్ ఆస్పత్రికి మార్చడం జరిగిందన్నారు. ప్రస్తుతం కోవిడ్ కేసులు తగ్గిన నేపథ్యంలో, డయాలసిస్ యూనిట్ ను తిరిగి హిందూ పురం జిల్లా ఆస్పత్రికి తరలించి, సోమవారం నుండి రోగులకు డయాలసిస్ సేవలను అందుబాటులోకి తెచ్చామన్నారు.. ప్రజలు ఈ మార్పును గమనించి, హిందూపురం ప్రభుత్వ ఆసుపత్రిలో యధావిధిగా డయాలసిస్ సేవలను వినియోగించుకోవాల్సిందిగా కలెక్టర్ విజ్ఞప్తి చేశారు..
Issued by AD,I&PR,ATP
TTD తిరుమల శ్రీవారి పుష్కరిణిలో తొమ్మిది తీర్థాలు..
మూడుమునకలేస్తే దీర్ఘాయుష్షు! తిరుమల శ్రీవారి లీలలు అన్నీ ఇన్నీ కావు. స్వామివారు నెలవై ఉన్న తిరుమలలో భక్తులకే తెలియని ఎన్నో విశేషాలు ఉన్నాయి. స్వామి వారి ఆలయానికి కుడివైపున ఉన్న పుష్కరిణికి ఎన్నో యేళ్ల చరిత్ర ఉంది. స్వామివారి తెప్పోత్సవాలన్నీ ఈ పుష్కరిణి నుంచే జరుగుతుంటుంది. ప్రతి యేడాది తెప్పోత్సవాలు జరిగే సమయంలో వేలాది మంది భక్తులు తిలకిస్తుంటారు. అలాంటి పుష్కరిణిలో ఎంతో ప్రాముఖ్యత కలిగిన తొమ్మిది తీర్థాలున్నాయి. శ్రీవారి పుష్కరిణిలో కుబేర తీర్థం, గాలవతీర్థం, మార్కండేయ తీర్థం, అగ్నితీర్థం, యమతీర్థం, వశిష్ట తీర్థం, వరుణ తీర్థం, వాయు తీర్థం, సరస్వతి తీర్థం ఇలా మొత్తం ఏడు తీర్థాలున్నాయి. అసలు తీర్థాలకు ఉన్న ప్రాశస్త్యం ఏమిటో తెలుసుకుందాం. కుబేర తీర్థం.. శ్రీవారి పుష్కరిణిలో ఉత్తరాన ధనద తీర్థం ఉంది. ఈ తీర్థాన్ని కుబేరుడు నిర్మించాడని పురాణాలు చెబుతున్నాయి. అందువల్లే ఇది కుబేర తీర్థం అని కూడా పిలువబడుతోంది. ఈ తీర్థంలో భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తే చాలు సర్వపాపాలు నశించడమే కాదు ధన, ధాన్యాది సంపదలన్నీ సంప్రాప్తిస్తాయి. గాలవ తీర్థం.. స్వామి పుష్కరిణిలో ఈశాన్య భాగంలో గాలవ తీర్థం ఉంది. ఇది గాలవ మహర్షిచే నిర్మితమైంది. ఈ భాగంలోని తీర్థాన్ని త్రాగినా, లేదా ఇందులో స్నానం చేసినా ఇహ, పర సుఖాలు రెండూ సమకూరుతాయని పురాణాలు చెబుతున్నాయి. మార్కండేయ తీర్థం... శ్రీనివాసుని పుష్కరిణిలో తూర్పు భాగంలో మార్కండేయ మహర్షి నిర్మించిందే మార్కండేయ తీర్థం. ఇక్కడ స్నానం చేస్తే మానవులకు దీర్ఘాయుస్సు కలుగుతుంది. అగ్ని తీర్థం - యమతీర్థం... వేంకటాచలం మీది స్వామి పుష్కరిణిలో ఆగ్నేయమూలలో అగ్ని దేవునిచే స్థాపించబడిన ఆగ్నేయ తీర్థం ఉంది. ఇందులో స్నానం చేసినట్లయితే పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. అలాగే యమతీర్థం దక్షిణ భాగంలో ఉంది. ఈ తీర్థంలో స్నానం చేస్తే మానవునికి నరక బాధ తప్పుతుంది. వసిష్ట తీర్థం... వసిష్ట మహర్షిచే నైరృతి దిశలో నిర్మింపబడిన వసిష్ట తీర్థం కూడా ఈ స్వామి పుష్కరిణిలో భాగంగానే ఆవిర్భవించింది. ఈ తీర్థంలో స్నానం చేస్తే తీవ్రమైన అప్పుల బాధలు తొలగుతాయి. వరుణతీర్థం - వాయుతీర్థం.. స్వామి వారి పుష్కరిణిలో పడమట వరుణతీర్థం, వాయుమూలన వాయుతీర్థంలు ఉన్నాయి. ఈ తీర్థాలు ముక్తిని కలిగిస్తాయి. సరస్వతి తీర్థం... కలియుగ వైకుంఠుని పుష్కరిణి మధ్య భాగంలో మహాపాతకాలను నాశనం చేసేటటువంటి సరస్వతి తీర్థం ఉంది. ఈ తొమ్మిది తీర్థాలలో ఒకేరోజున స్నానం చేసిన తర్వాత స్వామి పుష్కరిణికి దక్షిణ తీర్థంలో కొలువై ఉన్న శ్రీనివాస భగవానుని దర్శనం చేసుకున్న మానవునికి పునర్జన్మ ఉండదని పురాణాలు చెబుతున్నాయి. అంటే మోక్షం కలుగుతుంది. స్వామి వారి పుష్కరిణి స్నానం, శ్రీ వేంకటేశ్వరస్వామి దర్శనం, విష్ణు సహస్ర నామ పారాయణం ఈ మూడు కార్యాలు అత్యంత ఉత్తమమైన తప ఫలాన్ని కలిగిస్తాయి. అందువల్ల తొమ్మిది తీర్థాల నెలవుగా ఉన్న స్వామి పుష్కరిణిలో తప్పక స్నానం చేస్తుంటారు భక్తులు. ఆ తర్వాత అక్కడే ఉన్న శ్రీ వరాహస్వామి వారిని దర్శించుకుంటుంటారు. అలా ఒకవేళ చేయకపోతే ఆ క్షేత్రంలో ఎన్ని సేవలు చేసినప్పటికీ అవన్నీ ఈ నిష్ఫలాలే అవుతాయని పురాణాలు చెబుతున్నాయి. వేంకటాచలం మీది ఈ స్వామి పుష్కరిణి ఒకానొకప్పుడు దశరథ మహారాజు సేవించుకుని సంతానాన్ని పొందాడు. ఆ తర్వాత శ్రీరామ చంద్రుడు కూడా ఈ క్షేత్రాన్ని దర్శించుకుని రావణాసురుని చేత అపహరింపబడిన సీతాదేవిని పొందాడు. ప్రస్తుతం అయితే తీర్థాలన్నీ పుష్కరిణిలోనే ఉన్నాయి. పుష్కరిణిలో మూడుసార్లు మునకేస్తే చాలు సర్వం శుభమే... అయితే మీరు కూడా స్వామివారి పుష్కరిణిలో పుణ్య స్నానం చేస్తారా!
సింగరేణి కాలరీస్ ఎడ్యుకేషనల్ సొసైటీలో
ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : | టీచింగ్ స్టాఫ్-44, నాన్ టీచింగ్ స్టాఫ్-19, క్లాస్-4 ఎంప్లాయీస్-15. |
ఖాళీలు : | 78 |
అర్హత : | పదోతరగతి(క్లాస్-4), సంబంధిత సబ్జెక్టుల్లో బ్యాచిలర్స్ డిగ్రీ, మాస్టర్స్ డిగ్రీ , బీఈడీ, ఎంఫిల్/ పీహెచ్డీ & నెట్/ స్లెట్ అర్హత, అనుభవం. |
వయసు : | 18-44ఏళ్లు మించకూడదు. |
వేతనం : | రూ. 12,000-40,000/- |
ఎంపిక విధానం: | టెస్ట్/ డెమో కమ్ ఇంటర్వ్యూ ఆధారంగా. |
దరఖాస్తు ఫీజు : | జనరల్ కు రూ. 0/- , ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/- |
దరఖాస్తు విధానం : | ఆఫ్లైన్. |
దరఖాస్తులకు ప్రారంభతేది: | నవంబర్ 17, 2020, |
దరఖాస్తులకు చివరితేది: | డిసెంబర్ 7, 2020. |
వెబ్సైట్: | Click Here |
నోటిఫికేషన్: | Click Here |
TTD News
వైఎస్సార్ పెళ్లికానుక లక్ష్యం | YSR Pelli Kanuka
రాష్ట్రములోని నిరుపేద కుటుంబాలలో ఆడపిల్ల వివాహ కార్యక్రమము భారం కాకుండా మరియు పెళ్లి కుమార్తె పెళ్లి అయి అత్త వారింటికి వెళ్ళిన తరువాత కూడా అభద్రతా భావంతో ఉండకుండా ఉండేందుకు గాను రాష్ట్ర ప్రభుత్వం వారు పెళ్లి కానుక పథకానికి శ్రీకారం చుట్టారు. ఈ పథకం ద్వారా ప్రభుత్వం పేదింటి ఆడపిల్లకు ఆర్ధిక సహాయం చేయడం ద్వారా అండగా ఉండడమే కాక, బాల్య వివాహాలు నిర్మూలించేందుకు మరియు వివాహం రిజిస్ట్రేషన్ చెయ్యడం ద్వారా వధువుకి రక్షణ కల్పించడం ''వైఎస్సార్ పెళ్ళికానుక'' రూప కల్పన ముఖ్య ఉద్దేశ్యం."
పథక మార్గదర్శకాలు
1. మండల సమాఖ్య / మెప్మా కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలి.
2. అనంతరం అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలిస్తారు.
3. వివాహానికి ముందే సాయం మొత్తంలో 20 శాతం పెళ్లికుమార్తె బ్యాంకు ఖాతాలో వేస్తారు.
4. వివాహమయ్యాక మిగతా మొత్తాన్ని జమ చేస్తారు.
5. అనంతరం వివాహ ధ్రువీకరణ పత్రం ఇస్తారు.
వైఎస్సార్ పెళ్ళికానుక అర్హతలు👇
అర్హతలు (వధూవరులిద్దరూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందినవారయితే)
👉వధువు మరియు వరుడు ఇద్దరూ ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి
👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
👉కేవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు. అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను.
అర్హతలు (వధువు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి చెంది ఉండి వరుడు ఇతర రాష్ట్రాలకు (తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, చతీస్ ఘడ్ & ఒడిస్సా) చెందినవారయితే
👉వధువు ప్రజా సాధికార సర్వే నందు నమోదు కాబడి ఉండాలి
👉వధువు ఆంద్ర ప్రదేశ్ రాష్ట్ర నివాసితులై ఉండాలి
👉వధువు మరియు వరుడు ఇద్దరూ ఆధారు కార్డు కలిగి ఉండాలి.
👉వధువు తప్పనిసరిగా తెల్ల రేషను కార్డు కలిగి ఉండాలి
👉వవాహ తేది నాటికీ వధువుకు 18 సంవత్సరములు మరియు వరుడుకు 21 సంవత్సరములు పూర్తి అయి ఉండవలెను.
👉కవలం మొదటిసారి వివాహము చేసుకొనే వారు మాత్రమే ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనుటకు అర్హులు.
👉అయితే, వధువు వితంతువు అయినప్పటికీ ఈ పధకమునకు దరఖాస్తు చేసుకొనవచ్చును
👉వవాహము తప్పనిసరిగా ఆంద్ర ప్రదేశ్ రాష్ట్రములో మాత్రమే జరుగవలెను
కావలసిన ధ్రువీకరణ పత్రములు👇
👉కులము / కమ్యూనిటి మీ-సేవ చే జారి చేయబడిన నేటివిటీ, కమ్యూనిటి మరియు జనన ధృవీకరణ పత్రము (మీ- సేవ ఇంటిగ్రేటెడ్ సర్టిఫికేట్)
👉వయస్సు యస్.యస్.సి సర్టిఫికేట్: 2004 వ సంవత్సరము మరియు ఆ తరువాత పదవ తరగతి పాసయిన వారికీ (లేదా) ఇంటిగ్రేటెడ్ మీ -సేవ సర్టిఫికేట్
👉ఆదాయము (వధువుకి మాత్రమే) తెల్ల రేషను కార్డు/ మీ సేవ ఇన్కమ్ సర్టిఫికేట్
👉నవాసము ప్రజా సాధికార సర్వే నందు నమోదు
👉అంగవైకల్యము సదరం సర్టిఫికేట్ (కనీసం 40% గా ఉండి శాశ్వత అంగవైకల్యం అయి ఉండాలి)
👉వతంతువు
ఆధార్ నెంబర్ ఆధారముగా పింఛను డేటాతో పరిశీలిస్తారు
వితంతువు అయి ఉండి పింఛను పొందకపోతే లేదా ఫించను డేటాలో వివరాలు లేకపోతే వ్యక్తిగత ధృవీకరణ
👉భవన మరియు ఇతర నిర్మాణ కార్మికులు ఎ.పి.బి.ఒ.సి.డబ్ల్యూ.డబ్ల్యూ.బి చే జారీ చేయబడిన కార్మికుని యొక్క రిజిస్ట్రేషన్ నెంబర్/గుర్తింపు కార్డు కలిగి ఉండాలి
ప్రోత్సాహకం👇
👉వైఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి) సాంఘిక సంక్షేమ శాఖ 40,000/-
👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.సి కులాంతర) సాంఘిక సంక్షేమ శాఖ 75,000/-
👉వఎస్సార్ పెళ్ళికానుక (గిరి పుత్రిక) గిరిజన సంక్షేమ శాఖ 50,000/-
👉వఎస్సార్ పెళ్ళికానుక (ఎస్.టి కులాంతర) గిరిజన సంక్షేమ శాఖ 75,000/-
👉వఎస్సార్ పెళ్ళికానుక (బి.సి) బి.సి సంక్షేమ శాఖ 35,000/-
6 వైఎస్సార్ పెళ్ళికానుక (బి.సి కులాంతర) బి.సి సంక్షేమ శాఖ 50,000/-
👉 వఎస్సార్ పెళ్ళికానుక (దుల్హన్) మైనారిటీ సంక్షేమ శాఖ 50,000/-
👉వఎస్సార్ పెళ్ళికానుక (దివ్యంగులు) దివ్యంగులు సంక్షేమ శాఖ 1,00,000/-
👉 వఎస్సార్ పెళ్ళికానుక (APBOCWWB) ఆంధ్రప్రదేశ్ భవనములు మరియు ఇతర నిర్మాణ రంగములోని కార్మిక సంక్షేమ సంస్థ, కార్మిక సంక్షేమ శాఖ 20,000/-
-
AP KGBV Non-Teaching Recruitment 2024 Notification కేజీబీవీల్లో 729 బోధనేతర పోస్టులు కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయాల్లో 729 బోధనేతర పోస్ట...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...