18, జనవరి 2021, సోమవారం

Anantapuramu District Classifieds

 

విద్యా సమాచారం

*టెన్త్‌ విద్యార్థులకు*
 *రెండు పూటలా తరగతుల*

*♦రేపటి నుంచి అమలు*

*♦103 రోజుల ప్రణాళిక*

*♦అదే రోజు నుంచి ఇంటర్‌*

*♦ఫస్టియర్‌ క్లాసులూ ప్రారంభం* 

*♦వేసవి సెలవులు రద్దు*

పదో తరగతి విద్యార్థులకు సోమవారం నుంచి రెండు పూటలా తరగతులు జరగనున్నాయి. వీరికోసం ప్రత్యేంగా 103 రోజుల కార్యాచరణ ప్రణాళిక రూపొందించారు. అలాగే ఇంటర్‌ ప్రథమ సంవత్సర తరగతులు కూడా సోమవారం నుంచే ప్రారంభంకానున్నాయి. 10వ తరగతి విద్యార్థులకు రోజుకు 8 పీరియడ్లు నిర్వహిస్తారు. ఉదయం 8.45 నుంచి సాయంత్రం 4.20గంటల వరకూ తరగతులు జరుగుతాయి. జాతీయ, ఇతర పండుగలు మినహా ఆదివారాల్లో కూడా తరగతులు నిర్వహిస్తారు. ఆదివారం ఒక పూట ఒక సబ్జెక్టులో మాత్రమే తరగతులు  జరుగుతాయి. అన్ని పాఠశాలల్లో సోమవారం నుంచి ఈ ప్రణాళికను అమలు చేయాలని డీఈవో సుబ్బారావు ఆదేశించారు. 

*♦రేపటి నుంచి ఆరో తరగతి క్లాసులు*

ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరో తరగతి  క్లాసులు సోమవారం నుంచి ప్రారంభిస్తున్నట్లు డీఈవో సుబ్బారావు తెలిపారు. వీరికి రోజుమార్చి రోజు తరగతులు నిర్వహిస్తారన్నారు. 

*♦ఇంటర్‌కు 106 పనిదినాలు*

ఇంటర్మీడియట్‌ మొదటి సంవత్సరం విద్యార్థులకు  సోమవారం నుంచి తరగతులు ప్రారంభమవుతున్నాయి. అందుకు సంబంధించి ఇంటర్‌ బోర్డు సవరించిన వార్షిక క్యాలెండర్‌ను ప్రకటించింది. ఆ ప్రకారం 106 పని దినాలు ఉంటాయి. మే 31 వరకూ తరగతులు జరుగుతాయి. రెండో శనివారం కూడా కళాశాలలు నడుస్తాయి. వేసవి సెలవులను కూడా రద్దు చేశారు. 2021-22 విద్యాసంవత్సరంలో ఇంటర్మీడియట్‌ ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జూన్‌ 3వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. 

16, జనవరి 2021, శనివారం

అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీలు

🔳ఆంధ్రప్రదేశ్ ప్రభుత్యం అనంతపురం జిల్లాలో వివిధ శాఖల్లో లో ఖాళీగా ఉన్న ఉద్యోగాల భర్తీకి అర్హులైన దివ్యాంగుల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతోంది. ఆసక్తి ఉన్న వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.

ఈ జాబ్ యొక్క పూర్తి వివరాలు :
జాబ్ : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లు, ల్యాబ్ టెక్నిషియన్, ల్యాబ్ అటెండెన్ , ఆఫీస్ సభాడినేట్లు, టెక్నికల్ సభాడినేట్లు, ధోభి, స్వీపర్, డ్రెయిన్ క్లీనర్, పబ్లిక్ హెల్త్ వర్కర్స్, వాచ్ మన్, కుక్.
ఖాళీలు : 18
అర్హత : మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్లకు ఇంటర్ తోపాటు ఎంపీహెచ్ కోర్సు చేసి ఉండాలి. రెండేళ ఇంటర్మీడియెట్ ఒకేషనల్ (మల్టీపర్పస్ హెల్త్ వర్కర్) కోర్సు చేసినవారు ఏడాది వ్యవ ధిగల క్లినికల్ ట్రైనింగ్ పూర్తి చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ టెక్నీషియన్లకు, డిప్లొమా (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ) ఉత్తీర్ణత అవసరం. (బీఎస్సీ / పీజీ డిప్లొమా) (మెడికల్ ల్యాబ్ టెక్నాలజీ / లైఫ్ సైన్స్) చేసినవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
ల్యాబ్ అటెండెంట్లకు పదోతరగతితోపాటు ఐటీఐ కోర్సు చేసి ఉండాలి.
సబార్డినేట్లకు ఏడోతరగతి ఉత్తీర్ణతతో 35. వైకల్యా నికి 30 / 40. అకడమిక్ ప్రతిభకు పాటు సైకిల్ రైడింగ్ వచ్చి ఉండాలి.
మిగిలిన 25. సీనియారిటీకి 10 మార్కులు వెయిటేజీ పోస్టులకు అయిదో తరగతి పాసైతే చాలు. Note: ఈ పోస్ట్స్ కి అంగవైకల్యం ఉన్న వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోవాలి. అనంతపురం జిల్లా వాసులు మాత్రమే అర్హులు.
వయస్సు : 18-52 ఏళ్ల మ‌ధ్య ఉండాలి.
వేతనం : నెలకు రూ. 25,000/- 80,000
ఎంపిక విధానం: రాత‌ప‌రీక్ష‌ , ఇంటర్వ్యూ ఆధారంగా ఉంటుంది.
దరఖాస్తు విధానం: ఆఫ్ లైన్ ద్వారా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలి.
దరఖాస్తు ఫీజు : జనరల్ కు రూ. 0/-, ఎస్సీ, ఎస్టీలకు రూ. 0/-
దరఖాస్తులకు ప్రారంభతేది : జనవరి 10, 2021.
దరఖాస్తులకు చివరితేది : జనవరి 22, 2021.
దరఖాస్తులు పంపాల్సిన చిరునామా : చైర్మన్, టాస్క్ ఫోర్స్ కమిటీ అండ్ జిల్లా జాయింట్ కలెక్టర్ కార్యాలయం , అనంతపురం .

ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.


Edu news
ఆర్‌ఆర్‌టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఇండియన్ ఆర్మీ చేపడుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల నుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో తగిన నైపుణ్యం కలిగి ఉం డాలి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 194
పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ -171
అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ(ఏ గ్రూప్ వారైనా) ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ (గూర్ఖా)- గూర్ఖా రెజిమెంట్-09 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: గ్రంథి -05
అర్హత: ఈ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వీ(సున్నీ) -05
అర్హత : ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వి(షియా ) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన షియాలు మాత్రవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పాడ్రే -02 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది.. ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: బోధ్ సన్యాసి(మహాయాన) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్పా/లోపాన్/రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి.

వయసు: సివిలియన్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయసు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అక్టోబర్ 01,1987- సెప్టెంబర్ 30, 1996 మధ్య జన్మించి ఉండాలి.
 
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.Career guidance
పరీక్షా విధానం..
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులం దరికీతొలుత స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

రాత పరీక్ష..
  1. ఈ పరీక్షల్లో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్ సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇందులో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
  2. పేపర్-1 పరీక్షను అర్హత పరీక్షగానే చూస్తారు. ఇందు లో కనీసం 40శాతం మార్కులు సాధించిన అభ్యర్థు లు మాత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
  3. పేపర్ -2 : ఈ పరీక్ష కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మతపరమైన విషయాలను గురించిన ప్రశ్నలుంటాయి. మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
  4. పేపర్-2లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పేపర్-2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


ముఖ్యమైన సమాచారం..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09.02.2021
  3. పరీక్ష తేదీ : 27.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.joinindianarmy.nic.in