JEE Advanced 2024: జేఈఈ అడ్వాన్స్డ్ రిజిస్ట్రేషన్ తేదీల్లో మార్పు
* మే 26న యథాతథంగా పరీక్ష
చెన్నై: ప్రతిష్ఠాత్మక ఐఐటీల్లో 2024-25 విద్యా సంవత్సరానికి బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి ఏటా నిర్వహించే జేఈఈ అడ్వాన్స్డ్ పరీక్ష రిజిస్ట్రేషన్ షెడ్యూల్లో మార్పు చోటుచేసుకుంది. తొలుత ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం జేఈఈ మెయిన్లో అర్హత సాధించిన విద్యార్థులు ఏప్రిల్ 21 నుంచి 30 వరకు అడ్వాన్స్డ్ కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉండగా.. దాన్ని ఏప్రిల్ 27 నుంచి మే 7 సాయంత్రం 5గంటల వరకు మార్పు చేసినట్లు ఐఐటీ- మద్రాస్ ప్రకటించింది. పరీక్ష తేదీలో మార్పు లేదని, మే 26న యథాతథంగా పరీక్ష జరుగుతుందని స్పష్టం చేసింది. జేఈఈ అడ్వాన్స్డ్ దరఖాస్తు ఫీజు చెల్లింపునకు మే 10 వరకు గడువు ఇచ్చారు. అడ్మిట్ కార్డులు మే 17 నుంచి ఆన్లైన్లో అందుబాటులోకి రానున్నాయి. జేఈఈ అడ్వాన్స్డ్ అభ్యర్థుల రెస్పాన్స్ షీట్లు మే 31 నుంచి అందుబాటులో ఉంచుతారు. ప్రాథమిక కీ జూన్ 2న విడుదల చేసి తుది కీ, ఫలితాలను జూన్ 9న ప్రకటిస్తారు.
జేఈఈ అడ్వాన్స్డ్ వెబ్సైట్
అప్లికేషన్ల కోసం సంప్రదించండి జెమిని ఇంటర్నెట్, D L రోడ్, హిందూపురం | ఫోన్ 9640006015 | పని చేయు వేళలు ఉదయం 9.00 గంటల నుండి సాయంత్రం 6.00 వరకు | ప్రతి ఆదివారం సెలవు | విద్యా ఉద్యోగ అప్లికేషన్లకు 200/- రూపాయలు ఫీజు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లను పోస్ట్ చేయి (Atom)
-
PRL.DISTRICT COURT: ANANTHAPURAMU Dis. No. 3983/2024/Admn/Genl. Date 11.07.2024 NOTIFICATION FOR A...
-
📢📬 ఇండియా పోస్టల్ శాఖలో ఉద్యోగ అవకాశాలు! 🏤💼 ✅ పదో తరగతి పూర్తి చేసి ప్రభుత్వ ఉద్యోగం చేయాలని ఉందా? ✅ తక్కువ చదువుతో మంచి జీతంతో ఉద్యోగ...
-
1. PAN : - Student and Father/Mother/Guardian 2. Photograph: Student and Father/Mother 3. Bank Passbook : Student and Father/Mother...
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి