30, జనవరి 2021, శనివారం

AP POSTAL JOBS

టెన్త్ అర్హతతో  ప్ర‌భుత్వ పోస్ట‌ల్ విభాగం ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో 3446 గ్రామీణ డాక్ సేవ‌క్ (జీడీఎస్‌) పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. మొత్తం పోస్టుల్లో ఏపీ సర్కిల్‌ కింద 2296 ఖాళీలు, తెలంగాణ సర్కిల్‌ కింద 1150 ఖాళీలు ఉన్నాయి. ఆసక్తిగల అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి. ఇప్పటికే దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. ఫిబ్రవరి 26 దరఖాస్తులకు చివరితేది. పూర్తి వివరాలకు https://appost.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.


మొత్త ఖాళీలు: 3446
ఏపీ- 2296
తెలంగాణ- 1150

గ్రామీణ డాక్ సేవ‌క్
1) బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (బీపీఎం)
2) అసిస్టెంట్ బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్ (ఏబీపీఎం)
3) డాక్ సేవ‌క్‌

విద్యార్హతలు‌: మ‌్యాథ‌మెటిక్స్‌, లోక‌ల్ లాంగ్వేజ్‌, ఇంగ్లీష్ స‌బ్జెక్టుల‌తో ప‌దో త‌ర‌గ‌తి ఉత్తీర్ణులై ఉండాలి‌. అభ్య‌ర్థి క‌నీసం ప‌దో త‌ర‌గ‌తి వ‌ర‌కు లోక‌ల్ లాంగ్వేజ్‌లో చ‌దివి ఉండాలి. క‌నీసం 60 రోజుల శిక్ష‌ణా వ్య‌వ‌ధితో ఏదైనా కంప్యూట‌ర్ ట్రెయినింగ్ ఇన్‌స్టిట్యూట్ నుంచి బేసిక్ కంప్యూట‌ర్ ట్రెయినింగ్ కోర్సు స‌ర్టిఫికెట్ ఉండాలి. కంప్యూట‌ర్‌ను ఒక స‌బ్జెక్టుగా ప‌దో త‌ర‌గ‌తిలో చ‌దివితే స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించాల్సిన అవ‌స‌రం ఉండ‌దు. సంబంధిత గ్రామ ప‌రిధిలో నివాసం ఉండాలి.

ముఖ్య సమాచారం:
వ‌య‌సు: 2021, జనవరి 27 నాటికి 18-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ/ ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ప‌దేళ్లు గ‌రిష్ఠ వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.
ఎంపిక విధానం: అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేసిన స‌ర్టిఫికెట్ల‌ ఆధారంగా నిబంధ‌న‌ల ప్ర‌కారం ఆటోమేటిక్ జ‌న‌రేటెడ్ మెరిట్ లిస్ట్ త‌యార‌వుతుంది. ఉన్న‌త విద్యార్హ‌త‌ల‌కు అద‌న‌పు వెయిటేజ్ ఏమీ ఉండ‌దు. కేవ‌లం ప‌దో త‌ర‌గ‌తిలో సాధించిన మార్కుల ఆధారంగానే తుది ఎంపిక ఉంటుంది.
ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
ద‌ర‌ఖాస్తు ఫీజు: ఓసీ/ బీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ పురుష‌/ ట‌్రాన్స్-మెన్ అభ్య‌ర్థులు రూ.100 చెల్లించాలి. మ‌హిళా/ ట‌్రాన్స్‌-విమెన్‌, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఫీజు లేదు.
జీత‌భ‌త్యాలు: టైమ్ రిలేటెడ్ కంటిన్యూటీ అల‌వెన్స్ (టీఆర్‌సీఏ) ప‌ద్థతిలో వీరికి చెల్లింపులు ఉంటాయి.
బ్రాంచ్ పోస్టు మాస్ట‌ర్‌(బీపీఎం): క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 12000, క‌నీసం 5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.14500 చెల్లిస్తారు.
ఏబీపీఎం/ డాక్ సేవ‌క్‌: క‌నీసం 4 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ. 10000, క‌నీసం 5 గంట‌ల‌కు టీఆర్‌సీఏ రూ.12000 చెల్లిస్తారు.
ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ ప్రారంభం: జనవరి 27, 2021.
ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ఫిబ్రవరి 26, 2021.
వెబ్‌సైట్‌: https://appost.in/

కామెంట్‌లు లేవు: