Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

3, మార్చి 2021, బుధవారం

📚✍జేఈఈ మెయిన్ కీ* *విడుదల✍📚*

*
*🌻న్యూఢిల్లీ :* జేఈఈ మెయిన్ 2021 ఫిబ్రవరి సెషన్ కు సంబంధించిన పేపర్ 1, 2 ఆన్సర్ కీని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) మంగళవారం విడుదల చేసింది. ఫిబ్రవరి సెషన్ పరీక్షకు హాజరైన విద్యార్థులు https://jee main.nta.nic.in/ వెబ్ సైట్ లో చూసుకోవచ్చు. ఆన్సర్ కీలో ఎలాంటి సందేహాలు ఉన్నా ఛాలెంజ్ చేయడానికి ఎన్టీఏ అవకాశం కల్పించింది. దీని కోసం ఒక్క ప్రశ్నకు రూ.200 రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఇది నాన్ రిఫండెబుల్ అమౌంట్. ఈ అవకాశం మార్చి 1, 2021 నుంచి మార్చి 3, 2021 (సాయంత్రం 5) వరకు అందుబాటులో ఉంటుంది. తొలి సెషన్ పేపర్ 1కు 6,20,153 మంది, పేపర్ 2 పరీక్షకు 51,229 మంది హాజరయ్యారు. ఇక పేపర్ 1 రెండో విడత పరీక్షలు మార్చి 15, 16, 17, 18వ తేదీల్లో జరగనున్నాయి.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍మార్చి జేఈఈ మెయిన్‌ దరఖాస్తు గడువు 6✍📚*



🌻దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు నిర్వహించే రెండో విడత జేఈఈ మెయిన్‌ ఆన్‌లైన్‌ పరీక్షలకు హాజరయ్యేందుకు శనివారం(ఈ నెల 6వ తేదీ) వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ మేరకు జాతీయ పరీక్షల మండలి(ఎన్టీయే) నోటిఫికేషన్‌ జారీ చేసింది. ఇప్పటికే అన్ని విడతలకు దరఖాస్తు చేసినా... మిగిలిన విడతల్లో పరీక్షలు రాసేది లేదనుకుంటే 6వ తేదీలోగా దరఖాస్తును విరమించుకోవచ్చు. పరిమిత సమయమే ఉన్నందున దరఖాస్తుల్లో సవరణకు అవకాశం ఉండదని, పొరపాట్లు లేకుండా జాగ్రత్తగా వివరాలు పొందుపరచాలని ఎన్టీయే సూచించింది. బీఆర్క్‌, బీప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశాలకు పేపర్‌-2 పరీక్ష మార్చి, ఏప్రిల్‌లో జరగదు. వారికి మరోసారి మే నెలలో మాత్రమే పరీక్ష నిర్వహిస్తారు. ఫిబ్రవరిలో జరిగిన మొదటి విడత పరీక్షలకు సంబంధించి ప్రాథమిక కీ ని ఎన్టీయే వెబ్‌సైట్లో ఉంచింది. అభ్యంతరాలు ఉంటే బుధవారం సాయంత్రం 5 గంటల వరకు ఛాలెంజ్‌ చేయవచ్చు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

*📚✍ఆయుర్వేద, హోమియో డిగ్రీ ప్రవేశాలకు ఆహ్వానం✍📚*



*🌻ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం, న్యూస్‌టుడే:* ఈ విద్యా సంవత్సరానికి రాష్ట్రంలోని ఆయుర్వేద, హోమియో వైద్య కళాశాలల్లో అందుబాటులో ఉన్న బీఏఎంఎస్‌, బీహెచ్‌ఎంఎస్‌ డిగ్రీ కోర్సుల్లో యాజమాన్య, ప్రైవేటు, అన్‌ఎయిడెడ్‌, నాన్‌ మైనారిటీ కేటగిరీ సీట్ల ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఎన్టీఆర్‌ ఆరోగ్య విశ్వవిద్యాలయం ప్రకటించింది. అర్హత కలిగిన అభ్యర్థులు బుధవారం ఉదయం 9 గంటల నుంచి 10వ తేదీ ఉదయం 5 గంటల్లోగా దరఖాస్తులను డౌన్‌లోడ్‌ చేసుకుని ఆప్షన్లను నమోదు చేయాల్సి ఉంటుంది. ఏయే కళాశాలల్లో ఎన్నెన్ని సీట్లు అందుబాటులో ఉన్నాయో విశ్వవిద్యాలయ వెబ్‌సైట్‌లో పొందుపర్చామని రిజిస్ట్రార్‌ శంకర్‌ తెలిపారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

📚✍జులై 12 నుంచి* *ఎంసెట్‌✍📚

**

*♦బైపీసీ స్ట్రీమ్‌ 19, 20 తేదీల్లో ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు కన్వీనర్ల నియామకం*

*🌻ఈనాడు, అమరావతి:* ఏపీ ఎంసెట్‌ జులై 12 నుంచి ప్రారంభం కానుంది. రాష్ట్రంలో ఉమ్మడి ప్రవేశ పరీక్షల కన్వీనర్లు, పరీక్షల తేదీలను ఉన్నత విద్యా మండలి ఖరారు చేసింది. ఎంసెట్‌ నిర్వహణ బాధ్యతలను జేఎన్‌టీయూ కాకినాడకు అప్పగించారు. జులై 12 నుంచి 15 వరకు ఇంజినీరింగ్‌ పరీక్షను నిర్వహిస్తారు. నాలుగు రోజులపాటు 8 విడతలుగా పరీక్ష ఉంటుంది. బైపీసీ స్ట్రీమ్‌ విద్యార్థులకు 19, 20వ తేదీల్లో 2 రోజులపాటు నాలుగు విడతలుగా పరీక్ష నిర్వహిస్తారు. దీని తర్వాత ఈసెట్‌ నిర్వహించనున్నారు. పాలిటెక్నిక్‌ పరీక్షల తేదీలు ఖరారు కానందున ఈ తేదీలపై ఇంకా స్పష్టత రాలేదు. చివరి సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూలును పంపించాలని సాంకేతిక విద్యాశాఖను ఉన్నత విద్యామండలి కోరింది.

*♦మిగతా పరీక్షల్లో కొంత జాప్యం*
ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆలస్యంగా ప్రారంభమైనందున ఆగస్టు 6 వరకు డిగ్రీ విద్యార్థులకు తరగతులను నిర్వహించనున్నారు. అనంతరం సెమిస్టర్‌ పరీక్షలుంటాయి. ఈ నేపథ్యంలో డిగ్రీ పరీక్షల షెడ్యూలును అనుసరించి ఆగస్టు చివరి వారంలో లేదా సెప్టెంబరు మొదటి వారం నుంచి ఐసెట్‌, లాసెట్‌, ఎడ్‌సెట్‌, పీజీఈసెట్‌ లాంటివి నిర్వహించనున్నారు. డిగ్రీ పరీక్షల ఫలితాల అనంతరం కౌన్సెలింగ్‌ చేపట్టనున్నారు. ఆగస్టులో సెమిస్టర్‌ పరీక్షలు పూర్తయినా ఫలితాలు వచ్చేందుకు నెల వరకు సమయం పట్టే అవకాశం ఉంది. దీంతో అక్టోబరులో కౌన్సెలింగ్‌ నిర్వహించాలని భావిస్తున్నారు.

*♦ఆంధ్ర వర్సిటీకి మూడు సెట్‌ల బాధ్యతలు*
ఎంసెట్‌ కన్వీనర్‌గా జేఎన్‌టీయూ కాకినాడ ప్రొఫెసర్‌ రవీంద్రను రెండోసారి నియమించారు. మొత్తం ఏడు ఉమ్మడి ప్రవేశ పరీక్షలు ఉండగా, 3 ప్రవేశ పరీక్షల బాధ్యతలను ఆంధ్ర వర్సిటీకి అప్పగించారు. విశ్వవిద్యాలయాల ఉపకులపతులు ఉమ్మడి ప్రవేశ పరీక్షకు ఛైర్మన్లుగా వ్యవహరించనున్నారు.

🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇🌇

Software Engineer for freshers at United Health Group

 

Jobs Images  
Software Engineer
Qualifications:
  • Undergraduate degree or equivalent experience
  • Knowledge in algorithms, principles and techniques to solve technical problems
  • Ability to write time and space efficient code in languages like Java, J2EE, .NET, VC++
  • Ability to solve and develop complex problems
Location: Hyderabad

For more details, please visit: careers.unitedhealthgroup.com/job/12365495/software-engineer-hyderabad-tg-hyderabad-in/

Freshers jobs at Tata Communication

The Tata Communication invites application for the following posts.

Jobs Images 

1. Customer Service Executive (Service Assurance)
Qualification:
Engineering Graduate (CCNA/CCNP certification preferred).
Experience: 0 - 4 years
Location: Pune

2. Engineer (Platform Planning & Design)
Qualification:
Engineering Graduate.
Experience: 0 - 4 years
Location: Chennai

For more details, please visit: jobs.tatacommunications.com/

Freshers jobs at MassMutual

The MassMutual invites application for the following posts
Analyst, Quality Assurance
Qualification:
  • BE/ B.Tech. (CSE/ IT Discipline only)/ MCA.
  • 2020 graduates students with 65% throughout the academics with no back logs only need to apply.
Skills:
Technical and Soft Skills: Very good in at least 1 computer language. Examples – JAVA etc.
  • Must have done at least one POC or Project as part of the curriculum or Internship
  • Should have good knowledge of Software Development Life Cycle
  • Should be able to provide good logical algorithm to any problem statement
  • Good communication skills
  • Very good problem solving and decision-making skills
  • Excellent relationship building skills and good team player
  • Proactive and quick learner
  • Knowledge on any programming language (C, Java, Python)
  • Knowledge on Software Development Life Cycle and Database concepts
  • Should be trained in Testing Tools
Selection Process:
  • 1st round: Technical Interview
  • 2nd round: Managerial Interview
  • 3rd round: HR Interview
How to Apply: Candidates can apply online only.

Last Date: March 04, 2021

For more details, please visit: https://www.task.telangana.gov.in/Placements/MassMutual

Ananthapuramu District Classifieds

 






Ananthapuramu District Local Jobs

కొత్తగా ప్రారంభించిన మా కంపెనీ నందు పనిచేయుటకు 39 మంది యువతీ యువకులు కావలెను

పని ప్రదేశంః సింధు ప్రమోషన్స్, విశాల్ మార్ట్ ఎదురుగా, నంద్యాల రోడ్, తాడిపత్రి

విద్యార్హతః 10, ఇంటర్, డిగ్రీ, ఐటిఐ, డిప్లొమో (పాస్ లేదా ఫెయిల్)

జీతంః 10000+6000 డి ఎ+బోనస్, రూమ్ ఫ్రీ

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 8074816824

---------------------------------------------------------------------------------------------------------------------

సేల్స్ ఎగ్జిక్యూటివ్స్ కావలెను

పని ప్రదేశంః  కదిరి

విద్యార్హతః ఏదైనా డిగ్రీ

జీతంః నెలకి 10000 నుండి 15000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7022103299

---------------------------------------------------------------------------------------------------------------------

కేర్ టేకర్స్, ఆయాలు, వార్డ్ బాయ్స్, RMP డాక్టర్స్ ANM, GNM ట్రైనర్స్, GDA ట్రైనింగ్, MPHW, వంట మనుషులు అర్జెంట్ గా కావలెను

పని ప్రదేశంః హైదరాబాద్

విద్యార్హతః 5వ తరగతి నుండి ఏదైనా డిగ్రీ, ANM, GNM, RMP డాక్టర్స్

జీతంః నెలకి 10000 నుండి 25000 వరకు అలాగే ఫ్రీ రూమ్ అండ్ ఫుడ్

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 7993583999

---------------------------------------------------------------------------------------------------------------------

టెక్నీషియన్ కావలెను

పని ప్రదేశంః గుత్తి, యాడికి, తాడిపత్రి

విద్యార్హతః ఇంటర్ ఆపైన

జీతంః నెలకి 6000 నుండి 10000 వరకు

సంప్రదించాల్సిన ఫోన్ నెంబరుః 9985062055

---------------------------------------------------------------------------------------------------------------------

 

 

 

 

*పెద్దశేష వాహనంపై వైకుంఠ నారాయ‌ణుడి అలంకారంలో శ్రీ‌నివాసుడు*

      ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు మంగళవారం రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనంపై శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారు వైకుంఠ నారాయణుడి అలంకారంలో దర్శనమిచ్చారు. కోవిడ్ -19 నేప‌థ్యంలో వాహనసేవ ఆల‌యంలో ఏకాంతంగా జరిగింది..

■ ఏడుపడగలు గల ఆదిశేషుడు ఏడుకొండలకు, ఏడు లోకాలకు సంకేతం. శేషుడు శ్రీనివాసునికి తిరుమలలో నివాసభూమి అయినా శ్రీనివాసమంగాపురంలో వాహనరూపంలో శ్రీవారిని స్తుతిస్తూ, స్వామికి మంచం, పరుపు, ఛత్రం మూడూ తానే అయి శేషశాయి అనే పేరును సార్థకం చేస్తున్నారు. శ్రీవారి విశ్రాంతికీ, సుఖనిద్రకూ కారణమవుతున్నాడు.

👉ఈ కార్యక్రమంలో ఆలయ డెప్యూటీ ఈవో శ్రీమతి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

*ఏకాంతంగా శ్రీ కపిలేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలు*

        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి :  శ్రీ కపిలేశ్వరస్వామివారి ఆలయంలో మార్చి 4 నుండి 13వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నున్న వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ -19 నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హించ‌నున్నారు.
🟢 మర్చి 3వ తేదీ సాయంత్రం 4.30 నుండి 6.30 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి.

🕉 *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*

తేదీ       ఉదయం     సాయంత్రం

■04-03-2021(గురువారం)
 ధ్వజారోహణం(మీన‌లగ్నం) హంస వాహనం
■ 05-03-2021(శుక్ర‌‌వారం)
 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 06-03-2021(శ‌నివారం)
 భూత వాహనం సింహ వాహనం
■ 07-03-2021(ఆది‌వారం)
 మకర వాహనం శేష వాహనం
■ 08-03-2021(సోమ‌‌వారం)
 తిరుచ్చి ఉత్సవం అధికారనంది వాహనం
■ 09-03-2021(మంగ‌ళ‌వారం)
 వ్యాఘ్ర వాహనం గజ వాహనం
■ 10-03-2021(బుధ‌వారం)
 కల్పవృక్ష వాహనం అశ్వవాహనం
■ 11-03-2021(గురు‌వారం)
 రథోత్సవం(భోగితేరు) నందివాహనం
■ 12-03-2021(శుక్ర‌వారం)
 పురుషామృగవాహనం కల్యాణోత్సవం, తిరుచ్చి ఉత్సవం
■ 13-03-2021(శ‌నివారం)
 శ్రీనటరాజస్వామివారి రావణాసుర వాహనం,

🕉  సూర్యప్రభ వాహనం, త్రిశుల స్నానం. ధ్వజావరోహణం.

👉ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 9 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్ల‌కు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు.
 *Dept.Of PRO TTD.*

*మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు టిటిడిలో వ‌స్త్రాల ఈ -వేలం*

      ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : తిరుమల శ్రీవారి ఆలయంతోపాటు ఇతర అనుబంధ ఆలయాలకు భక్తులు కానుకగా సమర్పించిన 187 లాట్ల వ‌స్త్రాల‌‌ను మార్చి 4 నుండి 8వ తేదీ వ‌ర‌కు రాష్ట్ర ప్ర‌భుత్వ కొనుగోలు పోర్ట‌ల్ ద్వారా ఈ-వేలం వేయనున్నారు. ఇందులో కొత్త‌వి, వినియోగించిన వ‌స్త్రాలున్నాయి.

◆ ఇతర వివరాలకు తిరుపతిలోని టిటిడి మార్కెటింగ్‌ కార్యాలయాన్ని 0877-2264429 నంబ‌రును కార్యాలయం వేళల్లో గానీ, రాష్ట్ర ప్ర‌భుత్వ పోర్ట‌ల్  www.konugolu.ap.gov.in / www.tirumala.org ను గానీ సంప్రదించగలరు.
 *Dept.Of PRO TTD.*

*మార్చి 14న తిరుమలలో అనంతాళ్వారు 967వ అవతారోత్సవం*

       ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీవైష్ణవ భక్తుడు, ఆళ్వారులలో ప్రముఖుడైన శ్రీ అనంతాళ్వారు 967వ అవతారోత్సవాన్ని మార్చి 14వ తేదీన తిరుమలలోని శ్రీవారి ఆలయానికి నైరుతి దిశగా ఉన్న పురుశైవారి తోటలో టిటిడి ఘనంగా నిర్వహించనుంది. ఈ సందర్భంగా ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో అనంతాళ్వార్‌ బోధనలు, రచనలపై సదస్సు నిర్వహిస్తారు. 16 మంది పండితులు పాల్గొని ఉప‌న్య‌సించ‌నున్నారు.

◆ సాధారణంగా అనంతళ్వారు జననం చైత్రమాసంలో తమిళనాడులో సంభవించినా తిరుమలలో ఆయన కాలుమోపిన దినాన్ని అవతారోత్సవంగా వారి వంశీకులు పరిగణిస్తున్నారు.

👉ఈ సంద‌ర్భంగా దేశవ్యాప్తంగా స్థిరపడిన‌ అనంతాళ్వారు వంశీయులు తిరుమలలోని పురశైవారి తోటలో (అనంతాళ్వారు తోట) కలసి ప్రత్యేక పూజలు, దివ్యప్రబంధ పాశుర పారాయణం, ఆధ్యాత్మిక ప్రవచన‌ కార్యక్రమాలు నిర్వహిస్తారు.

◆ పురాణాల ప్ర‌కారం శ్రీ అనంతాళ్వారు సాక్షాత్తు ఆదిశేషుని రూపంగా మరో శ్రీవైష్ణవ భక్తాగ్రేశ్వరుడు శ్రీరామానుజాచార్యులతో కలిసి అవిర్భవించినట్లు తెలుస్తోంది. అంతేకాకుండా రామానుజాచార్యుని అభిమతానుసారమే శిష్యుడైన అనంతాళ్వారు తిరుమలకు వేంచేసి స్వామివారి పుష్ప కైంకర్యానికి శ్రీకారం చుట్టినట్లు పురాణ‌ కథనాలు ఉన్నాయి. అందులో భాగంగానే ఒకనాడు అనంతాళ్వారు నిండు గర్భిణియైన తన భార్యతో కలిసి స్వామివారి ఆలయం చెంత ఒక పూలతోటను ఏర్పాటు చేస్తుండగా బాలుని రూపంలో సాక్షాత్తు వేంకటేశ్వరస్వామి ప్రత్యక్షమయ్యాడు. తాను కాదన్నా తన భార్యకు పనులలో చేదోడువాదోడుగా ఉద్యానవన నిర్మాణంలో సహకరించాడన్న కోపంతో అనంతాళ్వారు ఆ బాలునిపై తన చేతిలో ఉన్న గునపాన్ని విసిరాడు. మరునాడు స్వామివారి మూలవిరాట్టు చుబుకం నుండి రక్తస్రావం చూసి తాను చేసిన పొరపాటుకు పశ్చాత్తాపం చెందాడు. వెంటనే స్వామివారి గాయానికి కర్పూరపు ముద్దను అంటించి తన అపారభక్తిని చాటుకున్నాడు. తద్వారా శ్రీవేంకటేశ్వరస్వామివారి కృపకు పాత్రుడయ్యాడు.

■ నేటికీ స్వామివారి చుబుకానికి కర్పూరాన్ని అంటించడం అనంతాళ్వారు దివ్యగాథను స్ఫురింపచేస్తుంది. అదే విధంగా నేటికీ మహాద్వారం చెంత అనంతాళ్వారు స్వామివారిపై విసిరిన గునపం కూడా భక్తులకు దర్శనమిస్తోంది.

◆ టిటిడి హెచ్‌డిపిపి కార్య‌ద‌ర్శి మ‌రియు ఆళ్వార్ దివ్య‌ప్ర‌బంధ ప్రాజెక్టు ప్ర‌త్యేకాధికారి ఆచార్య రాజ‌గోపాల‌న్ ఆధ్వ‌ర్యంలో ఈ అవ‌తారోత్స‌వాల‌కు ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.
 *Dept.Of PRO TTD.*

*ధ్వజారోహణంతో శ్రీ‌ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం*

       ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో మంగ‌ళ‌వారం వార్షిక బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయి. వేదపండితుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల నడుమ ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన‌లగ్నంలో శాస్త్రోక్తంగా ధ్వజారోహణం జరిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో ఈ కార్య‌క్ర‌మాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

◆ ముందుగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి, అనంత‌, గ‌రుడ‌, విష్వక్సేనుల వారిని, గ‌రుడ ప‌టాన్ని ఆల‌య ప్రాంగ‌ణంలో ఊరేగింపుగా ధ్వ‌జ‌స్తంభం వ‌ద్ద‌కు తీసుకొచ్చారు.
●  వేద మంత్రాల న‌డుమ ధ్వ‌జ‌స్తంభానికి పూజ‌లు చేశారు. అనంత‌రం మీన‌ లగ్నంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి సమక్షంలో ధ్వజారోహణం నిర్వహించారు. 18 గణాలను, ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తూ శాస్త్రోక్తంగా ఈ కార్యక్రమం నిర్వహించారు.
శ్రీ బాలాజి రంగాచార్యులు కంకణబట్టార్‌గా వ్య‌వ‌హ‌రించారు.

కోవిడ్ నేప‌థ్యంలో ఏకాంతంగా బ్రహ్మోత్సవాలు : టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి

◆ శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి బ్ర‌హ్మోత్స‌వాల‌ను కోవిడ్ నేప‌థ్యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తున్నామ‌ని టిటిడి ఈవో డాక్ట‌ర్ కెఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి తెలిపారు. ధ్వ‌జారోహ‌ణం సంద‌ర్భంగా ఈవో మాట్లాడుతూ ఈ ఆల‌యం చాలా చ‌రిత్ర గ‌ల‌ద‌ని, విజ‌య‌న‌గ‌ర‌రాజులు, అన్న‌మాచార్య వంశీకులు ఈ ఆల‌యాభివృద్ధికి ఎంతో స‌హ‌కారం అందించార‌ని శాస‌నాల ద్వారా తెలుస్తోంద‌న్నారు. ధ్వ‌జారోహ‌ణంతో బ్ర‌హ్మోత్స‌వాలు ప్రారంభ‌మ‌య్యాయ‌ని, మార్చి 6న గ‌రుడ‌సేవ జ‌రుగ‌నుంద‌ని, మార్చి 10న ధ్వ‌జావ‌రోహ‌ణంతో ఈ ఉత్స‌వాలు ముగుస్తాయ‌ని తెలిపారు. లోక‌క‌ల్యాణం కోసం నిర్వ‌హిస్తున్న ఈ ఉత్స‌వాల‌తో అంద‌రికీ మంచి జ‌ర‌గాల‌ని ఆకాంక్షించారు.

🕉 *భ‌క్తుల కోసం తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూలు*

ఈ బ్ర‌హ్మోత్స‌వాల సంద‌ర్భంగా 9 రోజుల పాటు తిరుమ‌ల శ్రీ‌వారి ల‌డ్డూల‌ను ఆల‌యంలో భ‌క్తుల‌కు అందుబాటులో ఉంచారు. రోజుకు 3 వేల చొప్పున ల‌డ్డూలను భ‌క్తుల‌కు విక్ర‌యిస్తారు.

👉 ఈ కార్యక్రమంలో టిటిడి జెఈవో శ్రీ‌మ‌తి స‌దా భార్గవి, ఎస్ఇ శ్రీ జ‌గ‌దీశ్వ‌ర్‌రెడ్డి, డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విఎస్‌వో శ్రీ మ‌నోహ‌ర్‌, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూపరింటెండెంట్లు శ్రీ ర‌మ‌ణ‌య్య‌, శ్రీ చెంగ‌ల్రాయులు, ఎవిఎస్వో శ్రీ సురేంద్ర‌, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు, ఆలయ అర్చకులు, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

*శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వ‌ర‌స్వామి వారి బ్రహ్మోత్సవాలకు శాస్త్రోక్తంగా అంకురార్పణ*

       ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుపతి : శ్రీ‌నివాస‌మంగాపురంలోని శ్రీ క‌ల్యాణ వేంక‌టేశ్వర‌‌స్వామివారి ఆల‌యంలో వార్షిక బ్ర‌హ్మోత్స‌వాల‌కు సోమ‌వారం రాత్రి శాస్త్రోక్తంగా అంకురార్పణం జ‌రిగింది. కోవిడ్ -19 నేప‌థ్యంలో మార్చి 2 నుండి 10వ తేదీ వ‌ర‌కు ఈ బ్ర‌హ్మోత్స‌వాలను ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.

◆ ఇందులో భాగంగా సోమ‌వారం సాయంత్రం 6 నుండి రాత్రి 8 గంటల వరకు పుణ్యాహ‌వ‌చ‌నం, మృత్సంగ్ర‌హ‌ణం, సేనాధిప‌తి ఉత్స‌వం, అంకురార్పణం కార్య‌క్ర‌మాలు నిర్వ‌హించారు.

👉ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి జెఈవో శ్రీమ‌తి స‌దా భార్గ‌వి, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, విజిఓ శ్రీ మనోహర్, ఎఇఓ శ్రీ ధనంజయుడు, సూపరింటెండెంట్లు శ్రీ చెంగల్రాయలు, శ్రీ రమణయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ శ్రీ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు.

🕉 మార్చి 2న ధ్వ‌జారోహ‌ణం
మార్చి 2న మంగ‌ళ‌వారం ఉదయం 7 నుండి 8 గంటల వరకు స్వామి, అమ్మవార్ల ఉత్సవమూర్తులకు తిరుచ్చి ఉత్సవం జర‌గనుంది. ఉదయం 8.30 నుండి 8.53 గంటల మధ్య మీన లగ్నంలో ధ్వజారోహణ ఘట్టాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు. రాత్రి 7 నుండి 8 గంటల వరకు పెద్దశేష వాహనసేవ జర‌గ‌నుంది.

👉ఈ సంద‌ర్భంగా ప్ర‌తి రోజు ఉద‌యం 8 నుండి 9 గంట‌ల వ‌ర‌కు, రాత్రి 7 నుండి 8 గంట‌ల వ‌ర‌కు స్వామి, అమ్మ‌వార్లకు ఆల‌యంలో ఏకాంతంగా వాహ‌న సేవ‌లు నిర్వ‌హిస్తారు. గ‌రుడ‌సేవ మాత్రం రాత్రి 7.30 నుండి 8.30 గంట‌ల వ‌ర‌కు నిర్వ‌హిస్తారు.

🕉 *బ్రహ్మోత్సవాల్లో వాహనసేవల వివరాలు :*

★తేదీ      ★ఉదయం       ★రాత్రి

■ 02-03-2021(మంగ‌ళ‌వారం)
 ధ్వజారోహణం(మీన‌లగ్నం) పెద్దశేష వాహనం
■ 03-03-2021(బుధ‌వారం)
 చిన్నశేష వాహనం హంస వాహనం
■ 04-03-2021(గురువారం)
 సింహ వాహనం ముత్యపుపందిరి వాహనం
■ 05-03-2021(శుక్ర‌వారం)
కల్పవృక్ష వాహనం సర్వభూపాల వాహనం
■ 06-03-2021(శ‌ని‌వారం)
పల్లకి ఉత్సవం(మోహినీ అవతారం) గరుడ వాహనం
■ 07-03-2021(ఆదివారం)
 హనుమంత వాహనం తిరుచ్చి, గజ వాహనం
■08-03-2021(సోమ‌వారం)
 సూర్యప్రభ వాహనం చంద్రప్రభ వాహనం
■ 09-03-2021(మంగ‌ళ‌వారం)
 సర్వభూపాల వాహనం అశ్వవాహనం
■ 10-03-2021(బుధ‌‌వారం)
 చక్రస్నానం ధ్వజావరోహణం.
 *Dept.Of PRO TTD.*

SBI CBO Recruitment 2020 CBT Test Result, Final Result 2021

State Bank of India Latest Jobs SBI Cicle Based Officer Recruitment 2020. Those Candidates Are Enrolled with Vacancies Can Download the Result. 

Some Useful Important Links

Download Final Result

Click Here

Download Interview Letter

Click Here

Download Result

Click Here

Download Admit Card

Click Here

For Change Exam District

Click Here

Download Change Exam District Notice

Click Here

Apply Online

Registration | Login

Download Notification

Click Here

Official Website

Click Here

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...