Alerts

కొత్త అప్‌డేట్: హైకోర్టు కార్యాలయ సబార్డినేట్ ఎంపిక జాబితా (07/01/2026) విడుదలయింది. | New Update: High Court Office Subordinate selection list (07/01/2026) is now available. ముఖ్య గమనిక: ఫీల్డ్ అసిస్టెంట్ మరియు ఎగ్జామినర్ సర్టిఫికేట్ వెరిఫికేషన్ జనవరి 19 నుండి 23 వరకు జరుగుతుంది. | Important Note: Field Assistant and Examiner Certificate Verification will be held from Jan 19 to 23. తాజా నోటిఫికేషన్లు: అనంతపురం మరియు శ్రీ సత్యసాయి జిల్లా రిక్రూట్‌మెంట్ వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌లను సందర్శించండి. | Latest Notifications: Visit official websites for Ananthapuramu and Sri Sathya Sai district recruitment details.

ఉద్యోగ నోటిఫికేషన్లు / Job Notifications

తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్‌ను గమనించండి. / Please check the banner above for the latest updates.

10, నవంబర్ 2021, బుధవారం

IRCTC Shri Ramayana Yatra: శుభవార్త... ఐఆర్‌సీటీసీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని చేర్చిన రైల్వే

IRCTC Shri Ramayana Yatra | ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర టూరిస్ట్ రైలు భద్రాచలం రోడ్ స్టేషన్‌లో కూడా ఆగుతుందని దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ప్రకటించింది. భద్రాచలం సందర్శించిన తర్వాత ఢిల్లీకి రైలు బయల్దేరుతుంది.

Gemini Internet

తెలంగాణలోని శ్రీరామ భక్తులకు శుభవార్త. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చింది భారతీయ రైల్వే (Indian Railways). ఇండియన్ రైల్వే కేటరింగ్ అండ్ టూరిజం కార్పొరేషన్ (IRCTC) నవంబర్ 7న ఢిల్లీలోని సఫ్దర్‌జంగ్ రైల్వే స్టేషన్‌లో శ్రీ రామాయణ యాత్రను ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ యాత్రలో వెళ్లే భక్తులు రామాయణానికి సంబంధించిన ప్రాంతాలన్నీ చూడొచ్చు. అయితే రామాయణానికి సంబంధం ఉన్న భద్రాచలాన్ని ఈ యాత్రలో చేర్చకపోవడంపై విమర్శలొచ్చాయి. దీంతో భారతీయ రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది. ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్రలో భద్రాచలాన్ని కూడా చేర్చినట్టు దక్షిణ మధ్య రైల్వే (South Central Railway) ట్విట్టర్‌లో వెల్లడించింది.


ఐఆర్‌సీటీసీ శ్రీ రామాయణ యాత్ర ప్రత్యేక రైలు షెడ్యూల్ ప్రకారం రామేశ్వరం వెళ్తుంది. తిరుగు ప్రయాణంలో ఢిల్లీకి వెళ్లేదారిలో భద్రాచలం రోడ్ స్టేషన్‌లో ఆగుతుంది. భద్రాచలం ఆలయంతో పాటు పరిసర ప్రాంతాల్లో రామాణయానికి సంబంధించిన ప్రాంతాలను యాత్రికులు సందర్శించొచ్చు. ఆ తర్వాత రైలు ఢిల్లీకి బయల్దేరుతుంది.

 

Update for NEET Qualified Candidates: Online Counselling for Allotment of Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) Seats

NEET-UG, 2021 పరీక్షలో అర్హత సాధించి, అండర్ గ్రాడ్యుయేట్ (BAMS/BSMS/BUMS/BHMS) కోర్సుల్లో ప్రవేశం కోసం ఎదురుచూస్తున్న అర్హులైన అభ్యర్థులందరికీ ప్రభుత్వ, ప్రభుత్వ, ప్రభుత్వ సహాయ, డీమ్డ్ యూనివర్సిటీలు సహా ఆల్ ఇండియా కోటా సీట్లకు కౌన్సెలింగ్ జరుగుతుందని ఇందుమూలంగా తెలియజేయడం జరిగింది. 2021-22 సెషన్ కోసం విశ్వవిద్యాలయాలు మరియు నేషనల్ ఇన్‌స్టిట్యూట్‌లను ఆయుష్ అడ్మిషన్స్ సెంట్రల్ కౌన్సెలింగ్ కమిటీ (AACCC), ఆయుష్ మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం నిర్వహిస్తుంది.

AACCC-UG కౌన్సెలింగ్ 2021లో పాల్గొనడానికి, అభ్యర్థులు AACCC అధికారిక వెబ్‌సైట్ (www.aaccc.gov.in)లో తమను తాము నమోదు చేసుకోవాలి.

అభ్యర్థులు వారి కేటగిరీ ప్రకారం రిజిస్ట్రేషన్ సమయంలో నాన్-రిఫండబుల్ రిజిస్ట్రేషన్ ఫీజులు మరియు రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్లు చెల్లించాలని దయచేసి గమనించండి.

2వ రౌండ్‌లో కేటాయించిన సీటు/ఇన్‌స్టిట్యూట్‌కు అభ్యర్థి రాజీనామా చేస్తే తిరిగి చెల్లించే సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది. ఇంకా, అభ్యర్థి రౌండ్-3 / మాప్ అప్ రౌండ్‌లో కేటాయించిన సీట్లలో చేరకపోతే/నిష్క్రమించకపోతే, రీఫండబుల్ సెక్యూరిటీ డిపాజిట్ జప్తు చేయబడుతుంది.

All the eligible candidates who qualified in NEET-UG, 2021 examination and aspiring for admission in Under Graduate (BAMS/BSMS/BUMS/BHMS) courses are hereby informed that Counselling for All India Quota seats including Government, Government Aided, Deemed Universities, Central Universities, and National Institutes for the session 2021-22 will be conducted by Ayush Admissions Central Counseling Committee (AACCC), Ministry of Ayush, Government of India.

  • For participation in AACCC-UG Counseling 2021, the candidates are required to register themselves at the official website of AACCC (www.aaccc.gov.in).

  • Kindly note that Non-Refundable registration fees and Refundable Security deposits have to be paid by the candidates at the time of registration as per their category.

  • The Refundable Security Deposit will be forfeited if a candidate resigned from the seat/institute allotted during the 2nd Round. Further, the Refundable Security Deposit will be forfeited, if the candidate does not join/exit the allotted seats in Round-3 / Mop Up Round.

 Gemini Internet

DOT డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికమ్యూనికేషన్స్ రిక్రూట్‌మెంట్ 2021 అసిస్టెంట్ డైరెక్టర్, జూనియర్ టెలికాం ఆఫీసర్ – 9 పోస్టులు dot.gov.in చివరి తేదీ 07-12-2021


Name of Organization Or Company Name :Department of Telecommunications


Total No of vacancies:– 9 Posts


Job Role Or Post Name:Assistant Director, Junior Telecom Officer 


Educational Qualification:Diploma, Degree (Engg/ Science)


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: dot.gov.in


Click here for Official Notification


*తిరుమలలో ఉచిత వివాహలు*

కలియుగ ప్రత్యక్ష దైవమైన తిరుమల శ్రీవేంకటేశ్వరుని చెంత వివాహాం చేసుకుని, ఒక్కటి అయ్యే జంటలకు టిటిడి నిర్వహిస్తున్న ఉచిత వివాహాలకు నూతన వదూవరుల నుండి విశేష స్పందన లభిస్తుంది. టిటిటి 2016 ఏప్రిల్‌ 25వ తేదీ నుండి తిరుమల పాపావినాశనం రోడ్డులోని కళ్యాణ వేదిక వద్ద ఉచితంగా వివాహాలు నిర్వహిస్తున్న విషయం విదితమే.

👉 ఇందులో భాగంగా...
◆ పురోహితుడు,
◆ మంగళవాయిద్యంతోపాటు రోజుకు రూ.50/- చెల్లించే వసతి గృహాన్ని, 
◆ పెళ్లి సమయంలో పసుపు, కుంకుమ, కంకణంను 
    టిటిడి ఉచితంగా అందిస్తుంది.
 
🟢 వీటితోపాటు...
  ● 12 లడ్డూలను
 (ఒకటి రూ.25/- చొప్పున) పొందవచ్చు. 
● వివాహానికి కావాల్సిన ఇతర సామాగ్రిని మాత్రం వదూవరులే తీసుకురావాల్సి ఉంటుంది.

■ వివాహానికి వదూవరుల తల్లిదండ్రులు తప్పనిసరిగా హాజరుకావాల్సి ఉంటుంది.

📜 👉 పెళ్లికి రాలేని పక్షంలో అందుకు సంబంధించిన ఆధార పత్రాలను సమర్పించాలి.

★ వివాహాం అనంతరం నవదంపతులకు గ్రూప్‌ ఫోటో తీసి రూ.300/-ల ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్‌ను ఒకటి ఉచితంగా అందజేస్తారు.

👉 📄 ఈ టికెట్‌ ద్వారా పెళ్లికుమారుడు, పెళ్లికుమార్తెతోపాటు ఇరువురి తల్లిదండ్రులను కలుపుకుని మొత్తం 6 మందికి ఏటీసీ మార్గం ద్వారా ఉచితంగా శ్రీవారి దర్శనానికి అనుమతిస్తారు.

🕉 *కల్యాణ వేదికకు ఆన్‌లైన్‌ బుకింగ్‌ అవకాశం*

తిరుమలలోని కళ్యాణ వేదికలో ఉచిత వివాహలు చేసుకునేందుకు ముందుగా...

★ ఆన్‌లైన్‌లో కల్యాణవేదిక స్లాట్‌ను బుక్‌ చేసుకునే సదుపాయాన్ని 2016 మే 9వ తేదీ నుండి నూతన వదూవరులకు టిటిడి కల్పించింది.

🟢 ఇందుకోసం తమ సమీపప్రాంతాల్లోని నెట్‌ సెంటర్‌ లో టిటిడి సేవా ఆన్‌లైన్‌.కామ్‌ వెబ్‌సైట్‌ను సంప్రదించాల్సి ఉంటుంది. 
◆ అక్కడ ఉన్న కల్యాణవేదిక కాలమ్‌లో అబ్బాయి, అమ్మాయి వివరాలను నమోదుచేయాలి.

★ వదూవరులు తప్పనిసరిగా తల్లిదండ్రుల వివరాలను నమోదు చేయడమేకాక
● ఓటర్‌, 
● ఆధార్‌ కార్డులలో ఏదోఒక గుర్తింపు కార్డును అప్‌లోడ్‌ చేయాలి. 
■ వయసు ధృవీకరణ కోసం బర్త్‌ సర్టిఫికేట్‌ లేదా పదో తరగతి మార్క్‌లిస్ట్‌ / ట్రాన్స్‌ఫర్‌ సర్టిఫికేట్‌ లేదా డ్రైవింగ్‌ లైసెన్స్‌ లేదా పాన్‌ కార్డు లేదా పాస్‌పోర్టు వివరాలను జతచేయాల్సి ఉంటుంది. వీటితోపాటు అందులో వివాహ తేది, సమయాన్ని వారే నిర్ణయించుకుని అప్‌లోడ్‌ చేస్తే అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రం జారీ అవుతుంది.

■ కొత్తగా పెళ్లి చేసుకునే వారు అక్నాలెడ్జ్‌మెంట్‌ పత్రాన్ని తీసుకుని కేవలం 6 గంటల ముందు తిరుమల చేరుకుని కల్యాణవేదిక వద్ద ఉన్న కార్యాలయంలో వారి వివరాలను మరోసారి అక్కడి సిబ్బంది ద్వారా పరిశీలించుకోవాలి.

■ కరెంటు బుకింగ్‌ / ఆన్‌లైన్‌లో బుక్‌ చేసుకునే జంటలు తిరుమలలో ఉచితంగా వివాహం చేసుకొనుటకు తప్పనిసరిగా హిందూ మతస్థులై ఉండాలి.

🟢 వధువుకు 18 సంవత్సరాలు,
🟢 వరునికి 21 సంవత్సరాలు నిండివుండాలి. 

❌ ద్వితీయ వివాహములు మరియు ప్రేమ వివాహములు ఇక్కడ జరుపబడవు.


☎️  ఇతర వివరాలకు...
*ఫోన్‌ – 0877 – 2263433*  
          సంప్రదించవచ్చు.
 వివాహ రిజిస్ట్రేషన్‌ కొరకు
               ➖➖➖
తిరుమలలో వివాహం చేసుకున్న నూతన వదూవరులు, 
తమ వివాహన్ని రిజిస్ట్రేషన్‌ చేసుకొనుటకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ”హిందూ వివాహ రిజిస్ట్రారు వారి కార్యాలయము”ను *ఎస్‌.ఎమ్‌.సి – 233* వద్ద ఏర్పాటు చేసింది.

👉 ఇందుకోసం నూతన వదూవరులు తమ 
◆ వయస్సు ధృవపత్రములు,
◆ నివాస ధృవపత్రము,
◆ వివాహము ఫోటో,
◆ పెండ్లి పత్రిక, 
◆ కళ్యాణ మండపము రసీదు సమర్పించవలెను. 
◆ ముగ్గురికి తక్కువ లేకుండా సాక్షులు రావలెను. 

👉 ఇతర వివరాలకు ఉదయం 10.30 నుండి సాయంత్రం 5.00 గంటల వరకు కార్యాలయంలో నేరుగా లేదా ఫోన్‌ 
☎️ *0877 – 2277744* సంప్రదించవచ్చు.

✳️ తిరుమలలో వివాహం చేసుకునే దంపతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని టిటిడి కోరుతోంది.
*Dept of PRO TTD.*
టీటీడీ టెలిగ్రామ్ న్యూస్ రిపోర్టర్  ౼ రెడ్డేరి శేఖర్ రెడ్డి
  📞  701 345 1212

AP Postal Jobs Update | ఆంధ్రప్రదేశ్ పోస్టల్ జాబ్స్ అప్డేట్స్ 2021-22 Last Date is 18-11-2021

Dear Applicant, You require to re-exercise options for the GDS posts applied during Jan-Mar21. Visit /appost.in/gdsonline for more details-IndiaPost ఈ మేసేజ్ వచ్చిన వారు వారి యొక్క లాగిన్ డోటెయిల్స్ తో గతంలో మీరు ఖాళీలకు పెట్టుకున్న ఆప్షన్లను మరొక సారి పెట్టుకోవలసినదిగా అభ్యర్థన.

కారణంః ప్రస్తుతం కొన్ని పోస్టులను తగ్గించడమో లేదా తొలగించడమో లేదా పెంచడమో జరినట్లు తెలుస్తోంది (కొందరి ప్రమోషన్లలో భాగంగా కొన్ని ఏరియాలలో ఉద్యోగాలను తొలగించినట్టు ఉంది) కాబట్టి ఎక్కడెక్కడ మీ క్యాటగిరీకి సంబంధించి ఉద్యోగాలు ఉన్నాయో వాటిని జాగ్రత్తగా క్రింద ఉన్న లింక్ చూసుకుని ఆప్షన్లలోమళ్ళీ ఇంకొకసారి పెట్టుకోవలసినదిగా మనవి.

సంప్రదించండి Gemini Internet

గతంలో అప్లై చేసిన అభ్యర్థులు అప్పటి లాగిన్ ఐడి మరియు అప్లికేషన్ లో అప్పుడిచ్చిన మొబైల్ కు కొత్తగా వచ్చిన OTP to అప్లై చేసుకోవడానికి లింక్  

ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ అభ్యర్థులు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఎంపికలను పునఃపరిశీలించాలని తెలియజేయడమైనది 03.11.2021 నుండి 18.11.2021 వరకు అవకాశం ఉంది. దయచేసి ఈ నిబంధన 27.01.2021 నుండి 01.03.2021 వరకు విత్‌హెల్డ్ పోస్ట్‌ల కోసం ఇప్పటికే దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే అని గుర్తుంచుకోండి.


NIELIT రిక్రూట్‌మెంట్ 2021 సైంటిస్ట్ C & D – 33 పోస్టులు www.nielit.gov.in చివరి తేదీ 07-12-2021



Name of Organization Or Company Name :National Institute of Electronics and Information Technology 


Total No of vacancies:– 33 Posts


Job Role Or Post Name:Scientist C & D 


Educational Qualification:BE/ B.Tech, M.Sc, ME/ M.Tech, M.Phil


Who Can Apply:All India


Last Date:07-12-2021


Website: www.nielit.gov.in


Click here for Official Notification


BCCL రిక్రూట్‌మెంట్ 2021 డ్రైవర్ – 94 పోస్టులు www.bcclweb.in చివరి తేదీ 22-11-2021


Name of Organization Or Company Name :Bharat Coking Coal Limited


Total No of vacancies: 94 Posts


Job Role Or Post Name:Driver 


Educational Qualification:8th Class, Valid Driving Licence


Who Can Apply:All India


Last Date:22-11-2021


Website: www.bcclweb.in


Click here for Official Notification


PM Kisan: రైతులకు అలర్ట్.. పీఎం కిసాన్ డబ్బుల కోసం ఇలా మీ పేరు చెక్ చేసుకోండి..

దేశంలోని రైతులకు కేంద్ర ప్రభుత్వం ఆర్థికంగా భరోసా కల్పించేందుకు ఎన్నో రకాల పథకాలను ప్రవేశ పెట్టింది. అందులో ఒకటి ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (PM Kisan). ఈ పథకంలో భాగంగా సంవత్సరానికి రూ. 6000 రైతుల ఖాతాల్లో నేరుగా జమకానున్నాయి. అయితే వీటిని ఒకేసారి అన్నదాతలకు అందించకుండా.. విడతలుగా వారి ఖాతాల్లో జమచేయనున్నారు. ఒక్కో విడతలో రూ. 2000 రైతుల ఖాతాల్లో జమకానుంది. మొదటి విడత.. ఏప్రిల్, జూలై మధ్య ఉంటుంది.. రెండవ విడత.. ఆగస్ట్, నవంబర్ మధ్య.. మూడవ విడత డిసెంబర్..మార్చి మధ్య ఉంటుంది. ఇప్పటికే కేంద్రం రైతులకు 9 విడతలుగా నగదు జమచేసింది. ఇక పదవ విడత కోసం అన్నదాతలు ఎదురుచూస్తున్నారు.

తాజా సమాచారం ప్రకారం పీఎం కిసాన్ పదవ విడత డబ్బులు డిసెంబర్ 15న వచ్చే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. పీఎం కిసాన్ నగదు చెక్ చేసుకోవడానికి ముందుగా pmkisan.gov.in వెబ్‌సైట్‌కి లాగిన్ కావాల్సి ఉంటుంది. ఆ తర్వాత.. కుడివైపున ఫార్మర్స్ కార్నర్ పై క్లిక్ చేయాలి. అఅందులో బెనిఫిషియరీ స్టేటస్ పై క్లిక్ చేయాలి. ఇందులో మీ స్టేటస్ చూడటానికి మీ ఆధార్ నంబర్, బ్యాంక్ ఖాతా, మొబైల్ నంబర్ వంటి వివరాలను ఎంటర్ చేయాలి. పూర్తి ప్రాసెస్ కంప్లీట్ చేసిన తర్వాత మీ పేరు జాబితాలో ఉంటే.. మీకు నగదు వివరాలు కనిపిస్తాయి.

మొబైల్ యాప్ ద్వారా పీఎం కిసాన్ జాబితాలో పేరును చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం మీరు పీఎం కిసాన్ యాప్‏ను డౌన్ లోడ్ చేసుకోవాలి. ఆ తర్వాత అన్ని వివరాలను ఎంటర్ చేసి యాక్సెస్ చేసుకోవాల్సి ఉంటుంది. ఈ పీఎం కిసాన్ పథకం ప్రయోజనాలు.. చిన్న, సన్నకారు రైతుల కుటుంబాలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది 2 హెక్టార్ల వరకు భూమిని కలిగి ఉన్న రైతులకు ప్రయోజనాలు అందుతాయి.

 

Gemini Internet

ఆదాయాన్ని పెంచుకునే ఆరు అద్భుత మార్గాలు.. ఆచరిస్తే ఆర్థిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు

ఆర్థికంగా ఎదగాలని అందరూ కోరుకుంటారు. అయితే ఈ విషయంలో కొందరు మాత్రమే సక్సెస్ అవుతారు. చాలామంది ఒకే ఒక్క ఆదాయ మార్గంతోనే జీవితం వెళ్లదీస్తుంటారు. ఇంకేమైనా ఆదాయమార్గాలున్నాయేమో కూడా ఆలోచించరు. అయితే ఈ రోజుల్లో ఒక్క ఆదాయమార్గంతో ఇల్లు గడవడం చాలా కష్టం. ప్రస్తుతం మనిషి అవసరాలకు తోడు ధరలు కూడా పెరిగిపోతున్నాయి. పలు విధాలుగా సౌకర్యాలను అందించే వస్తువులు అందుబాటులోకి వస్తున్నాయి. అందుకే మల్టిపుల్ సోర్సెస్ గురించి అందరూ ఆలోచించాల్సిన అవసరం ఏర్పడింది. ఇప్పుడు మీ ఆదాయాన్ని పెంచే ఆరు మార్గాల గురించి తెలుసుకుందాం.

Gemini Internet

1. ఏదో ఒక విద్యలో నైపుణ్యం పెంచుకోవడం 

ఈ రోజులల్లో అన్నిరంగాలలోనూ నిపుణుల ఆవశ్యకత మరింతగా పెరుగుతోంది. అందుకే ప్రతీ ఒక్కరూ ఏదో ఒక రంగంలో నిపుణత సాధించాలి. మిగిలినవారికన్నా ఏదోఒక ప్రత్యేక పరిజ్ఞానం కలిగివుండాలి. అప్పుడు మీ సేవలు ఏదో ఒక సంస్థ స్వీకరించి మీకు ఆదాయ మార్గాన్ని ఏర్పరుస్తుంది. శాస్త్రీయ సంగీతం మొదలు కొని కంటెంట్ రైటింగ్ వరకూ ఏదైనా సరే మీకు ఇష్టమైన విద్యను నేర్చుకోవచ్చు. 

2. మీ స్కిల్స్ పదిమందికీ తెలియజేయండి

ఈ రోజుల్లో తమ ఖాళీ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రతీఒక్కరూ పరితపిస్తున్నారు. ఏదో ఒకవిధంగా ఆదాయం సంపాదించాలని అనుకుంటున్నారు. అందుకే మీకున్న స్కిల్స్ పదిమందికీ తెలియజేసి ఆదాయ మార్గాలను ఏర్పరుచుకోండి. ఇప్పుడున్న పరిస్థితుల్లో వీడియో ఎడిటింగ్, ఆన్‌లైన్ క్లాసులు, ఆర్టికల్ రైటింగ్, కొత్త భాష నేర్పడం, కోడింగ్, కుకింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్, డిజిటల్ మార్కెటింగ్, ఆన్‌లైన్ సెల్లింగ్ మొదలైనవన్నీ మంచి ఆదాయాన్ని అందిస్తున్నాయి. 

3 పాసివ్ ఇన్కమ్ సోర్సెస్ ఏర్పాటు చేసుకోండి

ఈ రోజుల్లో చాలామంది పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌పై ఆధారపడుతున్నారు. ఒకసారి పనిచేసి జీవితాంతం ఆదాయం అందుకోవడం పాసివ్ ఇన్కమ్ సోర్సెస్‌తో సాధ్యమవుతుంది. దీనిని స్మార్ట్ ఇన్కమ్ అని చెప్పుకోవచ్చు. ఈ విభాగంలోకి బ్లాగింగ్, బుక్ రైటింగ్, రాయల్టీ ఇన్కమ్, ఆన్‌లైన్ కోర్సులు అందించడం, రెంటల్ ఇన్కమ్ మొదలైనవన్నీ పాసివ్ ఇన్కమ్ కోవలోకి వస్తాయి. 

సైడ్ బిజినెస్ చేయడం

మీరు మీ ఆదాయ మార్గాన్ని పెంచుకోవాలంటే సైడ్ బిజినెస్ ఏర్పాటు చేసుకోవాలి. 8 గంటలపాటు ఏదోఒక ఉద్యోగం చేసిన తరువాత మరో 6 గంటల సమయంలో మరో ఆదాయ మార్గాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఈ సమయంలో మీకు అభిరుచి కలిగిన వ్యాపారాన్ని చేయవచ్చు. యూట్యూబ్ ఛానల్ నిర్వహించడం, కోచింగ్ సెంటర్ నడపడం, జనరల్ స్టోర్ నడపడం మొదలైనవి చేయడం ద్వారా అదనపు ఆదాయాన్ని సమకూర్చుకోవచ్చు. 

ఇన్వెస్ట్‌మెంట్ చేయడం

అదనపు ఆదాయాన్ని అందుకునేందుకు ఇన్వెస్ట్‌మెంట్ చేయడమనేది మరో ఉత్తమ మార్గం. తగిన మొత్తంలో వివిధ బ్యాంకులు లేదా పోస్టల్ పథకాలలో పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు ప్రతీనెలా ఆదాయాన్ని అందుకునేందుకు అవకాశం ఏర్పడుతుంది. ఈ విధానంలో ఆదాయాన్ని వృద్ధి చేసేందుకు కూడా అవకాశం ఉంటుంది. 

హాబీలను ఆదాయ మార్గాలుగా మార్చుకోవడం

మీకున్న హాబీలను ఆధారంగా చేసుకుని ఆదాయాన్ని సంపాదించవచ్చు. ఇష్టమైన పనులు చేయడం ద్వారా ఆదాయాన్ని సంపాదించడం మరింత ఆనందాన్ని కలిగిస్తుంది. మీకు రాయడం అంటే ఇష్టముంటే పుస్తకాలు రాయవచ్చు లేదా బ్లాగ్ నిర్వహించవచ్చు. మెహందీ దగ్గర నుంచి పెయింటింగ్ వరకూ ఇలా ఏ హాబీనైనా ఆదాయమార్గంగా మార్చుకోవచ్చు.

 

Recent

10వ తరగతి మరియు క్రీడల అర్హతతో అస్సాం రైఫిల్స్‌లో 95 రైఫిల్‌మ్యాన్/వూమన్ పోస్టుల భర్తీ Recruitment for 95 Rifleman/Woman Posts in Assam Rifles with 10th Class and Sports Qualification

ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...