3, ఫిబ్రవరి 2021, బుధవారం

వెహికల్ స్క్రాపింగ్ పాలసీ

కింద కాలుష్యం వెదజల్లుతున్న 20 ఏళ్లకు పైబడ్డ వాహనాలు తుక్కు కింద మారనున్నాయి. దీంతో 2000 సంవత్సరానికి ముందు మీరు టాక్సీ లేదా ట్రక్కులు, బస్సులు వంటి వాణిజ్య వాహనాలు కొని ఉన్నట్లైతే ఇక మీ వాహనం రోడ్డెక్కేందుకు అవకాశం లేదు. దీంతో మనదేశంలో కనీసం మిలియన్ల కొద్దీ కమర్షియల్ వెహికల్స్ ఆటోమేటిక్ గా తుక్కు కిందకు మారిపోవాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి. అయితే ఇలా పాత వాహనాలను స్క్రాప్ చేసి, కొత్తవి కొనేవారికి ప్రభుత్వం కొన్ని పన్నుల నుంచి ఉపశమనం ఇస్తుంది. కొత్త వాహనం కొనేప్పుడు జీఎస్టీలో డిస్కౌంట్ పొందచ్చు. ఇందులో భాగంగా కమర్షియల్ వెహికల్ కొనేందుకు 28శాతం చెల్లించాల్సిన జీఎస్టీని 18 శాతానికి తగ్గించే ఛాన్సులున్నాయి. దీంతో సుమారు కోటి వెహికల్స్ స్క్రాప్ కింద మారిపోనున్నాయి. కాలపరిమితి ముగిసిన వెహికల్స్ అన్నీ ఫిట్నెస్ టెస్టు చేయించాల్సిందే. ఇప్పటికే 15 ఏళ్లు దాటిన పాత వాహనాలన్నింటిపై గ్రీన్ టాక్స్ ను కేంద్రం వసూలు చేస్తోంది. సరికొత్త విధానాల ప్రకారం 20 ఏళ్ల పాతబడ్డ పర్సనల్ వాహనాలన్నీ ఆటోమేటెడ్ ఫిట్నెస్ సెంటర్లకు వెళ్లి ఫిట్నెస్ టెస్టులు చేయించుకోవాల్సిందేనంటూ కేంద్ర ఆర్థిక శాఖామంత్రి నిర్మలా సీతారామన్ స్పష్టం చేశారు. వాహనాల వల్ల వచ్చే కాలుష్యాన్ని నియంత్రించేందుకు ఇది అత్యుత్తమ విధానంగా కేంద్రం భావిస్తోంది.

కామెంట్‌లు లేవు: