JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీల్లో మార్పు * మే 26న యథాతథంగా పరీక్ష

JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ తేదీల్లో మార్పు

* మే 26న యథాతథంగా పరీక్ష

చెన్నై: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌ పరీక్ష రిజిస్ట్రేషన్‌ షెడ్యూల్‌లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం జేఈఈ మెయిన్‌లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్‌ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్‌డ్‌ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్‌ 27 నుంచి మే 7 సాయంత్రం 5గంటల వరకు మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్‌ ప్రకటించింది. పరీక్ష తేదీలో మార్పు లేదని, మే 26న యథాతథంగా పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. అడ్మిట్‌ కార్డులు మే 17 నుంచి ఆన్‌లైన్‌లో అందుబాటులోకి రానున్నాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్‌ అభ్యర్థుల రెస్పాన్స్‌ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్‌ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్‌ 9న ప్రకటిస్తారు.


  జేఈఈ అడ్వాన్స్‌డ్‌ వెబ్‌సైట్‌ 

కామెంట్‌లు

ఈ బ్లాగ్ నుండి ప్రసిద్ధ పోస్ట్‌లు

అనంతపురం ఉమ్మడి జిల్లా కోర్టులో ఉద్యోగాలు హిందూపురంలో కూడా అవకాశం అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్ ధనలక్ష్మి రోడ్ హిందూపురం | Anantapur Joint District Court Jobs in Hindupur also opportunity for applications contact Gemini Internet Dhanalakshmi Road Hindupur

విద్యాలక్ష్మి లోన్ (విద్యా రుణం) కోసం Requirements for Vidyalakshmi Loan (Education Loan)

ఆంధ్ర ప్రదేశ్లో ఇంజినీరింగ్ అలాగే ఫార్మసీ కోర్సుల్లో జాయిన్ అవ్వాలనుకుంటున్న MPC & BiPC విద్యార్థులు వ్రాయాల్సిన entrance టెస్ట్ AP EAPCET 2024-25 అవసరమైన వివరాలు AP EAPCET 2024-25 Necessary Details | Entrance test for MPC & BiPC students who want to join engineering and pharmacy courses in Andhra Pradesh