16, జనవరి 2021, శనివారం

ఇండియన్ ఆర్మీలో జూనియర్ కమిషన్డ్ ఆఫీసర్ (రిలీజియస్ టీచర్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ వెలువడింది.


Edu news
ఆర్‌ఆర్‌టీ 91, 92, 93, 94, 95 కోర్సుల ద్వారా ఈ నియామక ప్రక్రియను ఇండియన్ ఆర్మీ చేపడుతుంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవాల నుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు సంబంధిత విభాగంలో తగిన నైపుణ్యం కలిగి ఉం డాలి. పురుష అభ్యర్థులు మాత్రమే దరఖాస్తుకు అర్హులు. ఆసక్తి కలిగిన వారు ఫిబ్రవరి 9వ తేదీలోగా ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

మొత్తం పోస్టుల సంఖ్య: 194
పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ -171
అర్హత : ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు డిగ్రీ(ఏ గ్రూప్ వారైనా) ఉత్తీర్ణతతో పాటు అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పండిట్ (గూర్ఖా)- గూర్ఖా రెజిమెంట్-09 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతో పాటు హిందూ అభ్యర్థులు సంస్కృతంలో ఆచార్య అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: గ్రంథి -05
అర్హత: ఈ పోస్టులకు ఏదేని విభాగంలో డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు అభ్యర్థులకు పంజాబీలో గ్యానీ అర్హత కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వీ(సున్నీ) -05
అర్హత : ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: మౌల్వి(షియా ) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీతోపాటు ముస్లిం అభ్యర్థులకు అరబిక్‌లో మౌల్వీ అలీం/ఉర్దూలో అదిబ్ అలీం అర్హతను కలిగి ఉండాలి. లద్దాఖ్ ప్రాంతానికి చెందిన షియాలు మాత్రవే ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకోవాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: పాడ్రే -02 :
అర్హత: ఈ పోస్టులకు ఏదేని డిగ్రీ ఉత్తీర్ణతతోపాటు స్థానిక బిషప్‌గా ఆమోదం పొంది.. ప్రస్తుతం ఆ పనిలో కొనసాగుతూ ఉండాలి.

పోస్టు- ఖాళీల సంఖ్య: బోధ్ సన్యాసి(మహాయాన) లద్దాఖ్ స్కౌట్స్ -01
అర్హత: ఈ ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే వారు ఏదైనా డిగ్రీతోపాటు బోధ్ సన్యాసిగా గుర్తింపు పొంది, కాన్పా/లోపాన్/రబ్‌జాంలో పీహెచ్‌డీ సర్టిఫికేట్ పొందిన వారై ఉండాలి.

వయసు: సివిలియన్, ఇన్ సర్వీస్ అభ్యర్థులకు సంబంధించి వయసు 01.10.2021 నాటికి 25-34 ఏళ్ల మధ్య ఉండాలి. అంటే.. అక్టోబర్ 01,1987- సెప్టెంబర్ 30, 1996 మధ్య జన్మించి ఉండాలి.
 
రాత పరీక్ష, ఇంటర్వ్యూ, ఫిజికల్ స్టాండర్డ్ అండ్ ఫిట్‌నెస్ టెస్ట్, మెడికల్ టెస్టుల ఆధారంగా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.Career guidance
పరీక్షా విధానం..
ఆయా పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులం దరికీతొలుత స్క్రీనింగ్ ద్వారా షార్ట్‌లిస్ట్ చేస్తారు. స్క్రీనింగ్‌లో షార్ట్‌లిస్ట్ చేసిన అభ్యర్థులకు మాత్రమే రాత పరీక్ష, ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు.

రాత పరీక్ష..
  1. ఈ పరీక్షల్లో రెండు పేపర్లు(పేపర్-1, పేపర్-2) ఉంటాయి. పేపర్-1లో జనరల్ అవేర్‌నెస్ సంబంధిత ప్రశ్నలుంటాయి. ఇందులో 50 ప్రశ్నలకు గాను 100 మార్కులకు పరీక్షను నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కుల చొప్పున కేటాయిస్తారు. నెగిటివ్ మార్కింగ్ విధానం కూడా ఉంటుంది.
  2. పేపర్-1 పరీక్షను అర్హత పరీక్షగానే చూస్తారు. ఇందు లో కనీసం 40శాతం మార్కులు సాధించిన అభ్యర్థు లు మాత్రమే పేపర్-2 పరీక్ష రాయడానికి అర్హులు.
  3. పేపర్ -2 : ఈ పరీక్ష కూడా మొత్తం 100 మార్కులకు ఉంటుంది. దీనిలో అభ్యర్థులు ఎంపిక చేసుకున్న మతపరమైన విషయాలను గురించిన ప్రశ్నలుంటాయి. మొత్తం 50 ప్రశ్నలకు పరీక్ష నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు రెండు మార్కులు. అలాగే నెగిటివ్ మార్కింగ్ విధానం ఉంటుంది.
  4. పేపర్-2లో ప్రతిభ చూపిన అభ్యర్థులకు ఇంటర్వ్యూలను నిర్వహిస్తారు. పేపర్-2, ఇంటర్వ్యూల్లో సాధించిన మార్కుల ఆధారంగా తుది ఎంపిక జరుగుతుంది.


ముఖ్యమైన సమాచారం..

  1. దరఖాస్తు విధానం: ఆన్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  2. ఆన్‌లైన్ దరఖాస్తులకు చివరి తేదీ : 09.02.2021
  3. పరీక్ష తేదీ : 27.06.2021
పూర్తి వివరాలకు వెబ్‌సైట్www.joinindianarmy.nic.in
 
 

కామెంట్‌లు లేవు: