రాష్ట్రంలోని లా కోర్సులు నిర్వహిస్తున్న కాలేజీల్లో ఫీజులను ఖరారు చేస్తూ ఉన్నత విద్యా శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సతీష్చంద్ర బుధవారం ఉత్తర్వులిచ్చారు.
2020-21 నుంచి 2022-23 బ్లాక్ పీరియడ్కు ఈ ఫీజులు వర్తించనున్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులకు కనిష్ఠం రూ.10 వేలుగా, గరిష్ఠం రూ.13 వేలుగా నిర్ణయించారు. ఐదేళ్ల డిగ్రీ కోర్సులకు కనిష్ఠం రూ.12 వేలు, గరిష్ఠం రూ.13 వేలుగా ఖరారు చేశారు. ఎంఎల్, ఎల్ఎల్ఎం కోర్సులకు కనిష్ఠం రూ.12 వేలు కాగా, గరిష్ఠం రూ.13 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చారు.
2020-21 నుంచి 2022-23 బ్లాక్ పీరియడ్కు ఈ ఫీజులు వర్తించనున్నాయి. మూడేళ్ల డిగ్రీ కోర్సులకు కనిష్ఠం రూ.10 వేలుగా, గరిష్ఠం రూ.13 వేలుగా నిర్ణయించారు. ఐదేళ్ల డిగ్రీ కోర్సులకు కనిష్ఠం రూ.12 వేలు, గరిష్ఠం రూ.13 వేలుగా ఖరారు చేశారు. ఎంఎల్, ఎల్ఎల్ఎం కోర్సులకు కనిష్ఠం రూ.12 వేలు కాగా, గరిష్ఠం రూ.13 వేలుగా నిర్ణయిస్తూ ఉత్తర్వులిచ్చారు.
కామెంట్లు