Alerts

Loading alerts...

26, సెప్టెంబర్ 2022, సోమవారం

సచివాలయాల్లోనే దరఖాస్తు చేసుకుంటే చాలు..ఒక చోట నుంచి మరో చోటుకు మారినపింఛన్దారులకు ప్రభుత్వం వెసులుబాటు


సాక్షి, అమరావతి: పింఛన్ లబ్దిదారు సొంత రాష్ట్ర పరిధిలో తన పింఛన్ ను ఓ చోట నుంచి మరొక చోటకి మార్చుకునేందుకు ప్రభుత్వం వెసులుబాటు కల్పించింది. ఇందులోభాగంగా లబ్దిదారులు తమ నివాసాన్ని ఒక చోట నుంచిమరొక చోటకి మారే సమయంలో ఆ వివరాలతో సంబం
ధిత గ్రామ వార్డు సచివాలయాల్లో దరఖాస్తు చేసుకుంటేసరిపోతుందని ప్రభుత్వం ప్రకటించింది. ఈ మేరకు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి
గోపాలకృష్ణ ద్వివేది ఉత్తర్వులిచ్చారు. అలాగే, నిబంధనలప్రకారం అర్హత లేని వారికి కూడా కొత్తగా పింఛన్లుమంజూరు చేసే అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకోనుంది. అనర్హులకు పింఛన్ మంజూరు చేస్తే ఆ సొమ్మును మంజూరు చేసిన వారి నుంచి రికవరీ చేయనుంది.పింఛన్ల సొమ్మును దుర్వినియోగ పరచడం.. పంపిణీ చేయకుండా మిగిలిపోయిన సొమ్మును తిరిగి ప్రభుత్వ
ఖాతాలో జమ చేయకుండా ఉండే సిబ్బందిపైనా తగిన చర్యలు తీసుకోనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

కామెంట్‌లు లేవు:

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...