నిరుద్యోగులకు జగన్‌ సర్కార్‌ న్యూ ఇయర్‌ గిఫ్ట్‌.. త్వరలో ఆ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్‌.. జిల్లాల వారీ ఖాళీల వివరాలివే

 

ప్రధానాంశాలు:

  • 403 బ్యాక్‌ లాగ్‌ టీచర్‌ పోస్టుల భర్తీకి కసరత్తు
  • త్వరలో లిమిటెడ్‌ డీఎస్సీ నోటిఫికేషన్‌
  • అనంతరం రెగ్యులర్‌ డీఎస్సీ
  • డీఎస్సీకి ముందు టెట్‌
  • టెట్‌ సిలబస్‌లో మార్పులు

ఏపీలో టీచర్‌ పోస్టుల భర్తీకి సంబంధించి విద్యాశాఖ కసరత్తు ప్రారంభించింది. ప్రస్తుతం జరుగుతున్న బదిలీల ప్రక్రియ ముగిసిన తరువాత టీచర్‌ పోస్టుల ఖాళీల భర్తీకి శ్రీకారం చుట్టనున్నట్లు సమాచారం. ముందుగా బ్యాక్‌లాగ్‌ పోస్టుల భర్తీకి లిమిటెడ్‌ డీఎస్సీ నిర్వహించనున్నారు. గత డీఎస్సీల్లో మిగిలిపోయిన రిజర్వుడ్‌ కేటగిరీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం విద్యాశాఖకు మార్చిలోనే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది. కరోనా కారణంగా ఆ ప్రక్రియ ముందుకు సాగలేదు.

ప్రభుత్వ పాఠశాలల్లో మిగిలిపోయిన 403 బ్యాక్‌లాగ్‌ పోస్టులను అధికారులు గుర్తించారు. ఈ లిమిటెడ్‌ డీఎస్సీ వల్ల ముందు ఆయా వర్గాల వారికి మేలు చేకూరనుంది. డీఎస్సీ-2018లో మిగిలిన బీసీ, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగుల ఖాళీలను భర్తీచేయనున్నారు. ఆ పోస్టులకు అర్హులైన ఆ కేటగిరీ అభ్యర్థులు లేకపోతే వాటిని జనరల్‌ కోటాలో తదుపరి డీఎస్సీలో భర్తీచేసే అవకాశాలున్నాయి.

సంక్షేమ స్కూళ్లలో ఖాళీలు: 182

  • జోన్‌ -1: మొత్తం ఖాళీలు 58 (టీజీటీ-7, పీజీటీ-51)
  • జోన్‌ -2: మొత్తం ఖాళీలు 5 (పీజీటీ)
  • జోన్‌ -3: మొత్తం ఖాళీలు 47 (టీజీటీ-7, పీజీటీ-40)
  • జోన్‌ -4: మొత్తం ఖాళీలు 72 (టీజీటీ-4, పీజీటీ-68)

జిల్లాల వారీగా ఖాళీలు: 221
(ప్రభుత్వ, జెడ్పీ, మండల పరిషత్‌, మున్సిపల్‌ స్కూళ్లలో ఖాళీలు)
  • శ్రీకాకుళం - 42
  • విజయనగరం - 7
  • విశాఖపట్నం - 12
  • తూర్పుగోదావరి - 12
  • పశ్చిమ గోదావరి - 16
  • క`ష్ణా - 6
  • గుంటూరు - 5
  • ప్రకాశం - 3
  • నెల్లూరు - 7
  • కడప - 20
  • చిత్తూరు - 37
  • కర్నూలు - 33
  • అనంతపురం - 21

ఆన్‌లైన్‌ పరీక్ష..!
జనవరిలో ఇతర పోటీ పరీక్షలు ఉండటంతో డీఎస్సీని ఆన్‌లైన్‌ ద్వారా ఫిబ్రవరిలో నిర్వహించే అవకాశాలున్నాయి. ఈ మేరకు ఆన్‌లైన్‌ పరీక్ష కోసం సాంకేతిక పరిజ్ఞానం అందించే సంస్థ స్లాట్ కేటాయించింది. ఈలోపు ఖాళీల సేకరణ, దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియ పూర్తి చేయనున్నారు.

ఫస్ట్‌ టెట్.. తర్వాత రెగ్యులర్‌ డీఎస్సీ‌:
ఈ ప్రక్రియ పూర్తయిన తరువాత రెగ్యులర్‌ డీఎస్సీకి చర్యలు తీసుకోనున్నారు. ఈ డీఎస్సీకి ముందుగా టీచర్‌ ఎలిజిబులిటీ టెస్టు (టెట్‌) నిర్వహిస్తారు. రాష్ట్రంలో ఇంగ్లిష్‌ మీడియాన్ని ప్రవేశపెడుతున్న నేపథ్యంలో ఈసారి టెట్‌ సిలబస్‌లో మార్పులు చేస్తున్నారు. టెట్‌ అనంతరం రెగ్యులర్‌ డీఎస్సీని నిర్వహించే అవకాశాలున్నాయి.

2020–21 విద్యాసంవత్సరం కోసం 8,700 కొత్త పోస్టులను నోటిఫై చేయాలని విద్యాశాఖ గతంలో ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ఇటీవల 2018 డీఎస్సీకి సంబంధించి 3000 ఎస్‌జీటీ పోస్టులను భర్తీచేశారు. ప్రస్తుత బదిలీల్లో గ్రామీణ ప్రాంత స్కూళ్లకు ఇబ్బంది లేకుండా ఉండేందుకు 15 వేల వరకు పోస్టులను బ్లాక్‌ చేసినట్లు మంత్రి ప్రకటించినందున ఆ మేరకు రానున్న డీఎస్సీకి పోస్టులు అందుబాటులో ఉండవచ్చని అంచనా.

 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh