25, ఫిబ్రవరి 2021, గురువారం

శ్రీ‌వారి ఆర్జిత సేవ‌ల ఆన్‌లైన్ టికెట్ల కోటా విడుదల

         మార్చి నెల‌కు సంబంధించిన తిరుమ‌ల శ్రీ‌వారి కల్యాణోత్సవం, ఊంజ‌ల్‌సేవ‌, ఆర్జిత బ్ర‌హ్మోత్స‌వం, సహస్ర దీపాలంకార‌ సేవల ఆన్‌లైన్ (వ‌ర్చువ‌ల్‌) టికెట్ల కోటాను గురువారం ఉద‌యం 11 గంట‌ల‌కు టిటిడి విడుదల చేసింది. 

ఈ సేవా టికెట్లు పొందిన భ‌క్తులు ఎస్వీబీసీ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారం ద్వారా త‌మ ఇళ్ల నుండే వ‌ర్చువ‌ల్ విధానంలో ఈ సేవ‌ల్లో పాల్గొనాల్సి ఉంటుంది.

         భ‌క్తులు ఈ విష‌యాన్ని గ‌మ‌నించి ముంద‌స్తుగా ఈ సేవ‌ల‌ టికెట్ల‌ను బుక్ చేసుకోవాల‌ని కోర‌డ‌మైన‌ది.

కల్యాణోత్సవం టికెట్లు పొందిన‌ గృహస్తుల‌కు(ఇద్దరికి) ఆ టికెట్‌పై ఉచితంగా ప్ర‌త్యేక ప్ర‌వేశ ద‌ర్శ‌నం క‌ల్పిస్తారు. వీరు టికెట్లు బుక్‌ చేసుకున్నతేదీ నుండి 90 రోజుల్లోపు స్వామివారిని ద‌ర్శించుకోవ‌చ్చు.

కామెంట్‌లు లేవు: