25, నవంబర్ 2021, గురువారం

India Post GDS Results 2021: పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల అభ్యర్థులకు అలర్ట్... గ్రామీణ డాక్ సేవక్ ఫలితాలు ఎప్పుడంటే..?

India Post GDS Results 2021 | మీరు గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) ఉద్యోగానికి అప్లై చేశారా? ఇటీవల మీ ఆప్షన్స్ మార్చారా? పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాల ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారా? అయితే అలర్ట్. ఫలితాలు ఎప్పట్లోపు రావొచ్చో తెలుసుకోండి.

1. ఇండియా పోస్ట్ దేశవ్యాప్తంగా పోస్ట్ ఆఫీస్ ఉద్యోగాలు (Post Office Jobs) భర్తీ చేయడంలో భాగంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లో గ్రామీణ డాక్ సేవక్ (Gramin Dak Sevak) పోస్టుల్ని ప్రకటించిన సంగతి తెలిసిందే. రెండు నోటిఫికేషన్ల ద్వారా 3,446 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరించింది. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 వరకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగింది.

Gemini Internet

2. సాధారణంగా రెండు నెలల్లోపే ఫలితాలు వస్తుంటాయి. కానీ కొన్ని నెలలైనా ఫలితాలు విడుదల కాకపోవడంతో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. అయితే పలు సాంకేతిక కారణాల వల్ల ఇండియా పోస్ట్ ఈ ఫలితాలను వెల్లడించలేదు. సెంట్రల్ అడ్మినిస్ట్రేటీవ్ ట్రిబ్యునల్, హైదరాబాద్ ఆదేశాల మేరకు విత్‌హెల్డ్ పోస్టుల స్థానంలో అభ్యర్థులు ఆప్షన్స్ ఎంచుకునే అవకాశం కల్పించింది ఇండియా పోస్ట్.

3. 2021 జనవరి 27 నుంచి 2021 మార్చి 1 మధ్య గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ కొత్త ఆప్షన్స్ ఎంచుకోవడానికి 2021 నవంబర్ 18 వరకు అవకాశం ఇచ్చింది. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు https://appost.in/ వెబ్‌సైట్‌లో ఆప్షన్స్ మార్చుకున్నారు. ఇప్పుడు ఆ అభ్యర్థులు అంతా ఫలితాల కోసం ఎదురుచూస్తున్నారు.

4. గ్రామీణ డాక్ సేవక్ నోటిఫికేషన్ దరఖాస్తు గడువు ముగిసిన రెండు నెలల్లోపు ఫలితాలు విడుదల చేస్తుంది ఇండియా పోస్ట్. ఆప్షన్స్ మార్చుకునే గడువు నవంబర్ 18న ముగియడంతో డిసెంబర్ లోగా ఫలితాలు విడుదలయ్యే అవకాశం ఉంది. https://appost.in/ వెబ్‌సైట్‌లో Results Under Process స్టేటస్‌లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ నోటిఫికేషన్స్ కనిపిస్తున్నాయి.

5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)

5. గ్రామీణ డాక్ సేవక్ ఫలితాల కోసం అభ్యర్థులు ట్విట్టర్‌లో ఇండియా పోస్ట్‌ను సంప్రదిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ సర్కిల్ జీడీఎస్ రిక్రూట్‌మెంట్ ఫలితాల కోసం APCO, విజయవాడ ఇమెయిల్ ఐడీ rectt.ap@indiapost.gov.in లో సంప్రదించాలని ఇండియా పోస్ట్ తెలిపింది. లేదా 0866 - 2429822 నెంబర్‌కు కాల్ చేయాలని కోరుతోంది. ఇక తెలంగాణ అభ్యర్థులు tcgds2021@gmail.com మెయిల్ ఐడీలో లేదా 040-23463617 ఫోన్ నెంబర్‌లో సంప్రదించొచ్చు. (Source: Twitter)

6. తెలంగాణలో 1150 గ్రామీణ డాక్ సేవక్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఇండియా పోస్ట్. వీటిలో రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే మొత్తం ఖాళీలు- 1150, జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 484, ఓబీసీ- 279, ఈడబ్ల్యూఎస్- 130, PWD-A- 9, PWD-B- 14, PWD-C- 15, ఎస్సీ- 154, ఎస్టీ- 65 పోస్టుల్ని కేటాయించింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లో మొత్తం 2296 ఖాళీలు ఉన్నాయి. రిజర్వేషన్ వారీగా పోస్టుల వివరాలు చూస్తే జనరల్ లేదా అన్ రిజర్వ్‌డ్- 947, ఓబీసీ- 507, ఈడబ్ల్యూఎస్- 324, PWD-A- 18, PWD-B- 34, PWD-C- 35, PWD-DE- 9, ఎస్సీ- 279, ఎస్టీ- 143 పోస్టులున్నాయి.

7. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌తో పాటు జమ్మూ కాశ్మీర్‌లో 266 పోస్టులు, ఉత్తరప్రదఏశ్‌లో 4264 పోస్టులు, ఉత్తరాఖండ్‌లో 581 పోస్టులు, పశ్చిమ బెంగాల్‌లో 2357 పోస్టులు, బీహార్‌లో 1940 పోస్టులు, మహారాష్ట్రలో 2428 పోస్టులు, ఢిల్లీలో 233 గ్రామీణ డాక్ సేవక్ పోస్టులకు సంబంధించిన ఫలితాలు కూడా విడుదల కావాల్సి ఉంది. ఈ ఫలితాలను ఒకదాని వెంట మరొకటి విడుదల చేయనుంది ఇండియా పోస్ట్. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ ఫలితాలు రెండు నెలల్లో రిలీజ్ కావొచ్చు.

 

Bank of Baroda Recruitment 2021: బ్యాంక్ ఆఫ్ బరోడాలో 376 ఉద్యోగాలు... హైదరాబాద్‌లో ఖాళీలు

Gemini Internet

బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ విడుదల చేసింది. రిలేషన్‌షిప్ మేనేజర్ (Relationship Manager) పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 376 ఖాళీలు ఉన్నాయి. దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకింగ్ రీజియన్లలో ఈ ఖాళీలు ఉన్నాయి. హైదరాబాద్‌లో 12 పోస్టులు ఉన్నట్టు నోటిఫికేషన్‌లో వెల్లడించింది బ్యాంక్ ఆఫ్ బరోడా (Bank of Baroda). డిగ్రీ పాస్ అయినవారితో పాటు బ్యాంకింగ్ రంగంలో రెండేళ్ల లోపు అనుభవం ఉన్నవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 9 చివరి తేదీ. ఈ పోస్టులకు దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి విద్యార్హతల వివరాలు తెలుసుకోవాలి.

Bank of Baroda Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...


మొత్తం ఖాళీలు376విద్యార్హతలుఅనుభవంవయస్సు
సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్326 (హైదరాబాద్- 12)గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా రెండేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి.24 నుంచి 35 ఏళ్లు
ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్50గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా సబ్జెక్ట్‌లో డిగ్రీ పాస్ కావాలి. మేనేజ్‌మెంట్‌లో రెండేళ్ల పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ లేదా డిప్లొమా పాస్ అయినవారికి, NISM, IRDA రెగ్యులేటరీ సర్టిఫికేషన్స్ ఉన్నవారికి ప్రాధాన్యం ఉంటుంది.ప్రభుత్వ రంగ బ్యాంకులు, ప్రైవేట్ బ్యాంకులు, ఫారిన్ బ్యాంకులు, బ్రోకింగ్ సంస్థలు, సెక్యూరిటీ సంస్థలు, అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీల్లో వెల్త్ మేనేజ్‌మెంట్‌లో రిలేషన్‌షిప్ మేనేజర్‌గా ఏడాదిన్నర పనిచేసిన అనుభవం ఉండాలి.23 నుంచి 35 ఏళ్లు
Bank of Baroda Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 19

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 9

ఎంపిక విధానం- పర్సనల్ ఇంటర్వ్యూ, గ్రూప్ డిస్కషన్

దరఖాస్తు ఫీజు- జనరల్, ఓబీసీ అభ్యర్థులకు రూ.600. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులు, మహిళలకు రూ.100.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ పోస్టులకు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

Bank of Baroda Recruitment 2021: అప్లై చేయండి ఇలా


Step 1- అభ్యర్థులు బ్యాంక్ ఆఫ్ బరోడా అధికారిక వెబ్‌సైట్ https://www.bankofbaroda.in/ లో కెరీర్స్ సెక్షన్ ఓపెన్ చేయాలి.

Step 2- Current Opportunities క్లిక్ చేస్తే సీనియర్ రిలేషన్‌షిప్ మేనేజర్, ఇ-వెల్త్ రిలేషన్‌షిప్ మేనేజర్ నోటిఫికేషన్స్ వేర్వేరుగా ఉంటాయి.

Step 3- మీరు ఏ పోస్టుకు దరఖాస్తు చేయాలనుకుంటే ఆ పోస్టుకు సంబంధించిన Apply Now పైన క్లిక్ చేయాలి.

Step 4- కొత్త పేజీ అవుతుంది. పోస్ట్ పేరు సెలెక్ట్ చేయాలి. ఆ తర్వాత పేరు, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేయాలి.

Step 5- రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత ఇతర వివరాలన్నీ ఎంటర్ చేయాలి.

Step 6- ఫోటో, సంతకం అప్‌లోడ్ చేయాలి.

Step 7- ఫీజు చెల్లించి దరఖాస్తు ఫామ్ సబ్మిట్ చేయాలి. 

24, నవంబర్ 2021, బుధవారం

TTD Update నవంబర్ 27 నుంచి వర్షాలు కురుస్తాయి. కానీ అల్పపీడనం పైన కన్వర్జెన్స్

*నవంబర్ 28వ తేదీ నుండి దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో అత్యంత భారీ వర్షపాతానికి కారణమవుతుంది.*

బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడి ప్రస్తుతానికి శ్రీలంక దక్షిణ భాగాల్లో ఉంది. ఆ అల్పపీడనం మెల్లగా ఉత్తర వాయువ్య దిశగా కదులుతోంది. రానున్న ఇరవై నాలుగు గంటల్లో ఇది బలపడి  తీవ్ర అల్పపీడనంగా మారనుంది. ఈ అల్పపీడనం ఈ నెలలో వచ్చిన అల్పపీడనాలు లాగ కాదు. కాస్త భిన్నంగా ఉత్తర దిశగా ఎక్కువ CONVERGENCE కనిపిస్తోంది. ఇది వాయుగుండంగా మారదు కానీ బలమైన అల్పపీడనంగా శ్రీలంక ఉత్తర దిశగా కదలనుంది. దిని వల్ల ఆ CONVERGENCE బెల్ట్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దక్షిణ భాగాల్లో పడనుంది కాబట్టి భారీ వర్షాలు విస్తారంగా పడనున్నాయి.

నెల్లూరు, ప్రకాశం, చిత్తూరు, కడప జిల్లాలు చాలా అపమత్తంగా ఉండాలి. ఈ అల్పపీడనం మెల్లగా ఆ అండమాన్ దీవుల దగ్గర ఉన్న భారీ మేఘాలను తీసుకొని మన రాష్ట్రం దక్షిణ భాగాల పై వదలనుంది. నవంబర్ 27 న మెళ్లగా నెల్లూరు జిల్లాలో వర్షాలు మొదలౌతాయి. నవంబర్ 28 నుంచి డిసెంబర్ 2 దాక తీవ్రమైన వర్షాలు నెల్లూరు, చిత్తూరు-తూర్పు, ప్రకాశం, కడప జిల్లాల పై పడనున్నాయి. దీని వల్ల వరద మరింత ఎక్కువౌతుంది. కొన్ని చోట్ల ప్రత్యేకించి నెల్లూరు జిల్లాలో అతితీవ్రమైన వర్షాలు (more than 300 mm rainfall) పడనున్నాయి.
ఈ రోజు మనం మధ్యాహ్నం, సాయంకాల సమయంలో రాయలసీమ జిల్లాల్లో వర్షాలను చూడొచ్చు.

ఈ మధ్య ప్రణాలిక వేసుకొని మరీ వాతావరణ అప్డేట్లు చేయాల్సి వస్తోంది. ఆఫీసులో సాఫ్ట్ వేర్ కంపెనీ ఒత్తిడి ఒక వైపు, మరో వైపు వాతావరణ అప్డేట్లు. కొన్ని సార్లు కష్టమే, ముఖ్యంగా ఇలాంటి విపత్తు సమయంలో.

Gemini Internet

Today Updates నేటి సమచారం

Content:
ఓ ఇంటికి ఎన్ని సంవత్సరాలు అద్దె కడితే.. అది మన సొంతమవుతుంది.! చట్టం ఏం 
చెబుతోంది?

UPSC Recruitment: కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ఇంజనీరింగ్ ఉద్యోగాల భర్తీకి 
దరఖాస్తుల ఆహ్వానం

Andhra Pradesh Jobs: డీసీసీ బ్యాంక్, కడపలో 75 క్లర్క్‌ పోస్టులు.. ఎంపిక 
విధానం ఇలా..

Andhra Pradesh Jobs: ఏపీలో పదోతరగతి అర్హత‌తో 1317 పారామెడికల్‌ పోస్టులు.. 
నెలకు రూ.28 వేల వరకూ వేతనం

Gemini Internet

APVVP-అనంతపురం-అనంతపురం జిల్లాలోని APVVP హాస్పిటల్స్‌లో కాంట్రాక్ట్ మరియు ఔట్-సోర్సింగ్ ప్రాతిపదికన వివిధ పోస్టుల రిక్రూట్‌మెంట్ కోసం నోటిఫికేషన్ Date 29/11/2021  https://speedjobalerts.blogspot.com/p/apvvp-apvvp-date-29112021.html 

 

Property Documents: ఆస్తి పత్రాలు పోగొట్టుకున్నారా.. అయితే ఈ వీడియో మీ కోసమే…!  https://speedjobalerts.blogspot.com/p/property-documents.html

 
కేంద్ర ప్రభుత్వం నుంచి త్వరలో ఉద్యోగులకు శుభవార్త అందనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు, పెన్షన్ మొత్తాన్ని పెంచాలని ప్రభుత్వం యోచిస్తోంది. https://speedjobalerts.blogspot.com/p/blog-page_55.html

NTRUHS - BDS 2021 NEET Last Ranks for the year 2021 http://ntruhs.ap.nic.in/notification/admission/2021/BDS_Last_Ranks_2020_21.pdf | MBBS-BDS-2021 Last Ranks for the year 2020-21 MBBS 2021- NEET Last  Ranks for the year 2020-21 http://ntruhs.ap.nic.in/notification/admission/2021/MBBS_Last_Ranks_2020_21.pdf 


Urgent requirement for MSW candidate with minimum 1 year experience for Hindupur location, Telugu is must
Salary as per company norms
Company Garments industry
Only for female
Contact: Thousif వివరాలను క్షుణ్ణంగా పరిశీలించి తగు నిర్ణయము తీసుకోగలరని అలా కాకుండా డబ్బు కట్టమని ఎవరైనా అడిగితే పట్టించుకోకండి/కట్టకండి
Mob:7013271067

23, నవంబర్ 2021, మంగళవారం

నేటి సమాచారం | Today Updates

NTR ట్రస్ట్ స్కాలర్ షిప్స్ అప్లై చేసుకోవడానికి చివరి తేది డిసెంబరు 8 https://speedjobalerts.blogspot.com/p/ntr-8.html

అనంతపురంలో టూ వీలర్, మోటార్ మెకానిజమ్ తో పాటు స్పోకెన్ ఇంగ్లీషు, కమ్యూనికేషన్ స్కిల్స్, వ్యక్తిత్వ వికారం, ప్రథమ చికిత్స ల పైన నిరుద్యోగులకు శిక్షణ మరిన్ని వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page_23.html

 

అనంతపురంలో ఉచిత సెల్ ఫోన్ రిపేరి ట్రైనింగ్ మరిన్ని వివరాలకు ఈ లింక్ ను క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/blog-page.html

అనంతపురంలో APS RTC Heavy Motor Vehicle Driving School లో ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి https://speedjobalerts.blogspot.com/p/aps-rtc-heavy-motor-vehicle-driving.html


Alert for pensioners: పెన్షనర్లకు అలెర్ట్‌.. ఈ నెలాఖరుకల్లా ఈ సర్టిఫికెట్‌ ఇవ్వకపోతే పెన్షన్‌ రాదు.. https://speedjobalerts.blogspot.com/p/alert-for-pensioners.html

Gemini Internet

DMHO, అనంతపురం రిక్రూట్‌మెంట్ 2021 రేడియోగ్రాఫర్, ఫార్మసిస్ట్ ..– 76 పోస్టులకు చివరి తేదీ 29-11-2021

DMHO, Ananthapuramu Recruitment 2021 Radiographer, Pharmacist ..– 76 Posts Last Date 29-11-2021

Name of Organization Or Company Name : District Medical & Health Officer,Ananthapuram

Total No of vacancies:– 76 Posts

Job Role Or Post Name:Radiographer, Pharmacist...

Educational Qualification: SSC, ITI, D.Pharm, DMLT, Degree (Relevant Disciplines)

Who Can Apply:Andhra Pradesh

Last Date:29-11-2021

Click here for Official Notification


శ్రీ క్రిష్ణ దేవరాయ యూనివర్సిటీ కింద చదువుతూ, 3వ సంవత్సరం 6వ సెమిస్టర్ లో BA., B.Sc., B.Com and BBA లకు ఆగస్టు/సెప్టెంబరు 2021లో జరిగిన పరీక్షలో కేవలం ఒక పేపరులో ఫెయిల్ అయినవారు Instant పరీక్ష వ్రాయడానికి అవకాశం వివరాలకు ఈ లింక్ ను చూడవచ్చు.




 

Gemini Internet

EPFO ఖాతాదారులకు గుడ్ న్యూస్.. ఇక ఉద్యోగం మారినా ఫండ్స్ ట్రాన్స్‌ఫర్ అవసరం లేదు

ఉగ్యోగుల పీఎఫ్ ఖాతాల్లో ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO) కీలక నిర్ణయం తీసుకుంది. తాజా నిర్ణయంతో ఉద్యోగి ఉద్యోగాలు మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు (PF Account Number) అదే కొనసాగుతుంది. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ఉద్యోగుల పీఎఫ్ ఖాతాల్లో (PF Accounts) ఫండ్ బదిలీపై ఈపీఎఫ్ఓ (EPFO)కీలక నిర్ణయం తీసుకుంది. సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ అభివృద్ధి చేసిన కేంద్రీయ వ్యవస్థను ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆమోదించింది. దీంతో ఉద్యోగి ఉద్యోగాలు(Jobs) మారిన తరువాత కూడా పీఎఫ్ ఖాతా నెంబరు అదే కొనసాగుతుంది. ఈపీఎఫ్ నిర్ణయంతో ఉద్యోగులు పీఎఫ్ ఖాతాలో ఫండ్ బదిలీ (PF Funds Transfer) గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నారు. దీంతోపాటు సెంట్రల్ డేటాబేస్ ద్వారా కార్యక్రమాలు సాఫీగా సాగించడం, మెరుగైన సేవలను ఈపీఎఫ్‌ఓ అందించనుంది. ఈ వ్యవస్థ ద్వారా పీఎఫ్ ఖాతాల డూప్లికేషన్ నివారించడం, ఖాతాల విలీనాన్ని సులభతరం చేస్తుంది.

ఈపీఎఫ్ తాజా నిర్ణయం ఏంటి?

సీ-డాక్ ద్వారా అభివృద్ధి చేసిన ఈ కేంద్రీకృత వ్యవస్థను ఈపీఎఫ్‌ఓ ఆమోదించినట్లు సంస్థ ఒక పత్రికా ప్రకటనలో తెలిపింది. ‘‘సెంట్రల్ డేటాబేస్‌ ఆధారంగా ఈ విధానంలో పనులు దశల వారీగా ముందుకు సాగుతాయి. కార్యక్రమాలు సులభతరం చేయడంతోపాటు, మెరుగైన సేవలు పొందవచ్చు. ఒక వ్యక్తి రెండు మూడు పీఎఫ్ ఖాతాలు కలిగి ఉండటం (Duplication), ఉద్యోగం మారినప్పుడు ఖాతాల్లో ఫండ్స్ బదిలీ అవసరాన్ని ఈ నూతన విధానం తొలగిస్తుందని’’రిటైర్‌మెంట్ ఫండ్ బాడీ పత్రికా ప్రకటనలో తెలిపింది.

ప్రావిడెంట్, పెన్షన్ ఫండ్స్ కొత్త వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టే నిర్ణయాలు తీసుకునేలా తన సలహా సంస్థ ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (Finance Investment and Audit Committee)కి అధికారం కల్పించాలని ఈపీఎఫ్ఓ ( Employees Provident Fund Office) నిర్ణయించింది. భారత ప్రభుత్వం గుర్తించిన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేందుకు, కేస్ టు కేస్ ఆధారంగా పెట్టుబడుల పెట్టే విషయంలో నిర్ణయం తీసుకునేందుకు ఫైనాన్స్ ఇన్వెస్ట్‌మెంట్ అండ్ ఆడిట్ కమిటీ (FIAC)కి అధికారం ఇవ్వాలని బోర్డు నిర్ణయించింది

ఈపీఎఫ్ఓ అదనంగా నాలుగు సబ్ కమిటీలను ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఇందులో ఉద్యోగుల బోర్డు సభ్యులు, యజమానుల పక్షాల సభ్యులతోపాటు, ప్రభుత్వ ప్రతినిధులు ఉంటారు. సంస్థలకు సంబంధించిన విషయాలపై కమిటీలు, సామాజిక భద్రతా అమలు కార్మిక,ఉపాధి మంత్రి అధీనంలో ఉంటుంది. డిజిటల్ బిల్డింగ్, పెన్షన్ సంబంధిత సమస్యలను యూనియన్ లేబర్ అండ్ ఎంప్లాయిమెంట్ సెక్రటరీ పర్యవేక్షిస్తారు. ఈపీఎఫ్ఓ (EPFO) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ (Central Board of Trustees) 229వ సమావేశం కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రి భూపేందర్ యాదవ్ అధ్యక్షతన జరిగింది.

EPFO తీసుకున్న ఈ నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. 

ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (C-DAC) ద్వారా కేంద్రీకృత IT-ఎనేబుల్డ్ సిస్టమ్‌ను అభివృద్ధి చేయడానికి ఆమోదించింది. ఈ చర్యతో, ఉద్యోగం మారిన తర్వాత కూడా ఉద్యోగి యొక్క PF ఖాతా సంఖ్య శాశ్వతంగా ఒకటే ఉండే వీలు కలిగింది.  EPFO తీసుకున్న ఈ  నిర్ణయం ద్వారా ఇప్పుడు PF ఖాతాదారులు ఖాతా బదిలీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. EPFO కొత్త నిర్ణయం ప్రకారం, ఒక ఉద్యోగి ఉద్యోగం మారితే లేదా ఒక కంపెనీ నుండి మరొక కంపెనీకి చేరినట్లయితే, అప్పుడు PF ఖాతాను బదిలీ చేయడానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఈ పని ఆటోమేటిగ్గా చేయబడుతుంది. కేంద్రీకృత వ్యవస్థ సహాయంతో, ఉద్యోగి యొక్క ఖాతా విలీనం అవుతుంది. కేంద్రీకృత వ్యవస్థ PF ఖాతాదారుల వివిధ ఖాతాలను విలీనం చేయడం ద్వారా ఒక ఖాతాను సృష్టిస్తుంది.

ఒక ఉద్యోగి ఒక కంపెనీని విడిచిపెట్టి మరొక కంపెనీకి వెళ్లినప్పుడు, అతను PF డబ్బును విత్‌డ్రా చేయడం లేదా మరొక కంపెనీకి బదిలీ చేయాలనేది ప్రస్తుతం నియమంగా ఉంది. ఖాతాను బదిలీ చేసే పనిని ఉద్యోగి స్వయంగా చేయాల్సి ఉంటుంది.

శనివారం జరిగిన ఉద్యోగుల భవిష్య నిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీల బోర్డు సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ఈపీఎఫ్‌ఓ వార్షిక డిపాజిట్లలో 5 శాతం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఇన్వెస్ట్‌మెంట్ ట్రస్ట్ ఇన్‌విట్‌లతో సహా ప్రత్యామ్నాయ పెట్టుబడులలో పెట్టుబడి పెట్టాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ఈపీఎఫ్‌వో సమావేశంలో నిర్ణయించారు.

 

DMHO అనంతపురం జిల్లాలో 129 ప్రభుత్వ ఉద్యోగాలు, చివరి తేది డిసెంబరు 5, 2021

అనంతపురం జిల్లా, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి చెందిన జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయం (DMHO) లో ఒప్పంద/ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖస్తులు కోరుతోంది.

ఉద్యోగాలుః-   

1) లాబ్ టెక్నీషియన్, 2) ఎఫ్ ఎన్ (ఫిమేల్ నర్సింగ్ ఆర్డర్స్లీ) 86, 3) శానిటరీ అంటెండర్ కమ్ వాచ్ మెన్ 30

ఖాళీలుః-        

129 

అర్హతః-         

పోస్టుల్ని అనుసరించి పదవ తరగతి లేదా తత్సమాన / డిప్లొమా (ఎం ఎల్ టి) ఎపి

మెడికల్ కౌన్సిల్ లో రిజిస్టర్ అయి ఉన్నవారు అర్హులు

వయస్సుః-   

పోస్టును అనుసరించి 42 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు ఉంటుంది

వేతనం:-    

పోస్టుని అనుసరించి నెలకు 12,000/- నుండి 50,000/- వరకు

ఎంపిక విధానం:-   

పోస్టుల్ని అనుసరించి అర్హత పరీక్షలో సాధించిన మెరిట్ మార్కులు, గత పని అనుభవం ఇతర వివరాల ఆధారంగా ఎంపిక ప్రక్రియ నిర్వహిస్తారు

దరఖాస్తు ఫీజుః-   

జనరల్ 300/- చెల్లించాలి, SC/ST 200/- చెల్లించాలి.

ప్రారంభ తేదిః-   

నవంబర్ 22, 2021

చివరి తేదిః

డిసెంబర్ 5, 2021

చిరునామాః   

డిఎంహెచ్ఓ, అనంతపురం, ఆంధ్రప్రదేశ్

అదికారిక వెబ్ సైట్ః  | అధికారిక నోటిఫికేషన్ః    | అప్లికేషన్ Click here for Application

Scholarship: కంప్యూట‌ర్ సైన్స్ చ‌దువుతున్నారా..? అయితే ఈ స్కాల‌ర్‌షిప్ మీ కోస‌మే

Gemini Internet

కంప్యూటర్ సైన్స్‌ (Computer Science)లో చ‌దివే మ‌హిళ‌ల‌కు గూగుల్ (Google) స్కాల‌ర్‌షిప్ అందిస్తోంది. ఈ స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు ప్రక్రియ ఆసియా-పసిఫిక్ నుంచి వచ్చిన మహిళల కోసం మాత్ర‌మే ప్రారంభించారు. కాబట్టి భారతీయ విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు (Application) చేసుకోవ‌చ్చు. కంప్యూటర్ సైన్స్‌లో మహిళల (Women) కోసం జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ (Scholarship) టెక్నాలజీలో కంప్యూటర్ సైన్స్ డిగ్రీలను అభ్యసించడానికి విద్యార్థులకు సాయం అందిస్తుంది. ఎంపికైన విద్యార్థులు 2022-2023 విద్యా సంవత్సరానికి $1000 (రూ.74191.35) విలువైన స్కాలర్‌షిప్‌లను అందుకుంటారు. ఈ స్కాల‌ర్‌షిప్ ద్వారా కంప్యూట‌ర్ సైన్స్ చ‌దివే వారిని మ‌రింత ప్రోత్స‌హించాల‌నేది గూగుల్ ల‌క్ష్యం. ఈ స్కాల‌ర్‌షిప్ విద్యార్థి ప‌నితీరు ఆధారంగా ఇస్తారు. ఈ ఇంట‌ర్న్‌షిప్ ప్రోగ్రాంకు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

ఎవ‌రు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు..
జనరేషన్ గూగుల్ స్కాలర్‌షిప్ ప్రోగ్రామ్‌ను పొందేందుకు అర్హతలు
- ద‌ర‌ఖాస్తు చేసుకొనే వారు 2021-2022 విద్యాసంవ‌త్స‌రంలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులో నమోదు అయి ఉండాలి.
- ఆసియా-పసిఫిక్ దేశంలో గుర్తింపు పొందిన విశ్వ‌విద్యాల‌యం విద్యార్థి అయి ఉండాలి.
- అభ్య‌ర్థి కంప్యూటర్ సైన్స్/కంప్యూటర్ ఇంజినీరింగ్ లేదా దగ్గరి సంబంధం ఉన్న సాంకేతిక రంగం విద్య‌న‌భ్య‌సిస్తూ ఉండాలి.
- మంచి అక‌డ‌మిక్ మార్కులు క‌లిగి ఉండాలి.

అవ‌స‌ర‌మైన డాక్యుమెంట్లు..
- ద‌ర‌ఖాస్తు దారు విద్యా సంవ‌త్స‌రంలో టెక్నిక‌ల్‌ ప్రాజెక్ట్‌లను మరియు కమ్యూనిటీ ఎంగేజ్‌మెంట్ కార్యక్రమాలలో అతని నేపుణ్యాన్ని తెలిపేలా రెజ్యూమ్/CVని క‌లిగి ఉండాలి.

- ప్రస్తుత లేదా (ఏదైనా ఉంటే) మునుపటి సంస్థల నుంచి అకడమిక్ ట్రాన్స్క్రిప్ట్స్.

- అభ్యర్థులు రెండు 400 పదాల వ్యాసాలను కూడా సమర్పించాలి. వ్యాసాలు ఆంగ్లంలో రాయాలి.

- ఈ వ్యాసాలు ఈక్విటీ, వైవిధ్యం, చేరిక మరియు ఆర్థిక అవసరాల పట్ల అభ్యర్థి నిబద్ధత, సామ‌ర్థ్యంపై అంచనా వేస్తాయి.

ద‌ర‌ఖాస్తు చేసుకొనే విధానం..

Step 1 - ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.

Step 2 -  ముందుగా https://buildyourfuture.withgoogle.com/scholarships/ లింక్‌లోకి వెళ్లాలి.

Step 3 - అందులో Generation Google Scholarship (Asia Pacific) లింక్‌ను ఎంచుకోవాలి.

Step 4 - ఇన్‌స్ట్ర‌క్ష‌న్‌ల‌ను పూర్తిగా చ‌దివి Apply Now ఆప్ష‌న్ క్లిక్ చేసి ద‌ర‌ఖాస్తుప్రారంభించాలి.

Step 5 - ద‌ర‌ఖాస్తుకు డిసెంబ‌ర్ 10, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

సాంకేతిక విద్య‌లో మ‌హిళ‌ల‌ను ప్రోత్స‌హించ‌డానికి ఈ స్కాల‌ర్‌షిప్ ఉప‌యోగ‌ప‌డుతుంది. విద్యార్థుల ఎంపిక‌లో కంపెనీదే పూర్తి బాద్య‌త‌. స్కాల‌ర్‌షిప్ నేరుగా విద్యార్థి ఖాతాలో ప‌డుతాయి. ఆస‌క్తిగల విద్యార్థినులు ఈ స్కాల‌ర్‌షిప్‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు.

 

AISSEE -2022: సైనిక్ స్కూల్‌లో అడ్మిష‌న్‌కు ద‌ర‌ఖాస్తు చేశారా.. ప‌రీక్ష విధానం గురించి తెలుసుకోండి

AISSEE -2022: దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తులు స్వీక‌రించింది. ఈ నేప‌థ్యంలో జ‌న‌వ‌రి 9, 2022న జ‌ర‌గే ప‌రీక్ష‌కు సంబంధించిన ప‌రీక్ష విధానం మార్కుల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.ఇప్ప‌టికే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ముగిసింది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.


ముఖ్య స‌మాచారం ..

ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in

 అర్హ‌త‌లు..

- ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.


- వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.


ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125
300

తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..

టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150
500

విద్యాప్రమాణాలు మెరుగుప‌డ్డాయి: యూనిసెఫ్‌
ద్యాప్ర‌మాణాలు పాటించ‌డంలో భార‌త్‌ మెరుగ్గా ఉందని యూనేటెడ్ నేష‌న్స్ చిల్డ్ర‌న్ ఫండ్ (United Nations Children's Fund) పేర్కొంది. ప్ర‌పంచ వ్యాప్తంగా 21 దేశాల్లో యూనిసెఫ్ స‌ర్వే నిర్వ‌హించింది. ఈ స‌ర్వేలో ఆస‌క్తి క‌ర విష‌యాలు వెల్ల‌డ‌య్యాయి. భారత్లో 15-24 ఏళ్ల వయోవర్గం లో 73 శాతం మం ది విద్యా నాణ్య త మెరుగుపడిం దని భావిస్తుం డగా, వారిలో 57 శాతం మంది జీవితంలో విజయానికి విద్య కీలకమని పేర్కొన్న‌ట్టు యూనిసెఫ్ (UNICEF) తెలిపింది. సర్వేలో పాల్గొన్న 40 ఏళ్లుపైబడిన మహిళల్లో 78 శాతం, పురుషుల్లో 72 శాతం మంది ఈనాటి బాలలకు వారి తల్లిదం డ్రులకన్నా మెరుగైన విద్య లభిస్తోందని వెల్ల‌డించారు.

ఈ స‌ర్వేలో 21000 మంది పాల్గ‌న్నారు. భార‌త్‌లో విద్యా ప్ర‌మాణాలు పెర‌గ‌డంపై యూనిసెఫ్ హ‌ర్షం వ్య‌క్తం చేసింది. ప్ర‌పంచంలో అత్య‌ధిక యువ జ‌నాభా ఉన్న భార‌త్‌లో ఈ మార్పు ఆహ్వ‌నించ‌ద‌గ్గ‌ద‌ని పేర్కొన్నారు. కోవిడ్ (Covid 19) కార‌ణంగా కొద్ది మంది బాలికలు ఇంటికే ప‌రిమిత‌మ‌య్యారు. తిరిగా మ‌ళ్లీ వారు వారిని పాఠ‌శాల‌కు ర‌ప్పించే ప్ర‌య‌త్నం చేయాల‌ని సూచించింది.

AICTE Scholarship: నవంబర్ 30న ముగియనున్న ఏఐసీటీఈ స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్.. నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోండి.

ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE) విద్యార్థులకు తీపి కబురు అందించింది. ఇటీవలే ఏఐసీటీఈ 2022 సంవత్సరం కొరకు స్కాలర్‌షిప్‌ల రిజిస్ట్రేషన్ ప్రాసెస్‌ను ఇటీవల ప్రారంభించింది. ఇది ప్రస్తుతం వివిధ రకాల స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. అర్హత గల అభ్యర్థులు నవంబర్ 30లోగా స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తు చేసుకోవాలని ఏఐసీటీఈ (AICTE) పేర్కొంది. నేషనల్ స్కాలర్‌షిప్‌ పోర్టల్ (NSP) scholarships.gov.in లో అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.

టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా విద్యార్థినుల (girl students)కు ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా దివ్యాంగ (specially-abled) విద్యార్థులకు ఏఐసీటీఈ సక్షం(Saksham) స్కాలర్‌షిప్... టెక్నికల్ డిగ్రీ, డిప్లొమా కోసం ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ అనే మూడు రకాల స్కాలర్‌షిప్‌లను అఖిల భారత సాంకేతిక విద్యా మండలి ఆఫర్ చేస్తోంది. నాలుగేళ్ల చదువుకు ప్రగతి స్కాలర్‌షిప్‌ పొందాలంటే విద్యార్థినులు టెక్నికల్ డిగ్రీ/ టెక్నికల్ డిప్లమాలో మొదటి లేదా రెండో సంవత్సరం చదువుతుండాలి. అయితే విద్యార్థినులు ఏఐసీటీఈ ఆమోదించిన కాలేజీల్లోనే చదువుతుండాలి. దివ్యాంగ విద్యార్థులు, అర్హత గల ఇతర విద్యార్థులు సైతం పైన పేర్కొన్న విధంగా చదువుతుండాలి.

పైన పేర్కొన్న మూడు రకాల స్కాలర్‌షిప్‌లతో పాటు విద్యార్థులు aicte-india.orgలో AICTE PG స్కాలర్‌షిప్ కోసం కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఏఐసీటీఈ ఆమోదించిన రెగ్యులర్ పోస్ట్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రామ్‌లలో చేరిన గేట్, జీప్యాట్‌, సీడ్ క్వాలిఫైడ్ విద్యార్థులు ఏఐసీటీఈ పీజీ స్కాలర్‌షిప్ కు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంపికైన అభ్యర్థులు 24 నెలలకు లేదా కోర్సు వ్యవధికి నెలకు రూ.2,400 అందుకుంటారు. స్కాలర్‌షిప్ పథకాలకు సంబంధించిన వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం. వీటి రిజిస్ట్రేషన్ నవంబర్ 30న ముగుస్తుందని విద్యార్థులు గమనించాలి.

* ఏఐసీటీఈ ప్రగతి స్కాలర్‌షిప్ (AICTE Pragati Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ సాక్షం స్కాలర్‌షిప్ (AICTE Saksham Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

* ఏఐసీటీఈ స్వాత్ స్కాలర్‌షిప్ (AICTE SWATH Scholarship)

- కోర్స్ పూర్తయ్యేంతవరకు సంవత్సరానికి రూ.50,000 స్కాలర్‌షిప్ అమౌంట్ అందుతుంది.

- వెబ్‌సైట్: Scholarships.gov.in

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇన్‌కమ్ సర్టిఫికెట్ పొందుపరచాల్సి ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులకు డైరెక్టర్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ పద్ధతిలో ప్రతియేటా స్కాలర్‌షిప్‌ చెల్లిస్తారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిగ్రీ విద్యార్థులకు వేయి కంటే ఎక్కువగానే స్కాలర్‌షిప్‌లు కేటాయించింది ఏఐసీటీఈ. ఆసక్తిగల విద్యార్థులు Scholarships.gov.in స్కాలర్‌షిప్‌ గైడ్ లైన్స్ చెక్ చేయగలరు.

Gemini Internet

ఉన్నత చదువులు పూర్తి చేయాలనుకున్న విద్యార్థులు ఏఐసీటీఈ ఆఫర్ చేస్తున్న స్కాలర్‌షిప్‌తో కాలేజ్ ఫీజు కంప్యూటర్, పుస్తకాలు తదితర విద్యా సంబంధిత వస్తువులు కొనుగోలు చేసుకోవచ్చు. కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షల కంటే తక్కువ ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

 

22, నవంబర్ 2021, సోమవారం

Andhra Pradesh Jobs: రూ.53,500 వేతనంతో ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో 896 ఉద్యోగాలు | దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు

APVVP Recruitment 2021 | ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తు ప్రక్రియ (Application Process) కొనసాగుతోంది. ఈ జాబ్ నోటిఫికేషన్ (Job Notification) వివరాలు తెలుసుకోండి.

Gemini Internet

ఆంధ్రప్రదేశ్‌ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో (APVVP Hospitals) రెగ్యులర్ పద్ధతిలో ఖాళీలను భర్తీ చేస్తోంది. మొత్తం 896 పోస్టులు ఉన్నాయి. ప్రభుత్వం మరిన్ని ఖాళీలను భర్తీ చేసే అలోచనలో ఉంది కాబట్టి నియామక ప్రక్రియ ముగిసే నాటికి పోస్టుల సంఖ్య పెరిగే అవకాశం ఉంది. గైనకాలజీ, పీడియాట్రిక్స్, అనస్తీషియా, జనరల్ మెడిసిన్, జనరల్ సర్జరీ, ఆర్థోపెడిక్స్, ప్యాథాలజీ, ఆప్తమాలజీ, రేడియాలజీ, సైకియాట్రి, డెర్మటాలజీ, ఈఎన్‌టీ విభాగాల్లో ఖాళీలను భర్తీ చేస్తోంది. ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ వివరాలు, విద్యార్హతలు, దరఖాస్తు విధానం తెలుసుకోండి.

APVVP Recruitment 2021: ఖాళీల వివరాలు ఇవే...

 మొత్తం ఖాళీలు 896
 గైనకాలజీ 302
 పీడియాట్రిక్స్ 120
 అనస్తీషియా 118
 జనరల్ మెడిసిన్ 61
 జనరల్ సర్జరీ 53
 ఆర్థోపెడిక్స్ 29
 ప్యాథాలజీ 19
 ఆప్తమాలజీ 29
 రేడియాలజీ 21
 సైకియాట్రి 8
 డెర్మటాలజీ 13
 ఈఎన్‌టీ 21
 సీఎఎస్ జనరల్  86
 డీఏఎస్ 16

APVVP Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు

దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21
దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 1 మధ్యాహ్నం 12 గంటలు
వేతనం- రూ.53,500

విద్యార్హతలు- సీఏఎస్ జనరల్ పోస్టులకు ఎంబీబీఎస్ పాస్ కావాలి. సీఏఎస్ స్పెషలిస్ట్ పోస్టులకు సంబంధిత స్పెషాలిటీలో పీజీ డిగ్రీ, డిప్లొమా, డీఎన్‌బీ పాస్ కావాలి. డీఏఎస్ పోస్టులకు బీడీఎస్ పాస్ కావాలి. అభ్యర్థులు తప్పనిసరిగా ఏపీ స్టేట్ మెడికల్ కౌన్సిల్, ఏపీ డెంటల్ కౌన్సిల్‌లో రిజిస్టర్ అయి ఉండాలి.

వయస్సు- 2021 జూలై 1 నాటికి 42 ఏళ్ల లోపు. ఎస్‌సీ, ఎస్‌టీ, బీసీ అభ్యర్థులకు 5 ఏళ్లు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- ఓసీ, బీసీ అభ్యర్థులకు రూ.1,500. ఎస్‌సీ, ఎస్‌టీ అభ్యర్థులకు రూ.1,000.
ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
అప్లై చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

APVVP Recruitment 2021: దరఖాస్తు విధానం

Step 1- అభ్యర్థులు https://dmeaponline.com/ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
For New Applicant Register Here పైన క్లిక్ చేయాలి.
Step 2- యూజర్ నేమ్, పాస్‌వర్డ్, మొబైల్ నెంబర్, ఇమెయిల్ ఐడీ ఎంటర్ చేస్తే మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.
Step 3- ఓటీపీ ఎంటర్ చేసి లాగిన్ కావాలి.
Step 4- లాగిన్ అయిన తర్వాత మొదటి స్టెప్‌లో వ్యక్తిగత వివరాలు, రెండో స్టెప్‌లో స్కూల్ ఎడ్యుకేషన్ వివరాలు ఎంటర్ చేయాలి.
Step 5- మూడో స్టెప్‌లో మెడికల్ ఎడ్యుకేషన్ వివరాలు, నాలుగో స్టెప్‌లో కాంటాక్ట్ డీటెయిల్స్ ఎంటర్ చేయాలి.
Step 6- ఐదో స్టెప్‌లో టెన్త్, డిగ్రీ, పీజీ, డిప్లొమా, డీన్‌బీ సర్టిఫికెట్స్, మార్క్స్ మెమో, మెడికల్ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్స్ అప్‌లోడ్ చేయాలి.
Step 7- చివరగా వివరాలన్నీ సరిచూసుకొని ఫీజు చెల్లించాలి.
Step 8- దరఖాస్తు సబ్మిట్ చేసిన తర్వాత డౌన్‌లోడ్ చేసి భద్రపర్చుకోవాలి.

 

Andhra Pradesh Jobs: ఆంధ్రప్రదేశ్‌లో 1,317 ఉద్యోగాలు. దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

Andhra Pradesh Jobs | ఆంధ్రప్రదేశ్‌లో భారీగా ఉద్యోగాల భర్తీ జరుగుతోంది. మరో 1317 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వరుసగా జాబ్ నోటిఫికేషన్స్ (Job Notification) విడుదల చేస్తూనే ఉంది. తాజాగా ల్యాబ్ టెక్నీషియన్, ఫార్మాసిస్ట్ లాంటి పోస్టుల భర్తీకి ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ జిల్లాల వారీగా వేర్వేరు నోటిఫికేషన్స్ విడుదల చేసింది. ఈ నోటిఫికేషన్ల ద్వారా మొత్తం 1,317 పోస్టుల్ని భర్తీ చేయనుంది ఏపీ ప్రభుత్వం. ల్యాబ్ టెక్నీషియన్ గ్రేడ్ 2, ఫార్మాసిస్ట్ గ్రేడ్ 2, ఫీమేల్ నర్సింగ్ ఆర్డర్లీ, సానిటరీ అటెండర్ లాంటి పోస్టులు ఉన్నాయి. ఔట్ సోర్సింగ్ పద్ధతిలో భర్తీ చేస్తున్న పోస్టులు ఇవి. దరఖాస్తు ప్రక్రియ ముగిసేనాటికి పోస్టుల సంఖ్య పెరగొచ్చు.


ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ వైద్య విధాన పరిశద్‌ ఆస్పత్రుల్లో రెగ్యులర్ పద్ధతిలో 896 పోస్టుల భర్తీకి దరఖాస్తుల్ని స్వీకరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ పోస్టులకు దరఖాస్తు చేయడానికి 2021 డిసెంబర్ 1 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి. ఇక తాజాగా ప్రకటించిన 1,317 పోస్టులకు పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. అప్లై చేయడానికి 2021 డిసెంబర్ 5 చివరి తేదీ. వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. దరఖాస్తు చేసేముందు నోటిఫికేషన్ పూర్తిగా చదివి వివరాలు తెలుసుకోవాలి. ఈ జాబ్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు, విద్యార్హతలు తెలుసుకోండి.

Gemini Internet


దరఖాస్తు ప్రారంభం- 2021 నవంబర్ 21

దరఖాస్తుకు చివరి తేదీ- 2021 డిసెంబర్ 5

విద్యార్హతలు- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.

ఎంపిక విధానం- మెరిట్ ద్వారా ఎంపిక చేస్తారు.

దరఖాస్తు విధానం- అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేయాల్సి ఉంటుంది. జిల్లాల వారీగా నోటిఫికేషన్లు వేర్వేరుగా విడుదలయ్యాయి. అభ్యర్థులు సంబంధిత జిల్లా అధికారిక వెబ్‌సైట్‌లో అప్లికేషన్ ఫామ్ డౌన్‌లోడ్ చేసి, పూర్తి చేసి, నోటిఫికేషన్‌లో వెల్లడించిన అడ్రస్‌కు చివరి తేదీలోగా చేరేలా పంపాలి.

 

 

ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ లో డిగ్రీ ఆ పై అర్హత ఉన్న వారికి ఉద్యోగాలు | The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

The Ananthapuramu District Co Operative Central Bank Ltd 2021-22

Gemini Internet

అసిస్టెంట్ మేనేజర్ మరియు స్టాఫ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు కోసం లింక్ క్రింద ఇవ్వబడింది

The link for application to the post of ASSISTANT MANAGER and STAFF ASSISTANT is given below 

Jobs purely for Local Candidates only

Click here for Application link

Click here to download notification for Staff Assistants

Click here to download notification for Assistant Managers

DCCB బ్యాంకు అనంతపురం జిల్లాలో 86 అసిస్టెంట్ మేనేజర్, క్లర్కు ప్రభుత్వ ఉద్యోగాలు అప్లికేషన్లకు చివరి తేది డిసెంబర్ 03-2021

ఏపీ, అనంతపురం జిల్లాలోని ది అనంతపురం డిస్ట్రిక్ట్ కో అపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ లిమిటెడ్ (ఎడిసిసిబి) లో ఖాళీగా ఉన్న ఉద్యోగాలకు భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరుతోంది. అప్లికేషన్లకోసం సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం.

ఉద్యోగాల పేర్లుః 1) అసిస్టెంట్ మేనేజర్లు 20 | 2) స్టాఫ్ అసిస్టెంట్లు / క్లర్కులు 66 మొత్తం ఖాళీలు 86

విద్యార్హతలుః 

అసిస్టెంట్ మేనేజర్లుః కనీసం 60 శాతం  మార్కులతో గ్రాడ్యుయేషన్, ఎకనమిక్స్ / స్టాటిస్టిక్స్ తత్సమాన సబ్జెక్టుల్లో పీజీ చేసిన వారి ప్రాధాన్యం, అలాగే కంప్యూటర్ లో పరిజ్ఞానం కలిగిఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

క్లర్కు/స్టాఫ్ అసిస్టెంట్ః గ్రాడ్యుయేషన్, ఇంగ్లీషు, తెలుగు భాషలో ప్రావీణ్యం, కంప్యూటర్ లో  ప్రావీణ్యం ఉండాలి. అప్లై చేసే ముందు నోటిఫికేషన్ ఖచ్చితంగా చూడగలరు.

వయస్సుః పోస్టును అనుసరించి 30 ఏళ్ళు మించకుండా ఉండాలి, ప్రభుత్వ నిబంధనల ప్రకారం వయసులో సడలింపు కలదు

వేతనంః పోస్ట్ ని బట్టి నెలకు 35,000/- నుండి 1,20,000/- వరకు 

ఫీజు వివరాలుః జనరల్ కు 590/-, SC/ST లకు 413/-

ఎంపికః ఆన్ లైన్ టెస్ట్, ఇంటర్వ్యూ ఆధారంగా ఎంపిక చేస్తారు

ప్రారంభమైన తేదిః నవంబరు 19

చివరి తేదిః డిసెంబర్ 3

అప్లికేషన్ లింక్ కోసం Click here for Application link

Click here to download notification for Staff Assistants స్టాఫ్ అసిస్టెంట్ నోటిఫికేషన్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Click here to download notification for Assistant Managers అసిస్టెంట్ మేనేజర్ కోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

 

 



Tirupati: శ్రీవారి భక్తులకు గుడ్ న్యూస్ .. టికెట్లు ఉండి ఆ తేదీల్లో దర్శనానికి వెళ్లని భక్తులకు టీటీడీ బంపర్ ఆఫర్..

Tirupati: తిరుమల, తిరుపతిలో గత మూడు రోజుల్లో కురిసిన వర్షాలకు జనజీవనం అస్త్యవ్యస్తమైంది.  శ్రీవారి భక్తులు అనేక ఇబ్బందులకు గురయ్యారు. ఇదే విషయంపై టీటీడీ చైర్మన్ వై వి సుబ్బారెడ్డి స్పందిస్తూ.. తిరుమల, తిరుపతి లో కురిసిన వర్షాలు గత 30 సంవత్సరాల్లో ఎప్పుడూ కురవలేదని తెలిపారు. ఈ భారీ వర్షాలకు శేషాచలం కొండల్లోని డ్యాములు, చెక్ డ్యామ్ లు పొంగి పొర్లి కపిల తీర్థం జలపాతం గుండా తిరుపతి నగరంలోని పలు ప్రాంతాలను ముంపునకు గురి చేశాయన్నారు. ఈ వర్షాల వలన తిరుమల లో రూ 4 కోట్లకు పైగా ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు.

మొదటి ఘాట్ రోడ్ లోని అక్కగార్ల గుడి వద్ద రక్షణ గోడ దెబ్బతిని, ఘాట్ రోడ్ లో నాలుగు ప్రాంతాల్లో కొండ చరియలు విరిగిపడ్డాయన్నారు. టిటిడి సిబ్బంది, అధికారులు యుద్ధ ప్రాతిపదికన రంగంలోకి దిగి వీటిని తొలిగించి తాత్కాలిక రక్షణ ఏర్పాట్లతో ట్రాఫిక్ ను పునరుద్ధరించారని సుబ్బారెడ్డి చెప్పారు. అంతేకాదు రెండవ ఘాట్ రోడ్లో 13 ప్రాంతాల్లో కొండచరియలు విరిగి పడ్డాయి. ఐదు చోట్ల రక్షణ గోడలు దెబ్బతిన్నాయన్నారు.  ఈ ఘాట్ రోడ్డులో కూడా టీటీడీ సిబ్బంది కొండ చరియలను తొలగించి ట్రాఫిక్ ను పునరుద్ధరించారని చెప్పారు. తిరుమల నారాయణగిరి గెస్ట్ హౌస్ ను ఆనుకొని ఉన్న రక్షణ గోడ పడిపోవడంతో మూడు గదులు దెబ్బతిన్నాయన్నారు.తిరుపతిలోని టీటీడీ పరిపాలన భవనం వెనుక వైపు ఉన్న గోడ తో పాటు, రాంనగర్, వినాయక నగర్, జి ఎంబి క్వార్టర్స్,  శ్రీనివాసం విశ్రాంతి గృహం కాంపౌండ్ వాల్స్ దెబ్బ తిన్నట్లు ఆయన తెలిపారు. అధికారులు నారాయణ గిరి, ఎస్వీ అతిథి గృహాల్లోని యాత్రికులను ముందు జాగ్రత్త గా ఇతర ప్రాంతాలకు తరలించారని చైర్మన్ వివరించారు.

శ్రీవారి మెట్టు మార్గంలో కొంతమేరకు రోడ్డు, కొంతమేరకు ఫుట్ పాత్ భారీ వర్షాలకు దెబ్బతిన్నాయన్నారు. కపిలతీర్థం ఆలయంలో ఒక మండపం వర్షాలకు దెబ్బతిందని, దీని మరమ్మతులకు 70 లక్షల రూపాయలు ఖర్చు కావచ్చని అధికారులు అంచనా వేశారన్నారు.

వర్షం వల్ల టీటీడీ సర్వర్లు దెబ్బతిని సేవలకు అంతరాయం కలిగిందన్నారు. ఐటి విభాగం అధికారులు, సిబ్బంది వెంటనే పునరుద్ధరించి భక్తుల సేవలకు ఇబ్బంది లేకుండా చేశారని ఆయన చెప్పారు.  స్వామివారి దర్శనం కోసం వచ్చి భారీ వర్షాల కారణంగా తిరుపతిలో ఆగిపోయిన భక్తులకు శ్రీనివాసం, మాధవం, రెండు మరియు మూడో సత్రాల్లో వసతి, ఆహారం ఏర్పాటు చేశామన్నారు.

టికెట్లు ఉండి దర్శనానికి రాలేక పోయిన భక్తులను వర్షాలు తగ్గాక స్వామివారి దర్శనానికి అనుమతించాలని నిర్ణయం తీసుకున్నామని  సుబ్బారెడ్డి చెప్పారు. తిరుమల తిరుపతిలో దెబ్బతిన్న రోడ్లు, ఇతర మరమ్మతులు యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి యాత్రికులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని టీటీడీ చైర్మన్ సుబ్బారెడ్డి తెలిపారు.

 

Gemini Internet

మాజీ సైనికుల పిల్లలకు స్కాలర్ షిప్స్ | Scholarships for Ex Army Children -2021-22

పత్రికా ముఖంగా ప్రకటన

కేంద్రీయ సైనిక బోర్డు వారు 2021-22 విద్యా సంవత్సరంలో ప్రొఫెషనల్ డిగ్రీ కోర్సులు, ఉన్నత విద్యా కోర్సులు మొదటి ఏడాది చదువుతున్న మాజీ సైనికుల పిల్లలు ప్రధాన మంత్రి ఉపకార వేతన పథకానికి దరఖాస్తు గడువును డిసెంబరు 31వ తేదీ వరకు పొడిగించామని జిల్లా సైనిక సంక్షేమాధికారి వి.భక్తవత్సలరెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. దరఖాస్తులను www.ksb.in వెబ్ సైట్లో పొందుపచరాలన్నారు.

Gemini Internet


 

RFCL- 2021-22 నోటిఫికేషన్… దరఖాస్తు చేసుకోండి Last Date 24 నవంబర్ 2021

RFCL ఉద్యోగ నోటిఫికేషన్:: NFL,FCIL,EIL… జాయింట్ వెంచర్ అయిన రామగుండం ఫర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ లిమిటెడ్ వివిధ నాన్ ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం 2021లో నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి మరియు అర్హత ఉన్న విద్యార్థులు ఈ పోస్టులకు 24 నవంబర్ 2021 వరకు లేదా అంతకు లోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

నోటిఫికేషన్లో పేర్కొన్న ప్రకారం రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ మ్యాథ్స్ ఫిజిక్స్ కెమిస్ట్రీ సబ్జెక్టులతో పాస్ కావాలి, ఈ అర్హత గల విద్యార్థులు ఈ నోటిఫికేషన్ కి అప్లై చేసుకోవచ్చు.

ఖాళీల వివరాలు ఈ క్రింది విధంగా ఉన్నాయి

కెమికల్ ల్యాబ్ -1

జూనియర్ ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్-08

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ప్రొడక్షన్ 8

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ మెకానికల్ 4

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేడ్ ఎలక్ట్రానిక్ 2

Godan కీపర్ 1

స్టోర్ అసిస్టెంట్ 1

అసిస్టెంట్ గ్రేడ్-3

అసిస్టెంట్ గ్రేడ్-3 – రవాణా 3

అర్హతలు

జూనియర్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (కెమికల్ ల్యాబ్)/జనరల్ ఓ బి సి/ews విద్యార్థులకు మొత్తంగా కనీసం 50 శాతం మార్కులతో కెమిస్ట్రీ తో రెగ్యులర్ గా మూడు సంవత్సరాల బీఎస్సీ, ఎస్సీ ఎస్టీలకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి.

జూనియర్ అసిస్టెంట్ ఇంజనీరింగ్ గ్రేడ్ 2 (ప్రొడక్షన్)-రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ (ఫిజిక్స్ కెమిస్ట్రీ మ్యాథ్స్) obc వారికి 50 శాతం మార్కులు, ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు వచ్చి ఉండాలి

 

కెమికల్ ఇంజనీరింగ్ లో రెగ్యులర్ 

మూడు సంవత్సరాల డిప్లమా

ఇంజనీరింగ్ అసిస్టెంట్ గ్రేట్ 2

రెగ్యులర్ మూడు సంవత్సరాల బీఎస్సీ ఫిజిక్స్ కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ లతో జనరల్ ఓబీసీ అభ్యర్థులకు 50 శాతం మార్కులు, మెకానికల్ ఇంజనీరింగ్ లో మూడు సంవత్సరాల డిప్లమా

మరియు రిజర్వ్ చేయబడినది స్థానాలకు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 45 శాతం మార్కులు ఉండాలి.

ఆసక్తిగల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి https://www.nationalfertilizers.com/ అనే వెబ్ సైట్ ని సందర్శించి అప్లై చేసుకోవచ్చు.

 

Gemini Internet