Alerts

--------

1, నవంబర్ 2021, సోమవారం

ఇప్పుడు వీడియో రికార్డింగ్ ద్వారా కూడా Pensioners Life Certificate 2021 సమర్పించవచ్చు.

మీరు ప్రభుత్వం నుంచి పెన్షన్​ను పొందుతున్నారా? అయితే త్వరపడాల్సిందే. వెంటనే వార్షిక జీవన ధ్రువీకరణ పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాలి. లేదంటే పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! మరి ఈ సర్టిఫికేట్ ఎలా సమర్పించాలో తెలుసా?

పెన్షనర్లకు హై అలర్ట్! పెన్షన్​ను యథావిధిగా పొందాలంటే ప్రతి ప్రభుత్వ పెన్షన్​దారు.. వార్షిక జీవిత ధ్రువీకరణ (లైఫ్ సర్టిఫికేట్) పత్రాన్ని (Pensioners Life Certificate 2021) సమర్పించాల్సి ఉంటుంది. నవంబర్​లో ఈ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate) సమర్పించకపోతే.. పెన్షన్ ఆగిపోయే ప్రమాదం ఉంది! 80 ఏళ్లు పైబడిన వ్యక్తులు అక్టోబర్ 1 నుంచే లైఫ్ సర్టిఫికేట్లను సమర్పిస్తున్నారు. వీడియో కాల్ ద్వారా కూాడా ఈ సర్టిఫికేట్ సమర్పించే అవకాశం ఉంది.

ఎలా సమర్పించవచ్చంటే..

లైఫ్ సర్టిఫికేట్​ను (Pensioners Life Certificate 2021) సమర్పించేందుకు చాలా మార్గాలు ఉన్నాయి. ఆ వివరాలు ఇలా..

  • పెన్షన్ అందిస్తున్న బ్యాంకు బ్రాంచ్​కి వెళ్లి సమర్పించవచ్చు.
  • జీవన్ ప్రమాణ్ పోర్టల్​లోకి వెళ్లి ఆధార్ ద్వారా డిజిటల్ రూపంలో లైఫ్ సర్టిఫికేట్ (Pensioners Life Certificate online) అందించొచ్చు.
  • బ్యాంకింగ్ డోర్​స్టెప్ ఫెసిలిటీ ద్వారా కూడా సర్టిఫికేట్ (Pensioners Life Certificate form) సమర్పించవచ్చు. దీనికోసం 'డోర్​స్టెప్ బ్యాంకింగ్ యాప్​'లో వివరాలు నమోదు చేసుకొని పెన్షన్ అకౌంట్​ నెంబర్​ను ధ్రువీకరించాలి. కనీస రుసుముతో ఈ పని అయిపోతుంది. బ్యాంకు ప్రతినిధులే మీ ఇంటికి వచ్చి లైఫ్ సర్టిఫికేట్ సమర్పించే ప్రక్రియను పూర్తి చేస్తారు.
  • పోస్ట్​మ్యాన్ ద్వారా ఇంటి నుంచే లైఫ్ సర్టిఫికేట్ సమర్పించవచ్చు. ఇందుకోసం పోస్ట్ ఇన్పో మొబైల్ యాప్ లేదా ప్రభుత్వ వెబ్​సైట్​కి వెళ్లి డోర్​స్టెప్ రిక్వెస్ట్ కోసం నమోదు చేసుకోవాలి. ఆ తర్వాత మొబైల్​కు 'ప్రమాణ్ ఐడీ' వస్తుంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులందరికీ ఈ వెసులుబాటు ఉంది. ఏ బ్యాంకులో ఖాతా ఉన్నా సరే.. ఈ సేవను వినియోగించుకోవచ్చు. ఇందుకోసం రూ.70 చెల్లించాల్సి ఉంటుంది.

ఎస్​బీఐ వీడియో కాల్ ఫీచర్

దీంతో పాటు తొలిసారి 'వీడియో లైఫ్ సర్టిఫికేట్​' సేవలను ఎస్​బీఐ ప్రవేశపెట్టింది. నవంబర్ 1 నుంచి ఈ సదుపాయాన్ని అందుబాటులోకి తీసుకురానుంది. దీన్ని ఉపయోగించుకొని ఫించనుదారులు.. తమ లైఫ్ సర్టిఫికేట్లను వీడియో కాల్ చేసి సమర్పించవచ్చు.

ఎలా చేయాలంటే...?

  1. ఎస్​బీఐ పెన్షన్ సేవ పోర్టల్​లోకి వెళ్లి 'వీడియో ఎల్​సీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  2. ఎస్​బీఐ పెన్షన్ ఖాతా నెంబర్​ను ఎంటర్ చేసి.. రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్​కు వచ్చిన ఓటీపీని వెబ్​సైట్​లో నమోదు చేయాలి.
  3. టర్మ్స్ అండ్ కండిషన్స్​ను యాక్సెప్ట్ చేసి స్టార్ట్ జర్నీ అనే బటన్​పై క్లిక్ చేయాలి.
  4. ఒరిజినల్ పాన్ కార్డును దగ్గర పెట్టుకోవాలి. ఆ తర్వాత 'ఐయామ్ రెడీ' అనే ఆప్షన్​పై క్లిక్ చేయాలి.
  5. ఎస్​బీఐ అధికారులు అందుబాటులోకి రాగానే వీడియో కాల్ ప్రారంభం అవుతుంది.
  6. స్క్రీన్ మీద కనిపించే నాలుగు అంకెల వెరిఫికేషన్ కోడ్​ను అధికారులు అడుగుతారు.
  7. ఆ తర్వాత పాన్​కార్డు ఒరిజినల్​ను చూపించాలి. దాన్ని ఫొటో తీసుకుంటారు.
  8. అనంతరం పెన్షనర్ ఫొటోను తీసుకుంటారు. దీంతో వీడియో లైఫ్ సర్టిఫికేట్ నమోదు ప్రక్రియ పూర్తవుతుంది.
  9. ఒకవేళ ఈ ప్రక్రియ విఫలమైతే.. బ్యాంకు ద్వారా మొబైల్ నెంబర్​కు సందేశం వస్తుంది.

 

 

31, అక్టోబర్ 2021, ఆదివారం

*కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు* | కొత్తగా పెళ్లి చేసుకోబోయేవారికి శ్రీవారి తలంబ్రాలు

టీటీడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే వధూవరులు, చేసుకున్న నవదంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.

★ తిరుమల తిరుపతి దేవస్థానం..
దేశంలో ఎన్నో గుడులు ఉండవచ్చుగాక.. కానీ తిరుమల గుడి ప్రత్యేకతే వేరు.
◆ అక్కడికి వెళ్లి ఓసారి శ్రీవారిని దర్శించుకుంటే చాలు..
 మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది. మనసుకు ఏదో తెలియని ఉత్తేజం కలుగుతుంది. అందుకే..

★ తిరుమల తిరుపతి దేవస్థానానికి అంత ప్రత్యేకత. సాధారణంగా తిరుమల శ్రీవారిని దర్శించుకోవడం అంత ఈజీ కాదు. కొన్ని గంటల పాటు లైన్ లో వేచి ఉండాలి.
 నిద్రకు ఓర్చుకోవాలి.. అప్పుడే శ్రీవారి దర్శనభాగ్యం కలుగుతుంది.

🟢 టిటిడీ ప్రస్తుతం మరో పథకాన్ని ప్రవేశపెట్టింది. కొత్తగా పెళ్లి చేసుకునే దంపతులు, చేసుకున్న దంపతుల కోసం కొత్త పథకాన్ని ప్రవేశపెట్టింది.
◆ శ్రీవారికి నిత్య కల్యాణంలో పవిత్ర తలంబ్రాలను వినియోగిస్తారు. ఆ తలంబ్రాలకు కొత్త దంపతులకు అందివ్వాలని నిర్ణయించింది. కొత్తగా పెళ్లయిన, పెళ్లి చేసుకోబోయే దంపతులు స్వామి ఆశీర్వాదం కోసం ప్రత్యేకంగా తిరుమలకు రావాల్సిన అవసరం లేకుండా… వాళ్లకు డైరెక్ట్ గా ఇంటికే శ్రీవారి పవిత్ర తలంబ్రాలను అందివ్వాలని నిర్ణయించింది.

దానికోసం..
■ నూతన దంపతులు వాళ్ల పెళ్లి పత్రికను పోస్టు ద్వారా తిరుమలకు పంపించాల్సి ఉంటుంది. ఆ పెళ్లి పత్రిక ద్వారా.. నూతన దంపతులకు శ్రీవారి పవిత్ర తలంబ్రాలను పోస్టు ద్వారా ఉచితంగా పంపిస్తారు. కల్యాణ తలంబ్రాలతో పాటు కుంకుమ, కంకణాలు, కల్యాణ సంస్కృతి పుస్తకాన్ని కూడా పంపిస్తారు.

❇️ ఇంకెందుకు ఆలస్యం..

★ మీకు ఇటీవలే పెళ్లి అయిందా?
★ లేదా త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారా?
★ శ్రీవారి తలంబ్రాల కోసం వెంటనే టీటీడీ కాల్ సెంటర్ నెంబర్లు 0877-2233333, 2277777 ఫోన్ చేయండి.
చిరునామా: ది ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్, టీటీడీ అడ్మిన్ బిల్డింగ్స్, కేటీ రోడ్, తిరుపతి – 517501.
*Dept.Of PRO TTD*

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...