16, జూన్ 2023, శుక్రవారం

APBIE: ఇంటర్‌ రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు చివరి తేదీ ఇదే.

అమరావతి: ఇంటర్మీడియట్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలు జూన్‌ 13 సాయంత్రం విడుదలయ్యాయి. 

తాడేపల్లిలోని ఇంటర్మీడియట్‌ బోర్డు కార్యాలయంలో బోర్డు కార్యదర్శి ఎంవీ శేషగిరిబాబు ఫలితాలు విడుదల చేశారు. ఈ ఏడాది సప్లిమెంటరీకి 2,51,653 మంది జనరల్‌ అభ్యర్థులు, ఒకేషనల్‌ కోర్సులకు 26,735 మంది, మరో 38,666 మంది ప్రైవేటు విద్యార్థులు హాజరైనట్టు వివరించారు. మొదటి సంవత్సరం 1,69,347 మంది బెటర్‌మెంట్‌ రాశారన్నారు. కాగా, ఈ ఏడాది మార్చి, మే నెలల్లో నిర్వహించిన పరీక్షల్లో మొత్తం 84.35 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. మొదటి సంవత్సరం రెండు దశల్లోను 4,16,639 మంది పరీక్షకు హాజరు కాగా మార్చిలో 2,66,326 మంది, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో 56,767 (77.54 శాతం) మంది ఉత్తీర్ణులైనట్టు తెలిపారు.

ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లమెంటరీకి 3,73,341 మంది హాజరవగా,  మార్చిలో 2,72,001, సప్లిమెంటరీలో 42,931 (84.35 శాతం) మంది ఉత్తీర్ణులైనట్లు చెప్పారు. రీ వెరిఫికేషన్, రీ కౌంటింగ్‌కు జూన్‌ 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని ఆయన సూచించారు. మొదటి సంవత్సరం బెటర్‌మెంట్‌కు హాజరైన 1,69,347 మందిలో 1,41,733 (83.69 శాతం) మంది ఇంప్రూవ్‌మెంట్‌ సాధించారు. మార్చిలో ఫెయిలైన 1,50,313 మంది సప్లిమెంటరీ పరీక్షలకు హాజరుకాగా 56,767 మంది (37.77 శాతం) ఉత్తీర్ణత సాధించారు. 

  • మార్చిలో ద్వితీయ సంవత్సరం ఫెయిలైన 1,01,340 మంది విద్యార్థులు అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీకి హాజరవగా 42,931 (42.36 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రైవేటు విద్యార్థులు 38,666 మందిలో 14,395 (37.22 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. మార్చి, అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీలో ద్వితీయ ఇంటర్‌లో బాలికలు 86.46 శాతం, బాలురు 81.99 శాతం ఉత్తీర్ణత సాధించగా, మొదటి సంవత్సరం ఫలితాల్లో బాలికలు 80.56 శాతం, బాలురు 74.34 శాతం ఉత్తీర్ణత సాధించారు. 
  • జిల్లాల వారీగా మొదటి సంవత్సరం ఫలితాల్లో కృష్ణా జిల్లా (88.38 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (63.32 శాతం) చివరి స్థానంలో నిలిచాయి. ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో పశ్చిమ గోదావరి (97.32 శాతం) మొదటి స్థానంలో, వైఎస్సార్‌ జిల్లా (75.95 శాతం) చివరి స్థానంలో ఉన్నాయి. 
  • ఒకేషనల్‌ విభాగంలో మొదటి సంవత్సరం విద్యార్థులు 78.53 శాతం, ద్వితీయ సంవత్సరంలో 84.69 శాతం మంది ఉత్తీర్ణులయ్యారు. 
  • ఫలితాలను  www.bie.ap.gov.in వెబ్‌సైట్‌లో చూడవచ్చని శేషగిరిబాబు తెలిపారు.

------------------------------------------------------------------------ For applications visit Gemini Internet with your own ATM. Gemini Internet, D L Road, Hindupur 9640006015 | మీ స్వంత ATMతో అప్లికేషన్ల కోసం జెమిని ఇంటర్నెట్‌ని సందర్శించండి. జెమిని ఇంటర్ నెట్, D L రోడ్, హిందూపూర్ 9640006015. మరెన్నో అప్డేట్స్ కోసం మా టెలిగ్రామ్ ఛానెల్ లో జాయిన్ అవ్వగలరు https://t.me/GEMINIINTERNETHINDUPUR రిటైర్ అయిన పభుత్వ ఉద్యోగులకు /ఉద్యోగులకు బయోమెట్రిక్ ద్వారా లైఫ్ సర్టిఫికేట్ (జీవన్ ప్రమాణ్ | Jeevan Pramaan) కొరకు సంప్రదించండి, జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 వెల రూ.50/-. వేలి ముద్ర పడని వారి లైఫ్ సర్టిఫికేట్ ను రూ.100/-తో ఐరిస్ స్కానింగ్ తో జీవన్ ప్రమాణ్ లైఫ్ సర్టిఫికేట్ ను సమర్పించబడును. Instant పాన్ కార్డు కేవలం రూ.50/-మాత్రమే ఆధార్ కార్డుకు సెల్ ఫోన్ లింక్ అయి ఉన్న వారికి మాత్రమే సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ (9640006015) నందు సంప్రదించవచ్చును. పాస్ పోస్ట్ అప్లై చేయాలకునే వారు ఆధార్ ఫోటో స్టాట్ (జిరాక్స్), పదవ తరగతి (చదివుంటే) ఫోటో స్టాట్ (జిరాక్స్), ఎ టి ఎం కార్డు దాని లింక్ అయిన ఫోన్ తో పాటు తీసుకుని సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. వెల రూ.100/-. తెలుగు టైపింగ్ రూ.60/-ఒక పేజి/ఒక ప్రక్క | ఇంగ్లీషు టైపింగ్ రూ.40/-ఒక పేజి / ఒక ప్రక్క | టైపింగ్ సేవల కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్ హిందూపురం (9640006015) నందు సంప్రదించవచ్చును. జాబ్స్ అప్లికేషన్ (ఉద్యోగాలు)/ఎంట్రాన్స్ అప్లికేషన్ (ప్రవేశాలు)/స్కాలర్ షిప్ అప్లికేషన్ (ఉపకారవేతనాలు) అప్లికేషన్ లను అప్లై చేయడానికి రూ.100/- డిజిటల్ సిగ్నేచర్ (Rs.1500/-) with epass Token కొరకు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం EPF అప్లై చేయాలనుకునే వారు సంప్రదించండి జెమిని ఇంటర్ నెట్, ధనలక్ష్మి రోడ్, హిందూపురం 9640006015 | ప్రతి కన్సల్ టింగ్ కు రూ.50/- https://geminiinternethindupur.blogspot.com/p/pf.html

కామెంట్‌లు లేవు: