Alerts

--------

11, డిసెంబర్ 2020, శుక్రవారం

Teaching Faculty Jobs 2020 Telugu || ఛాంబర్స్ కాలేజ్, పాలకొల్లు లో ఇంటర్, డిగ్రీ, పీజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాలకు ఇంటర్వ్యూ

 

ఇంటర్, డిగ్రీ, పీజీ టీచింగ్ ఫ్యాకల్టీ ఉద్యోగాల ఇంటర్వ్యూ లకు ప్రకటన జారీ :

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పాలకొల్లు నగరంలో ఉన్న భూపతి రాజు రామచంద్ర రాజు మరియు గోపాలకృష్ణ రాజు ఛాంబర్స్ జూనియర్ మరియు డిగ్రీ కాలేజ్ లో ఇంటర్మీడియట్, డిగ్రీ మరియు పీజీ కోర్సులలో ఖాళీగా ఉన్న బోధన విభాగాల టీచింగ్ ఫాకల్టీ ఉద్యోగాలను భర్తీ చేయడానికి ఒక ప్రకటన జారీ అయినది.


ఇంటర్వ్యూ ల ద్వారా భర్తీ చేయబోయే ఈ ఉద్యోగాలకు అర్హతలు గల అభ్యర్థులు అందరూ  దరఖాస్తు చేసుకోవచ్చు.

ముఖ్యమైన వివరాలు :

ఇంటర్వ్యూ నిర్వహణ తేదీడిసెంబర్ 13,2020
ఇంటర్వ్యూ నిర్వహణ ప్రదేశం ఛాంబర్స్ జూనియర్  &డిగ్రీ కాలేజ్,ఎల్. ఆర్. పేట,పాలకొల్లు – 534260

బోధన విభాగాల వారీగా ఖాళీలు :

పీజీ విభాగం :

ఆర్గానిక్ కెమిస్ట్రీ

ఫీజికల్ కెమిస్ట్రీ

డిగ్రీ విభాగం :

మాథ్స్

స్టాటాస్టిక్స్

జూనియర్ కాలేజీ విభాగం :

మాథ్స్

ఇంగ్లీష్

సంస్కృతం

అర్హతలు :

అభ్యర్థులు  బోధన విభాగాలను అనుసరించి విద్యా అర్హతలను కలిగి ఉండాలి.

జీతం :

ఈ ఉద్యోగాలకు ఎంపికైన అభ్యర్థులకు 20,000 రూపాయలు నుండి 30,000 రూపాయలు వరకూ జీతం లభించనుంది.

ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు వారి వారి రెస్యూమ్ లను ఈ క్రింది మెయిల్ అడ్రస్ కు పంపవలెను.

ఈమెయిల్ అడ్రస్ :

krishnavarmakv@gmail.కామ్

అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు సంబంధించిన  మరిన్ని వివరాలకు ఈ క్రింది మొబైల్ మరియు వాట్సాప్ నెంబర్ లను సంప్రదించవచ్చును.

మొబైల్ & వాట్సాప్ నెంబర్ :

9849212321

🕉 *శ్రీ‌నివాస‌మంగాపురంలో ఏకాంతంగా కార్తీక వ‌న‌భోజ‌నం*



        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:   టిటిడికి అనుబంధంగా ఉన్న శ్రీనివాసమంగాపురంలోని శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఆలయంలో శుక్ర‌వారం కార్తీక వనభోజన కార్యక్రమం జ‌రిగింది. కోవిడ్‌-19 నిబంధ‌న‌ల నేప‌థ్యంలో ఈ ఉత్స‌వాన్ని ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హించారు.

👉 ఇందులో భాగంగా శ్రీ‌దేవి, భూదేవి స‌మేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవమూర్తులను ఆల‌యంలోని క‌ల్యాణ మండ‌పానికి వేంచేపు చేశారు.

■  ఉదయం 10 నుంచి 11 గంటల వరకు స్నపనతిరుమంజనం వేడుకగా నిర్వహించారు.
👉ఈ సందర్భంగా పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. ఆ తరువాత అలంకారం, వ‌న‌భోజ‌నం, అన్న‌మాచార్య ప్రాజెక్టు క‌ళాకారులు భ‌క్తి సంగీత కార్య‌క్ర‌మం నిర్వహించారు.

👉ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి డెప్యూటీ ఈవో శ్రీ‌మ‌తి శాంతి, ఏఈవో శ్రీ ధ‌నంజ‌యులు, సూప‌రింటెండెంట్ శ్రీ చెంగ‌ల్రాయ‌లు త‌దిత‌రులు పాల్గొన్నారు.
 *Dept.Of PRO TTD.*

🕉 *వృద్ధులు, చిన్న‌పిల్ల‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుని శ్రీ‌వారిని ద‌ర్శించుకోవ‌చ్చు*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌:   
 కోవిడ్-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ అనంత‌రం 2020 జూన్ 8వ తేదీ నుండి వివిధ సంస్థ‌ల‌ను తిరిగి తెర‌వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది.

👉65 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారు,
👉అనారోగ్యంతో ఉన్నవారు,
👉గ‌ర్భిణులు,
👉ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల వారు అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.

అయితే...,
65 ఏళ్లు పైబ‌డినవారికి,
10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు
శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని భారీ సంఖ్య‌లో మెయిల్స్ ద్వారా టిటిడికి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి.
డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో కూడా అనేక మంది ఈ విష‌యంపై అభ్య‌ర్థిస్తున్నారు.

🟢 ద‌ర్శ‌నానికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల్లో చాలావ‌ర‌కు చిన్న‌పిల్ల‌ల కేశఖండ‌న‌,
చెవిపోగులు కుట్టడం,
అన్న‌ప్రాస‌న‌,
ష‌ష్టిపూర్తి చేసుకున్న‌వారు,
70-80 సంవ‌త్స‌రాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు.

      ఇది భ‌క్తుల ఆచారాలు, సంప్ర‌దాయాలు, మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న అంశం.
 ఈ కార‌ణాల రీత్యా 65 ఏళ్లు పైబ‌డిన వారు, ప‌దేళ్ల లోపు వారు కోవిడ్‌-19 సూచ‌న‌లు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో వారి సొంత నిర్ణ‌యం మేర‌కు స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌చ్చు. అయితే, ముంద‌స్తుగా ద‌ర్శ‌న టికెట్ల బుక్ చేసుకోవాలి. ద‌ర్శ‌న టికెట్లు క‌లిగిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ప్ర‌త్యేక క్యూలైన్లు ఉండ‌వని తెలియ‌జేయ‌డ‌మైన‌ది.
 *Dept.Of PRO TTD.*


🕉 *డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు ధనుర్మాస తిరుప్పావై ప్రవచనాలు* 🕉 *తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాలు*



        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🟢 TTD News™ తిరుమల‌: పవిత్రమైన ధనుర్మాసాన్ని పురస్కరించుకుని డిసెంబరు 16 నుంచి జనవరి 13వ తేదీ వరకు తిరుపతితోపాటు దేశవ్యాప్తంగా 141 కేంద్రాల్లో ప్రముఖ పండితులు తిరుప్పావై ప్రవచనాలు చేయనున్నారు. ధనుర్మాసం సందర్భంగా టిటిడి ఆళ్వార్‌ దివ్యప్రబంధ ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఇందుకోసం ఏర్పాట్లు జరుగుతున్నాయి.

■ తిరుమల శ్రీవారి ఆలయంలోనూ ఈ ధనుర్మాసంలో సుప్రభాతం బదులుగా తిరుప్పావై నివేదించడం విశేషం. తిరుపతిలోని అన్నమాచార్య కళామందిరం, కెటి రోడ్డులోని శ్రీ వరదరాజస్వామివారి ఆలయం, తిరుప్పావై ప్రవచనాలు పారాయణం చేస్తారు. అదేవిధంగా చిత్తూరు జిల్లాలో నారాయ‌ణ‌వ‌నంలోని శ్రీ హ‌రేరామ హ‌రేకృష్ణ ఆల‌యం, కుప్పం మండ‌లం గుడిప‌ల్లిలోని శ్రీ యామ‌గానిప‌ల్లెలో గ‌ల శ్రీ వేంక‌టేశ్వ‌ర‌స్వామివారి ఆలయాల్లో ప్రవచన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక, పాండిచ్చేరి, మ‌ధ్య‌ప్ర‌దేశ్‌ రాష్ట్రాల్లో ప్రవచన కార్యక్రమాలు జరుగనున్నాయి.

🟢 ఈ ధనుర్మాసం దేవతలకు బ్రహ్మముహూర్తం. ఈ బ్రహ్మముహూర్తాన్ని అనుసరించి 12 మంది ఆళ్వారులలో ఒకరైన గోదాదేవి ధనుర్మాసం వ్రతం పాటించారు. దేశ సుభిక్షాన్ని, లోకకల్యాణాన్ని కాంక్షిస్తూ గోదాదేవి శ్రీకృష్ణునిలో ఐక్యమవ్వాలనేది ఈ వ్రతం ఉద్దేశం. ఈ వ్రతం పాటించడం వల్ల దేశం సమృద్ధిగా, సుభిక్షంగా ఉంటుంది. ద్వాపరయుగంలో గోపికలు ఈ వ్రతాన్ని ఆచరించి శ్రీకృష్ణుని కృపకు పాత్రులయ్యారని భాగవతం దశమ స్కందంలో పేర్కొనబడింది.

👉 ఈ వ్రతం ఎలా పాటించాలనే విషయాన్ని గోదాదేవి 30 పాశురాలతో కూడిన తిరుప్పావై దివ్యప్రబంధాన్ని లోకానికి అందించారు. ఈ తిరుప్పావై సారాంశం భగవంతునికి కైంకర్యం చేయడమే. ఈ వ్రతం ఒకరు చేయడం కాకుండా అందరినీ కలుపుకుని చేస్తే గొప్ప విశేషం. ఈ సంప్రదాయం ప్రకారం దేశవ్యాప్తంగా గల అన్ని వైష్ణవ దేవాలయాలలో తిరుప్పావై శాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.
 *Dept.Of PRO TTD.*

*✍️NIRDPR- హైద‌రాబాద్‌లో 510 జాబ్స్‌.✍️*


 
హైద‌రాబాద్‌లోని భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ‌కు చెందిన నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్ అండ్ పంచాయ‌తీరాజ్ ‌(ఎన్ఐఆర్‌డీపీఆర్) ఒప్పంద ప్రాతిప‌దిక‌న 510 స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌, యంగ్ ఫెలో, క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తులు కోరుతోంది. దేశ‌వ్యాప్తంగా క్ల‌స్ట‌ర్ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీలను అభివృద్ధి చేయడంలో భాగంగా భార‌త ప్ర‌భుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ‌శాఖ ఆధ్వ‌ర్యంలో ఎన్ఐఆర్‌డీపీఆర్ ఈ ఉద్యోగాల‌ను భ‌ర్తీ చేస్తోంది. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 29 తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. పూర్తి వివరాలకు http://nirdpr.org.in/ వెబ్‌సైట్‌ చూడొచ్చు.

 *మొత్తం ఖాళీలు: 510* 

 *1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్ ‌- 10 పోస్టులు* 

 *2) యంగ్ ఫెలో - 250 పోస్టులు* 

 *3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్ ‌- 250 పోస్టులు* 

 *1) స్టేట్ ప్రోగ్రాం కోఆర్డినేట‌ర్‌:* 

 *విధులు:* ఈ పోస్టులకు ఎంపికైన వారు క‌్ల‌స్ట‌ర్‌ మోడ‌ల్ గ్రామ‌పంచాయ‌తీల ఏర్పాటులో భాగంగా ఎంపిక చేసిన గ్రామ‌పంచాయ‌తీల‌లో జ‌రుగుతున్న ప‌నుల‌ను క్షేత్ర స్థాయిలో మానిట‌రింగ్ చేయాల్సి ఉంటుంది.

 *అర్హ‌త‌:* సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ (ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 30-50 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఎస్సీ&ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.55 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *2) యంగ్ ఫెలో:* 

 *విధులు:* క్షేత్రస్థాయిలో గ్రామ‌పంచాయ‌తీల‌కు వెళ్లి వివిధ శాఖ‌ల‌ అధికారులు, ప్ర‌జాప్ర‌తినిధుల‌తో క‌లిసి వారికి గ్రామ‌పంచాయ‌తీ ప‌నుల‌ను వివ‌రిస్తూ.. వారితో క‌లిసి అభివృద్ధి ప‌నుల్లో పాల్గొన‌డం వీరు చేయాల్సిన పని.

 *అర్హ‌త‌:* సోష‌ల్ సైన్సెస్‌లో పోస్టు గ్రాడ్యుయేష‌న్ డిగ్రీ/ రెండేళ్ల పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా(ఎక‌న‌మిక్స్‌/ రూర‌ల్ డెవ‌ల‌ప్‌మెంట్‌/ రూర‌ల్ మేనేజ్‌మెంట్‌/ పొలిటిక‌ల్ సైన్స్‌/ ఆంథ్ర‌పాల‌జీ/ సోష‌ల్‌వ‌ర్క్‌/ డెవ‌ల‌ప్‌మెంట్ స్ట‌డీస్‌/ హిస్ట‌రీ) ఉత్తీర్ణ‌త‌తో పాటు క‌నీస అక‌డ‌మిక్ మెరిట్ (ప‌దోత‌ర‌గ‌తి నుంచి పీజీ వ‌ర‌కు) కూడా అవ‌స‌రం. ప‌దో త‌ర‌గ‌తిలో 60%, ఇంట‌ర్మీడియ‌ట్‌లో 50%, గ్రాడ్యుయేష‌న్‌లో 50%, పోస్టు గ్రాడ్యుయేష‌న్‌లో 50% మార్కులు ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 21-30 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.35 వేలు ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *3) క్ల‌స్ట‌ర్ లెవ‌ల్ రిసోర్స్ ప‌ర్స‌న్‌:* 

 *విధులు:* వీళ్లు వార్డు స్థాయిలో ప్ర‌జల్ని గ్రామంచాయ‌తీ విధుల్లో (గ్రామ ‌స‌భ‌, వార్డ్ స‌భ‌, మ‌హిళా స‌భ‌)పాల్గొనేలా వారిని చైత‌న్య‌వంతుల్ని చేయ‌డం.

 *అర్హ‌త‌:* ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌తోపాటు సెల్ప్ హెల్ప్ గ్రూప్స్‌లో ప‌ని చేసిన అనుభ‌వం/ సెల్ప్ హెల్ప్ గ్రూప్స్ లీడర్‌గా ప‌ని చేసి ఉండ‌డం/ ఎన్ఐఆర్‌డీపీఆర్‌/ ఎన్ఆర్ఎల్ఎం/ ఎస్ఆర్ఎల్ఎం నుంచి సంబంధిత స‌ర్టిఫికెట్ ప్రోగ్రాములు చేసి ఉండాలి.

 *వ‌య‌సు:* 01.11.2020 నాటికి 25-40 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.ఎస్సీ & ఎస్టీల‌కు ఐదేళ్లు, ఓబీసీల‌కు మూడేళ్లు వ‌య‌సులో స‌డ‌లింపు ఉంటుంది.

 *జీతభ‌త్యాలు:* నెల‌కు రూ.12,500 ఉంటుంది. దీనితో పాటు ఎన్ఐఆర్‌డీపీఆర్ నిబంధ‌న‌ల ప్ర‌కారం ప్ర‌యాణ‌, ఇత‌ర ఖర్చుల‌ను చెల్లిస్తారు.

 *ముఖ్య సమాచారం:* 

 *ద‌ర‌ఖాస్తు విధానం:* ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

 *ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది:* డిసెంబర్‌ 29, 2020.

 *ఎంపిక:*  ఎన్‌ఐఆర్‌డీపీఆర్‌ నిబంధనల ప్రకారం ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

 *వెబ్‌సైట్‌* : http://nirdpr.org.in/


TTD News

వయోవృద్ధులకు,చంటి పిల్లకు టీటీడీ శుభావార్త

         కోవిడ్-19 నేప‌థ్యంలో లాక్‌డౌన్ అనంత‌రం 2020 జూన్ 8వ తేదీ నుండి వివిధ సంస్థ‌ల‌ను తిరిగి తెర‌వ‌డానికి భార‌త ప్ర‌భుత్వం ప‌లు మార్గ‌ద‌ర్శ‌కాలు జారీ చేసింది. 65 సంవ‌త్స‌రాలు పైబ‌డిన‌వారు, అనారోగ్యంతో ఉన్నవారు, గ‌ర్భిణులు, ప‌దేళ్ల కంటే త‌క్కువ వ‌య‌సుగ‌ల వారు అత్య‌వ‌స‌రమైతే త‌ప్ప ఇంటి నుంచి బ‌య‌ట‌కు రావ‌ద్ద‌ని సూచించింది.

        అయితే, 65 ఏళ్లు పైబ‌డినవారికి, 10 సంవ‌త్స‌రాల కంటే త‌క్కువ వ‌య‌సు ఉన్న పిల్ల‌ల‌కు శ్రీ‌వారి ద‌ర్శ‌నం క‌ల్పించాల‌ని భారీ సంఖ్య‌లో మెయిల్స్ ద్వారా టిటిడికి అభ్య‌ర్థ‌న‌లు వ‌స్తున్నాయి. డ‌య‌ల్ యువ‌ర్ ఈవో కార్య‌క్ర‌మంలో కూడా అనేక మంది ఈ విష‌యంపై అభ్య‌ర్థిస్తున్నారు. ద‌ర్శ‌నానికి సంబంధించిన అభ్య‌ర్థ‌న‌ల్లో చాలావ‌ర‌కు చిన్న‌పిల్ల‌ల కేశఖండ‌న‌, చెవిపోగులు కుట్టడం, అన్న‌ప్రాస‌న‌, ష‌ష్టిపూర్తి చేసుకున్న‌వారు, 70-80 సంవ‌త్స‌రాల శాంతి చేసుకున్నవారు ఉంటున్నారు. ఇది భ‌క్తుల ఆచారాలు, సంప్ర‌దాయాలు, మ‌నోభావాల‌తో ముడిప‌డి ఉన్న అంశం. ఈ కార‌ణాల రీత్యా 65 ఏళ్లు పైబ‌డిన వారు, ప‌దేళ్ల లోపు వారు కోవిడ్‌-19 సూచ‌న‌లు పూర్తిగా దృష్టిలో ఉంచుకుని వారి ఆరోగ్యప‌రిస్థితుల‌ను బేరీజు వేసుకుని త‌గిన జాగ్ర‌త్త‌ల‌తో వారి సొంత నిర్ణ‌యం మేర‌కు స్వామివారి ద‌ర్శ‌నానికి రావ‌చ్చు. అయితే, ముంద‌స్తుగా ద‌ర్శ‌న టికెట్ల బుక్ చేసుకోవాలి. ద‌ర్శ‌న టికెట్లు క‌లిగిన వారిని మాత్ర‌మే తిరుమ‌ల‌కు అనుమ‌తిస్తారు. ఇలాంటి వారి కోసం ఎలాంటి ప్ర‌త్యేక క్యూలైన్లు ఉండ‌వని తెలియ‌జేయ‌డ‌మైన‌ద

Name of the Post: AP Grama/ Ward Volunteer (West Godavari & Vizag) Online Form 2020


Post Date: 28-08-2020

Latest Update: 11-12-2020

Total Vacancy: 7444

Brief Information: Dept of Gram/ Ward Volunteers & Village/ Ward Secretariat, AP has announced notification for the recruitment of GramaWard Volunteer vacancies. Those Candidates who are interested in the vacancy details & completed all eligibility criteria can read the Notification & Apply Online.

Interested Candidates Can Read the Full Notification Before Apply Online
Important Links
Interview Date & InformationClick here
Download Submitted ApplicationClick here
Apply OnlineClick here
Detailed NotificationClick here
Newspaper NotificationClick here
Official WebsiteClick Here

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...