దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు): రూ.3000/-
ముఖ్యమైన తేదీలు:
- ఆన్లైన్ దరఖాస్తు స్వీకరణకు చివరి తేదీ: నవంబర్ 20, 2023
- ఆన్లైన్ అప్లికేషన్ హార్డ్ కాపీని సమర్పించడానికి చివరి తేదీ: నవంబర్ 27, 2023
అప్లికేషన్ల కోసం సంప్రదించండి GEMINI ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు మధ్యాహ్నం 3.00 గంటల నుండి | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు | Phone 9640006015 | Working hours from 3.00 pm | Every Sunday off | Fee Rs. 200/- for educational & job applications
తాజా సమాచారం కోసం పైన ఉన్న బానర్ను గమనించండి. / Please check the banner above for the latest updates.
దరఖాస్తు రుసుము (వాపసు ఇవ్వబడదు): రూ.3000/-
ముఖ్యమైన తేదీలు:
* ఎంపికైతే ఉచిత విద్య, భోజన, వసతి సౌకర్యాలు
దేశవ్యాప్తంగా 649 జవహర్ నవోదయ విద్యాలయ(జేఎన్వీ)లో తొమ్మిది, పదకొండో తరగతుల్లో ప్రవేశాలకు సంబంధించి ఆన్లైన్ దరఖాస్తు గడువును నవంబర్ 15 వరకు పొడిగించినట్లు నవోదయ విద్యాలయ సమితి ఓ ప్రకటనలో వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్లో 15, తెలంగాణలో 9 జేఎన్వీలు ఉన్నాయి. ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు అర్హులు. గ్రామీణ ప్రాంతాల విద్యార్థులకు 75 శాతం సీట్లు కేటాయించారు. మిగిలిన 25శాతం సీట్లు పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయించారు. ప్రవేశ పరీక్ష ద్వారా విద్యార్థులను ఎంపిక చేస్తారు. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఉచిత విద్య అందిస్తారు. బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పించారు.
నవోదయ విద్యాలయాల్లో 9వ తరగతి లేటరల్ ఎంట్రీ ప్రవేశాలు
ప్రొఫెసర్లు: 26 పోస్టులు
అర్హత: పీహెచ్డీ.
పే స్కేల్: రూ.1,44,200 - 2,18,200/-
అసోసియేట్ ప్రొఫెసర్లు: 34 పోస్టులు
అర్హత: మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్డీ.
పే స్కేల్: రూ.1,33,400 - 2,17,100/-
అసిస్టెంట్ ప్రొఫెసర్: 43 పోస్టులు
అర్హత: బ్యాచిలర్స్ డిగ్రీ/ మాస్టర్స్ డిగ్రీ/ పీహెచ్డీ/ బీఈ/ బీటెక్/ బీఎస్ అండ్ ఎంఈ/ ఎంటెక్/ ఎంఎస్ లేదా ఇంటిగ్రేటెడ్ ఎంటెక్.
పే స్కేల్: రూ.57,700 - 1,82,400/-
ఎలా దరఖాస్తు చేయాలి?
దరఖాస్తుదారులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి (లింక్ ద్వారా: https://recruitments.universities.ap.gov.in)
అభ్యర్థి పూరించిన దరఖాస్తు యొక్క ప్రింట్-అవుట్ తీసుకొని, అన్ని
స్వీయ-ధృవీకరణ పత్రాలను జతచేసి రిజిస్టర్డ్ పోస్ట్/స్పీడ్ పోస్ట్/కొరియర్
ద్వారా "ది రిజిస్ట్రార్, యోగి వేమన విశ్వవిద్యాలయం, కడప - 516005,
వైఎస్ఆర్ కడప, ఆంధ్రప్రదేశ్"".
ముఖ్యమైన తేదీలు:
Tirumala : డిసెంబర్ 23 నుంచి జనవరి 1 వరకు తిరుమల శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనం కల్పించనుంది టీటీడీ. అయితే వైకుంఠ ద్వార దర్శనానికి సంబంధించి రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం టికెట్లు, శ్రీవాణి దర్శన టికెట్లు, గదుల కోటాను నవంబర్ 10న టీటీడీ ఆన్ లైన్ లో విడుదల చేయనుంది. 2.25 లక్షల రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శన టికెట్లను నవంబర్ 10వ తేదీ ఉదయం 10 గంటలకు, రోజుకు 2 వేలు చొప్పున 20 వేల శ్రీవాణి దర్శన టికెట్లను మధ్యాహ్నం 3 గంటలకు, గదుల కోటాను సాయంత్రం 5 గంటలకు ఆన్లైన్లో విడుదల చేయనున్నారు. భక్తులు ఈ విషయాలను గమనించి టికెట్లు బుక్ చేసుకోవాలని టీటీడీ సూచించింది.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుంచి 18వ తేదీ వరకు జరుగనున్న వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాలకు నవంబరు 9వ తేదీ గురువారం అంకురార్పణ జరుగనుంది. ఈ సందర్భంగా ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు లక్షకుంకుమార్చన నిర్వహిస్తారు. సాయంత్రం 6.30 నుంచి రాత్రి 8.30 గంటల వరకు పుణ్యాహవచనం, రక్షాబంధనం, సేనాధిపతి ఉత్సవం, యాగశాలలో అంకురార్పణ కార్యక్రమాలు చేపడతారు.
ఆలయంలో నవంబరు 10న ఉదయం 8 గంటల నుంచి 9 గంటల వరకు ధ్వజస్థంభ తిరుమంజనం, అలంకారం, ఉదయం 9.10 నుండి 9.30 గంటల మధ్య ధనుర్ లగ్నంలో ధ్వజారోహణంతో అమ్మవారి బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయి. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజూ ఉదయం 8 నుంచి 10 గంటల వరకు, రాత్రి 7 నుంచి 9 గంటల వరకు వాహనసేవలు జరుగనున్నాయి.
తిరుచానూరు శ్రీ పద్మావతి అమ్మవారి ఆలయంలో నవంబరు 10 నుండి 18వ తేదీ వరకు వార్షిక కార్తీక బ్రహ్మోత్సవాల నేపథ్యంలో నవంబరు 7వ తేదీ మంగళవారం కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా ఉదయం సుప్రభాతంతో అమ్మవారిని మేల్కొలిపి సహస్రనామార్చన, శుద్ధి నిర్వహించారు. ఉదయం 6 నుండి 9 గంటల వరకు కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం జరిగింది. ఇందులో ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పు, పూజాసామగ్రి తదితర వస్తువులను నీటితో శుద్ధి చేసిన అనంతరం నామకోపు, శ్రీచూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచిలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్రజలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం ఉదయం 9.30 గంటల నుండి భక్తులను దర్శనానికి అనుమతించారు.
* నవంబర్ 26న పరీక్ష
* జనవరి రెండో వారంలో ఫలితాలు
ప్రతిష్ఠాత్మక ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్(ఐఐఎం) కళాశాలల్లో మేనేజ్మెంట్ కోర్సులు చేసేందుకు అవకాశం కల్పించే ప్రవేశ పరీక్ష- కామన్ అడ్మిషన్ టెస్ట్(క్యాట్) 2023 అడ్మిట్ కార్డులు విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు యూజర్ ఐడీ, పాస్వర్డ్ సాయంతో అడ్మిట్ కార్డు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఆన్లైన్ కంప్యూటర్ ఆధారిత విధానంలో నిర్వహించే క్యాట్లో సాధించిన పర్సంటైల్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది. క్యాట్ స్కోరు ఆధారంగా ఐఐఎంలే కాకుండా పేరున్న కళాశాలలు కూడా తమ కళాశాలల్లో సీట్లను భర్తీ చేస్తాయి. దేశవ్యాప్తంగా మొత్తం 155 నగరాల్లో నవంబర్ 26న పరీక్ష నిర్వహించనున్నారు. తెలుగు రాష్ట్రాల్లోని అనంతపురం, చిత్తూరు, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్, ఖమ్మం, వరంగల్ నగరాల్లో పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. వచ్చే జనవరి రెండో వారంలో ఫలితాలు వెలువడనున్నాయి.
త్రివిధ
దళాలకు అవసరమైన అధికారులను పాఠశాల స్థాయి నుంచే సిద్ధం చేసే లక్ష్యంతో
కేంద్ర ప్రభుత్వం సైనిక పాఠశాలను ఏర్పాటు చేసింది. సంపూర్ణ క్రమశిక్షణ,
వ్యక్తిత్వ వికాసంతోపాటు, దేశభక్తిని పెంపొందించే విధంగా ఇక్కడి బోధన
ఉంటుంది. రక్షణ రంగంలోకి ప్రవేశించడానికి కావాల్సిన నైపుణ్యాలను పాఠశాల దశ
నుంచే నేర్పిస్తారు. దేశ వ్యాప్తంగా రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలోని 33
సైనిక స్కూళ్లలో 2024-2025 విద్యా సంవత్సరానికి సంబంధించి 6, 9వ తరగతి
ప్రవేశాల కోసం కేంద్ర ప్రభుత్వం అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ
పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ-2024) నోటిఫికేషన్ విడుదల చేసింది. దీని కోసం
నిర్వహించే ప్రవేశ పరీక్షను సైనిక్ స్కూల్ సొసైటీ నిబంధనల ప్రకారం నేషనల్
టెస్టింగ్ జెన్సీ(ఎన్టీఏ) నిర్వహిస్తుంది. ఎన్జీవోలు/ ప్రైవేట్ పాఠశాలలు/ రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో పనిచేసే 19 కొత్త సైనిక పాఠశాలలకు రక్షణ మంత్రిత్వ శాఖ ఆమోదం తెలిపింది. ఈ పాఠశాలల్లోనూ ఆరోతరగతి ప్రవేశాలు ఏఐఎస్ఎస్ఈఈ-2024 ద్వారా జరుగుతాయి.
పరీక్ష వివరాలు...
* అఖిల భారత సైనిక పాఠశాలల ప్రవేశ పరీక్ష(ఏఐఎస్ఎస్ఈఈ)-2024
సీట్ల కేటాయింపు: ఆరో తరగతి(ప్రభుత్వ- 2970, ప్రైవేటు- 2255)కి 5225; తొమ్మిదో తరగతికి 697 సీట్లు కేటాయించారు. ఏపీలోని కోరుకొండ(విజయనగరం జిల్లా), కలికిరి (చిత్తూరు జిల్లా), కృష్ణపట్నం(ఎస్పీఎస్సార్ నెల్లూరు)లో సైనిక పాఠశాలలు ఉన్నాయి.
అర్హతలు:
* ఆరో తరగతికి ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 10-12 ఏళ్ల మధ్యలో ఉండాలి. బాలికలు కూడా ఆరో తరగతిలో ప్రవేశానికి దరఖాస్తు చేసుకోవచ్చు.
* తొమ్మిదో తరగతిలో ప్రవేశం పొందే విద్యార్థుల వయసు మార్చి 31, 2024 నాటికి 13-15 ఏళ్ల మధ్యలో ఉండాలి. ఎనిమిదో తరగతి ఉత్తీర్ణులై ఉండాలి.
ఎంపిక ప్రక్రియ: అభ్యర్థులు ప్రవేశపరీక్షలో ఒక్కో సజ్జెక్టులో కనిష్ఠంగా 25% మార్కులు, అన్ని సజ్జెక్టుల్లో కలిపి 40% మార్కులు సాధించాలి. దీనిలో అర్హత సాధించిన వారికి శారీరక దార్ఢ్య, వైద్య పరీక్షలు నిర్వహించి ప్రవేశం కల్పిస్తారు.
పరీక్ష విధానం: పెన్ పేపర్ (ఓఎంఆర్ షీట్) విధానంలో నిర్వహించే రాత పరీక్షలో సాధించే మెరిట్ ఆధారంగా సీట్ల కేటాయింపు ఉంటుంది.
* ఆరో తరగతిలోకి ప్రవేశం పొందే విద్యార్థులకు మొత్తం 300 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. 125 ప్రశ్నలు ఇస్తారు. మ్యాథమెటిక్స్ సబ్జెక్టు నుంచి 50 ప్రశ్నలు ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు. ఇంటలిజెన్స్, లాంగ్వేజ్, జనరల్ నాలెడ్జ్ సబ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున అడుగుతారు. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. పరీక్ష కాల వ్యవధి 2.30 గంటలు.
* తొమ్మిదో తరగతిలో చేరే విద్యార్థులు 400 మార్కులకు పరీక్ష రాయాల్సి ఉంటుంది. మ్యాథమెటిక్స్ నుంచి 50 ప్రశ్నలు ఇస్తారు. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కులు. ఇంటలిజెన్స్, ఇంగ్లిష్, జనరల్ సైన్స్, సోషల్ సైన్స్ సజ్జెక్టుల నుంచి 25 ప్రశ్నల చొప్పున 100 ప్రశ్నలకు సమాధానం రాయాలి. ఒక్కో ప్రశ్నకు రెండు మార్కులు. మూడు గంటల పరీక్ష కాల వ్యవధి ఉంటుంది.
* తొమ్మిదో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్ మాధ్యమంలో, ఆరో తరగతి విద్యార్థులు ఇంగ్లిష్, హిందీ, అస్సామీ, బెంగాలీ, గుజరాతీ, కన్నడ, మలయాళం, మరాఠీ, ఒడియా, పంజాబీ, తమిళ్, తెలుగు, ఉర్దూ మాధ్యమాల్లో పరీక్ష రాయడానికి అవకాశం ఉంది.
సీట్ల కేటాయింపు: ఏ రాష్ట్రంలోనైతే సైనిక స్కూల్ ఉంటుందో అక్కడ అందుబాటులో ఉన్న మొత్తం సీట్లలో ఆ రాష్ట్రం/ కేంద్రపాలిత ప్రాంతానికి చెందిన విద్యార్థులకు 67%, ఇతర రాష్ట్రాల వారికి 33% సీట్లు కేటాయిస్తారు. అందులో ఎస్సీ-15%, ఎస్టీ-7.5%, ఇతర కులాలకు చెందిన విద్యార్థులకు 27% రిజర్వేషన్ ఉంటుంది. మిగిలిన 50.50% సీట్లలో 25% మాజీ డిఫెన్స్ ఉద్యోగుల పిల్లలకు, మిగతా 25% ఇతర రాష్ట్రాలు/ కేంద్రపాలిత ప్రాంతాలకు చెందిన విద్యార్థులకు కేటాయించవచ్చు. ఈ కోటాలో ఒకే రాష్ట్రానికి మూడు కంటే ఎక్కువ సీట్లు కేటాంచడానికి వీలు లేదు.
పరీక్ష కేంద్రాలు: దేశ వ్యాప్తంగా 186 కేంద్రాల(దాదాపు అన్ని సైనిక స్కూళ్లు)లో పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది.
ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో పరీక్ష కేంద్రాలు: అనంతపురం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజమహేంద్రవరం, శ్రీకాకుళం, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం, హైదరాబాద్, కరీంనగర్.
దరఖాస్తు విధానం: అర్హత కలిగిన విద్యార్థులు ఆన్లైన్లో నవంబర్ 7, 2023 నుంచి డిసెంబర్ 16, 2023 లోగా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులో మార్పులకు డిసెంబర్ 18 నుంచి 20వ తేదీ వరకు అవకాశం ఉంటుంది. ఎస్సీ/ ఎస్టీ కులాలకు చెందిన విద్యార్థులు రూ.500, ఇతరులు రూ.650 పరీక్ష రుసుం చెల్లించాలి. జనవరి 21, 2024న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు.
ఏ

టౌన్ ప్లానింగ్ అండ్ ఓవర్సీస్ ఉద్యోగాల భర్తీలో భాగంగా ధ్రువీకరణ పత్రాల పరిశీలన కోసం ప్రాథమికంగా ఏపీపీఎస్సీ అభ్యర్థులను ఎంపికచేసింది. నవంబరు 22న విజయవాడలోని ఏపీపీఎస్సీ కార్యాలయంలో జరిగే ధ్రువపత్రాల పరిశీలనకు ఉదయం 10 గంటలకు హాజరుకావాలని కార్యదర్శి నవంబరు 7న ఒక ప్రకటనలో తెలిపారు. అలాగే శాంపిల్ టేకర్స్ ఉద్యోగాల భర్తీ (ఏపీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్రివెంటివ్ మెడిసిన్)లో భాగంగా ధ్రువపత్రాల పరిశీలన కోసం ఎంపికచేసిన అభ్యర్థులు నవంబరు 22న ఏపీపీఎస్సీ కార్యాలయానికి రావాలని పేర్కొన్నారు. పూర్తి వివరాలు ఏపీపీఎస్సీ వెబ్సైట్లో ఉన్నాయి.
ఎయిమ్స్ భోపాల్లో నాన్ఫ్యాకల్టీ పోస్టులు
‣ నవంబర్ 20 దరఖాస్తుకు గడువు
భోపాల్లోని
ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (ఎయిమ్స్) 357
నాన్ ఫ్యాకల్టీ పోస్టుల భర్తీకి ప్రకటన విడుదల చేసింది. ఈ నియామకాలను
డైరెక్ట్ రిక్రూట్మెంట్ ప్రాతిపదికన చేస్తారు. అభ్యర్థులు ఆన్లైన్లో
దరఖాస్తు చేసుకోవచ్చు.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ (సీబీటీ), స్కిల్ టెస్ట్, మెడికల్
ఎగ్జామినేషన్ ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. సీబీటీలో చూపిన ప్రతిభ
ఆధారంగా అభ్యర్థులను 1:3 నిష్పత్తిలో డాక్యుమెంట్ వెరిఫికేషన్కు
ఎంపికచేస్తారు. అవసరమైన వారికి మాత్రమే స్కిల్ టెస్ట్ నిర్వహిస్తారు. ఇది
అర్హత పరీక్ష మాత్రమే. ఈ టెస్ట్ తేదీ, డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీ,
వివరాలను ఎయిమ్స్ భోపాల్ వెబ్సైట్లో తర్వాత ప్రకటిస్తారు.
ఏయే ఉద్యోగాలు?
‣ హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-3 (నర్సింగ్ ఆర్డర్లీ) - 106
‣ ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్ 2 - 41
‣ మెడికల్ రికార్డ్ టెక్నీషియన్ - 38
‣ ఫార్మసిస్ట్ గ్రేడ్ 2 - 27
‣ వైర్మేన్ - 20
‣ శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్ 2 - 18
‣ ప్లంబర్ - 15
‣ ఆర్టిస్ట్- 14
‣ క్యాషియర్ - 13
‣ ఆపరేటర్/ లిఫ్ట్ ఆపరేటర్ - 12
‣ జూనియర్ మెడికల్ రికార్డ్ ఆఫీసర్ (రిసెప్షనిస్ట్స్) - 05
‣ మ్యానిఫోల్డ్ టెక్నీషియన్ (గ్యాస్ స్టివార్డ్/ గ్యాస్ కీపర్) - 06
‣ ఎలక్ట్రీషియన్ - 06
‣ మెకానిక్ - 06
‣ డార్క్రూమ్ అసిస్టెంట్ గ్రేడ్ 2 - 05
‣ అసిస్టెంట్ లాండ్రీ సూపర్వైజర్ - 04
‣ డిస్పెన్సింగ్ అటెండెంట్స్ - 04
‣ మెకానిక్ (ఈ అండ్ ఎం) - 04
‣ లైబ్రరీ అటెండెంట్ గ్రేడ్ 2 - 03
‣ గ్యాస్/పంప్ మెకానిక్ - 02
‣ లైన్మెన్(ఎలక్ట్రికల్) - 02
‣ టైలర్ గ్రేడ్ 3 - 02
‣ ల్యాబ్ టెక్నీషియన్ - 01
‣ ఫార్మా కెమిస్ట్/ కెమికల్ ఎగ్జామినర్ - 01
‣ కోడింగ్ క్లర్క్ - 01
‣ మ్యానిఫోల్డ్ రూమ్ అటెండెంట్ - 01
మొత్తం పోస్టుల్లో అన్రిజర్వుడ్కు 177, ఓబీసీలకు 89, ఎస్సీలకు 42, ఎస్టీలకు 20, ఈడబ్ల్యూఎస్లకు 29 కేటాయించారు.
జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు దరఖాస్తు ఫీజు రూ.1200, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు రూ.600. ఫీజును ఆన్లైన్లో చెల్లించాలి.
అర్హతలు
హాస్పిటల్ అటెండెంట్ గ్రేడ్-3 (నర్సింగ్ ఆర్డర్లీ): మెట్రిక్యులేషన్ పాసై హాస్పిటల్ సర్వీసెస్లో సర్టిఫికెట్ కోర్సు చేయాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉన్నవారికి ప్రాధాన్యమిస్తారు.
ల్యాబ్ అటెండెంట్ గ్రేడ్-2: సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ పాసవడంతోపాటు.. మెడికల్ ల్యాబ్ టెక్నాలజీలో డిప్లొమా చేయాలి. వయసు 18-27 సంవత్సరాల మధ్య ఉండాలి. హాస్పిటల్లో రెండేళ్లు పనిచేసినవారికి ప్రాధాన్యం ఉంటుంది.
మెడికల్ రికార్డ్ టెక్నీషియన్: బీఎస్సీ (మెడికల్ రికార్డ్స్) పాసై కంప్యూటర్ పరిజ్ఞానం ఉండాలి. ఆఫీస్ అప్లికేషన్స్, స్ప్రెడ్షీట్స్, ప్రజెంటేషన్స్లో అనుభవం ఉండాలి. ఇంగ్లిష్లో నిమిషానికి 35 పదాలు, హిందీలో 30 పదాలు టైప్ చేయగలగాలి. లేదా సైన్స్ సబ్జెక్టుతో ఇంటర్మీడియట్ పాసై, మెడికల్ రికార్డ్ కీపింగ్లో సర్టిఫికెట్ కోర్స్ చేయాలి. రెండేళ్లు హాస్పిటల్లో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-30 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఫార్మసిస్ట్ గ్రేడ్-2: ఫార్మసీ డిప్లొమా చేసి, రిజిస్టర్డ్ ఫార్మసిస్ట్ అయివుండాలి. ఫ్లూయిడ్ తయారీ/ స్టోరేజ్/ టెస్టింగ్లో హాస్పిటల్ లేదా పరిశ్రమలో పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 21-27 సంవత్సరాల మధ్య ఉండాలి.
శానిటరీ ఇన్స్పెక్టర్ గ్రేడ్-2: ఇంటర్మీడియట్, ఏడాది వ్యవధిగల హెల్త్ శానిటరీ ఇన్స్పెక్టర్ కోర్సు పాసవ్వాలి. 200 పడకల హాస్పిటల్లో నాలుగేళ్లు పనిచేసిన అనుభవం ఉండాలి. వయసు 18-35 సంవత్సరాల మధ్య ఉండాలి.
గరిష్ఠ వయసులో.. ఓబీసీ - ఎన్సీఎల్కు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు ఐదేళ్లు, పీడబ్ల్యూబీడీ అభ్యర్థులకు పదేళ్లు, ప్రభుత్వ ఉద్యోగులకు ఐదేళ్లు, ఎక్స్సర్వీస్మెన్కు మూడేళ్ల సడలింపు ఉంటుంది.
కంప్యూటర్ బేస్డ్ టెస్ట్
మల్టిపుల్ ఛాయిస్ విధానంలో 100 ప్రశ్నలకు 100 మార్కులు ఉంటాయి. ప్రశ్నపత్రంలో పార్ట్-ఎ 25 మార్కులకు, పార్ట్-బి 75 మార్కులకు ఉంటాయి. రెండు పార్టుల్లోనూ మల్టిపుల్ ఛాయిస్ ప్రశ్నలే ఉంటాయి. ఉద్యోగాన్ని అనుసరించి సిలబస్ వేర్వేరుగా ఉంటుంది. పోస్టులవారీగా సిలబస్ వివరాలు వెబ్సైట్లో త్వరలో అందుబాటులో ఉంచుతారు. పరీక్ష వ్యవధి 90 నిమిషాలు. ప్రతి తప్పు సమాధానానికీ 0.25 మార్కు తగ్గిస్తారు. టెస్ట్ సెంటర్లను అడ్మిట్కార్డ్లో తెలియజేస్తారు. సీబీటీకి ముందు దీన్ని వెబ్సైట్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి, పోస్టులో పంపరు. సీబీటీలో చూపిన ప్రతిభ ఆధారంగా కేటగిరీవారిగా అభ్యర్థుల తుది జాబితాను రూపొందిస్తారు.
గమనించాల్సినవి..
‣ ఒకటికంటే ఎక్కువ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు పోస్టుల ప్రాధమ్యాన్ని దరఖాస్తులో తెలియజేయాలి. ప్రతిపోస్టుకూ వేర్వేరుగా దరఖాస్తు ఫీజును చెల్లించాలి.
‣ పరీక్ష తేదీ, ఇతర సమాచారాన్ని అభ్యర్థి దరఖాస్తులో పేర్కొన్న ఈమెయిల్ ఐడీకి తెలియజేస్తారు.
‣ దరఖాస్తుకు చివరి తేదీ: 20.11.2023
‣ వెబ్సైట్: https://www.aiimsbhopal.edu.in/
-----------------------------------------------------------------------------------------------------------
* మొత్తం 450 ఖాళీల భర్తీ
* నవంబర్ 18, 19 తేదీల్లో పరీక్ష
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(RBI)లో అసిస్టెంట్ ఉద్యోగ రాత పరీక్ష కాల్లెటర్లు (Call Letter) విడుదలయ్యాయి. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు రిజిస్ట్రేషన్ నంబర్, పాస్వర్డ్ సాయంతో కాల్లెటర్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రాథమిక పరీక్షను (Prelimis) నవంబర్ 18, 19 తేదీల్లో, ప్రధాన పరీక్షను (Mainis) డిసెంబర్ 31వ తేదీల్లో నిర్వహించనున్నట్లు పేర్కొంది. ముంబయిలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా సర్వీస్ బోర్డు.. దేశవ్యాప్తంగా ఆర్బీఐ శాఖల్లో 450 అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామినేషన్, లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ టెస్ట్ ద్వారా అభ్యర్థుల ఎంపిక ఉంటుంది. ఎంపికైన అభ్యర్థులు దేశవ్యాప్తంగా ఉన్న ఆర్బీఐ శాఖల్లో విధులు నిర్వర్తించాల్సి ఉంటుంది. నెలకు రూ.20,700 నుంచి రూ.55,700 వేతనం అందుతుంది.
* ఏప్రిల్ 2న సీహెచ్ఎస్ఎల్, జూన్ 11న సీజీఎల్ నోటిఫికేషన్లు విడుదల
![]() |
దిల్లీ: కేంద్ర ప్రభుత్వంలోని పలు విభాగాల్లో ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసే స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (SSC) పరీక్షల క్యాలెండర్ను ప్రకటించింది. వచ్చే ఏడాది (2024-25)లో నిర్వహించే ఉద్యోగ నియామక పరీక్షల తేదీలతో ప్రత్యేక చార్ట్ను విడుదల చేసింది. దీంట్లో 2024 జనవరి నుంచి 2025 జనవరి వరకు నిర్వహించే గ్రేడ్-సి స్టెనోగ్రాఫర్, దిల్లీ పోలీస్ సబ్ఇన్స్పెక్టర్, సీఏపీఎఫ్, జూనియర్ ఇంజినీర్, మల్టీ టాస్కింగ్ సిబ్బంది, హవల్దార్ (సీబీఐసీ, సీబీఎన్), కానిస్టేబుల్ (జీడీ) తదితర ఉద్యోగ నియామక పరీక్షల తేదీలను ప్రకటించింది. ఆయా పోస్టులకు నోటిఫికేషన్, దరఖాస్తుల స్వీకరణ, కంప్యూటర్ ఆధారిత పరీక్షలు నిర్వహించే తేదీలను క్యాలెండర్లో పొందుపరిచింది. అప్పటి పరిస్థితులను బట్టి ఈ తేదీల్లో మార్పులు ఉండొచ్చు. పరీక్షల క్యాలెండర్ను ఈ కింది డాక్యుమెంట్లో చూడొచ్చు.
ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఆఫీస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ ఎస్యూరెన్స్/ క్వాలిటీ కంట్రోల్ నైపుణ్యాలు
హైదరాబాద్లో
స్టార్టూన్ ల్యాబ్స్
1. క్వాలిటీ అనలిటిక్స్
స్టైపెండ్: నెలకు రూ.3,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఆఫీస్, ప్రొడక్ట్ మేనేజ్మెంట్, క్వాలిటీ ఎస్యూరెన్స్/ క్వాలిటీ కంట్రోల్ నైపుణ్యాలు
internshala.com/i/427a28
2. లీడ్ జనరేషన్
స్టైపెండ్: నెలకు రూ.8,000
దరఖాస్తు గడువు: నవంబరు 16
అర్హతలు: కంటెంట్, డిజిటల్, ఈమెయిల్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, లింక్డ్ఇన్ మార్కెటింగ్, లీడ్ జనరేషన్, ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యాలు
internshala.com/i/e79a57
టెలికాలింగ్
సంస్థ: డెరైడ్ ట్రాన్స్పోర్టేషన్ సర్వీసెస్
స్టైపెండ్: నెలకు రూ.5,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఎంఎస్-ఎక్సెల్ నైపుణ్యాలు
internshala.com/i/4fca4f
కంటెంట్ రైటింగ్
సంస్థ: కొడెఫ్ట్ డిజిటల్
స్టైపెండ్: నెలకు రూ.15,000-20,000
దరఖాస్తు గడువు: నవంబరు 13
అర్హతలు: కంటెంట్ మార్కెటింగ్, కంటెంట్ రైటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/91a67f
ఆపరేషన్స్
సంస్థ: టెర్రాబ్లూ ఎక్స్టీ
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎంఎస్-ఆఫీస్ నైపుణ్యం
internshala.com/i/cc79d8
మీడియా అండ్ పీఆర్
సంస్థ: కనెక్షన్స్ ఐమేగ్
స్టైపెండ్: నెలకు రూ.15,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: క్రియేటివ్ రైటింగ్, ఇంగ్లిష్ మాట్లాడటం, రాయడం, సోషల్ మీడియా మార్కెటింగ్ నైపుణ్యాలు
internshala.com/i/0f14b9
మార్కెటింగ్
సంస్థ: రిజల్
స్టైపెండ్: నెలకు రూ.10,000
దరఖాస్తు గడువు: నవంబరు 14
అర్హతలు: డిజిటల్ మార్కెటింగ్, ఎఫెక్టివ్ కమ్యూనికేషన్, ఇంగ్లిష్ మాట్లాడటం, మార్కెటింగ్, సోషల్ మీడియా మార్కెటింగ్
internshala.com/i/46a5d7
విజయవాడ, గుంటుపల్లిలలో
వెబ్ డెవలప్మెంట్
సంస్థ: ఎకంప్సిస్ ఇండియా
స్టైపెండ్: నెలకు రూ.2,000
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: బూట్స్ట్రాప్, సీఎస్ఎస్, హెచ్టీఎంఎల్, జావాస్క్రిప్ట్, జెక్వెరీ, మైఎస్క్యూఎల్, పీహెచ్పీ, వర్డ్ప్రెస్ నైపుణ్యాలు
inte-rn-shala.-com/-i/-09-c8df-
గుంటూరు, గువాహటి, వైజాగ్, హైదరాబాద్, విజయవాడలలో
అకౌంటింగ్ అండ్ బుక్కీపింగ్
సంస్థ: నిధి ఎస్ జైన్ అండ్ కంపెనీ
స్టైపెండ్: నెలకు రూ.7,500
దరఖాస్తు గడువు: నవంబరు 15
అర్హతలు: ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ నైపుణ్యం
inte-rn-shala.-com/-i/-38fd-cd
పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో 53 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
పోస్టులు: 53
పాడేరులోని జిల్లా ప్రోగ్రామ్ మేనేజ్మెంట్ యూనిట్, నేషనల్ హెల్త్ మిషన్- అల్లూరి సీతారామరాజు జిల్లాలోని గ్రామాల్లో 53 ఆశా వర్కర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అర్హత: పదో తరగతితో పాటు ఖాళీ ఉన్న గ్రామ పరిధిలో నివసిస్తున్న మహిళలు అర్హులు. వయసు: 25-45 సంవత్సరాల మధ్య ఉండాలి.
ఎంపిక: ఆశా వర్కర్లను జిల్లా సెలక్షన్ కమిటీ ద్వారా ఎంపిక చేస్తారు.
దరఖాస్తు: వెబ్సైట్లో సూచించిన దరఖాస్తు నమూనా పూర్తి చేసి సంబంధిత పీహెచ్సీల్లో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
ప్రొవిజనల్ మెరిట్ జాబితా వెల్లడి: 15-11-2023.
అభ్యంతరాలు, ఫిర్యాదుల స్వీకరణ తేదీలు: 16, 17-11-2023.
తుది మెరిట్ జాబితా, ఎంపిక జాబితా వెల్లడి: 19-11-2023.
నియామక ఉత్తర్వుల జారీ: 20-11-2023.
వెబ్సైట్: https://allurisitharamaraju.ap.gov.in/
నంద్యాల జిల్లాలో అంగన్వాడీ ఖాళీలు
పోస్టులు: 26
నంద్యాల జిల్లా ఐసీడీఎస్ ప్రాజెక్టుల్లోని అంగన్వాడీ కేంద్రాల్లో 26 అంగన్వాడీ ఖాళీల భర్తీకి మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ ఆఫ్లైన్ దరఖాస్తులు కోరుతోంది.
మినీ అంగన్వాడీ కార్యకర్త: 01
అంగన్వాడీ ఆయా: 25
వయసు: 21 నుంచి 35 సంవత్సరాల మధ్య ఉండాలి.
అర్హత: 10వ తరగతి.
దరఖాస్తు: ఆఫ్లైన్ దరఖాస్తులను నంద్యాల జిల్లాలోని ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయంలో అందజేయాలి.
దరఖాస్తుకు చివరి తేదీ: 10-11-2023.
వెబ్సైట్: https://nandyal.ap.gov.in/
రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లో అసిస్టెంట్లు
పోస్టులు:12
బెంగళూరులోని రామన్ రిసెర్చ్ ఇన్స్టిట్యూట్ (ఆర్ఆర్ఐ).. 12 రెగ్యులర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
అసిస్టెంట్ సెక్యూరిటీ ఆఫీసర్- 01
అసిస్టెంట్ క్యాంటిన్ మేనేజర్- 01
అసిస్టెంట్- 09 బీ అసిస్టెంట్ 1- 01
అర్హత: ఇంటర్, సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు పని అనుభవం.
ఎంపిక: రాత పరీక్ష, స్కిల్ టెస్ట్ ఆధారంగా.
ఆన్లైన్ దరఖాస్తుకు చివరి తేదీ: 04-12-2023.
వెబ్సైట్: www.rri.res.in/careers/other-openings
మల్టీమీడియా ఎడిటర్, కెమెరామెన్లు
పోస్టులు: 6
హైదరాబాద్ రాజేంద్రనగర్లోని నేషనల్ ఇస్స్టిట్యూట్ ఆఫ్ అగ్రికల్చరల్ ఎక్స్టెన్షన్ మేనేజ్మెంట్ (మేనేజ్).. 6 పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
మల్టీమీడియా ఎడిటర్: 02 బీ కెమెరామెన్: 02
టెక్నికల్ అసిస్టెంట్: 02 అర్హత: ఇంటర్, సంబంధిత విభాగంలో డిగ్రీతో పాటు అనుభవం ఉండాలి.
ఇంటర్వ్యూ తేదీలు: 14, 15, 16-11-2023.
వేదిక: మేనేజ్, రాజేంద్రనగర్, హైదరాబాద్.
వెబ్సైట్: https://www.manage.gov.in/
పోటీ పరీక్షల ప్రత్యేకం
ఆర్టికల్ 243(డి) పంచాయితీ రిజర్వేషన్లు
• ఆర్టికల్ 243(డి3) ప్రకారం ప్రత్యక్ష ఎన్నిక ద్వారా భర్తీ అయ్యే సీట్లలో కనీసం మూడో వంతు మహిలలకు కేటాయించాలి.
• ఆర్టికల్ 243(డి4) ప్రకారం గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్ స్థాయులన్నింటిలో మొత్తం అధ్యక్ష స్థానాల్లో మూడో వంతు మహిళలకు కేటాయించాలి.
• ఆర్టికల్ 243(డి5) ప్రకారం మహిళా రిజర్వేషన్లు మినహా అన్ని రిజర్వేషన్లు ఆర్టికల్ 334లో పేర్కొన్నంతకాలం కొనసాగుతాయి.
• ఆర్టికల్ 243(డి6) ప్రకారం పంచాయితీ రాజ్ సంస్థల్లో ఇతర వెనకబడిన తరగతుల రిజర్వేషన్లను సంబంధిత రాష్ట్ర శాసనసభ నిర్దేశిస్తుంది.
• మహిళల రిజర్వేషన్లు: దేశవ్యాప్తంగా మొత్తం 20 రాష్ట్రాల పంచాయితీ రాజ్ సంస్థల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నారు. వీటిలో మొదటగా బిహార్ రాష్ట్రంలో కల్పించారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, బిహార్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్,జార్ఖండ్, కేరళ, అసోం, చత్తీస్గఢ్, కర్ణాటక, ఒడిషా, త్రిపుర, రాజస్థాన్, ఉత్తరాఖండ్, హిమాచల్ప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, పంజాబ్, సిక్కిం, తమిళనాడు రాష్ట్రాల్లో రిజర్వేషన్లు అమలవుతున్నాయి. మరో ఎనిమిది రాష్ట్రాలు హరియాణా, గోవా, అరుణాచల్ ప్రదేశ్, నాగాలాండ్, మణిపూర్, మిజోరాం, ఉత్తరప్రదేశ్, మేఘాలయలో రిజర్వేషన్లు కల్పించడంలేదు.
ఆర్టికల్ 243(ఇ) పంచాయితీరాజ్ సంస్థల కాల పరిమితి
• ఆర్టికల్ 243(ఇ1) ప్రకారం పంచాయితీరాజ్ సంస్థల ఎన్నికల అనంతరం జరిగే మొదటి సమావేశం నుంచి పంచాయితీల కాల పరిమితి అయిదేళ్లు. అయిదేళ్ల కాలం ముగియక ముందే రాష్ట్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయవచ్చు.
• ఆర్టికల్ 243(ఇ2) ప్రకారం పంచాయితీరాజ్ సంస్థల పదవీకాలం అయిదేళ్లలో రాష్ట్ర శాసనసభ ఏదైనా చట్టాన్ని తీసుకొచ్చినపుడు దానిలో పంచాయితీలకు సంబంధించిన అంశాలు ఉంటే అవి పంచాయితీ సంస్థల పదవీకాలం పూర్తయ్యే వరకు వర్తించవు.
• ఆర్టికల్ 243(ఇ3) ప్రకారం పంచాయితీల పదవీకాలం అయిదేళ్లు ముగియక ముందే రద్దయితే ఆర్నెల్లలోపు తప్పనిసరిగా ఎన్నికలు నిర్వహించాలి. అయితే సంస్థ (గ్రామ పంచాయితీ, మండల పరిషత్, జిల్లా పరిషత్) పదవీకాలం ముగిసేందుకు ఆర్నెల్ల కంటే తక్కువ సమయం ఉంటే ఉప ఎన్నికలు నిర్వహించాల్సిన అవసరం లేదు.
• ఆర్టికల్ 243(ఇ4) ప్రకారం పదవీకాలం ముగియకమందే ఒక పంచాయితీ రద్దయి నూతన పంచాయితీ ఉప ఎన్నిక ద్వారా ఏర్పడినపుడు అది మిగిలిన కాలానికి మాత్రమే అధికారంలో ఉంటుంది.
ఆర్టికల్ 243(ఎఫ్) పంచాయితీ సభ్యుల అర్హతలు, అనర్హతలు
• ఆర్టికల్ 243(ఎఫ్1) ప్రకారం రాష్ట్ర శాసనసభల చట్టం ద్వారా రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించి కానీ, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి గానీ అనర్హులుగా ప్రకటించిన వ్యక్తులు పంచాయితీ సంస్థల ఎన్నికల పోటీకి అనర్హులు.
• ఆర్టికల్ 243(ఎఫ్2) ప్రకారం ఒక పంచాయితీ సభ్యుడు పదవిలో కొనసాగేందుకు అర్హుడా కాదా అన్న అంశం వివాదాస్పదమైనపుడు ఆ అంశాన్ని శాసన సభ ఏర్పాటు చేసిన అఽథారిటీ నిర్ణయానికి పంపాలి. అర్హతలు/అనర్హతలను రాష్ట్ర విధానసభ నిర్ధారించవచ్చు.
ఉదా: తెలుగు రాష్ట్రాల్లో 1995 తరవాత ఇద్దరి కంటే ఎక్కువ సంతానం ఉన్నవారు స్థానిక సంస్థల్లో పోటీ చేసేందుకు అనర్హులు. అలాగే స్థానిక సంస్థలకు పోటీ చేసే అభ్యర్థులకు కనీస వయసు 21 ఏళ్లు.
ఆర్టికల్ 243(జి) పంచాయితీల అధికారాలు–విధులు
• భారత రాజ్యాంగంలో పదకొండో షెడ్యూల్లో పేర్కొన్న 29 అంశాలపై అధికారాలు, విధులను పంచాయితీరాజ్ సంస్థలకు రాష్ట్ర ప్రభుత్వాలు అప్పగించాల్సి ఉంటుంది. అవి వ్యవసాయం–వ్యవసాయ విస్తరణ, భూ అభివృద్ధి–భూ సంస్కరణల అమలు–భూ స్థిరీకరణ–భూసారపు పరిరక్షణ, చిన్న నీటి పారుదల–నీటి నిర్వహణ–వాటర్ షెడ్ల అభివృద్ధి, పశు సంవర్థకం–డెయిరీ–పౌల్ట్రీ, మత్స్య పరిశ్రమ, సామాజిక అడవులు–వ్యవసాయ క్షేత్ర అడవుల అభివృద్ధి, చిన్న తరహా అటవీ ఉత్పత్తులు, చిన్న తరహా పరిశ్రమలు–ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమలు, ఖాదీ–గ్రామీణ–కుటీర పరిశ్రమలు, గ్రామీణ గృహ వసతి, తాగునీరు, ఇంధనం–పశుగ్రాసం, రహదారులు–చిన్న వంతెనలు–ఫెర్రీలు–జలమార్గాలు–ఇతరత్రా రాకపోకల విధానాలు, గ్రామీణ విద్యుదీకరణ–విద్యుత్ పంపిణీ, సంప్రదాయేతర ఇంధన వనరులు, పేదరిక నిర్మూలన కార్యక్రమం, ప్రాథమిక–మాధ్యమిక పాఠశాల విద్య, సాంకేతిక శిక్షణ–వృత్తి విద్య, వయోజన–అనియత విద్య, గ్రంథాలయాలు, సాంస్కృతిక కార్యకలాపాలు, మార్కెట్లు–సంతలు, ఆసుపత్రులు–ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు–డిస్పెన్సరీలు సహా ఆరోగ్యం–పారిశుధ్యం, కుటుంబ సంక్షేమం, మహిళ–శిశు అభివృద్ధి, వికలాంగులు–మానసిక వికలాంగుల సంక్షేమం సహా సామాజిక సంక్షేమం, బలహీన వర్గాల సంక్షేమం–ఎస్సీ, ఎస్టీల సంక్షేమం, ప్రజా పంపిణీ వ్యవస్థ, సామాజిక ఆస్తుల నిర్వహణ–పరిరక్షణ.
ఆర్టికల్ 243 (హెచ్) ఆదాయ వనరులు
• పంచాయితీరాజ్ సంస్థలకు సమకూరే ఆదాయాలు: రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు(స్థానిక సంస్థలకు సమకూరే ప్రధాన ఆదాయ వనరు), కేంద్ర ప్రభుత్వం ఇచ్చే నిధులు, విరాళాలు, రాష్ట్ర శాసనసభ నిర్దేశించిన మేరకు (చట్టం చేయడం ద్వారా) ఆర్టికల్ 265 ప్రకారం విధించే పన్నులు.
Description: Badhte Kadam Scholarship 2023-24 aims to help high-performing students from lesser privileged backgrounds overcome financial barriers and successfully pursue their education.
Badhte Kadam Scholarship
Eligibility: Indian students who are currently pursuing general or professional graduation courses are eligible.
● Students with disabilities having a disability level of more than 40% and a valid document can also apply.
● Must have obtained at least 70% marks (60% for students with disabilities) in the previous class or board exams. ● Annual family income of the applicants should be below INR 6 lakh from all sources.
Prizes & Rewards: Up to INR 1,00,000
Last Date: 20-11-2023 Application: Online only
Short Url: www.b4s.in/aj/HTPF20
BYPL SASHAKT Scholarship
Description: An initiative by BSES Yamuna Power Limited (BYPL) to provide financial assistance to students coming from underprivileged sections of the society to help them pursue their higher education.
Eligibility: Open for Indian nationals residing in Delhi only. ● Applicants must be studying in the final-year of the undergraduate programme (any stream) in any government institute in Delhi. ● Must have secured more than 55% marks in their last appeared examination. ● Annual family income of the applicant must not be more than 6,00,000 from all sources.
Prizes & Rewards: Up to 30,000
Last Date: 15-12-2023 Application: Online only
Short Url: www.b4s.in/aj/BYPL4

గుంటూరులోని ఆచార్య ఎన్.జీ రంగా అగ్రికల్చరల్ యూనివర్సిటీ(ఏఎన్జీఆర్ఏయూ)–ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద డిగ్రీ కోర్సుల్లో ప్రవేశానికి ఫైనల్ ఫేజ్ నోటిఫికేషన్ను విడుదల చేసింది. బీఎస్సీ (ఆనర్స్), బీటెక్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ప్రవాస భారతీయుల పిల్లలు, వారు స్పాన్సర్ చేసిన బంధువుల పిల్లలు దరఖాస్తు చేసుకోవచ్చు.
కోర్సులు–సీట్లు: ప్రతి కోర్సులో ఎన్ఆర్ఐ/ఎన్ఆర్ఐ స్పాన్సర్డ్ కోటా కింద 15 శాతం సూపర్న్యూమరరీ సీట్లు కేటాయించారు. బీఎస్సీ(ఆనర్స్) కోర్సులో అగ్రికల్చర్ 122, కమ్యూనిటీ సైన్స్ 14 సీట్లు ఉన్నాయి. బీటెక్ కోర్సులో అగ్రికల్చరల్ ఇంజనీరింగ్, ఫుడ్ టెక్నాలజీ విభాగాలకు ఒక్కోదానిలో 18 సీట్లు ఉన్నాయి.
● దరఖాస్తు ఫీజు: రూ.2,000
● దరఖాస్తు చేరేందుకు చివరి తేదీ: నవంబరు 18
● వెబ్సైట్: angrau.ac.in
ఈ కంటెంట్ నచ్చిందా? / Liked this content? ఇది ఉచితం. మీకు నచ్చితే ₹1 ఇచ్చి మాకు మద్దతు తెలపండి. This content...