Alerts

Loading alerts...

30, అక్టోబర్ 2021, శనివారం

కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ తీసుకునే అవకాశాన్ని కేంద్ర ప్రభుత్వం కల్పిస్తోంది

ఎడ్యుకేషన్తో సంబంధం లేకుండా తక్కువ పెట్టుబడి..ఎక్కువ ఆదా పొందేలా ఏదైనా బిజినెస్చేయాలని అనుకుంటున్నారా? అయితే మీకో శుభవార్త.
 

కేంద్రప్రభుత్వం ప్రపంచంలో అతిపెద్ద పోస్టల్నెట్వర్క్ను నిర్వహిస్తుంది. దేశవ్యాప్తంగా 1.55లక్షల పోస్టాఫీస్లు ఉన్నాయి. అందులో 89 శాతం పోస్టాఫీసులు  గ్రామీణ ప్రాంతాల్లో సేవల్ని అందిస్తున్నాయి. అయితే కేంద్రం ప్రభుత్వం కొత్తగా అభివృద్ధి చెందుతున్న రూరల్‌, అర్బన్ఏరియాల్లో సైతం సేవల్ని మరింత విస్తృతం చేసేందుకు 2019లో ఫ్రాంఛైజ్స్కీంను అందుబాటులోకి  తెచ్చింది

పోస్టాఫీస్‌  ఫ్రాంఛైజీ తీసుకుంటే ఏం చేయాలి

 స్టాంప్స్‌, స్టేషనరీని అమ్ముకోవచ్చు

► బుకింగ్రిజిస్టర్డ్ఆర్టికల్స్‌, స్పీడ్పోస్ట్ఆర్టికల్స్‌, మనీ ఆర్డర్స్సర్వీస్లను అందించాల్సి ఉంటుంది

► పోస్టల్లైఫ్ఇన్స్యూరెన్స్‌ (పీఎల్- ఏజెంట్‌)కు సంబంధించిన అమ్మకాలు, ప్రీమియంను కట్టించుకోచ్చు.

► పోస్టాఫీస్పరిధిలోకి వచ్చే రీటైల్ సర్వీసులు అంటే బిల్స్‌, ట్యాక్స్‌, పన్నుల వసూళ్లు లేదా చెల్లింపులు  చేయాల్సి ఉంటుంది.  

ఫ్రాంఛైజీకి కావాల్సిన  అర్హతలు 

► ఫ్రాంఛైజీని సొంతం చేసుకోవాలంటే మినిమం 8 తరగతి చదివి ఉండాలి. ఇక డిపాజిట్కింద రూ.5000 నేషనల్సేవింగ్స్సర్టిఫికెట్కింద చెల్లించాల్సి ఉంటుంది

 దరఖాస్తు చేసుకున్న వారి వివరాలను   పోస్టాఫీస్అధికారులు మీ దరఖాస్తును డివిజనల్ హెడ్కు పంపిస్తారు

 అలా మీ ధరఖాస్తును చెక్చేస్తారు. మీ ఫ్రాంఛైజీకోసం అప్లయ్చేసిన ధరఖాస్తుకు చెందిన అడ్రస్ను పరిశీలిస్తారు. దీంతో పాటు ఫ్రాంఛైజీని నిర్వహించే సామర్ధ్యం ఉందా లేదా, కంప్యూటర్సౌకర్యం ఉందా లేదా అని పరిగణలోకి తీసుకుంటారు

► అనంతరం 14 రోజుల్లో ఫ్రాంఛైజీకి మీరు అర్హులు, కాదా అంశంపై  నిర్ణయం తీసుకుంటారు.

ఫ్రాంఛైజీకి ఎవరికి? ప్రాంతంలో ఇవ్వరు

► 18 సంవత్సరాల వయస్సు కంటే తక్కువ వయస్సు ఉన్న వారికి అవకాశం ఇవ్వరు

► పోస్టాఫీస్ఉద్యోగం చేస్తున్నా, లేదంటే రిటైర్డ్ ఉద్యోగులకు ఫ్రాంఛైజీని తీసుకునేందుకు అనర్హులు 

► పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ పథకంలో భాగంగా పంచాయత్ కమ్యూనికేషన్ సర్వీస్ సెంటర్లు ఉన్న గ్రామాలకు పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్ ఇవ్వరు.  

ఫ్రాంఛైజీ వల్ల లాభాలు ( లింక్క్లిక్చేస్తే 22పేజీలో పూర్తి వివరాలు)

► పోస్ట్ ఆఫీస్ ఫ్రాంఛైజ్నిర్వాహకులు అందించే సేవలపై కమీషన్ లభిస్తుంది

► రిజిస్టర్డ్ పోస్ట్కు రూ.3, స్పీడ్పోస్టుకు రూ.5 కమీషన్, రూ.100 నుంచి రూ.200 మనీ ఆర్డర్పై రూ.3.50, అంతకన్నా ఎక్కువ మనీ ఆర్డర్పై రూ.5 కమీషన్ వస్తుంది.

► నెలలో 1000 రిజిస్టర్ పోస్టులు, 1000 స్పీడ్ పోస్ట్లు బుక్ చేస్తే 20శాతం కమీషన్ అదనంగా లభిస్తుంది

► ఇక స్టాంపులు, పోస్టల్ స్టేషనరీ, మనీ ఆర్డర్ ఫామ్ లాంటి అమ్మకాలపై 5 శాతం కమిషన్ ఉంటుంది.

 

Gemini Internet కేవలం రూ.5వేలు పెట్టుబడితో పోస్టాఫీస్‌ను ఫ్రాంఛైజ్‌ | Postal Agency for Just Rs.5000/- only

https://www.youtube.com/watch?v=k0eeJxrOHwY&ab_channel=GeminiAlertsTeluguUpdates

 

Sukanya Samruddhi Yojana: అదిరిపోయే స్కీమ్‌.. నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌..!

Sukanya Samruddhi Yojana: ప్రస్తుతం ఆదాయం పెంచుకునే పథకాలు ఎన్నో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వం వివిధ రకాల స్కీమ్‌లను అందుబాటులోకి తీసుకువస్తోంది. ఇక కేంద్ర ప్రవేశపెట్టిన పథకాలలో సుకన్య సమృద్ది (ఎస్‌ఎస్‌వై) యోజన స్కీమ్‌ ఒకటి. ఈ పథకం అనేది ఆడ పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించినది. భారత ప్రభుత్వం బేటీ పడావో కార్యక్రమంలో భాగంగా 2015లో ప్రారంభించింది. ఇది దీర్ఘకాలిక పొదుపు ప‌థ‌కం. ఆడ పిల్లల భవిష్యత్తుకు ఆర్థిక భరోసాగా ఈ పథకాన్ని అందుబాటులోకి తీసుకువచ్చింది. ఉన్నత విద్య, వివాహ సమయాల్లో ఈ స్కీమ్‌ ఎంతగానో ఉపయోగపడుతుంది.

ఈ పథకానికి ఎవ‌రు అర్హులు?

ఆడ పిల్ల పుట్టిన తర్వాత నుంచి ఆమెకు పదేళ్ల వయసు వచ్చే లోపు ఎప్పుడైన ఈ స్కీమ్‌ కింద బ్యాంకుల్లో, పోస్టాఫీసుల్లో ఖాతా తెరవవచ్చు. అయితే ఈ పథకంలో ఆమె చేరాలంటే ఖచ్చితంగా భారతీయురాలై ఉండాలి. తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు రెండు ఖాతాలు తెరిచేందుకు మాత్రమే వీలుంది. రెండోసారి పుట్టిన పిల్లలు కవలలైనా లేదా మొదటి సారి ముగ్గురు పిల్లలు జన్మించినా మూడోది తెరిచేందుకు అనుమతి ఇస్తారు. ఇందుకోసం వైద్యప‌ర‌మైన ప‌త్రాలు స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. దత్తత తీసుకున్న బాలిక పేరు పై కూడా ఈ ఖాతా తెరిచేందుకు సౌకర్యం ఉంది. అయితే ఒక‌రి కోసం రెండు ఖాతాలను తీసుకునేందుకు వీలు ఉండదు. బాలిక ప‌దేళ్ల వ‌య‌సు నుంచి ఖాతాను నిర్వహించుకోవచ్చు.

ధృవీకరణ పత్రాలు..

ఈ ఖాతా తెరిచేందుకు వ్యక్తిగత గుర్తింపు పత్రం, చిరునామ, పత్రాలతో పాటు జనన ధృవీకరణ పత్రాన్ని కూడా సమర్పించాల్సి ఉంటుంది. సుకన్య సమృద్ధి యోజన బ్యాంకులు, పోస్టాఫీసుల్లో తెరవవచ్చు. ఈ స్కీమ్‌ మెచ్యూరిటీ గడువు 21 సంవత్సరాలు. ఉదాహారణకు చెప్పాలంటే 8 సంవత్సరాలు వయసున్న బాలికపై ఖాతాను ప్రారంభిస్తే అమ్మాయి 29 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు మెచ్యూరిటీ పూర్తవుతుంది. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్‌ అమ్మాయికి 18 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత డబ్బులు తీసుకునే వీలుంటుంది.

ఒక ఆర్ధిక సంవత్సరం అంటే ఏప్రిల్1 నుంచి వచ్చే ఏడాది మార్చి 31 వరకు అని అర్ధం. అకౌంట్‌ను ప్రారంభించేందుకు కనీస డిపాజిట్ రూ.250 అవ‌స‌రం . ఏడాదికి కనీసం రూ.250 డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. ఇక ఏడాదికి గరిష్టంగా రూ.1.5 లక్షల వరకు డిపాజిట్‌ చేయవచ్చు. అంతకు మించి డిపాజిట్‌ చేయరాదు. అకౌంట్‌ తెరిచిన ఏడాది నుంచి 14 సంవత్సరాల పాటు డిపాజిట్‌ చేయవచ్చు. ఒక వేళ మీకు ఇద్దరు అమ్మాయిలు ఉంటే మీరు రెండు ఖాతాలలో మొత్తం రూ.3 లక్షల వరకు డిపాజిట్‌ చేసుకోవచ్చు.

ఎలా డిపాజిట్ చేయవచ్చు..

అలాగే నగదు లేదా చెక్కు లేదా డిమాండ్‌ డ్రాఫ్ట్‌ (డీడీ) రూపంలో కూడా డబ్బులను డిపాజిట్‌ చేయవచ్చు. అలాగే డిపాజిట్ మొత్తాన్ని ఒకేసారి లేదా వాయిదాలలో చెల్లించవచ్చు. అలాగే ఒక నెల లేదా ఒక ఆర్ధిక సంవత్సరంలో ఎన్ని సార్లు అయినా డిపాజిట్ చేయవచ్చు. ఒకవేళ ఒక ఆర్థిక సంవత్సరంలో ఖాతాలో కనీస మొత్తం డిపాజిట్ చేయకపోతే ఖాతాను డిఫాల్ట్ అకౌంట్‌గా పరిగణిస్తారు. ఖాతాను తిరిగి పునరుద్ధరించుకోడానికి డిపాజిట్ మొత్తంతో పాటు రూ.50 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఒక ఆర్ధిక సంవత్సరంలో రూ. లక్షా 50 వేలకంటే ఎక్కువ మొత్తాన్ని జమ చేసినట్లయితే ఖాతాదారుడు అదనపు మొత్తాన్ని ఎప్పుడైనా విత్‌డ్రా చేసుకునే అవకాశం ఉంటుంది. కానీ అదనపు మొత్తంపై ఎలాంటి వడ్డీ చెల్లించరు.

వడ్డీ రేటు:

ప్రస్తుతం వడ్డీ రేటు 7.6 శాతంగా ఉంది. ఇది ఫిక్స్‌డ్‌ డిపాజిట్లు, ప్రభుత్వ స్కీమ్‌లపై వర్తించే వడ్డీ రేట్లు కంటే ఎక్కువగా ఉంటుంది. అకౌంట్‌ తెరిచిన రోజు నుంచి 15 సంవత్సరాల పాటు నెలవారీ లేదా వార్షిక ప్రాతిపదికన డిపాజిట్లు చేయవచ్చు. ఆడ పిల్లకు 18 సంవత్సరాల వయస్సు వచ్చిన తర్వాత లేదా కొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో మాత్రమే మీరు ఖాతాలో డబ్బును ఉపసంహరించుకునే అవకాశం ఉంటుంది.

అయితే ఈ ఖాతాలో ప్రతి నెల 10 వ తేది కంటే ముందు న‌గ‌దు డిపాజిట్ చేస్తే నెలంత‌టికీ వ‌డ్డీ ల‌భిస్తుంది. ప్రతినెల 10 వ తేదీ నుంచి చివ‌రి వ‌ర‌కు ఉన్న త‌క్కువ న‌గ‌దుపై వ‌డ్డీ లెక్కిస్తారు. అందుకే 10 వ తేదీకంటే ముందే డిపాజిట్ చేస్తే మంచి ప్రయోజనం ఉంటుంది. ఈ స్కీమ్‌పై వడ్డీ రేటును ప్రభుత్వం నిర్ణయిస్తుంది. అందుకే ఏ బ్యాంకులో ఖాతాను ప్రారంభించినా ఒకే విధంగా వడ్డీ రేట్లు ఉంటాయని గుర్తించుకోవాలి. మెచ్యూరిటీ తీరిన తర్వాత కూడా అంటే 21 సంవత్సరాలు పూర్తయిన తర్వాత కూడా ఖాతాలోని మొత్తాన్ని ఉపసంహరించుకోకపోతే, దానిపై వడ్డీని చెల్లించరు.

సుకన్య సమృద్ధి యోజన పథకానికి 7.6 శాతం వడ్డీ రేటు లభిస్తుంది అనుకుంటే.. సంవత్సరానికి రూ.1000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల పూర్తయిన తర్వాత అంటే మెచ్యూరిటీ సమయంలో రూ. 46,800 పొందవచ్చు. అలాగే ఏడాదికి రూ. 1,50,000 కనీస పెట్టుబడి15 సంవత్సరాల పాటు పెట్టినట్లయితే, 21 సంవత్సరాల తరువాత రూ. 70,20,000 తీసుకోవచ్చు.

ఏడాదికి ఎంత డిపాజిట్‌ చేస్తే అమ్మాయికి 21 ఏళ్లు నిండిన తర్వాత ఎంత వస్తుందంటే..

► ఏడాదికి రూ.1000 డిపాజిట్‌ చేసినట్లయితే 21 ఏళ్ల తర్వాత 46,800 వస్తుంది.

► రూ.2000 డిపాజిట్‌ చేస్తే రూ. 93,600

► రూ.5000 డిపాజిట్‌ చేస్తే రూ.2,34000

► రూ. 10 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.4,68000

► రూ. 20 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.9,36000

► రూ.50 వేలు డిపాజిట్‌ చేస్తే రూ.23,40000

► రూ.1,00,000 డిపాజిట్‌ చేస్తే రూ.46,80000

► రూ.1.50,000 డిపాజిట్‌ చేస్తే రూ.70,20000 మొత్తాన్ని అందుకోవచ్చు.

ఇలా ఏడాది కాలానికి డిపాజిట్‌ చేసిన మొత్తానికి 21 ఏళ్ల తర్వాత ఇంత మొత్తాన్ని అందుకోవచ్చన్నమాట.

Gemini Internet

నెలకు రూ.12,500 డిపాజిట్‌తో రూ. 70 లక్షల బెనిఫిట్‌.. | Sukanya Samriddhi Yojana https://www.youtube.com/watch?v=M6lgfc8xZb0&ab_channel=GeminiAlertsTeluguUpdates

AP Postal Circle Jobs: ఏపీలో టెన్త్, ఇంటర్ అర్హతతో పోస్టల్ శాఖలో ఉద్యోగాలు.. అప్లై ఇలా.

ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP Postal Circle) నిరుద్యోగులకు గుడ్ న్యూస్ చెప్పింది. పలు ఉద్యోగాల(Jobs)ను భర్తీ చేయనున్నట్లు ప్రకటించింది. ఈ మేరకు నోటిఫికేషన్(Job Notification) విడుదలైంది. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

Gemini Internet

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను(Sports Quota Jobs) భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP POSTAL CIRCLE) తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్(Postman), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff) తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.

ఆంధ్రప్రదేశ్ లోని నిరుద్యోగులకు పోస్టల్ శాఖ (Postal Department) శుభవార్త చెప్పింది. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలను(Sports Quota Jobs) భర్తీ చేయనున్నట్లు ఆంధ్రప్రదేశ్ పోస్టల్ సర్కిల్ (AP POSTAL CIRCLE) తెలిపింది. ఈ మేరకు నోటిఫికేషన్ (Job Notification) విడుదలైంది. మొత్తం 75 ఖాళీలను భర్తీ చేయనున్నట్లు నోటిఫికేషన్లో పేర్కొన్నారు. పోస్టల్ అసిస్టెంట్(Postal Assistant), సార్టింగ్ అసిస్టెంట్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్, పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్, పోస్ట్ మ్యాన్(Postman), మల్టీ టాస్కింగ్ స్టాఫ్(Multi Tasking Staff) తదితర విభాగాల్లో ఈ ఖాళీలను భర్తీ చేస్తున్నారు. ఈ ఉద్యోగాలకు(Jobs) దరఖాస్తు చేసుకునేందుకు నవంబర్ 27ను ఆఖరి తేదీగా నిర్ణయించారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఆ తేదీలోగా అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.


విభాగాల వారీగా ఖాళీల విరాలు ఇలా ఉన్నాయి..

పోస్టుఖాళీలు
పోస్టల్ అసిస్టెంట్19
సార్టింగ్ అసిస్టెంట్04
పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సర్కిల్ ఆఫీస్/రీజనల్ ఆఫీస్03
పోస్టల్ అసిస్టెంట్ ఇన్ సేవింగ్స్ బ్యాంక్ కంట్రోల్ ఆర్గనైజేషన్04
పోస్ట్ మ్యాన్18
మల్టీ టాస్కింగ్ స్టాఫ్27


For Applications Visit  Gemini Internet, Dhanalakshmi  Road, Hindupur.విద్యార్హతలు:
పోస్టల్ అసిస్టెంట్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డ్/యూనివర్సిటీ నుంచి ఇంటర్ విద్యార్హతను కలిగి ఉండాలి.

పోస్ట్ మ్యాన్: ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు 12వ తరగతి పాసై ఉండాలి. స్థానిక భాష అయిన తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగును ఓ సబ్జెక్టుగా కలిగి ఉండాలి.

మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేయాలనుకుంటున్న అభ్యర్థులు టెన్త్ పాసై ఉండాలి. స్థానిక భాష తెలుగుపై నాలెడ్జ్ ఉండాలి. టెన్త్ వరకు తెలుగు ఓ సబ్జెక్ట్ గా ఉండాలి.

-అభ్యర్థులు విద్యార్హతలకు సంబంధించిన పూర్తి వివరాలను నోటిఫికేషన్లో చూడొచ్చు.

క్రీడలు: స్పోర్ట్స్ కోటాలో భర్తీ చేస్తున్న ఈ ఉద్యోగాలకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థులు ఆర్చరీ, బాస్కెట్ బాల్, బాడీ బిల్డింగ్, చెస్, సైక్లింగ్, హ్యాండ్ బాల్, కబడ్డీ, షూటింగ్ తదితర క్రీడల్లో జాతీయ/అంతర్జాతీయ/ఇంటర్ టోర్నమెంట్స్ స్థాయిలో ప్రాతినిధ్యం వహించి ఉండాలి. ఇతర పూర్తి వివరాలను నోటిఫికేషన్ లో చూడొచ్చు.


వయో పరిమితి: మల్టీ టాస్కాంగ్ పోస్టులకు అప్లై చయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-25 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీలకు వయో పరిమితిలో సడలింపు ఇచ్చారు.

-ఇతర పోస్టులకు అప్లై చేయాలనుకుంటున్న అభ్యర్థుల వయస్సు 18-27 ఏళ్లు ఉండాలి. ఓబీసీలకు మూడేళ్లు, ఎస్సీ/ఎస్టీ అభ్యర్థులకు వయో పరిమితిలో ఐదేళ్ల సడలింపు ఇచ్చారు.

వేతనాలు:
-పోస్టల్ అసిస్టెంట్ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 25,500 - రూ. 81,100 వరకు వేతనం ఉంటుంది.
-పోస్ట్ మాన్: ఈ ఉద్యోగాలకు ఎంపికైన వారికి నెలకు రూ. 21700-రూ.69100 వరకు వేతనం ఉంటుంది.
-మల్టీ టాస్కింగ్ స్టాఫ్: ఈ ఖాళీలకు ఎంపికైన వారికి నెలకు రూ. 18 వేల నుంచి రూ. 56900 వరకు వేతనం ఉంటుంది.
For Applications Visit  Gemini Internet, Dhanalakshmi  Road, Hindupur.
దరఖాస్తు ప్రక్రియ:  ఈ ఉద్యోగాలకు అభ్యర్థులు ఆన్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
Step 1: అభ్యర్థులు మొదటగా https://dopsportsrecruitment.in/ వెబ్ సైట్ ను ఓపెన్ చేయాలి.
Step 2: అనంతరం రిజిస్ట్రేషన్ లింక్ కనిపిస్తుంది. ఆ లింక్ పై క్లిక్ చేయాలి.
Step 3: అక్కడ మీ పేరు, మొబైల్ నంబర్, ఈ మెయిల్, చిరునామా తదితర పూర్తి వివరాలు నమోదు చేయాలి.

Step 4: రిజిస్ట్రేషన్ అనంతరం ఫీజు పేమెంట్ కోసం https://dopsportsrecruitment.in/fee.aspx లింక్ పై క్లిక్ చేయాలి. అభ్యర్థులు రూ. 200 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ/ఎస్టీ/PWD/మహిళా అభ్యర్థులకు ఫీజులో మినహాయింపు ఇచ్చారు.
Step 5: అనంతరం Apply online లింక్ పై క్లిక్ చేసి అప్లిపేషన్ ఫామ్ ను పూర్తి చేయాల్సి ఉంటుంది. కావాల్సిన వివరాలను నమోదు చేసి సబ్మిట్ పై క్లిక్ చేయాలి.

 

29, అక్టోబర్ 2021, శుక్రవారం

Kisan Credit Card: కిసాన్ క్రెడిట్ కార్డుతో తక్కువ వడ్డీతో రూ. 3 లక్షల వరకు ఋణం పొందండి.. ఎలా దరఖాస్తు చేసుకోవాలంటే

SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి.

SBI Kisan Credit Card: అన్నదాత వ్యవసాయం చేయడానికి డబ్బులు అవసరం పడతాయి. అటువంటి రైతు ఎస్బీఐ బ్యాంకు ఖాతాదారుడైతే.. సాగు ఖర్చుల నిమిత్తం వ్యవసాయ ఋణం పొందడం ఈజీ..  రైతు వ్యవసాయం కోసం దేశీయ అతి పెద్ద బ్యాంక్ SBI అన్నదాతకు అండగా నిలవడానికి కిసాన్ క్రెడిట్ కార్డ్ ను అందిస్తోంది.  ఈ కార్డు సహాయంతో రైతు తన వ్యవసాయానికి సంబంధించిన ఖర్చుల నిమిత్తం సులభంగా ఋణం పొందవచ్చు.. ఈ కార్డు గురించి వివరాలు తెలుసుకుందాం..

లక్షణాలు, ప్రయోజనాలు:
1. SBI కిసాన్ ఖాతా.. క్యాష్ క్రెడిట్ ఖాతాలా ఉంటుంది.
2. ఖాతాలో క్రెడిట్ బ్యాలెన్స్ ఏదైనా ఉంటే, సేవింగ్స్ బ్యాంక్ రేటు వద్ద వడ్డీని పొందుతారు.
3. వ్యవధి: 5 సంవత్సరాలు, ప్రతి సంవత్సరం వార్షిక సమీక్ష అనంతరం 10% వార్షిక పెంచుతారు
4. వడ్డీ రాయితీ: 3 లక్షల వరకూ సత్వర రుణం.. రుణ గ్రహీతలకు 3% వడ్డీ రాయితీ.
5. తిరిగి చెల్లింపు: పంట కాలం (స్వల్ప/దీర్ఘ), పంటకు మార్కెటింగ్ వ్యవధిపై తిరిగి చెల్లించే వ్యవధి ఆధారపడి ఉంటుంది.

భీమా:
70 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న KCC రుణగ్రహీతలు వ్యక్తిగత ప్రమాద భీమా పథకం (PAIS) కింద కవర్ చేయబడతారు
అర్హత కలిగిన పంటలు ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన (PMFBY) కింద కవర్ చేయబడతాయి.

వడ్డీ రేటు:
1. రూ. 3లక్షల వరకూ రుణం తీసుకునే వారికి వడ్డీ రేటు 7 శాతం.
2. రూ.3 లక్షల పైన రుణం తీసుకునే వారికి ఎప్పటికప్పుడు వడ్డీ రేటు వర్తించే విధంగా

ఇతర ఫీచర్లు/ప్రయోజనాలు:
1. అర్హులైన KCC రుణగ్రహీతలందరూ SBI నుంచి కిసాన్ క్రెడిట్ కార్డ్ తీసుకోవచ్చు.
2. Rupay కార్డులు హోల్డర్‌లకు ఒక లక్ష భీమా.. 45 రోజులకు ఒకసారి రెన్యువల్..

దరఖాస్తు చేసుకునే విధానం: 

నేరుగా ఎస్బిఐ బ్యాంక్ శాఖకు వెళ్లి దరఖాస్తు చేసుకోవచ్చు.
SBI ఆన్ లైన్ నుంచి దరఖాస్తు ఫారమ్‌ను డౌన్‌లోడ్ చేసుకుని అప్లై చేసుకోవచ్చు.

అవసరమైన పత్రాలు:

గుర్తింపు కార్డుకు సంబంధించిన ఆధార్ కార్డు, లేదా ఓటర్ ఐడీ, తదితర గుర్తింపు కార్డులు
వ్యవసాయ భూమికి సంబంధించిన పత్రాలు
ధరఖాస్తుదారుడి ఫోటోలు
ఇంటి చిరునామా

 

TTD Updates 🕉 *శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అంకురార్ప‌ణ‌*


        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
         శ్రీనివాసమంగాపురం శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి పవిత్రోత్సవాలకు అక్టోబ‌రు 30న సాయంత్రం 6 గంటలకు అంకురార్పణం నిర్వ‌హించ‌నున్నారు.

★ ఆలయంలో అక్టోబరు 31 నుండి న‌వంబ‌రు 2వ తేదీ వరకు ప‌విత్రోత్స‌వాలు జ‌రుగ‌నున్నాయి.
 కోవిడ్ – 19 వ్యాప్తి నేప‌థ్యంలో ఆల‌యంలో ఏకాంతంగా ఈ ఉత్స‌వాల‌ను నిర్వ‌హిస్తారు.

వైదిక సంప్రదాయం ప్రకారం
●జాతాశౌచం,
●మృతాశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధం.
అయినా
యాత్రికుల వల్లగానీ, సిబ్బంది వల్ల గానీ తెలిసితెలియక దోషాలు జరుగుతుంటాయి. వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాదీ పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ.

■ పవిత్రోత్సవాల్లో మొదటిరోజైన అక్టోబరు 31వ తేదీన ఉదయం యాగశాలలో వైదిక కార్యక్రమాలు, సాయంత్రం 6 నుండి రాత్రి 9 గంటల వరకు పవిత్రప్రతిష్ఠ నిర్వహించనున్నారు.
■ రెండో రోజు నవంబరు 1వ తేదీన మధ్యాహ్నం 12.00 నుండి 1.00 గంట వరకు పవిత్ర సమర్పణ చేస్తారు.

■ చివరిరోజు నవంబరు 2వ తేదీ సాయంత్రం 6.30 నుండి రాత్రి 8.30 గంటల వరకు పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి.

★ పవిత్రోత్సవాల సందర్భంగా మూడు రోజుల పాటు ఉదయం 11 నుండి మ‌ధ్యాహ్నం 12 గంటల వరకు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కల్యాణ వేంకటేశ్వరస్వామివారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు.
👉 అదేవిధంగా ప్రతిరోజు సాయంత్రం 4 నుండి 5 గంటల వరకు స్వామి, అమ్మవార్ల‌కు ఆల‌యంలో ఆస్థానం జ‌రుగ‌నుంది.


🕉 *న‌వంబ‌రు నెల‌లో తిరుప‌తిలోని టిటిడి స్థానిక ఆల‌యాల్లో విశేష ఉత్సవాలు*
        ➖〰️〰️〰️〰️〰️〰️➖
🕉 TTD News ™ తిరుపతి:
          తిరుపతి శ్రీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం, శ్రీ కోదండరామాలయంలో న‌వంబ‌రు నెలలో పలు విశేష ఉత్సవాలు జరుగనున్నాయి.

★ వాటి వివరాలు ఇలా ఉన్నాయి. ★

🕉 శరీ గోవింద‌రాజ‌స్వామివారి ఆల‌యం…..

■– న‌వంబ‌రు 2న కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం.

■– న‌వంబ‌రు 4న దీపావ‌ళి ఆస్థానం.

■– న‌వంబ‌రు 6న శ్రీ తిరుమ‌ల నంబి శాత్తుమొర.

■– న‌వంబ‌రు 8న శ్రీ మనవాళ మహాముని శాత్తుమొర.

■– నవంబరు 9న శ్రీ సేనై మొదలియార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 10 నుండి 19వ తేదీ వ‌ర‌కు శ్రీ తిరుమంగై ఆళ్వార్ ఉత్సవం.

■– న‌వంబరు 11వ తేదీ శ్రీ వేదాంతదేశికర్‌ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 12న శ్రీ భూతాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– న‌వంబ‌రు 13న శ్రీ పెరియాళ్వార్ వర్ష తిరునక్షత్రం.

■– నవంబరు 19న శ్రీ తిరుమంగై ఆళ్వార్ శాత్తుమొర.

■– న‌వంబ‌రు 16వ తేదీ కైశిక ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఆలయంలో కైశిక ద్వాదశి ఆస్థానం, పురాణ ప్ర‌వ‌చ‌నం నిర్వహిస్తారు.

■– నవంబరు 18న కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా కార్తీక దీప్పొత్స‌వం.

🕉 శ్రీ కోదండరామాలయంలో….

■– న‌వంబ‌రు 2న ఆల‌యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం జ‌రుగ‌నుంది.

■– న‌వంబ‌రు 4న అమావాస్య సందర్భంగా ఉదయం 6.30 గంటలకు సహస్ర కలశాభిషేకం,
సాయంత్రం 6 గంట‌ల‌కు దీపావ‌ళి ఆస్థానం నిర్వ‌హిస్తారు.

■– న‌వంబ‌రు 6, 13, 20, 27వ‌ తేదీల్లో శనివారం సందర్భంగా ఉదయం 6.00 గంటలకు శ్రీసీతారామ లక్ష్మణుల మూలవర్ల అభిషేకం నిర్వహిస్తారు. సాయంత్రం 6.00 గంటలకు స్వామి, అమ్మవారిని తిరుచ్చిపై ఆలయంలో ఊరేగింపు, అనంతరం రాత్రి 7.00 గంటలకు ఆలయంలో ఊంజల్‌సేవ నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 19న పౌర్ణమి సందర్భంగా ఉదయం 9 గంటలకు అష్టోత్తర శతకలశాభిషేకం నిర్వహిస్తారు.

■– న‌వంబ‌రు 24న పున‌ర్వ‌సు న‌క్ష‌త్రాన్ని పుర‌స్క‌రించుకుని ఉద‌యం 11 గంట‌ల‌కు శ్రీ సీతారాముల క‌ల్యాణం నిర్వ‌హిస్తారు.


Central Government: కేంద్ర ప్రభుత్వ పథకం.. దీనిలో చేరితే భార్యాభర్తలు నెలకు రూ.10 వేలు పొందొచ్చు.. వివరాలివే..

Gemini Internet

Central Government: కేంద్ర ప్రభుత్వం ఎన్నో పథకాలను ప్రవేశపెట్టింది. అందులో రైతులకు ఉపయోగపడేవి ఉన్నాయి. మరికొన్ని సాధారణ పౌరులకు కూడా ఉపయోగపడేవి ఉన్నాయి. అందులో మనం ఇప్పుడు చెప్పుకునే పథకం అటల్ పెన్షన్ యోజన. దీని ద్వారా నెలకు భార్యాభర్తలు రూ. 10 వేలు తీసుకోవచ్చు. ఎలా అంటే..

రిటైర్మెంట్ తర్వాత పెన్షన్ ఎలా తీసుకోవాలో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఎందుకంటే.. అసంఘటిత రంగంలో పనిచేసే ప్రజలందరికీ, అటోల్ పెన్షన్ పథకం (అటల్ పెన్షన్ యోజన) ప్రారంభించబడింది. ఈ పథకంలో పెట్టుబడులు పెట్టడం ద్వారా ఏ భారతీయ పౌరుడైనా పెన్షన్ పొందవచ్చు. 18 నుంచి 40 ఏళ్ల మధ్య వయస్సు ఉన్న వారు ఈ పథకంలో చేరడానికి అర్హులు.

ఈ పథకంలో చేరడానికి బ్యాంక్ లేదా పోస్ట్ ఆఫీస్ ఖాతా అవసరం. ఈ పథకం తర్వాత 60 సంవత్సరాల తరువాత డిపాజిటర్లు పెన్షన్ పొందడం ప్రారంభిస్తారు. మీరు అందుకునే పెన్షన్ మొత్తం మీరు చేసే పెట్టుబడి మరియు మీ వయస్సుపై ఆధారపడి ఉంటుంది.

APY కింద.. ఒక వ్యక్తి కనీసం రూ. 1,000, రూ .2,000, రూ .3,000, రూ .4,000 మరియు రూ.5 వేల వరకు పెన్షన్ పెందవచ్చు. ఈ పథకాన్ని కేంద్ర ప్రభుత్వం 2015 మేలో ప్రారంభించబడిని విషయం తెలిసిందే. అయితే అటల్ పెన్షన్ స్కీమ్ యొక్క ముఖ్యమైన అంశం ఏమిటంటే.. మీరు ఈ పథకంలో ఎంత త్వరగా చేరితే అంత ఎక్కువ లాభం పొందవచ్చు.

ఒక వ్యక్తి 18 సంవత్సరాల వయస్సులో ఈ పథకంలో చేరితే, అతడు/ఆమె 60 సంవత్సరాల వయస్సు తరువాత నెలకు రూ. 5,000 పెన్షన్ కోసం నెలకు రూ. 210 జమ చేయాలి. అంటే ఈ పథకంలో రోజుకు కేవలం రూ .7ను జమ చేయడం ద్వారా నెలకు రూ .5 వేల పింఛను పొందవచ్చు.

నెలకు రూ. 3 వేలు పెన్షన్ కావాలంటే రూ.126, రూ. 4 వేలు పెన్షన్ కావాలంటే నెలకు రూ. 168, నెలకు రూ. 2 వేలు పెన్షన్ కావాలంటే రూ. 84 చెల్లించాల్సి ఉంటుంది. మీకు కేవలం రూ. వేయి పెన్షన్ కావాలంటే మాత్రం నెలకు రూ.42 చెల్లిస్తే సరిపోతుంది.

APY మరియు NPS లైట్ యాప్ ద్వారా ఖాతాదారులు తమ లావాదేవీల వివరాలను చూసుకోవచ్చు. ఈ పథకంలో చేరాలంటూ.. బ్యాంక్ లేదా పోస్టాఫీస్‌కు వెళ్లి జాయిన్ అవ్వొచ్చు. 

లేదా ప్రతీ ఒక్కిరికీ నెట్ బ్యాంకింగ్ ఉండే ఉంటుంది. అందులోకి వెళ్లి కూడా జాయిన్ అవ్వొచ్చు. ఇలా చేరిన సదరు వ్యక్తి అకౌంట్ నుంచి నెల నెలా డబ్బుల కట్ అవుతూ ఉంటాయి. 40ఏళ్ల వయస్సులో జాయిన్ అయిన వారు 60 ఏళ్లు వచ్చే వరకు కట్టాలి.

18 ఏళ్ల వయస్సులో జాయిన్ అయితే 20 ఏళ్లు వరుసగా కట్టాల్సి ఉంటుంది. ఇలా భార్యభర్తలు 40 ఏళ్ల లోపు జాయిన్ అయి నెలకు రూ.5000 వచ్చే స్కీంలో చేరితే 60 ఏళ్ల తర్వాత నెలకు ఇద్దిరకి కలిపి రూ.10 వేలు తీసుకోవచ్చు. 

AP EAPCET 2021 పరీక్ష వ్రాసిన Bi.P.C. విద్యార్థుల సర్టిఫికేట్ వెరిఫికేషన్ అక్టోబరు 28, 29, 30 తేదీలలో

AP EAPCET 2021 Bi.P.C. విద్యార్థులకు గమనికః ఎవరైతే ANGRAU ద్వారా Agriculture, Animal Husbandry, Bachelor of Veterinary Science, Horticulture, Fisheries, Food Technology కొరకు Farmer కోటా లో అప్లై చేసి Form 1, Form 2 అప్లోడ్ చేశారో అలాంటి వారు 28, 29, 30 తేదీలలో క్రింద తెలుపబడిన లింక్ లో ని PDF File ను డౌన్ లోడ్ చేసుకుని అందులోని మీ ప్రాంతాలలోగల చిరునామాలో ఒరిజినల్ సర్టిఫికేట్ల తో వెళ్ళి Certificate Verification చేయించుకొనవలసినదిగా మనవి. Gemini Internet

to know for Certificate Verification Centers https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/adimissionpdfs.do?mode=downloadPDFFile&filename=Farmers%27quotaguidelines.pdf


to know Certificate verification notification

https://ugadmissionsangrau.aptonline.in/ANGRAUGRADU/adimissionpdfs.do?mode=downloadPDFFile&filename=Extension%20of%20last%20dates.pdf

Recent

District Judiciary of Andhra Pradesh Recruitment 2025–26: Document Verification Schedule & Provisionally Selected Candidates List Released ఆంధ్రప్రదేశ్ జిల్లా న్యాయవ్యవస్థ నియామకాలు 2025–26: డాక్యుమెంట్ వెరిఫికేషన్ షెడ్యూల్ & ప్రొవిజనల్ ఎంపిక జాబితా విడుదల

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...