Alerts

--------

12, నవంబర్ 2021, శుక్రవారం

Pension Alert: పెన్షన్ కావాలంటే నవంబర్ 30 లోగా ఆ సర్టిఫికెట్ ఇవ్వాలి ఇంటి నుంచే ఈ సర్టిఫికెట్ ఎలా సబ్మిట్ చేయాలో తెలుసుకోండి.

Pension Alert | పెన్షనర్లకు అలర్ట్. లైఫ్ సర్టిఫికెట్‌ను (Life Certificate) సమర్పించడానికి గడువు సమీపిస్తోంది. నవంబర్ 30 లోగా జీవన ప్రమాణ పత్రం (Jeevan Pramaan Patra) సమర్పించాలి.

ఈజీగా PF బ్యాలెన్స్ చెక్ చేసుకోండి

ఉద్యోగులు తమ పీఎఫ్ బ్యాలెన్స్ను SMS లేదా మిస్డ్ కాల్ ద్వారానూ తెలుసుకోవచ్చు. ‘EPFOHO UAN ENG’ అని టైప్ చేసి రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 7738299899కి SMS పంపాలి. మిస్డ్ కాల్ ద్వారా అయితే రిజిస్టర్ మొబైల్ నంబర్ నుంచి 9966044425కి ఫోన్ చేయాలి. ఈ కాల్ రింగ్ అయిన తర్వాత ఆటోమేటిక్గా కట్ అవుతుంది. కాసేపటి తర్వాత మీ పీఎఫ్ బ్యాలెన్స్ వివరాలు మెసేజ్ ద్వారా వస్తాయి.

Gemini Internet

1. పెన్షన్​ పొందే రిటైర్డ్​ ప్రభుత్వ ఉద్యోగులు ఏటా జీవన ప్రమాణ పత్రం (లైఫ్​ సర్టిఫికెట్​) సమర్పించాల్సి ఉంటుంది. ప్రతి సంవత్సరం బ్యాంకులకు వెళ్లి లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించడం నిజంగా వృద్ధులకు ఇబ్బంది కలిగిస్తుంది. మరోవైపు, కరోనా మహమ్మారి కారణంగా చాలా మంది బయటకు వెళ్లేందుకు జంకే పరిస్థితి. ఇప్పుడు ఆ ఇబ్బంది పడాల్సిన అవసరం లేకుండా కేంద్రం శుభవార్త చెప్పింది.

2. ఆన్​లైన్​ ద్వారానే లైఫ్​ సర్టిఫికెట్​ సమర్పించే అవకాశం కల్పించింది. రిటైనర్​ అయిన ఉద్యోగులు అంతరాయం లేకుండా పెన్షన్​ పొందాలంటే ఏటా నవంబర్​ 1 నుంచి నవంబర్​ 30 మధ్య బ్యాంకులకు లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్ చేసుకోవచ్చు. పెన్షనర్ ఇంకా బతికే ఉన్నాడని సర్టిఫికేట్ రుజువుగా పనిచేస్తుంది.

3. సర్టిఫికేట్‌ను అధీకృత పెన్షన్ పంపిణీదారు లేదా ఏజెన్సీ ముందు చూపించాలి. ఆ తర్వాత వారి ఖాతాలో పెన్షన్ జమ చేయబడుతుంది. పెన్షనర్లు తమ వార్షిక జీవిత ధృవీకరణ పత్రాలను పెన్షన్ డిస్బర్సింగ్ అథారిటీస్ (PDA)ల వద్ద నేరుగా సబ్​మిట్​ చేయవచ్చు.

4. లేదంటే కొన్ని బ్యాంకులు, పోస్టాఫీసులు అందిస్తున్న డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​ సేవలను ఉపయోగించుకొని నేరుగా ఇంటి వద్దే ప్రక్రియ పూర్తి చేయవచ్చు. అంతేకాదు, ఈ ఏడాది నుంచి ఆన్‌లైన్‌లోనూ సమర్పించే వెసులుబాటు కూడా ఉంది. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ (DSB) ద్వారా పెన్షనర్లు తమ లైఫ్​ సర్టిఫికెట్​ సబ్​మిట్​ చేయవచ్చు.

5.స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ బరోడా, పంజాబ్ నేషనల్ బ్యాంక్​తో సహా 12 ప్రభుత్వ రంగ బ్యాంకులు డోర్​ స్టెప్​ బ్యాంకింగ్​కు మద్ధతిస్తున్నాయి. పింఛనుదారుడు ఈ సేవను పొందేందుకు గూగుల్​ ప్లేస్టోర్​ నుండి డోర్‌స్టెప్ బ్యాంకింగ్ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలి లేదా https://doorstepbanks.com/ వెబ్‌సైట్‌ను సందర్శించాలి. 


6. డోర్‌స్టెప్ బ్యాంకింగ్ సేవలను వినియోగించుకునేందుకు పెన్షనర్లు ముందుగా తమ వివరాలను నమోదు చేయాలి. వ్యక్తి పెన్షన్ ఖాతా నంబర్‌ను ఎంటర్​ చేసి ధృవీకరించాలి. ఆ తర్వాత నామమాత్రపు ఛార్జీలు చెల్లించాలి. దీంతో, ప్రక్రియను పూర్తి చేయడానికి మీ ఇంటికి వచ్చే బ్యాంక్ ఏజెంట్ వివరాలు ఎస్​ఎమ్​ఎస్​ ద్వారా అందుకుంటారు. ఏజెంట్ వ్యక్తి ఇంటిని సందర్శించి, ప్రక్రియను పూర్తి చేస్తాడు. 

7. ఎలక్ట్రానిక్స్ అండ్​ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖతో పాటు పోస్ట్‌మ్యాన్ లైఫ్​ సర్టిఫికేట్‌ను సమర్పించడానికి డోర్‌స్టెప్ సర్వీస్‌ను ప్రవేశపెట్టింది. సేవను పొందేందుకు పెన్షనర్ పోస్ట్ ఇన్ఫో యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. తగిన ఫీజు చెల్లిస్తే పోస్ట్​ మ్యాన్ మీ ఇంటికే వచ్చి పెన్షన్​ సర్టిఫికెట్​ తీసకుంటారు. ఈ అవకాశం దేశవ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పెన్షనర్లందరికీ అందుబాటులో ఉంటుంది.

 

11, నవంబర్ 2021, గురువారం

TTD Update

తిరుమల నుంచి తిరుపతి ప్రయాణించే ఘాట్ రోడ్ మూసివేత

భారీ వర్షాల కారణంగా మొదటి ఘాట్ రోడ్డులో అక్కడక్కడా విరిగి పడుతున్న కొండచరియల

ఈ కారణంగా రాత్రి 7 గంటల నుండి తిరుమల నుంచి తిరుపతికి ప్రయాణించే ఘాట్ రోడ్ లో రాకపోకలు నిషేధించారు

టిటిడి భద్రతా సిబ్బంది

Gemini Internet


*తిరుమల- పాపవినాశనం రోడ్డు మూసివేత*

తిరుమల: తుపాను ప్రభావంతో తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. గురువారం తెల్లవారుజాము నుంచి ఈదురు గాలులతో కూడిన వర్షం పడుతోంది. గాలుల ధాటికి పలు చోట్ల పదుల సంఖ్యలో భారీ వృక్షాలు, చెట్టు కొమ్మలు రోడ్లపై పడ్డాయి. దీంతో ముందు జాగ్రత్త చర్యగా తిరుమల- పాపవినాశనం రోడ్డును అధికారులు మూసివేశారు. అటవీ, తితిదే అధికారులు రంగంలోకి దిగి రోడ్లపై పడిన చెట్లను తొలగిస్తున్నారు.

మరోవైపు వర్షం కారణంగా రెండు ఘాట్‌ రోడ్లలో కొండ చరియలు విరిగిపడే ప్రమాదం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల వద్ద భద్రతా చర్యలు చేపడుతున్నారు. ఘాట్‌ రోడ్డులో ప్రయాణించే సమయంలో వాహనదారులు అప్రమత్తంగా ఉండాలంటూ అలిపిరి వద్ద భద్రతా సిబ్బంది సూచనలు చేస్తున్నారు.

Post Office Scheme: పోస్టాఫీసులో అదిరిపోయే స్కీమ్‌.. రూ.10వేల డిపాజిట్‌తో చేతికి రూ.7 లక్షలు.. పూర్తి వివరాలకోసం ఈ లింక్ ను క్లిక్ చేయండి

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ..

Gemini Internet

Post Office Scheme: ప్రస్తుతం పోస్టల్‌ శాఖలో ఎన్నో స్కీమ్‌లు అందుబాటులో ఉన్నాయి. పెట్టుబడి పెట్టే వారికి మంచి అవకాశం ఉంటుంది. తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభం పొందే విధంగా స్కీమ్‌లను రూపొందించింది పోస్టల్‌ శాఖ. ఆర్థికంగా ఎదిగేందుకు పలు రకాల స్కీమ్‌లో ఎంతగానో ఉపయోగపడతాయి. అందులో రికరింగ్‌ డిపాజిట్‌ స్కీమ్‌ కూడా ఒకటి. వీటిల్లో డబ్బులు పెడితే మంచి రాబడి పొందే అవకాశం ఉంటుంది. ఈ స్కీమ్‌లో చేరితే మీరు నెలకు రూ.100 నుంచి కూడా ఇన్వెస్టు చేసే సదుపాయం ఉంది. అదే సమయంలో గరిష్ట పరిమితి అంటూ ఏమీ లేదు. ఎంత మొత్తాన్ని అయినా డిపాజిట్ చేసుకునే వెసులుబాటు ఉంటుంది. అయితే ప్రతి నెలా డబ్బులు పెడుతూనే ఉండాలి.

స్కీమ్‌ గడువు ఐదేళ్లు:

పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్ గడువు 5 సంవత్సరాలు. ప్రతి మూడు నెలలకోసారి మీ ఖాతాలో జమ అవుతూనే వస్తుంది. ప్రస్తుతం పోస్టాఫీస్ ఆర్‌డీ స్కీమ్‌పై 5.8 శాతం వడ్డీ లభిస్తోంది. ప్రతి మూడు నెలలకు ఒకసారి వడ్డీ రేటు సమీక్ష ఉంటుంది. అంటే ఒకవేళ వడ్డీ రేటు తగ్గొచ్చు.. లేదా పెరగొచ్చు. లేదంటే అలానే స్థిరంగా కొనసాగించే అవకాశం ఉంటుంది. ఈ పథకంలో చేరితే నెలకు 10 వేల రూపాయలు ఇన్వెస్ట్‌ చేస్తే.. ఐదు సంవత్సరాల తర్వాత 7 లక్షల రూపాయల వరకు బెనిఫిట్‌ పొందవచ్చు. ఖచ్చితమైన లాభం వస్తుంది తప్ప.. రిస్క్‌ అనేది ఉండదు. ఈ స్కీమ్‌లో ఒక వ్యక్తిగానీ, ముగ్గురు కలిపి కూడా ఉమ్మడి ఖాతాగా తీసుకుని ఇన్వెస్ట్‌ చేయవచ్చు. అలాగే మైనర్ల పేరు మీద కూడా ఖాతా ఓపెన్‌ చేసి పెట్టుబడి పెట్టువచ్చు. కనీసం 10 సంవత్సరాలపైబడిన వారు మాత్రమే ఈ స్కీమ్‌లో చేరవచ్చు.

ఉదాహారణకు చెప్పాలంటే.. మీరు 1 నుంచి 15వ తేదీ మధ్యలో అకౌంట్‌ ఓపెన్‌ చేసినట్లయితే ప్రతి నెల 15వ తేదీ లోపు డబ్బులు జమ చేయాల్సి ఉంటుంది. అలాగే 15వ తేదీ తర్వాత ఖాతా తీసినట్లయితే ప్రతి నెల చివరి దినం వరకు మొత్తం జమ చేయాల్సి ఉంటుంది. గడువులోగా మొత్తాన్ని జమ చేయనట్లయితే కొంత పెనాల్టీతో చెల్లించాల్సి ఉంటుంది. ఈ పథకంలో అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే కొంత మినహాయింపు కూడా ఉంటుంది. మీరు ఆరు నెలల పాటు అడ్వాన్స్‌ డిపాజిట్‌ చేస్తే నెలవారీ ప్రీమియంలో 10 శాతం డిస్కౌంట్‌ కూడా లభిస్తుంది. ఎవరైనా ప్రతి నెల డిపాజిట్‌ చేస్తే ఆరు నెలల పాటు అతను రూ.6000కు బదులు రూ.5900 మాత్రమే డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది. అలాగే ఒక సంవత్సరం మొత్తం డిపాజిట్‌ చేస్తే ఈతనికి నెలవారీ ప్రీమియంలో 40 శాతం వరకు రాయితీ లభించే అవకాశం ఉంటుంది. ఈ విధంగా ఒక సంవత్సరానికి మొత్తం డిపాజిట్‌ రూ.12,000కు బదులు రూ.11,600 డిపాజిట్‌ చేయాల్సి ఉంటుంది.

డిపాజిట్‌ మొత్తం రుణ సదుపాయం:

ఇక రుణ సదుపాయం విషయానికొస్తే.. డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం రుణం పొందే అవకాశం ఉంటుంది. ఏడాది తర్వాత డిపాజిట్‌ మొత్తంలో 50 శాతం వరకు రుణం పొందవచ్చు. దానిని వివిధ వాయిదాల రూపంలో కూడా తిరిగి చెల్లించి సౌకర్యం ఉంటుంది. రికరింగ్‌ డిపాజిట్ల వడ్డీపై వడ్డీ రేటు 2 శాతం వీడిగా ఉంటుంది. ఇక కాలిక్యులేటర్‌ ప్రకారం.. మీరు ప్రతి నెలా రూ.10 వేలు ఈ స్కీమ్‌లో డిపాజిట్‌ చేసినట్లయితే ప్రస్తుతం 5.8 శాతం వడ్డీ రేటుతో, మెచ్యూరిటీపై మొత్తం రూ.69,6967 అవుతుంది. 5 ఏళ్లలో డిపాజిట్‌ మొత్తం రూ.6 లక్షలు అవుతుంది. ఇక వడ్డీ మొత్తం రూ.99967 అవుతుంది. ఈ విధంగా మెచ్యూరిటీ మొత్తం దాదాపు రూ.7 లక్షల వరకు పొందవచ్చు. ఇంకో విషయం ఏంటంటే.. ఈ వివరాలన్ని వివిధ వెబ్‌సైట్ల ద్వారా అందించడం జరుగుతుంది. ఈ స్కీమ్‌కు సంబంధించిన మార్పు చేర్పులు జరిగే అవకాశం ఉంటుంది. అందుకే మీరు స్కీమ్‌లో చేరి డబ్బులు ఇన్వెస్ట్‌ చేయాలనుకుంటే మీ సమీపంలో ఉన్న పోస్టాఫీసును సంప్రదిస్తే పూర్తి వివరాలు అందజేస్తారు.

 

 

Recent

Reasoning Book for SI Constable SSC CGL CPO CHSL MTS Banking Railway Telugu

-| ఇలాంటి విద్యా ఉద్యోగ UPDATES కోసం మా WATSAPP ఛానెల్లో లో జాయిన్ అవ్వాలనుకుంటే 9640006015 ఈ ఫోన్ నెంబరుకు మీ వాట్సాప్ నుండి హాయ్ అని ఒక మె...