29, సెప్టెంబర్ 2021, బుధవారం

Navodaya Vidyalayas: ఆరో తరగతి ప్రవేశాలకు దరఖాస్తుల స్వీక‌ర‌ణ‌ / ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021

Gemini Internet

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖకు చెందిన నవోదయ విద్యాలయ సమితి (ఎన్‌వీఎస్‌).. దేశవ్యాప్తంగా ఉన్న జవహర్‌ నవోదయ విద్యాలయాల్లో(జేఎన్‌వీ).. 2022–2023 విద్యా సంవత్సరానికి సంబంధించి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు కోరుతోంది.

అర్హత: 2021–22 విద్యా సంవత్సరంలో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
వయసు: 01.05.2009 నుంచి 30.04.2013 మధ్య జన్మించి ఉండాలి.

ఎంపిక విధానం: సెలక్షన్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపికచేస్తారు.
పరీక్షా విధానం: ఈ పరీక్షని ఆబ్జెక్టివ్‌ విధానంలో 100 మార్కులకు  నిర్వహిస్తారు. మొత్తం 3 సెక్షన్ల నుంచి 80 ప్రశ్నలు ఉంటాయి. పరీక్ష సమయం రెండు గంటలు.

దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 30.11.2021
పరీక్ష తేది: 30.04.2022

వెబ్‌సైట్‌: https://navodaya.gov.in/

కామెంట్‌లు లేవు: