21, జనవరి 2021, గురువారం

SKUCET Update


*💁‍♀️పజీ ప్రవేశాలకు పాత రుసుములే..*

🍁ఎస్‌.కె.విశ్వవిద్యాలయం:

*🔰శరీకృష్ణదేవరాయ విశ్వవిద్యాలయం, అనుబంధ పీజీ కళాశాలల్లో పీజీ ప్రవేశాల కోసం వెబ్‌ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌, రుసుములు ఖరారు చేశారు. బుధవారం ఎస్కేయూ ప్రవేశాల సలహామండలి సమావేశం ఉపకులపతి రామకృష్ణారెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ నెల 19వ తేదీన ధ్రువపత్రాల పరిశీలన గడువు ముగిసింది. ఎస్కేయూ సెట్‌ ద్వారా మొత్తం 4,142మంది విద్యార్థులు అర్హత సాధించగా 2,178మంది విద్యార్థులు హాజరయ్యారు. 1,964 మంది విద్యార్థులు గైర్హాజరు అయ్యారు. ఎస్కేయూ సెట్‌-2020 ద్వారా అర్హత పొంది ఎంఏ, ఎమ్మెస్సీ, ఎంకామ్‌, ఎంఈడీ, ఎంపీఈడీ, ఎంఎల్‌ఐఎస్సీ కోర్సులకు గతంలో (ఎస్కేయూ సెట్‌-2019) ఉన్న ఫీజులు ఖరారు చేశారు. ఈ నెల 21 నుంచి 23వ తేదీ వరకు ఆయా పీజీ కోర్సుల్లో ప్రవేశాలకు విద్యార్థులు ఆప్షన్లు ఇచ్చుకోవచ్ఛు వెబ్‌ ఆప్షన్లు www.skudoa.in వెబ్‌సైట్‌ ద్వారా ఆప్షన్లు ఇచ్చుకోవాలి. సమావేశంలో రిజిస్ట్రార్‌ వెంకటరమణ, సైన్సు, ఆర్ట్స్‌ కళాశాలల ప్రధానాచార్యులు శంకర్‌నాయక్‌, విజయ్‌కుమార్‌, ప్రవేశాల సంచాలకులు తిమ్మానాయక్‌, డైరెక్టర్‌ ఆఫ్‌ ఎవాల్యూషన్స్‌ చింతా సుధాకర్‌, సీడీసీ డీన్‌ విజయకృష్ణనాయుడు, పాలకమండలి సభ్యులు శోభాలత, డిప్యూటీ డైరెక్టర్‌ శ్రీనివాసన్‌ పాల్గొన్నారు.*

🌾🍃🍃🌾🍃🍃🍃🌾🍃🍃🍃🌾

కామెంట్‌లు లేవు: