ఆంధ్రప్రదేశ్
రాష్ట్రంలో MBBS మరియు BDS కోర్సులలో ప్రవేశాలకు నిర్వహించే కౌన్సిలింగ్
షెడ్యూల్ -2020 పై ఎన్టీఆర్ ఆరోగ్య యూనివర్సిటీ ఒక అధికారిక ప్రకటన
చేసినది.
ఈ సారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ సారి ఎంబీబీఎస్ మరియు
బీడీఎస్ కౌన్సిలింగ్ లు విడివిడిగా నిర్వహించనున్నారు. ఈ కౌన్సిలింగ్ తేదీల
షెడ్యూల్ త్వరలోనే విడుదల కానుంది.
అభ్యర్థులు ఈ
షెడ్యూల్ ప్రకారం ఎంబీబీఎస్ మరియు బీడీఎస్ కోర్సులలో ప్రవేశాలకు ప్రకటించిన
తేదీలలో కళాశాలల ఎంపికకు ఆప్షన్స్ ఇవ్వవలసి ఉంటుంది.
ఈ ఉత్తర్వుల
ప్రకారం అభ్యర్థులు సీట్లు కేటాయించిన కళాశాలల్లో చేరకుండా ఉంటే, తరువాతి
కౌన్సిలింగ్ లో పాల్గొనే అర్హత ఉండదు అని ఎన్టీఆర్ ఆరోగ్య వర్సిటీ ఒక
ప్రకటనలో తెలిపింది.