20, అక్టోబర్ 2021, బుధవారం

Indian Navy Recruitment: ఇండియన్‌ నేవీలో ఉద్యోగాలు.. 2500 ఖాళీల భర్తీతో భారీ నోటిఫికేషన్‌..

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను..

Indian Navy Recruitment 2021: ఇండియన్‌ నేవీ భారీ నోటిఫికేషన్‌ను జారీ చేసింది. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) విభాగాల్లో కలిసి మొత్తం 2500 ఖాళీలను భర్తీ చేయనున్నారు. నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు మీకోసం..

భర్తీ చేయనున్న ఖాళీలు, అర్హతలు..

* నోటిఫికేషన్‌ భాగంగా ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ), సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులను భర్తీ చేయనున్నారు.

* ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ (ఏఏ) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో మ్యాథ్స్‌, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ/ కంప్యూటర్‌ సైన్స్‌ సబ్జెక్టులతో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ (ఎస్‌ఎస్‌ఆర్‌) పోస్టులకు దరఖాస్తు చేసుకునే వారు 60 శాతం మార్కులతో గణితం, ఫిజిక్స్‌, కెమిస్ట్రీ/ బయోలజీ / కంప్యూటర్‌ సైన్స్‌లో 10+2 ఉత్తీర్ణత పొంది ఉండాలి.

* అవివాహిత పురుషులు మాత్రమే ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది.

ముఖ్యమైన విషయాలు..

* అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఆన్‌లైన్‌ విధానంలో దరఖాస్తు చేసుకోవాలి.

* అభ్యర్థులను రాతపరీక్ష, ఫిజికల్‌ ఫిట్‌నెస్‌ టెస్ట్‌ ఆధారంగా ఎంపిక చేస్తారు.

* రాత పరీక్ష హిందీ, ఇంగ్లిష్‌లో ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు శిక్షణ ఇస్తారు. ఆర్టిఫిషర్‌ అప్రెంటిస్‌ అభ్యర్థులకు 09 వారాలు, సీనియర్‌ సెకండరీ రిక్రూట్స్‌ అభ్యర్థులకు 22 వారాలు శిక్షణ ఉంటుంది.

* ఎంపికైన అభ్యర్థులకు 2022 ఫిబ్రవరి నుంచి కోర్సు ప్రారంభమవుతుంది.

* శిక్షణా కాలంలో అభ్యర్థులకు నెలకు రూ.14,600 చెల్లిస్తారు. అనంతరం డిఫెన్స్‌ పే మ్యాట్రిక్స్‌ ఆధారంగా రూ. 21,700 నుంచి రూ. 69,100 వరకు చెల్లిస్తారు.

* పూర్తి వివరాల కోసం ఇండియన్‌ నేవీ అధికారిక వెబ్‌సైట్‌ను సందర్శించండి..

19, అక్టోబర్ 2021, మంగళవారం

Sainik School Admissions 2021: నాణ్య‌మైన విద్య‌కు చిరునామా.. సైనిక్‌స్కూల్స్‌ ప్ర‌వేశాల‌కు ద‌ర‌ఖాస్తు వివ‌రాలు, ప‌రీక్ష‌ విధానం

నాణ్య‌మైన విద్యాకు చిరునామా సైనిక్ స్కూల్స్‌. ప్ర‌స్తుతం దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

దేశ వ్యాప్తంగా ఉన్న సైనిక్ స్కూల్ (Sainik School) ల‌లో ప్ర‌వేశాల కోసం నేష‌న‌ల్ టెస్టింగ్ ఏజెన్సీ (National Testing Agency) నోటిఫికేష‌న్ (Notification) విడుద‌ల చేసింది. ఏఐఎస్ఎస్ఈఈ-2022 నోటిఫికేష‌న్‌ ద్వారా ఆరోత‌ర‌గ‌తి, తొమ్మిదో త‌ర‌గ‌తుల‌కు సైనిక్ స్కూల్‌లో ప్ర‌వేశాల‌కు ప‌రీక్ష నిర్వ‌హించ‌నున్నారు. ఈ ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి ప్రస్తుతం 5, 8వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ సెప్టెంబ‌ర్ 27, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతుంది. ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేదీ అక్టోబ‌ర్ 26, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ప్ర‌వేశ ప‌రీక్ష (Entrance Test) జ‌న‌వ‌రి 9, 2022న నిర్వ‌హిస్తారు. ప‌రీక్ష ఫీజు ( Exam Fee) నోటిఫికేష‌న్‌, ద‌ర‌ఖాస్తు విధానం తెలుసుకొనేందుకు అధికారిక వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ సంద‌ర్శించండి.

ముఖ్య స‌మాచారం ..

ద‌ర‌ఖాస్తు ప్రారంభంసెప్టెంబ‌ర్ 27, 2021
ద‌ర‌ఖాస్త‌కు చివ‌రి తేదీఅక్టోబ‌ర్ 26, 2021
స‌వ‌ర‌ణ‌ల‌కు అవ‌కాశంఅక్టోబ‌ర్ 28, 2021 నుంచి న‌వంబ‌ర్ 2, 2021
ప‌రీక్ష ఫీజు రూ.550, ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కు రూ.400
ప‌రీక్ష తేదీజ‌న‌వ‌రి 9, 2022
ప‌రీక్ష స‌మ‌యం ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 150 నిమిషాలు,                                       తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు 180 నిమిషాలు
అధికారిక వెబ్‌సైట్https://aissee.nta.nic.in/      www.nta.ac.in

అర్హ‌త‌లు..
ప్రస్తుతం ఐదోత‌ర‌గ‌తి చ‌దివే విద్యార్థులు 6వ తరగతికి.. ఎనిమిది చ‌దివే విద్యార్థులు తొమ్మిదో త‌ర‌గ‌తికి ప్ర‌వేశాల‌కు దరఖాస్తు చేసుకోవచ్చు. వ‌య‌సు 31.03.2021 నాటికి ఆరో త‌ర‌గ‌తికి 10 నుంచి 12, తొమ్మిదో త‌ర‌గ‌తికి 13 నుంచి 15 ఏళ్ల మ‌ధ్య ఉన్న వారు అర్హులు.

ఆరోత‌ర‌గ‌తి ప్ర‌వేశాలకు ప‌రీక్ష విధానం..
టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్503150
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
జ‌న‌ర‌ల్ నాలెడ్జ్‌25250
మొత్తం125
300


తొమ్మిదో త‌ర‌గ‌తి ప్ర‌వేశాల‌కు నిర్వ‌హించే ప్ర‌వేశ ప‌రీక్ష విధానం..
టాపిక్ప్ర‌శ్న‌ల సంఖ్యప్ర‌తీ ప్ర‌శ్న‌కు మార్కులుమొత్తం మార్కులు
మ్యాథ‌మెటిక్స్504200
ఇంట‌లిజెన్స్‌25250
లాగ్వేజ్‌25250
 జ‌న‌ర‌ల్ సైన్స్‌25250
సోష‌ల్ సైన్స్‌25250
మొత్తం150
500


ద‌ర‌ఖాస్తు విధానం..

Step 1 :  ద‌ర‌ఖాస్తు ఆన్‌లైన్ ద్వారా చేసుకోవాలి.

Step 2 : ముందుగా అధికారిక‌ వెబ్‌సైట్ https://aissee.nta.nic.in/ ను సంద‌ర్శించాలి.

Step 3 : అనంత‌రం అధికారిక బ్రౌచ‌ర్‌ను పూర్తిగా చ‌ద‌వాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4 : అప్లికేష‌న్ ఫాంలో ఈ మెయిల్ ఐడీ, మొబైల్ నంబ‌ర్ స‌రిగా ఇవ్వాలి.

Step 5 : జేపీజీ / జేపీఈజే ఫార్మేట్‌లో ఫోటోను అప్లోడ్ చేయాలి. సాఫ్ట్ కాపీ సైజ్ నిర్దేశించిన ఫార్మెట్‌లో ఉండాలి.

Step 6 : విద్యార్హ‌త స‌ర్టిఫికెట్‌, క్యాస్ట్ స‌ర్టిఫికెట్ సంబంధిత స‌ర్టిఫికెట్ల‌ను సాఫ్ట్ కాపీ రూపంలో అప్లోడ్ చేయాలి.

 

SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. ఎస్ఎస్‌సీలో 1,775 పోస్టులు

SSC Recruitment 2021 : ప‌ది, ఇంట‌ర్ విద్యార్థుల‌కు మంచి అవ‌కాశం.. స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (Staff Selection Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు.  ఈ పోస్టుల‌లో ప‌ది, ఇంట‌ర్ విద్యార్హ‌త‌తో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి. వాటి ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25 వ‌ర‌కు అవ‌కాశం ఉంది.

స్టాఫ్ సెలెక్ష‌న్ క‌మిష‌న్ (Staff Selection Commission) ప‌లు పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది. ఈ నోటిఫికేష‌న్ ద్వారా వేర్వేరు విభాగాల్లో ఎస్ఎస్‌సీ ఖాళీల‌ను భ‌ర్తీ చేస్తుంది. ఈ నోటిఫికేష‌న్(Notification) ద్వారా మొత్తం 3,261 పోస్టులు భర్తీ చేయ‌నున్నారు.  ఈ పోస్టుల‌లో ప‌ది, ఇంట‌ర్ (Inter) విద్యార్హ‌త‌తో ఎస్ఎస్‌సీలో 1,775 ఉద్యోగాలు ఉన్నాయి.  పోస్టుల ద‌ర‌ఖాస్తుకు అక్టోబ‌ర్ 25, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు అనంత‌రం ఫీజు (Fee) చెల్లించేందుకు అక్టోబ‌ర్ 28, 2021 రాత్రి 11.30 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. బ్యాంక్ ద్వారా చ‌లాన్ (Bank challan) రూపంలో ఫీజు చెల్లించేందుకు న‌వంబ‌ర్ 1, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది. పోస్టుల ఎంపిక ప‌రీక్ష ద్వారా నిర్వ‌హిస్తారు. ఈ ప‌రీక్ష జ‌న‌వ‌రి 2022 లేదా ఫిబ్ర‌బ‌రి 2022లో జ‌రిగే అవ‌కాశం ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ పూర్త‌యిన త‌రువాత ప‌రీక్ష తేదీలు విడుద‌ల చేస్తారు. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

ఎంపిక విధానం..
Step 1 :  ఈ పోస్టుల భ‌ర్తీకి ప్రాథ‌మికంగా కంప్యూట‌ర్ బెస్డ్ (Computer Based Exam) ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు.  ప‌రీక్ష స‌మ‌యం - 60 నిమిషాలు
Step 2 :  ఇది అబ్జెక్టీవ్ టైప్ (Objective type) ప్ర‌శ్న‌ల‌ను క‌లిగి ఉంటుంది. అయితే పోస్టును బ‌ట్టి విద్యార్హ‌త‌ను బ‌ట్టి మూడు ప‌రీక్ష‌ల వ‌ర‌కు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది.

Step 3 :  ప‌రీక్ష రాసే అభ్య‌ర్థులు ఆచితూచి స‌మాధానం పెట్టాలి. ప్ర‌తీ త‌ప్పు ప్ర‌శ్న‌కు 0.50 మార్కులు నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది.


Step 4 :  ప‌రీక్ష ఉత్తీర్ణులైన వారిని నైపుణ్య (Skill) ప‌రీక్ష‌కు పిలుస్తారు. ఎంపిక విధానంలో ద‌ర‌ఖాస్తు చేసుకొన్న‌ పోస్టుల ఆధారంగా ఉంటుంది.

ప‌రీక్ష విధానం
స‌బ్జెక్టుప్ర‌శ్న‌లుమార్కులు
జ‌న‌ర‌ల్ ఇంట‌లిజ‌న్స్2550
జ‌న‌రల్ అవెర్నెస్2550
క్వాంటిటేవ్ ఆప్టిట్యూడ్2550
ఇంగ్లీష్ లాంగ్వేజ్2550

విద్యార్హ‌త‌, వ‌యోప‌రిమితి..
విద్యార్హతలు పోస్టుల వారీగా మారుతూ ఉంటుంది. ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణతతో కొన్ని ఉద్యోగాలు, 12వ త‌ర‌గ‌తి ఉత్తీర్ణ‌త‌తో కొన్న ఉద్యోగాలు ఉండ‌గా ప‌లు పోస్టుల‌కు గ‌రిష్ట విద్యార్హ‌త గ్రాడ్యుయేషన్‌గా ఉంది. ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తుచేసుకోవ‌డానికి అర్హ‌త క‌నీస వ‌య‌సు 18 సంత్స‌రాలు ఉంది. చాలా పోస్టుల‌కు గ‌రిష్ట వ‌య‌సు 30 ఏళ్లుగా ఉంది. అయితే రిజ‌ర్వేష‌న్‌ల ప్ర‌కారం ఆయా విభాగాల వారీకి వ‌యోప‌రిమిత (Age Limit) స‌డ‌లింపు ఉంటుంది.



ద‌ర‌ఖాస్తు విధానం..
Step 1:  ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ రెండు భాగాలుగా ఉంటుంది.

Step 2: ముందుగా అధికారిక వెబ్‌సైట్ ssc.nic.in ను సంద‌ర్శించాలి.

Step 3: అందులో NOTICES లోకి వెళ్లి. OTHERS విభాగంలో నోటిఫికేష‌న్ చ‌ద‌వాలి. అనంత‌రం హోం పేజీకి వ‌చ్చి ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ మొద‌లు పెట్టాలి. (నోటిఫికేష‌న్ కోసం క్లిక్ చేయండి)

Step 4: మొద‌ట వ‌న్‌టైం రిజ‌స్ట్రేష‌న్ చేసుకోవాలి.



Step 5: అభ్య‌ర్థి ప్రాథ‌మిక విద్యార్హ‌త‌, పాస్‌పోర్టు ఫోటో, సంత‌కం అప్‌లోడ్ చేసి ఫాం స‌బ్‌మిట్ చేయాలి.

Step 6: ఈ ప్ర‌క్రియ అనంత‌రం అభ్య‌ర్థికి రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్‌, పాస్ వ‌ర్డ్ వ‌స్తాయి.

Step 7: రెండో భాగంలో రిజిస్ట్రేష‌న్ నంబ‌ర్ (Registration Number) పాస్ వ‌ర్డ్‌తో లాగిన్ అవ్వాలి.

Step 8: అనంత‌రం ఏ పోస్టుకు ద‌ర‌ఖాస్తు చేస్తున్నారో క్లిక్ చేసి స‌మాచారం , ఫీజు చెల్లించి స‌బ్‌మిట్ చేయాలి.

Step 9: ప‌రీక్ష‌కు ద‌ర‌ఖాస్తు చేసుకొనేందుకు ఫీజు రూ.100. ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ, ఈఎస్ఎం క్యాట‌గిరీ అభ్య‌ర్థుల‌కు, మ‌హిళ‌ల‌కు ప‌రీక్ష ఫీజు లేదు.

 

Microsoft Internship 2021: డిగ్రీ విద్యార్థులకు మైక్రోసాఫ్ట్‌లో వర్చువల్ ఇంటర్న్‌షిప్... రేపే లాస్ట్ డేట్

Microsoft Internship 2021 | డిగ్రీ చదువుతున్నవారికి, డిగ్రీ పాస్ అయినవారికి ఇంటర్న్‌షిప్ (Internship) అవకాశం ఇస్తోంది మైక్రోసాఫ్ట్. 85000 మంది వర్చువల్ ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి

డిగ్రీ పాస్ అయిన విద్యార్థులకు గుడ్ న్యూస్. ఐటీ రంగ దిగ్గజం అయిన మైక్రోసాఫ్ట్ ఇంటర్‌షిప్స్ ప్రకటించింది. రెండో బ్యాచ్‌లో 85,000 మందికి వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశాలు ఇస్తోంది. భారతదేశంలో ఇటీవల డిగ్రీ పూర్తి చేసినవారంతా ఈ ఇంటర్న్‌షిప్ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఆల్ ఇండియా కౌన్సిల్ ఫర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ (AICTE), ఫ్యూచర్ స్కిల్స్ ప్రైమ్-ఏ నాస్‌కామ్, మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (MeitY) డిజిటల్ స్కిల్ ఇనషియేటీవ్, ఎర్న్‌స్ట్ అండ్ యంగ్ (EY), గిట్‌హబ్, క్వెస్ కార్ప్ లాంటి సంస్థలతో కలిపి ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది మైక్రోసాఫ్ట్. ఆసక్తి గల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకోవచ్చు. 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాలి.


కెరీర్‌లో అడుగుపెట్టాలనుకునే విద్యార్థులు అందుకు తగ్గట్టుగా సిద్ధం కావడానికి ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ ఉపయోగపడుతుంది. విద్యార్థుల కెరీర్‌ను దృష్టిలో పెట్టుకొని ఫ్యూచర్ రెడీ టాలెంట్ ప్రోగ్రామ్‌ను గత నెలలో మైక్రోసాఫ్ట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అందులో భాగంగా రెండో బ్యాచ్ ద్వారా 85,000 మంది విద్యార్థులకు వర్చువల్ ఇంటర్న్‌షిప్ అవకాశం ఇస్తోంది.

వర్చువల్ ఇంటర్న్‌షిప్ మొత్తం 8 వారాలు ఉంటుంది. 2021 లో డిగ్రీ పాస్ అయిన విద్యార్థులతో పాటు రాబోయే రెండేళ్లలో ఉద్యోగాల్లో చేరాలనుకునేవారు ఈ ఇంటర్న్‌షిప్ చేయొచ్చు. అంటే 2022, 2023లో డిగ్రీ పాస్ అయ్యేవారు కూడా అప్లై చేయొచ్చు. ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో 2021 అక్టోబర్ 20 లోగా రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది. విద్యార్థులు 8 వారాలపాటు అంకితభావంతో పూర్తి సమయం కేటాయించి ఇంటర్న్‌షిప్‌లో పాల్గొనాలి.



ఈ ఇంటర్న్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థులకు గిట్‌హబ్ స్టూడెంట్ డెవలపర్ ప్యాక్‌కు యాక్సెస్ లభిస్తుంది. ఇందులోనే 100 డాలర్ల విలువైన అజ్యూర్ సబ్‌స్క్రిప్షన్ కూడా ఉంటుంది. డిస్కౌంటెడ్ సర్టిఫికేషన్స్ కూడా లభిస్తాయి. 8 వారాల ఇంటర్న్‌షిప్ పూర్తి చేసినవారికి పార్టిసిపేషన్ సర్టిఫికెట్ లభిస్తుంది. కెరీర్ సపోర్ట్ సేవలు కూడా పొందొచ్చు. మొత్తం 190 గంటల లెర్నింగ్ సెషన్స్, ఆన్ ల్యాబ్ సెషన్స్ ఉంటాయి.

ఆసక్తిగల విద్యార్థులు ఏఐసీటీఈ తులీప్ పోర్టల్‌లో రిజిస్టర్ చేయాలి. విద్యాసంస్థ పేరు, స్టూడెంట్ ఐడీ, విద్యార్థి పేరు, ఊరు, ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ లాంటి వివరాలతో రిజిస్టర్ చేయాలి. విద్యార్థుల మెయిల్ ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ అయిన తర్వాత ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. ఈ ఇంటర్న్‌షిప్‌కు దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి. ప్యూచర్ రెడీ కోర్సుల వివరాలు తెలుసుకోవడానికి ఇక్కడ క్లిక్ చేయండి.

 

TTD Calender 2021

Gemini Internet












IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా


IRCTC Tirumala Tour: విజయవాడ నుంచి రూ.3,220 ధరకే తిరుపతి టూర్ ప్యాకేజీ... శ్రీవారి ప్రత్యేక దర్శనం కూడా (ప్రతీకాత్మక చిత్రం)

IRCTC Tirumala Tour | ఐఆర్‌సీటీసీ టూరిజం విజయవాడ నుంచి తిరుపతికి టూర్ (Vijayawada Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. కేవలం రూ.3,220 ధరకే ఈ టూర్ ప్యాకేజీ అందిస్తోంది. ఈ ప్యాకేజీకి సంబంధించిన పూర్తి వివరాలు తెలుసుకోండి.


తిరుమల వెళ్లాలనుకునే విజయవాడ పరిసర ప్రాంతా వాసులకు శుభవార్త. ఇండియన్ రైల్వే కేటరింగ్ టూరిజం కార్పొరేషన్‌కు (IRCTC) చెందిన ఐఆర్‌సీటీసీ టూరిజం తక్కువ ధరకే తిరుపతి టూర్ (Tirupati Tour) ప్యాకేజీ ప్రకటించింది. విజయ్ గోవిందం పేరుతో టూర్ ప్యాకేజీ అందిస్తోంది. 2 రాత్రులు, 3 రోజుల టూర్ ప్యాకేజీ ఇది. ఈ టూర్ ప్యాకేజీలో తిరుమల, తిరుచానూర్ కవర్ అవుతాయి. ఈ ప్యాకేజీ బుక్ చేసిన పర్యాటకుల్ని రైలులో తిరుపతి తీసుకెళ్లనుంది ఐఆర్‌సీటీసీ. తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారి దర్శనం ఉంటుంది. ఈ టూర్ ప్యాకేజీ ప్రతీ శుక్రవారం అందుబాటులో ఉంటుంది. వీకెండ్‌లో రెండు రోజులు తిరుపతి టూర్ ప్లాన్ చేసుకునేవారికి ఈ ప్యాకేజీ ఉపయోగపడుతుంది.

ఐఆర్‌సీటీసీ విజయ్ గోవిందం ప్యాకేజీ ధర ఎంతంటే


ఐఆర్‌సీటీసీ టూరిజం విజయ్ గోవిందం టూర్ ప్యాకేజీ స్టాండర్డ్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.3,220 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.3,300, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.3,920 చెల్లించాలి. కంఫర్ట్ ధరలు చూస్తే ట్రిపుల్ ఆక్యుపెన్సీ ధర రూ.5,080 కాగా, డబుల్ ఆక్యుపెన్సీకి రూ.5,160, సింగిల్ ఆక్యుపెన్సీకి రూ.5,780 చెల్లించాలి. స్టాండర్డ్ ప్యాకేజీ బుక్ చేసుకునేవారికి రైలులో స్టాండర్డ్ క్లాస్‌లో, కంఫర్ట్ ప్యాకేజీ బుక్ చేసుకున్నవారికి థర్డ్ ఏసీ క్లాస్‌లో బెర్త్ లభిస్తుంది.

రైలు టికెట్లతో పాటు ఏసీ వాహనంలో సైట్ సీయింగ్, తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం, బ్రేక్‌ఫాస్ట్, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ కవర్ అవుతాయి. రైలులో భోజనం, ఐటినరీలో చెప్పిన స్థలాలు కాకుండా ఇతర ప్రాంతాలకు సైట్ సీయింగ్, వ్యక్తిగత ఖర్చులు, ఎంట్రెన్స్ టికెట్స్ లాంటివి ఈ టూర్ ప్యాకేజీలో కవర్ కావు. ఈ ప్యాకేజీకి సంబంధించిన మరిన్ని వివరాలను ఐఆర్‌సీటీసీ టూరిజం అధికారిక వెబ్‌సైట్ https://www.irctctourism.com/ లో తెలుసుకోవచ్చు. పర్యాటకులు ఇదే వెబ్‌సైట్‌లో ప్యాకేజీ బుక్ చేసుకోవాలి.

టూర్ సాగేది ఇలాగే...

మొదటి రోజు రాత్రి 10.50 గంటలకు విజయవాడలో 07209 నెంబర్ గల ఎక్స్‌ఫ్రెస్ రైలు ఎక్కితే మరుసటి రోజు ఉదయం 5.25 గంటలకు తిరుపతి చేరుకుంటారు. పర్యాటకులు తెనాలిలో కూడా రైలు ఎక్కొచ్చు. ఈ రైలు తెనాలికి రాత్రి 11.20 గంటలకు చేరుకుంటుంది. పర్యాటకుల్ని ఐఆర్‌సీటీసీ సిబ్బంది హోటల్‌కు తీసుకెళ్తారు. హోటల్‌లో చెకిన్ అయిన తర్వాత బ్రేక్‌ఫాస్ట్ ఉంటుంది. ఆ తర్వాత 8.50 గంటలకు తిరుమలలో ప్రత్యేక ప్రవేశ దర్శనం ద్వారా శ్రీవారిని దర్శించుకోవచ్చు.

తిరుమలలో శ్రీవారి దర్శనం తర్వాత గోవిందరాజ స్వామి ఆలయానికి తీసుకెళ్తారు. సమయాన్ని బట్టి తిరుచానూర్‌లో పద్మావతి అమ్మవారి దర్శనం ఉంటుంది. రెండో రోజు రాత్రి 8.30 గంటలకు తిరుపతిలో రైలు ఎక్కితే మరుసటి రోజు తెల్లవారుజామున 2.10 గంటలకు తెనాలికి, 3.10 గంటలకు విజయవాడ చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది.

IBPS PO Recruitment 2021: ప్రభుత్వ బ్యాంకుల్లో 4,135 ఉద్యోగాలకు నోటిఫికేషన్... డిగ్రీ పాస్ అయితే చాలు

IBPS PO Recruitment 2021 | ఐబీపీఎస్ ప్రభుత్వ బ్యాంకుల్లో (Govt Bank Jobs) ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) రిలీజ్ చేసింది. ఖాళీల వివరాలు తెలుసుకోండి.

ప్రభుత్వ బ్యాంకుల్లో ఉద్యోగాలు (Bank Jobs) కోరుకునేవారికి అలర్ట్. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలెక్షన్ (IBPS) ఉద్యోగాల భర్తీకి జాబ్ నోటిఫికేషన్ (Job Notification) విడుదల చేసింది. ప్రొబెషనరీ ఆఫీసర్, మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది. మొత్తం 4,135 ఉద్యోగాలున్నాయి. మొత్తం 11 ప్రభుత్వ రంగ బ్యాంకులు ఈ పోస్టుల్ని భర్తీ చేస్తున్నాయి. బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, కెనెరా బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్, పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్, యూకో బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, ఇండియన్ బ్యాంక్, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఈ పోస్టులున్నాయి. ఈ పోస్టులకు 2021 అక్టోబర్ 20న దరఖాస్తు ప్రక్రియ మొదలవుతుంది. అప్లై చేయడానికి 2021 నవంబర్ 10 చివరి తేదీ. ఈ జాబ్ నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేసే ఖాళీల వివరాలు, విద్యార్హతల వివరాలు తెలుసుకోండి.

IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన తేదీలు


 ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ ప్రారంభం2021 అక్టోబర్ 20
 దరఖాస్తుకు చివరి తేదీ 2021 నవంబర్ 10
 దరఖాస్తు ఫీజు చెల్లింపు 2021 అక్టోబర్ 20 నుంచి నవంబర్ 10
ప్రిలిమినరీ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల 2021 నవంబర్ లేదా డిసెంబర్
 ప్రిలిమినరీ ఎగ్జామ్ 2021 డిసెంబర్ 4 నుంచి 12
 ప్రిలిమినరీ ఎగ్జామ్ ఫలితాల విడుదల 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ కాల్ లెటర్ విడుదల 2021 డిసెంబర్ లేదా 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ 2022 జనవరి
 మెయిన్ ఎగ్జామ్ ఫలితాల విడుదల 2022 జనవరి లేదా ఫిబ్రవరి
 ఇంటర్వ్యూ కాల్ లెటర్ విడుదల 2022 ఫిబ్రవరి
 ఇంటర్వ్యూ 2022 ఫిబ్రవరి లేదా మార్చి
 ప్రొవిజనల్ అలాట్‌మెంట్ 2022 ఏప్రిల్

IBPS PO Recruitment 2021: ఖాళీల వివరాలు


 మొత్తం ఖాళీలు 4,135
 బ్యాంక్ ఆఫ్ ఇండియా 588
 బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర 400
 కెనెరా బ్యాంక్ 650
 సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 620
 ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్ 98
 పంజాబ్ అండ్ సింధ్ బ్యాంక్ 427
 యూకో బ్యాంక్ 440
 యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 912
 పంజాబ్ నేషనల్ బ్యాంక్ పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
 ఇండియన్ బ్యాంక్ పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది
 బ్యాంక్ ఆఫ్ బరోడా పోస్టుల సంఖ్యను వెల్లడించాల్సి ఉంది

IBPS PO Recruitment 2021: గుర్తుంచుకోవాల్సిన అంశాలు


విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి డిగ్రీ పాస్ కావాలి.

ఎంపిక విధానం- ప్రిలిమినరీ ఎగ్జామ్, మెయిన్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ.

వయస్సు- 2021 అక్టోబర్ 1 నాటికి 20 నుంచి 30 ఏళ్లు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిజర్వ్‌డ్ కేటగిరీ అభ్యర్థులకు వయస్సులో సడలింపు ఉంటుంది.

దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్‌సీ, ఎస్‌టీ, దివ్యాంగులకు రూ.175.

ఈ జాబ్ నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

దరఖాస్తు చేయడానికి ఇక్కడ క్లిక్ చేయండి.