ప్రధాన కంటెంట్‌కు దాటవేయి

పోస్ట్‌లు

Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా..? అయితే మీకో గుడ్ న్యూస్.. ఏడాదికి రూ.5.70 లక్షలు సంపాదించే ఛాన్స్..!

Federal Bank: మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. మీరు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారా? బ్యాంకులో ఇంటర్న్‌షిప్‌ ద్వారా వర్క్ ఎక్స్పీరియన్స్ పొందాలనేది మీ కలా? అయితే మీకు ఫెడరల్ బ్యాంకు (Federal Bank) ఓ గుడ్ న్యూస్ చెప్పింది. గ్రాడ్యుయేట్ల కోసం తాజాగా రెండేళ్ల ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ తీసుకువచ్చినట్లు ప్రకటించింది. ప్రస్తుతం విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నామని ఫెడరల్ బ్యాంకు తెలిపింది. ఈ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్‌ను విజయవంతంగా పూర్తి చేసిన విద్యార్థులు ఫెడరల్ బ్యాంక్ మణిపాల్ అకాడమీ ఆఫ్ హయ్యర్ ఎడ్యుకేషన్ (MAHE) నుంచి పీజీ డిప్లొమా అందుకోవచ్చు. అంతేకాదు, సంవత్సరానికి రూ. 5.70 లక్షల వరకు ఆదాయం సంపాదించవచ్చు. ఈ ప్రోగ్రామ్‌లో పాల్గొనాలనే ఆసక్తి గల అభ్యర్థులు అక్టోబర్ 23 లోపు దరఖాస్తు చేసుకోవాలి. ఆన్‌లైన్ ఆప్టిట్యూడ్ పరీక్షను నవంబర్ 7న నిర్వహిస్తారు. ఫెడరల్ బ్యాంకు ఈ కోర్సును ‘ఫెడరల్ ఇంటర్న్‌షిప్ ప్రోగ్రామ్ (ఎఫ్‌ఐపీ)’ పేరుతో.. మణిపాల్ గ్ల...

తిరుమల శ్రీవారి భక్తులకు తీపి కబురు.

నవంబరు నుంచి తిరుమల శ్రీవారి దర్శన టికెట్ల సంఖ్య పెంచనున్నట్లు టీటీడీ తెలిపింది. సర్వదర్శనం 10వేలు, ప్రత్యేక ప్రవేశ దర్శన (రూ.300) టికెట్లు 12వేలు జారీ చేయనున్నట్లు ప్రకటన విడుదల చేసింది. నవంబరు నెలకు ప్రత్యేక సర్వదర్శన టికెట్ల విడుదల షెడ్యూల్ ఖరారు చేసింది. ఈ నెల 22న ఉదయం 9 గంటలకు ప్రత్యేక దర్శన టికెట్లు.. 23న ఉదయం 10వేల సర్వదర్శన టికెట్లను విడుదల చేయనున్నట్లు టీటీడీ ప్రకటించింది. శ్రీవారి దర్శనానికి సంబంధించిన రూ.300 ప్రత్యేక ప్రవేశ దర్శనం, టైంస్లాట్‌ సర్వదర్శన టోకెన్లను ‘గోవింద’ యాప్‌లో కాకుండా టీటీడీ వెబ్‌సైట్‌లోనే బుక్‌ చేసుకోవాలని టీటీడీ తెలిపింది. రూ.300 టోకెన్లు, సర్వ దర్శనం టోకెన్లు శుక్ర, శనివారాల్లో విడుదల కానుండటంతో భక్తులు ఎదురు చూస్తున్నారు. ఒకవేళ రూ.300 టోకెన్లు దొరక్కపోయినా సర్వ దర్శనం టోకెన్లు తీసుకోవాలని భావిస్తున్నారు. మరోవైపు తిరుమల వెళ్లే భక్తులను టీటీడీ అలర్ట్ చేసింది. శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులకు టీటీడీ కొత్త నిబంధనలను అమలులోకి తీసుకు వచ్చింది. ఇకపై శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులు రెండు డోసుల వ్యాక్సిన్ పూర్తయిన సర్టిఫికెట్, మూడు రోజుల ముందు కరోనా నెగిటివ...

APPSC Jobs Recruitment 2021: అసిస్టెంట్‌ ఇంజనీర్ ఉద్యోగాల‌కు అర్హ‌త‌లు..ఎంపికైతే ప్రారంభ జీతమే..రూ.31,460–రూ.84,970

నిరుద్యోగుల‌కు శుభవార్త. రాష్ట్రంలో ఏఈ (అసిస్టెంట్‌ ఇంజనీర్‌) స్థాయి ఉద్యోగాలు భర్తీ చేసేందుకు ఆంధ్రప్రదేశ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (ఏపీపీఎస్సీ) ఇటీవల నోటిఫికేషన్‌ విడుదల చేసింది. దీనిద్వారా పలు శాఖల్లో 190 అసిస్టెంట్‌ ఇంజనీర్‌ పోస్టుల భర్తీకి ఎంపిక ప్రక్రియ చేపట్టనుంది. డిప్లొమా, బీటెక్‌ ఉత్తీర్ణులు ఏఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులు. రాత పరీక్షలో ప్రతిభ ఆధారంగానే చక్కటి ప్రభుత్వ కొలువు సొంతం చేసుకోవచ్చు. ఈ నేపథ్యంలో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన అసిస్టెంట్‌ ఇంజనీర్‌(ఏఈ) నోటిఫికేషన్‌ వివరాలు, ఎంపిక విధానం, ప్రిపరేషన్‌ గైడెన్స్‌.. మొత్తం పోస్టులు : 190 తాజాగా విడుదల చేసిన నోటిఫికేషన్‌లో.. ఏపీపీఎస్సీ తాజాగా విడుదల చేసిన ఏఈ నోటిఫికేషన్‌ ద్వారా మొత్తం తొమ్మిది విభాగాల్లో 190 పోస్ట్‌లను భర్తీ చేయనున్నారు. ఈ 190 పోస్ట్‌లలో 155 తాజా పోస్ట్‌లు కాగా, 35 పోస్ట్‌లను క్యారీ ఫార్వర్డ్‌ పోస్ట్‌లు(గత నోటిఫికేషన్‌లో భర్తీ కానివి)గా పేర్కొన్నారు.  ఎంపికైతే వేతన శ్రేణి: రూ.31,460–రూ.84,970 లభిస్తుంది. అర్హతలు ఇవే..: ఏపీ స...

తిరుమల దర్శనం RTC ప్రకటన

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ బస్సులలో తిరుమల వెళ్ళి దైవ దర్శనం చేసుకునే ప్రయాణికుల సౌకర్యార్థం, ప్రతి రోజు ఏ.పి.ఎస్.ఆర్.టి.సి బస్సులలో 1000 దైవ దర్శనం టికెట్లు అందుబాటులోకి వచ్చాయి.  ఏ.పి.ఎస్.  ఆర్.టి.సి బస్సులలో తిరుమలకు విచ్చేయు ప్రయాణికులకు తిరుమల తిరుపతి దేవస్థానం అధికారులు ఈ అమూల్యమైన అవకాశం కల్పించినారు. ఏ.పి.ఎస్. ఆర్.టి.సి బస్సులలో తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ఛార్జీతోపాటు 300 రూపాయలు అదనంగా చెల్లించి బస్సులోనే శీఘ్ర దర్శనం టికెట్ పొందవచ్చును. ప్రతి రోజు ఉదయం 11. 00 గంటలకు మరియు సాయంత్రం 4.00 గంటలకు ఈ శీఘ్ర దర్శనం ఏర్పాటు కలదు. తిరుమల బస్సు స్టేషన్ చేరుకున్న తర్వాత శీఘ్ర దర్శనం చేసుకొనుటకు ప్రయాణికులకు RTC సూపర్ వైజర్లు సహాయం చేసెదరు. కావున తిరుపతి వెళ్ళు ప్రయాణికులు ముందుగా RTC బస్సులలో శీఘ్ర దర్శనం టికెట్ పొందే అవకాశాన్ని వినియోగించుకోవలసినదిగా కోరడమైనది. APSRTC ప్రతి రోజు తిరుపతికి 650 బస్సులు నడుపుతున్నది.  ప్రతి డిపో నుండి తిరుపతికి బస్సు సౌకర్యం కలదు. బెంగుళూరు, చెన్నై, కంచి, వెల్లూరు, పాండిచ్చేరి, హైదరాబాద్ మొదలైన నగరాల నుండి దైవ దర్శనం కొరకు వచ్చు ...

Daily Updates 21-10-2021

Gemini Internet

Ananthapuramu | Chittoor | Kurnool | Cuddappah District Classifieds 21-10-2021

Gemini Internet

HDFC Scholarship : రూ.75,000 స్కాల‌ర్‌షిప్ పొందే అవ‌కాశం.. ద‌ర‌ఖాస్తు వివ‌రాలు

క‌రోనా మహమ్మారి (Covid-19 pandemic) కారణంగా దెబ్బ‌తిన్న కుటుంబాల విద్యార్థుల‌కు హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ చేయూత‌నందిస్తోంది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్ పేరుతో విద్యార్థుల‌కు రూ.75,000 అందించ‌నుంది. కరోనా కార‌ణంగా చ‌దువుకోవ‌డానికి ఇబ్బంది ప‌డుతున్న వారికి ఇది చ‌క్క‌ని అవ‌కాశం. ఈ స్కాల‌ర్‌షిప్ ద‌ర‌ఖాస్తు చేసుకోవడానికి అక్టోబ‌ర్ 31, 2021 వ‌ర‌కు అవ‌కాశం ఉంది కరోనా మహమ్మారి (Covid-19 pandemic)కారణంగా వేలాది మంది పిల్లలు నిరాశ్రయులయ్యారు. తల్లిదండ్రులను కోల్పోయిన వారి చదువు, భవిష్యత్తు ప్రశ్నార్థకమైంది. అటువంటి పిల్లలకు హెచ్‌డీఎఫ్‌సీ చేయూత నందిస్తోంది. వారికి కోసం హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ (HDFC Bank) ప‌రివ‌ర్త‌న్ కోవిడ్ క్రైసిస్ స‌పోర్ట్ స్కాల‌ర్‌షిప్‌ను ప్ర‌వేశ పెట్టింది. క‌రోనా కార‌ణంగా త‌ల్లి లేదా తండ్రిని కోల్పోయిన వారు. జీవ‌నోపాధి కోల్పోయిన కుటంబ విద్యార్థ‌లుకు ఈ స్కాల‌ర్‌షిప్‌(Scholarship)  ను అందించ‌నున్నారు. ఈ కుటుంబాల‌కు చెందిన విద్యార్థుల‌కు ఒకసారి ఆర్థిక సాయం రూపంలో రూ.15,000 నుంచి రూ.75,000 వ‌ర‌కు హెచ్‌డీఎఫ్‌సీ అందిస్తోంద...