14, మే 2020, గురువారం

డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు!



ఈనాడు, అమరావతి: డీఎస్సీ-2008 అభ్యర్థులకు తాత్కాలిక ఉద్యోగాలు ఇచ్చేందుకు ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు తెలిసింది. కనీస టైం స్కేల్‌తో ఉద్యోగాలు ఇచ్చేందుకు అనుమతించింది. డీఎస్సీ-2008లో సెకండరీ గ్రేడ్‌ టీచర్ల (ఎస్జీటీ) పోస్టులకు మొదట డీఈడీ వాళ్లకే అవకాశం కల్పించారు. దీనిపై బీఈడీ అభ్యర్థులు న్యాయస్థానాన్ని ఆశ్రయించగా డీఈడీ వాళ్లకు 30శాతం పోస్టులే కేటాయించారు. దీంతో మొదట పోస్టులు వచ్చిన డీఈడీ అభ్యర్థులు పోస్టు కోల్పోవాల్సి వచ్చింది. ఈ అభ్యర్థుల వినతి మేరకు గత ప్రభుత్వం ఎమ్మెల్సీలతో కమిటీ వేసింది. కనీస వేతనంతో వీరికి పోస్టింగ్‌ ఇవ్వాలని కమిటీ సిఫార్సు చేసింది. దీనికి ప్రస్తుతం ఆర్థిక శాఖ ఆమోదం తెలిపినట్లు సమాచారం.

ప్రభుత్వ ఆమోదానికి దస్త్రం
డీఎస్సీ-2008కి సంబంధించిన అభ్యర్థులు మొత్తం 4,657 మంది ఉన్నట్లు లెక్క తేల్చారు. వీరిలో కొందరు ఇప్పటికే వేర్వేరు ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. వీరికి పదవీ విరమణ వరకు కనీస టైం స్కేల్‌ ఇస్తూ పోస్టింగ్‌లు ఇచ్చేందుకు పాఠశాల విద్యాశాఖ దస్త్రాన్ని ముఖ్యమంత్రి కార్యాలయానికి పంపాలని నిర్ణయించింది. ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి ఆమోదం లభించిన తర్వాత పోస్టింగ్‌లు ఇచ్చే అవకాశం ఉంది.

ఉపాధ్యాయుల బదిలీలకు వివరాల సేకరణ
ఉపాధ్యాయుల బదిలీలకు ఖాళీల వివరాలు పంపాలని కమిషనరేట్‌ నుంచి జిల్లా విద్యాధికారులకు ఆదేశాలు అందాయి. ఫిబ్రవరి 29 వరకు ఉన్న ఎస్జీటీ, ఎల్‌ఎఫ్‌ఎల్‌, గ్రేడ్‌-2 ప్రధానోపాధ్యాయుల ఖాళీలు, పాఠశాలల్లో ఖాళీలు, 5, 8 ఏళ్లుగా ఒకేచోట పని చేస్తున్నవారు.. తదితర వివరాలు సేకరిస్తున్నారు.

Ad

జూన్‌ నుంచి ఈ-ఎస్‌ఆర్‌
ఉపాధ్యాయుల ప్రస్తుత సర్వీసు రిజిస్టర్‌(ఎస్‌ఆర్‌) స్థానంలో ఈ-ఎస్‌ఆర్‌ తీసుకొస్తున్నారు. ఉపాధ్యాయుడిగా విధుల్లో చేరినప్పటి నుంచి పదవీ విరమణ పొందిన వరకు అన్ని సేవలను ఆన్‌లైన్‌లోనే నమోదు చేయనున్నారు. జూన్‌ నుంచి దీన్ని అమల్లోకి తెచ్చేందుకు అధికారులు చర్యలు చేపట్టారు. మానవవనరుల సేవలు, వేతనాల చెల్లింపులు, సర్వీసు మొత్తం ఆన్‌లైన్‌ చేయనున్నారు.

టెన్త్‌ పరీక్షలపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం


పదో తరగతి పరీక్షలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. కరోనా వైరస్‌ నేపథ్యంలో 11 పేపర్లను 6 పేపర్లుగా కుదించింది. భౌతిక దూరం పాటిస్తూ జూలై 10వ తేదీ నుంచి 15 వరకూ పరీక్షలు నిర్వహించనుంది. ప్రతి పేపర్‌కు 100 ​మార్కులు ఉంటాయి.
►జులై 10న ఫస్ట్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 11న సెకండ్ లాంగ్వేజ్(9.30am- 12.45pm)
►జులై 12న ఇంగ్లీషు(9.30am- 12.45pm)
►జులై 13న మ్యాథ్స్‌(9.30am- 12.45pm)
►జులై 14న జనరల్ సైన్స్(9.30am- 12.45pm)
►జులై 15న సోషల్ స్టడీస్‌(9.30am- 12.45pm)

లాక్ డౌన్ సమయంలో అత్యవసర పరిస్థితులలో ప్రయాణానికి

ఇబ్బందులు ఎదుర్కొంటున్న ప్రజలకు పరిష్కారంగా  ఏపి పోలీసులు ఓ మార్గాన్ని సూచిస్తున్నారు
అత్యవసర ప్రయాణానికి పోలీసు వారి వెబ్ సైట్ ద్వారా ఇ పాస్ లను ఇవ్వనున్నట్టు అందుకు
ఫోటో, పూర్తి పేరు, మొబైల్ నంబర్, మెడికల్ సర్టిఫికెట్లు, అధికారిక లేఖలు, ఆధార్‌ను అప్‌లోడ్ లేదా ఏదైనా గుర్తింపు కార్డు, పూర్తి ప్రయాణ వివరాలు, ప్రయాణించే వాహన పూర్తి వివరాలు, ప్రయాణీకుల సంఖ్యను వెబ్ సైట్ లో నమోదు చేయాలి. త్వరితగతిన అందించే అత్యవసర ఇ పాస్ ను అప్లై చేసిన అభ్యర్థి యొక్క మెబైల్ ఫోన్ కు లేదా ఇ మెయిల్ ఐడికు చేరవేస్తారు, కారుకు (1+3) మాత్రమే అనుమతి ఉంటుంది. ఇ పాస్ లభించిన తరువాత  ప్రయాణించేటప్పుడు వారి ఒరిజినల్ ఐడి కార్డును కూడా తప్పనిసరిగా తీసుకెళ్లాలి. వెబ్ సైట్ లింక్ https://citizen.appolice.gov.in/

13, మే 2020, బుధవారం

సంక్షిప్తంగా ఉద్యోగాలు వాటి వివరాలు


Andhra Pradesh DME Covid Hospital Vacancies 550 on one year contract basis
Post: General Duty Medical Officer
Qualification: MBBS
Age: below 40 years
Mode of Selection: MBBS Marks and others details
Application Mode: Online
Last Date: May 18
Website:  https://dme.ap.nic.in

CIPET Senior Project Associate Vacancies
Post: Senior Project Assoicate
Qualification: M.Sc/M.E./M Tech Chemistry/Material Science/Polymer Science / Material Science and Engineering/Plastic Engineering/Polymer Nano Technology) with NET/GATE Qualification
Age: 35 years
Application Mode: Through E-mail
e-mail: larpmadmin@larpm.in
Last Date: May 18
Website: https://www.cipet.gov.in

అనంతపురము సర్వజన ఆసుపత్రి నందు ఆల్కహాల్ మరియు డ్రగ్ డి అడిక్షన్ సెంటర్ నందు ఒక ఏడాది కాలము పాటు పనిచేయుట కొరకు ఈ క్రింద తెలుపబడిన పోస్టులకు గాను అన్ని అర్హతలు కలిగి ఉన్న ఆసక్తి గల అభ్యర్థుల నుండి దరఖాస్తులు కోరడమైనది. ఈ నియామకాలు మెరిట్ ఆధారముగా భర్తీ చేయబడును వివరల కొరకు www.ananthapuramu.ap.gov.in ను సంప్రదించవలయునని కోరడమైనది

సంక్షిప్త ఉద్యోగ వివరాలు (పూర్తి వివరాలను వెబ్ సైట్లలోని నోటిఫికేషన్ ను చూడగలరు)
Western Coal Fields
Vanacies 303
Job: Technician Apprentice
Last Date: May 19
Website: https://westerncoal.in

Heavy Engineering Limited
Job: Graduate Technician
Last Date May 27
Website: www.hecltd.com

SEBI
Job: Assistant Manager (Grade A)
Last Date: May 31
Website: www.sebi.gov.in

NIELT - Calicut
Job: Assistant, Scientist B
Last Date June 1st
Website: www.nielt.gov.in

CPET
Job :  Officer, Technician  Officer
Last Date: May 29
Website:  www.cipet.gov.in

National Fertilizers Limited
Job: Engineer and Chemist
Last  Date: 27 May
Website: www.nationalfertilizersc.com 

ITI Limited
Job: Finance, HR Executive
Last Date: May  17
Website: www.itiltd.in


హిందూపుర పట్టణ | విద్యా | ఉద్యోగ వార్తలు కోసం Hindupur Times


Hindupur Times | వార్తల్లో నేటి హిందూపురం

కర్నూలు జిల్లా నంద్యాలలోని రాఘవేంద్ర  కోచింగ్ సెంటర్ నందు బ్యాంకింగ్ కోచింగ్ తీసుకుంటూ లాక్ డౌన్ తో నంద్యాలలో చిక్కున్న అనంతపురం,హిందూపురం, పెనుకొండ, ధర్మవరం,కదిరి,కొత్తచెరువు,గోరంట్ల,తాడిపత్రి, రామగిరి,పామిడి,గార్లదిన్న,ఓడిసి,సోమందేపల్లి తదితర ప్రాంతాలకు చెందిన దాదాపు 37 మంది (7మంది హిందూపురం వారు ఉన్నారు) అభ్యర్థులను అధికారులు 11.05.2020 ఉదయం నంద్యాల నుండి AP21Z/0781బస్సులో వాళ్ళ స్వస్థలాలకు తరలించారు. ఇందులో 16 మందిని అనంతపురం TTDCలో, నలుగురిని తాడిపత్రి quarentineలో, హిందూపురం వారితో సహా మిగిలిన 17 మంది, సోమందేపల్లిలోని కస్తూరిబా పాఠశాల నందు quarentineలో ఉంచారు.
మంజునాథ్,సవిత,శుభారాణి తదితరులు హిందూపురంకు చెందిన వారున్నారు.
---------------------------------------------------------------------------------------------------------------------
పోస్టాఫీసులో బ్యాంకు డబ్బులు డ్రా చేసుకునే సదుపాయం
ప్రస్తుతం దేశ వ్యాప్తంగా బ్యాంకు ఖాతాదారులకు తమకు అవసరమైన నగదును ఉపసంహరించుకునే సదుపాయాన్ని ప్రైవేటు వ్యక్తులు లేదా సంస్థలు ఖాతాదారుని బయోమెట్రిక్ ద్వారా నగదు ఇవ్వడం లేదా ఇతర అకౌంటుకు పంపడం జరుగుతోంది సరిగ్గా ఇలాంటి సౌకర్యాన్నే కల్పిస్తున్నాయి పోస్టాఫీసులు. ఇందుకోసం వ్యక్తి తమ  బ్యాంకు ఖాతాకు ఆధార్ లింక్ చేసుకుని ఉంటే ఊ సదుపాయాన్ని పోస్టాఫీసులో కూడా పొందవచ్చు.
---------------------------------------------------------------------------------------------------------------------
దేశ ఆర్థిక ప్రగతి గురించి దేశభక్తులు కోరుకుంటున్నట్టుగానే ప్రధాని మోదీ దేశ ప్రజలకు 20 లక్షల కోట్ల ఆర్థిక ప్యాకెజీ ప్రకటించడంతో పాటు స్వదేశీ వస్తువులకే ప్రాధాన్యతనివ్వాలని దేశప్రజల యొక్క బాధ్యతను గుర్తుచేశారు
--------------------------------------------------------------------------------------------------------------------------
ఒక రేషన్ కార్డుకు ఒకటే పింఛను వర్తించేలా  ప్రభుత్వం చర్యలు, దివ్యాంగులు, డయాలసిస్ రోగులు, క్యాన్సర్, ధలసీమియా, పక్షవాతం రోగుల పింఛన్లకు మాత్రం దీనిని నుంచి మినిహాయించారు. ఆధార్ ప్రభుత్వ సర్వేల ఆధారంగా చేసుకుని రాష్ట్రంలో ఒక రేషనుకు రెండు పింఛన్లను పొందుతున్న వారి వివరాలను ఇప్పటికే సేకరించి మునిసిపల్ కమీషనర్లకు మరియు ఎం పి డి వోలకు పంపింది ఈ నెల 15వ తేదీలోగా క్షేత్ర స్థాయిలో పరిశీలించే బాధ్యతను వాలంటీర్లు, సచివాలయ ఉద్యోగులకు అప్పగించింది. ఈ విషయమై గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ ఇన్ ఛార్జ్ రాజబాబు ఆదేశాలు జారీ చేశారు.
----------------------------------------------------------------------------------------------------------------------
కరోనా నివారణ చర్యల్లో భాగంగా సుమారు 51 సూపర్ మార్కెట్ లకు హిందూపురం పట్టణంలోడోర్ డెలివరీ కోసం జిల్లా కలెక్టరు అనుమతి ఇచ్చినా కొన్ని సూపర్ మార్కెట్ లో కౌంటర్ ద్వారా మాత్రమే విక్రయాలు జరుపుతున్నారనే సమాచారంతో తనిఖీ చేయగా రెండు సూపర్ మార్కెట్లపై ఎఫ్ ఐ అర్ నమోదు చేయడం జరిగింది. అలాగే నాయి బ్రాహ్మణులను రజకులను సమావేశ పరిచి ఎట్టి పరిస్థితులలో షాపులు తెరవకూడదని వినియోగదారుల ఇంటివద్దకు వెళ్ళరాదని, ఉల్లంఘించిన వారి పై చట్టపరమైన చర్యలు తీసుకుంటుమన్నారు.
60 ఏళ్క పై బడిన వారు బయట తిరగకూడదని అలా కాదని బయట తిరిగిన వ్యక్తులకు నోటీసులు ఇస్తున్నామని రెండవ సారి బయట కనబడితే వారి పై కేసులు నమోదు చేస్తామన్నారు.
అత్యవసర సేవలు అందించే వారు మాస్కులు తప్పకుండా ధరించాలని పాల వ్యాపారస్తులు కేవలం డోర్ డెలివరీ ద్వారానే విక్రయించాలని  లేదంటే వారి పైన  కేసులు నమోదు చేస్తామని పెనుకొండ సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ పేర్కొన్నారు.

https://www.youtube.com/watch?v=TE7Cvx6Tp4c 

Education News | విద్యావార్తలు | Hindupur Times

బీటెక్లో 10నెలలు ఇంటర్న్షిప్
* ఉన్నత విద్యామండలి కసరత్తు ఈనాడు, అమరావతి: బీటెక్పాఠ్యాంశాల్లో మార్పులు రాబోతున్నాయి. కొత్తగా కొన్ని నైపుణ్య సబ్జెక్టులను ప్రవేశపెట్టడంతోపాటు ఇంటర్న్షిప్కాలాన్ని పెంచనున్నారు. బీటెక్లో నైపుణ్యాల పెంపునకు తీసుకోవాల్సిన చర్యలపై అధ్యయనం చేసేందుకు ఉన్నత విద్యామండలి ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేసింది. మొదటి రెండేళ్లల్లో ప్రస్తుతం ఉన్న సబ్జెక్టులకు అదనంగా కొత్తవి తీసుకురానున్నారు. కమ్యూనికేషన్, సాఫ్ట్స్కిల్స్, మౌఖిక పరీక్షల సన్నద్ధత వంటివి నేర్పించనున్నారు. మూడు, నాలుగు ఏడాదిలో విద్యార్థుల కోర్సులకు అనుగుణంగా అందించనున్నారు. ప్రస్తుతం చివరి సెమిస్టర్ఆరు నెలలు ఇంటర్న్షిప్ఉండగా.. దీన్ని 10 నెలలకు పెంచనున్నారు. మొదటి రెండేళ్లు వేసవి సెలవుల్లో రెండేసి నెలలు చొప్పున ఇంటర్న్షిప్ను తీసుకురానున్నారు.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఏపీ ఎంసెట్జులై 27 నుంచి
* ఈసెట్‌ 24
*
ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారు ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో ప్రవేశ పరీక్షల తేదీలు ఖరారయ్యాయి. ఏపీ ఎంసెట్ను జులై 27 నుంచి 31 వరకు నిర్వహించనున్నట్లు ఉన్నత విద్యా మండలి కార్యదర్శి సుధీర్ప్రేమ్కుమార్తెలిపారు. ఇంజినీరింగ్రెండో ఏడాదిలోకి ప్రవేశానికి నిర్వహించే ఈసెట్ను జులై 24 నిర్వహించనున్నారు. అన్ని ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు దరఖాస్తు గడువు మే 20వరకు ఉంది. ఇప్పటి వరకు ఎంసెట్కు 2,48,614 దరఖాస్తులు వచ్చాయి. ఇందులో ఇంజినీరింగ్కు 1,69,137 మంది, వ్యవసాయ, వైద్య విద్యకు 78,959 మంది, రెండింటికీ 518 మంది దరఖాస్తు చేశారు. 3 వేల మంది రుసుము చెల్లించినా దరఖాస్తులు సమర్పించలేదు. ఇంజినీరింగ్ను ఎనిమిది విడతలుగా, వ్యవసాయ, వైద్య విద్య పరీక్షలను నాలుగు విడతలుగా నిర్వహించనున్నారు. ఉదయం, సాయంత్రం పరీక్షలు ఉంటాయి.
పరీక్షలు.. తేదీలు
ప్రవేశ పరీక్ష    తేదీ
ఈసెట్‌    జులై 24
ఐసెట్‌    జులై 25
ఎంసెట్‌    జులై 27-31
పీజీ ఈసెట్‌    ఆగస్టు 2-4
ఎడ్సెట్‌    ఆగస్టు 5
లాసెట్‌    ఆగస్టు 6
పీఈసెట్‌    ఆగస్టు 7-9
-----------------------------------------------------------------------------------------------------------------------
జేఈఈ, నీట్పరీక్షల తేదీలు ఖరారు
దిల్లీ: ఇంజినీరింగ్‌, మెడికల్ కళాశాల్లో ప్రవేశాల కోసం జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పరీక్షలకు సంబంధించిన తేదీలు ఖరారయ్యాయి. జులై 18-23 మధ్య జేఈఈ(మెయిన్స్‌)‌, జులై 26 నీట్‌, ఆగస్టులో జేఈఈ అడ్వాన్స్డ్పరీక్షలు నిర్వహించనున్నట్లు కేంద్ర మానవ వనరుల శాఖ మంత్రి రమేశ్ పోఖ్రియాల్ తెలిపారు. ఇక వాయిదా పడిన సీబీఎస్ 10, 12 తరగతి బోర్డు పరీక్షల తేదీలపై త్వరలో నిర్ణయం తీసుకుంటామన్నారు.
కరోనా వైరస్వ్యాప్తి నేపథ్యంలో విధించిన లాక్డౌన్కారణంగా వివిధ పరీక్షలు వాయిదా పడ్డ విషయం తెలిసిందే. దీంతో పరీక్షల తేదీల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. వాస్తవానికి ఏప్రిల్లో జేఈఈ మెయిన్స్‌, మే నెలలో నీట్జరగాల్సి ఉండగా.. లాక్డౌన్నేపథ్యంలో వాయిదా పడ్డాయి.
-------------------------------------------------------------------------------------------------------------------------
ఆన్లైన్లో ఇంటర్పాఠాలు
* జూన్నుంచి అందుబాటులోకి ఈనాడు, అమరావతి: కరోనా వైరస్వ్యాప్తి కారణంగా వచ్చే విద్యా సంవత్సరం ప్రారంభం ఆలస్యమైతే ఆన్లైన్తరగతులు నిర్వహించేందుకు ఇంటర్మీడియట్విద్యాశాఖ సన్నద్ధమవుతోంది. ఇంటర్మొదటి, రెండో ఏడాది మొత్తం పాఠాలను నిపుణులైన లెక్చరర్లతో వీడియో రికార్డు చేయించనున్నారు. రికార్డు చేసిన వీడియోలను వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారు. వీటిని ప్రైవేటు, ప్రభుత్వ జూనియర్కళాశాలల్లో చదువుతున్న విద్యార్థులంతా వినియోగించుకోవచ్చు. జూన్నుంచి ఆన్లైన్వీడియోలు అందుబాటులోకి రానున్నాయి. విద్యార్థులకు ఏదైనా పాఠం అర్థం కాకపోయినా, రెడ్జోన్లో ఉండి తరగతులకు హాజరుకాలేని వారు సైతం వాటిని వినియోగించుకోవచ్చు.
రూపకల్పన ఇలా..
* ఒక పాఠంపై ముగ్గురు, నలుగురు లెక్చరర్ల నుంచి పాఠ్యాంశాలు(కంటెంట్‌)ను స్వీకరిస్తారు. ఎంపికైన వారి నుంచి పాఠం వీడియో రికార్డు చేస్తారు.
* తరగతిలో చెప్పే దానికి భిన్నంగా విద్యార్థులకు తేలికగా అర్థమయ్యేందుకు పాఠ్యాంశానికి అవసరమైన వీడియోలను జత చేస్తారు.
* ఇంటర్అకడమిక్జూన్నుంచి ప్రారంభమవుతుంది. నెలకు సంబంధించి ఒక్కో సబ్జెక్టు నుంచి మూడు పాఠాలు అవసరం కానున్నాయి. ముందుగా వాటిని పూర్తి చేస్తారు.
* ఇంటర్మొదటి ఏడాది ప్రవేశాలు జాప్యం కానున్నందున ముందుగా రెండో ఏడాది పాఠ్యాంశాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు.

 

నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ | National Overseas Scholarship


✅భారత ప్రభుత్వ సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు చెందిన నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21 సంవత్సరానికి నోటిఫికేషన్‌ విడుదల చేసింది. విదేశాల్లో ఉన్నత విద్య కోసం షెడ్యూల్డ్‌ క్యాస్ట్‌, ఇతర వెనుకబడిన తరగతుల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

🎯 నేషనల్‌ ఓవర్‌సీస్‌ స్కాలర్‌షిప్‌ 2020-21

🎯మొత్తం స్కాలర్‌షిప్‌ల సంఖ్య: 100

🎯అర్హత: మాస్టర్స్‌ డిగ్రీ చదివే అభ్యర్థులకు బ్యాచిలర్స్‌ డిగ్రీ, పీహెచ్‌డీ చేసే అభ్యర్థులకు మాస్టర్స్‌ డిగ్రీ ఉత్తీర్ణత. వార్షికాదాయం రూ. 8 లక్షలు మించకూడదు.

🎯వయసు: 01.04.2020 నాటికి 35 ఏళ్లు మించకూడదు.

🎯ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ ఆధారంగా.

🎯దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌.

🎯చివరి తేది: మే 27, 2020

⭕వెబ్‌సైట్‌: http://nosmsje.gov.in/