నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షకు కొత్త నిబంధన**♦️. 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపు పుట్టిన వారే అర్హులట**♦️. అనర్హులుగా మారనున్న ఎందరో విద్యార్థులు**♦️. ఆగస్టు 21 వరకు జరిగిన స్కూల్‌ అడ్మిషన్లు**♦️. కొత్త నిబంధనతో అడ్మిషన్లకు ఆటంకమే*

🌻భీమవరం ఎడ్యుకేషన్‌, జనవరి 30 :* జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో ప్రవేశం కోసం పెట్టిన వయస్సు నిబంధన అర్హులకు అడ్డుకట్ట వేస్తోంది. నవోదయ స్కూళ్లలో ఆరో తరగతిలోకి ప్రవేశానికి సంబంధించిన నోటిఫికేషన్‌లో నవోదయ విద్యాలయ సమితి 2013 ఏప్రిల్‌ 30వ తేదీ లోపల పుట్టిన వారు మాత్రమే ప్రవేశ పరీక్షకు అర్హతగా నిర్ధారించారు. దాంతో అనేక మంది విద్యార్థులు నష్టపోనున్నారు. ఏటా ఆగస్టు 31వ తేదీ వరకు అడ్మిషన్లు నిర్వహిస్తుంటారు. ఐదో తరగతిలో చేరే విద్యార్థులకు ఆ లెక్కనే వయస్సు పరిగణలోకి తీసుకుని అడ్మిషన్లు కల్పిస్తారు. అంటే జూన్‌, జూలై, ఆగస్టు నెలల్లో పుట్టిన తేదీ ఉన్నవారు కూడా ఐదో తరగతిలో అడ్మిషన్లు పొందారు. అలాంటి వారు కొత్త నిబంధన వల్ల నవోదయ పరీక్షకు అనర్హులవుతున్నారు. జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 12,630 మంది విద్యార్థులు 5వ తరగతి చదువుతున్నారు. వీరిలో 50 శాతం మందితో నవోదయ ప్రవేశ పరీక్షకు దరఖాస్తు చేయించాలన్న సూచనలు జిల్లా వైద్యశాఖ అధికారుల నుంచి వస్తున్నట్టు సమాచారం అంటే 6 వేలకు పైగా దరఖాస్తులు రావాలి. గతేడాది 6 వేలు వరకు వచ్చాయి. ఈ ఏడాది వయస్సు నిబంధనతో ఈ సంఖ్య తగ్గడం ఖాయమని హెచ్‌ఎంలు చెబుతున్నారు. తొలుత ఈనెల 31తో దరఖాస్తుకు ఆఖరు తేదీ అని ప్రకటించినా గడువు తేదీని ఫిబ్రవరి 8వ తేదీ వరకు పెంచడంతో కొంత ఊరట లభించింది. అయితే వయస్సు నిబంధన సడలించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. కొన్ని పాఠశాలల్లో వయస్సు నిబంధన లేకుండా దరఖాస్తు చేశారు. వాటికి అనుమతి ఇస్తారో లేదో చూడాలి.

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh