కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి రంగం సన్నద్ధమవుతోంది. దేశ వ్యాప్తంగా భారీ సంఖ్యలో కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) ఖాళీలు భర్తీకానున్నాయి. పదో తరగతి విద్యార్హత ఉన్న అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు అర్హులు. బీఎస్ఎఫ్, సీఐఎస్ఎఫ్, సీఆర్పీఎఫ్, ఐటీబీపీ, ఎస్ఎస్బీ, ఎస్ఎస్ఎఫ్లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు; అస్సాం రైఫిల్స్లో రైఫిల్మ్యాన్ (జనరల్ డ్యూటీ); ఎన్సీబీలో సిపాయి పోస్టులు భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్(ఎస్ఎస్సీ) సమాయత్తమవుతోంది. ఎస్ఎస్సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ డిసెంబర్ 28 పూర్తి కానుంది. రాత పరీక్ష తేదీలను ఎస్ఎస్సీ ఇటీవలే వెల్లడించింది. పరీక్ష షెడ్యూల్ను విడుదల చేసింది. కానిస్టేబుల్(గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29; మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా ప్రధాన కేంద్రాల్లో జరుగుతుందని పేర్కొంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, వైద్య పరీక్షలు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ అనుసరించి వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులు ఉద్యోగాలకు ఎంపిక అవుతారు.
గతేడాది 50,187 ఖాళీల భర్తీ
గతేడాది నవంబర్లో భారీ ఉద్యోగ నియామకాలకు సంబంధించి ప్రకటనను విడుదల చేసిన విషయం తెలిసిందే. ఈ నోటిఫికేషన్ ద్వారా వివిధ సాయుధ బలగాల్లో 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్మ్యాన్/ సిపాయి పోస్టులు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది సైతం అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ కానున్నాయి.
- | For applications visit Gemini Internet with your own ATM Gemini Internet, D L Road, Hindupur | - - | అప్లికేషన్ల కోసం మీ స్వంత ATM జెమిని ఇంటర్నెట్తో జెమిని ఇంటర్నెట్ని సందర్శించండి, DL రోడ్, హిందూపూర్ | -
https://geminiinternethindupur.blogspot.com/2023/02/list-of-hindupur-and-other-areas.html
కామెంట్లు లేవు:
కామెంట్ను పోస్ట్ చేయండి