ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిరుద్యోగ అభ్యర్థులకు శుభవార్త.

ఏపీ లో చిత్తూరు జిల్లాలో ఉన్న తిరుపతి నగరంలో శ్రీ వెంకటేశ్వర రామ నారాయణ రూయ ప్రభుత్వ ఆసుపత్రి లో ఖాళీగా ఉన్న మెడికల్  మరియు నర్సుల పోస్టుల భర్తీకి గాను ఒక మంచి నోటిఫికేషన్ విడుదల అయినది.

పరీక్షలు మరియు ఇంటర్వ్యూలు లేకుండా కేవలం మెరిట్ లిస్ట్ ద్వారా ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలను 80% స్థానికులతో మరియు 20% నాన్ – లోకల్ అభ్యర్థులతో భర్తీ చేయనున్నారు.అర్హతలు గల అభ్యర్థులు అందరూ ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవచ్చు.

ముఖ్యమైన తేదీలు :

దరఖాస్తుకు చివరి తేదిడిసెంబర్ 28,2020

విభాగాల వారీగా ఖాళీలు :

మహిళా నర్సులు27
బ్యాక్ లాగ్ పోస్టులు4
స్టాఫ్ నర్స్ లు2
రేడియోలాజికల్ ఫిజిస్ట్2
ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్4
మహిళా నర్స్ (ఎం. ఎస్సి  కేటగిరీ )3
మహిళా నర్స్ (బీ. ఎస్సీ కేటగిరీ, జిఎన్ఎం)12

అర్హతలు :

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయకునే అభ్యర్థులు విభాగాలను అనుసరించి 10వ తరగతి /ఇంటర్మీడియట్ /జనరల్ నర్సింగ్  మిడ్ వైఫరీ /బీ. ఎస్సీ /ఎం. ఎస్సీ కోర్సులను పూర్తి చేసి ఫస్ట్ ఎయిడ్ సర్టిఫికెట్ కలిగి ఉండవలెను.

దరఖాస్తు విధానం :

ఆన్లైన్ / ఆఫ్ లైన్ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు :

ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 300 రూపాయలు దరఖాస్తు ఫీజుగా చెల్లించవలెను.

వయసు :

ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకునే అభ్యర్థులుకు 42 సంవత్సరాలకు మించరాదు.

ఎంపిక విధానం :

మెరిట్ లిస్ట్ మరియు సెలక్షన్ లిస్ట్ ద్వారా ఈ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 14,250 రూపాయలు నుండి 34,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

సంప్రదించవల్సిన చిరునామా :

సూపరింటెండెంట్ కార్యాలయం,

ఎస్వీఆర్ఆర్ జిజిహేచ్,

తిరుపతి.

Website

Notification Links